ఆంధ్ర ప్రదేశ్

TTD Darshan: శ్రీవారిని దర్శనానికి నేటి నుంచి 9 వేల టికెట్లు అందుబాటులోకి, ప్రత్యేక‌ ప్రవేశ ద‌ర్శన టికెట్ ధర రూ. 300, జూలై ఒకటి నుంచి రోజుకు 3,000 చొప్పున స‌ర్వ ద‌ర్శనం టోకెన్ల జారీ

Hazarath Reddy

అన్లాక్ 1.0 సమయంలో జూన్ 11 న తిరిగి తెరిచిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam), రోజువారీ దర్శనంలో భాగంగా కోటాను మరికొంత పెంచింది. ముందుగా 3000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించగా ఆ తరువాత మరో 3000 మందికి అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా మరో 3 వేల మందికి అవకాశం కల్పించారు. ఆన్ లైన్ బుకింగ్ (online booking darshan quota) ద్వారా రోజుకు 9 వేల మంది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం అధికారులు కల్పించారు.

AP Coronavirus Report: ఏపీలో తాజాగా 793 కరోనావైరస్‌ కేసులు, రాష్ట్రంలో 13,891కి చేరిన మొత్తం కేసుల సంఖ్య, 180కి చేరిన మరణాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 793 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు (AP's Coronavirus) నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 81మందికి, విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ (Coronavirus in Andhra Pradesh) అయింది. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 30,216 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 793 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 302మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 11 మంది మృతి చెందారు.

'Greater Worry': గ్రేటర్ హైదరాబాద్‌పై కరోనా ఎఫెక్ట్, మరోసారి జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించే దిశగా అడుగులేస్తున్న తెలంగాణ సర్కార్, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించిన సీఎం కేసీఆర్

Team Latestly

హైదరాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా....

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో మరో 813 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 12 మంది మృతి, రాష్ట్రంలో 13 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 12 కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్నూల్ నుంచి ఆరుగురు, కృష్ణా నుంచి ఐదుగురు మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు....

Advertisement

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 796 పాజిటివ్ కేసులు నమోదు, గత 24 గంటల్లో 11 మంది మృతి, రాష్ట్రంలో 12 వేలు దాటిన మొత్తం కోవిడ్19 బాధితుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 11 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి నలుగురు, కర్నూల్ నుంచి నలుగురు మృతిచెందగా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు విజయనగరం జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు...

YSR APP: రైతుల కోసం వైఎస్సార్ యాప్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, కర్షకుల కోసం ప్రభుత్వం అందించే పథకాల సమాచారం మొత్తం దీని ద్వారా తెలుసుకోవచ్చు

Hazarath Reddy

రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ సర్కారు (AP Government) మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవ‌సాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను (YSR APP) ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (AP CM YS Jagan Camp Office) క్యాంప్ కార్య‌ల‌యంలో శుక్రవారం ప్రారంభించారు

AP Corona Update: ఏపీలో ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి, 11వేలు దాటిన కోవిడ్-19 కేసులు సంఖ్య, నాలుగు జిల్లాల్లో వేయి దాటిన కరోనా కేసులు

Hazarath Reddy

ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను (AP Corona Update) రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. గత 24 గంటల్లో 605 కేసులు (COVID-19 cases) నమోదు అయ్యాయి. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 570 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 34 మంది, విదేశాలకు చెందిన వారు ఒకరు ఉన్నారు. మొత్తం 10 మంది చనిపోగా.. కర్నూల్ జిల్లాకు చెందిన వారు నలుగురు, కృష్ణా జిల్లాకు చెందిన వారు నలుగురు, గుంటూరులో ఒకరు, విశాఖలో ఒకరు మృతి (Corona Virus Deaths) చెందారు.ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11, 489 కేసులు నమోదు కాగా, 6147 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 5196 మంది డిశ్చార్జ్ అయ్యారని రికార్డులు చెబుతున్నాయి. మొత్తం 146 మంది చనిపోయారు.

