ఆంధ్ర ప్రదేశ్
AP CM Village Tour: ఆగస్టు నుంచి గ్రామాల్లోకి వైయస్ జగన్, ఎవరైనా పథకాలు అందలేదని ఫిర్యాదులు చేస్తే అధికారులే బాధ్యులు, ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటనకు (AP CM Village Tour) సన్నద్ధం అవుతున్నారు. తన పర్యటనలో భాగంగా క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలును పరిశీలించనున్నారు. ఈలోపు అర్హులైన ప్రజలు ఎవరూ కూడా తమకు సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదులు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
Dr Sudhakar Latest Comments: సీఎం వైయస్ జగన్ నాకు దేవుడితో సమానం, డాక్టర్ సుధాకర్ కొత్త పలుకు, గుండు కొట్టిన వాళ్ల పేరు చెబితే గొడవలవుతాయన్న డాక్టర్
Hazarath Reddyవిశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డాక్టర్ సుధాకర్ మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు (Dr Sudhakar Comments) చేశారు. గతంలో ఏపీ సీఎం జగన్ ను తిట్టిన సుధాకర్ తాజాగా జగన్ దేవుడు (AP CM YS jagan) లాంటివాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానసిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తొలిసారి జనం ముందుకు వచ్చిన సుధాకర్ (Narsipatnam Doctor Sudhakar) పలు విషయాలు వెల్లడించారు. అదే సమయంలో తన ఉద్యోగం తిరిగి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం జగన్ దేవుడని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
AP Cabinet Key Decisions: గత ప్రభుత్వ అవకతవకలపై సీబీఐ విచారణ, ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం
Hazarath Reddyఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు (AP Cabinet Key Decisions) తీసుకుంది. ఈ రోజు సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ (AP Cabinet) కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.
AP Inter Results 2020: ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల, మనబడి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్న ఆంధ్రప్రదేశ్ బోర్డు
Hazarath Reddyఏపీ మనబడి ఇంటర్ రిజల్ట్స్ 2020 ను (Manabadi Inter Results 2020) రేపు (శుక్రవారం) ప్రకటించడానికి బీఐఏపీ (BIEAP) సిద్ధమైంది. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను మనబడి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. పరీక్షా ఫలితాలను (AP Inter Results 2020) రేపు అధికారిక వెబ్‌సైట్‌ లో పొందుపర్చనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, AP ఇంటర్ రిజల్ట్స్ 2020 ను నోటీసు బోర్డులలో ప్రదర్శించవద్దని పాఠశాలలకు సూచించబడింది.
AP Coronavirus: అనంతపురం యాడికిలో 20 కరోనా కేసులు, ఏపీలో 4,261కు చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, హోంక్వారంటైన్ ‌లోకి 8 మంది జీజీహెచ్ వైద్యులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (AP Coronavirus) గత 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా మరో 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,261 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు (Covid-19 cases) 1,641 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 80కి చేరింది.
Tirumala Temple Darshan: భక్తులతో పోటెత్తిన తిరుమల, 30 గంటల్లో 60 వేల టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు, అలిపిరి వద్ద భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌
Hazarath Reddyతిరుమల ఆలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ప్రారంభమయ్యింది. మూడు రోజుల ట్రయల్ రన్‌ తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మందికి శ్రీవారి దర్శనభాగ్యం కలుగనుంది. టైం స్లాట్ టోకెన్ల ద్వారా మరో 3 వేల మందికి శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు. 53 మందికి వీఐపీ టిక్కెట్ల ద్వారా టీటీడీ దర్శనం కల్పించింది. టీటీడీ సిబ్బంది అలిపిరి వద్ద భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు. టికెట్లు ఉన్నవారినే మాత్రమే దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు.
AP Cabinet Meeting: కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లు ఏర్పాటు, ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు ఇవే
Hazarath Reddyఏపీ రాష్ట్ర మంత్రివర్గం (AP State Cabinet Meeting) నేడు భేటి కానుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో ఈ మీటింగ్ జరగనుంది. కరోనా (COVID-19) నియంత్రణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మద్యం, ఇసుక అక్రమాల నియంత్రణకు కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, నూతనంగా ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్‌లతో పాటు మొత్తం 40 అంశాలపై మంత్రివర్గ మండలి చర్చించి ఆమోదముద్ర వేయనుంది. అలాగే నూతన పారిశ్రామిక విధానానికి కూడా కేబినేట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
AP SEC Row: నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం, హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రెండు వారాల్లోగా ప్రతివాదులందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
Hazarath Reddyరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడాన్ని ఏపీ హైకోర్టు (AP High Court) తప్పు పట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ్లిన సంగతి విదితమే. ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బాబ్డే (chief justice S A Babde), జస్టిస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది.