YSRCP MLA Sudhakar: కరోనా భారీన మరో వైసీపీ ఎమ్మెల్యే, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ, ఐసోలేషన్‌ వార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు

Hazarath Reddy

కరోనా వైరస్‌ సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా, పోలీసుల నుంచి రాజకీయ నాయకుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, మం‍త్రులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు కోవిడ్ 19 ( COVID-19) భారీన పడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా భారీన పడగా..తాజాగా ఏపీలో మరో ఇద్దరు కరోనావైరస్ (Coronavirus) భారీన పడ్డారు. మొన్నటికి మొన్న విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కే శ్రీనివాసరావు (YCP S.Kota MLA Kadubandi Srinivasa Rao) ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు.

Advertisement

Rabi Crop Insurance: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, రూపాయి కడితే మొత్తం బీమా ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది, పెండింగ్‌లో ఉన్న రబీ పంటల బీమా కోసం రూ.596.36 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కారు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం (AP Govt) మరోసారి రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకునే దిశగా అడుగులు వేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra pradesh CM YS Jagan) గత సర్కారు పెండింగ్ లో పెట్టిన రబీ బీమా పంట సొమ్మును (Pending Rabi Crop Insurance) రైతులకు చెల్లించారు. 2018 రబీ పంటల బీమా సొమ్ముకు (Crop Insurance) గానూ ఏపీ ప్రభుత్వం రూ. 596.36 కోట్లను విడుదల చేసింది.

AP New Sand Policy: పేదలకు ఉచితంగా ఇసుక సరఫరా, ఇసుక కొరతపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఇకపై ఎడ్లబళ్లపై, ట్రాక్టర్లపై సొంత అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకువెళ్లవచ్చు

Hazarath Reddy

పరిపాలనులో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇసుక పాలసీలో (Andhra Pradesh sand policy)పలు సవరణలు చేసి కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇక నుంచి సొంత అవసరాలు, పేదల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు (weaker sections) ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది.1,2,3 ఆర్డర్‌ రీచ్‌లలో మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పింది. ఇసుక విధానంపై స్పష్టతనిస్తూ..అనుమతి ఉన్న రిచుల్లో ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు ఉచితంగా తీసుకెళ్లొచ్చని, ట్రాక్టర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP UG,PG Exams Update: ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు కాలేదు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నాం, విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి

Hazarath Reddy

ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షలు (AP UG, PG Exams) రద్దయ్యాయని గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Andhra Education Minister Adimulapu Suresh) క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల (10th Exams) మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు.

AP coronavirus Report: ఏపీలో తాజాగా 553 కరోనా కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 10,884 కు చేరిన కేసుల సంఖ్య, రికార్డుస్థాయిలో కోవిడ్-19 పరీక్షలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 553 కరోనా పాజిటివ్‌ కేసులు (AP coronavirus Report) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 19,085 సాంపిల్స్‌ను పరిశీలించగా 553 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ​దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,884 కు చేరింది. ఇప్పటివరకు ఏపీలో రికార్డుస్థాయిలో 7,69,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఏపీ నుంచి 8783 కేసులు, 1,730 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి

Advertisement

AP High Court: ఈ నెల 28 వరకు ఏపీ హైకోర్టు విధులు నిలిపివేత, సర్క్యులర్‌ జారీ చేసిన హైకోర్టు రిజిస్ట్రార్‌, ఉద్యోగులపై పలు నిబంధనలు విధించిన న్యాయస్థానం

Hazarath Reddy

కోవిడ్‌-19 (COVID-19) నేపథ్యంలో ఈ నెల 28 వరకు ఏపీ హైకోర్టు విధులు (AP High Court regular work) నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, విజయవాడ మెట్రో పాలిటన్‌ కోర్టుల విధులను సస్పెండ్‌ చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్‌ గురువారం ఈ మేరకు సర్క్యులర్‌ జారీ చేశారు. కాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ఆదేశాల మేరకు.. కరోనా కట్టడికి తమ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, సందర్శకుల విషయంలో న్యాయస్థానం ఇటీవల కఠిన మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

TDP MLA Atchannaidu: ఏసీబీ కస్టడీకి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురు డైరక్టర్లు, మూడు రోజుల పాటు వీరిని విచారించనున్న ఏసీబీ

Hazarath Reddy

ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం ( ESI scam) కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని (TDP MLA Atchannaidu) మరో అయిదుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం (ACB Court) బుధవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Animal Health Cards in AP: ఏపీ ప్రభుత్వం మరో సంచలన పథకం, మూగ జీవాల కోసం వైఎస్సార్‌ పశు సంరక్షణ స్కీం, మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ ప్రజా సంక్షేమంతో పాటు మూగ జీవాల రక్షన కోసం కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా మూగప్రాణులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల యజమానులు, పెంపకం దారులకు ఆసరాగా నిలిచేందుకు వైఎస్సార్‌ పశుసంరక్షణ పథకానికి (YSR Pasu Samrakshana Scheme) శ్రీకారం చుట్టారు.

MP Raghu Rama Krishna Raju: అనుకున్నదే జరిగింది, ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు పార్టీ నుంచి షోకాజ్ నోటీస్, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు

Hazarath Reddy

ఈ మధ్య ఏపీలో హాట్ టాఫిక్ గా మారిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Kanumuru Raghu Rama Krishna Raju) వివాదానికి ఎవైసీపీ పార్టీ చెక్ పెట్టే దిశగా ఎట్టకేలకు అడుగులు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు (MP Raghu Rama Krishna Raju) వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement

AP's Coronavirus Report: ఏపీలో 10 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, తాజాగా 497 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో 10,331కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసులు పదివేల మార్కును దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు (Coronavirus cases) నమోదవగా, ఈ వైరస్‌ బారినపడినవారిలో 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య (AP's Coronavirus Report) 10,331కి చేరగా, 129 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 5,423 యాక్టివ్‌ కేసులు ఉండగా, మరో 4779 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 37 మంది, రాష్ర్టానికి చెందినవారు 448 మంది ఉన్నారు.

Distribution of House Rails: వైఎస్సార్ పుట్టిన రోజున ఏపీ సీఎం భారీ గిఫ్ట్, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఏపి సిఎం వైయస్ జగన్‌ మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ‘స్పందన’ కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో (AP CM Video Conference) మాట్లాడారు. జూలై 8న దివంగత సిఎం వైఎస్ఆర్ జయంతి (YS Rajasekhara Reddy Birthday) రోజున పేదలకు ఇళ్ల పట్టాలను (Distribution of House Rails) ఇవ్వాలని నిర్ణయించారు. 29-30 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని.. ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం అని జగన్‌ అన్నారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను సూచించారు.

Telugu States RTC Meeting: తెలంగాణకు ఏపీ నుంచి బస్సులు ఇప్పట్లో కష్టమే, రెండు రాష్ట్రాల ఆర్టీసీ కీలక భేటీ వాయిదా, మళ్లీ భేటీ ఎప్పుడు అనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్

Hazarath Reddy

కరోనా వైరస్ లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులు ( inter state bus services) తిరిగి ప్రారంభమవుతాయని భావించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. బుధవారం హైదరాబాద్‌లో జరగాల్సిన కీలక భేటి (Telugu States RTC Meeting) కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం అయ్యాయి. ఇందులో భాగంగానే గతవారం విజయవాడలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు (AP Telangana RTC Higher Official Meeting) సమావేశమై అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చించుకున్నారు.

YSR Kapu Nestham: రూ.15 వేలు నేరుగా అకౌంట్లోకి, వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని లాంచ్ చేయనున్న ఏపీ సీఎం, 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు రూ.354 కోట్లు జమ

Hazarath Reddy

పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS jagan) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చుకుంటున్నారు. హామీల్లో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ (YSR Kapu Nestham) అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan Mohan Reddy) రంగం సిద్ధం చేశారు.

Advertisement
Advertisement