Sidda Raghava Rao joins YSRCP: ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్, వైసీపీలో చేరిన టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడి
Hazarath Reddyప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కరణం బలరాం (Karanam Balaram) ప్రకంపనలు మరవక ముందే ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి శిద్ధా రాఘవరావు (DP Ex-Minister Sidda Raghava Rao) బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో (YSRCP) చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శిద్ధా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్‌ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి (AP CM YS Jagan)వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
TSRTC: అంతర్రాష్ట్ర సర్వీసులకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, ఒప్పందం తరువాత రోడ్డెక్కనున్న టీఎస్ఆర్టీసీ, ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో చర్చలు జరుపుతున్న తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్
Hazarath Reddyప్రస్తుతం జిల్లా సర్వీసులు నడుపుతున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులకూ (Interstate Bus Services) సిద్ధమైంది. అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ సర్కార్‌ (Telangana Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పొరుగు రాష్ట్రాలతో ముందుగా ఒప్పందాలు చేసుకున్న తర్వాతే... సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించింది. దీంతో సీఎస్ సోమేష్ కుమార్ ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో చర్చలు జరపనున్నారు. ఆర్టీసీపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌... ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రూట్ టు రూట్ నడపాలని అధికారులను ఆదేశించారు. సిటీ సర్వీసులు ఇప్పుడే వద్దన్నారు.
Heavy Rains Alert: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రానున్న రెండు రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ విభాగం
Hazarath Reddyతూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48గంటల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారనున్నది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు (Rain In Andhra Pradesh) కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని (Heavy Rains Alert) వాతావరణశాఖ తెలిపింది. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
Amaravati SI Suspended: లాడ్జీలో కోరిక తీర్చాలంటూ ఎస్ఐ ఒత్తిడి, బాధితుల ఫిర్యాదుతో సస్పెన్షన్‌కు గురైన అమరావతి ఎస్ఐ, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిఎస్‌పి ఆదేశాలు
Hazarath Reddyమహిళలను రక్షించాల్సిన పోలీసు అధికారి తన కర్తవ్యాన్ని మరిచి ఓ మహిళ వద్ద డబ్బు వసూలు చేయడంతో పాటు, లైంగిక దాడికి యత్నించిన ఆరోపణలు రావడం అమరావతిలో (Amaravati) కలకలం రేపింది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సస్పెన్షన్‌కు (Amaravati SI Suspended) గురయ్యారు.
Jagananna Chedodu Scheme: నేడు జగనన్న చేదోడు స్కీమ్ లాంచ్, కుల వృత్తుల వారికి ఏడాదికి రూ.10 వేలు, రూ.154 కోట్ల 31 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) నేడు జగనన్న చేదోడు పథకాన్ని లాంచ్ చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఈ పథకం కింద ప్రభుత్వం అందజేయనుంది. వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్‌(దర్జీ) సంక్షేమం కోసం ‘జగనన్న చేదోడు’ (Jagananna Chedodu Scheme) పేరుతో ఆర్థిక సహాయం అందించనున్నారు.
AP Coronavirus: ఏపీలో నాలుగు వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు, తాజాగా 147 కరోనా కేసులు నమోదు, 2403 మంది డిశ్చార్జ్‌
Hazarath Reddyఏపీలో (Andhra Pradesh) గడిచిన 24 గంటల్లో 15,085 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 147 మందికి పాజిటివ్‌గా నిర్దారణ (AP Coronavirus) అయింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి పూర్తిగా కోలుకొని 16 మంది డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరణించిన ఆ ఇద్దరు కృష్ణా, అనంతపురం జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 3990 కరోనా కేసులు నమోదు కాగా 2403 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు 77 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1510 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.
Heavy Rainfall Alert: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన, మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చ‌రిక‌, మరింత చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
Hazarath Reddyనైరుతి రుతుపవనాలు (Mansoon) రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కోస్తాంధ్ర‌లో (Coastal Andhra) భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని విశాఖ వాతావరణ కేంద్రం (Visakha IMD) వెల్ల‌డించింది. ఈ రోజు తూర్పు మధ్య‌ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవ‌కాశముంద‌ని తెలిపింది. ఇది ప‌శ్చిమ వాయువ్య దిశ‌గా ప‌య‌నిస్తూ మ‌రింత‌ బ‌ల‌ప‌డ‌నుంద‌ని.. దీని వ‌ల్ల‌ తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయ‌ని తెలిపింది. అల్ప పీడ‌న ప్ర‌భావంతో రేపు కోస్తాంధ్ర అంత‌టా విస్తారంగా వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు ప‌డ‌తాయ‌న్నారు. మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.
AP SEC Row: నిమ్మగడ్డ వ్యవహారంలో ఊహించని ట్విస్టు, ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగం శ్రీకాంత్‌రెడ్డి
Hazarath Reddyరాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజు రోజుకు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జగన్ ప్రభుత్వం (YS Jagan Govt) దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం విదితమే. అయితే ఈ ఈసారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ( Nimmagadda Ramesh Kumar) వ్యతిరేకంగా హైకోర్టులోనే ఓ పిటీషన్ దాఖలైంది. ఆయన నియామకాన్ని రద్దు చేయాలంటూ కోవారెంట్ పిటీషన్ (Quo Warranto petition) దాఖలైంది. ఏపీ హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది.
Kanaka Durga Temple: జూన్ 10 నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనం, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనాలు
Hazarath Reddyఅన్‌లాక్ 1 నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏపీలో ఆలయాలు (temples Reopen in AP) తెరుచుకున్నాయి. ప్రధాన ఆలయాల్లో రెండు రోజుల ట్రయిల్ రన్ తర్వాత భక్తులకు దైవ దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో (Kanaka Durga Temple) భక్తుల దర్శనానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 10వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.
Comprehensive Land Survey: ఏపీ సీఎం కీలక నిర్ణయం, సమగ్ర భూసర్వే వేగ‌వంతం చేయాలని అధికారులకు ఆదేశాలు, మూడు విడతల్లో సర్వే చేయాలని అధికారులకు సూచన
Hazarath Reddyఏపీ సీఎం వైయస్ జ‌గ‌న్ మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సమగ్ర భూసర్వేను (Comprehensive Land Survey) వెంటనే ప్రారంభించాల‌ని అధికారులను ఆదేశించారు. మూడు విడ‌త‌ల్లో స‌ర్వే ప‌నులు పూర్తి చెయ్యాల‌ని.. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అధికారులకు సూచించారు. మండలాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని సర్వే చేయాలన్న ముఖ్య‌మంత్రి.. సర్వే రాళ్ల ఖర్చు కూడా స‌ర్కారే భ‌రిస్తుంద‌న్నారు. క్యాంపు ఆఫీసులో సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ (AP CM YS Jagan) రివ్యూ చేశారు. ఈ సమావేశంలో సీఎం చీఫ్ అడ్వైజ‌ర్ అజేయ కల్లం, ల్యాండ్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి..సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Vizag Divya Murder Case: విశాఖ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది, దివ్య హత్య కేసులో మొత్తం ఆరుమంది అరెస్ట్, లోతుగా విచారణ చేపడుతున్న విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు
Hazarath Reddyఏపీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన దివ్య హత్య కేసును (Vizag Divya Murder Case) విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. దివ్య హత్యలో పాల్గొన్న నిందితులను కస్టడీకి తీసుకోవాలని విశాఖ పోలీసులు యోచిస్తున్నారు. కోర్టులో పిటిషన్ వేసి, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలు వసంతతో పాటు, నలుగురు మహిళలు, ఒక వ్యక్తి అరెస్టయిన సంగతి విదితమే.
AP Assembly Session 2020: జూన్ 16 నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు, ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టే అవకాశం, ఈ నెల 11న కేబినెట్ భేటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 (జూన్ 16) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన వైఎస్సార్ సీపీ సర్కార్.. ఈ అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను (AP Assembly Budget Session 2020) ప్రవేశపెట్టనుంది. జూన్ 16న ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు.