ఆంధ్ర ప్రదేశ్
Krishnapatnam Node Tenders: ఏపీలో పుంజుకోనున్న పారిశ్రామిక రంగం, కృష్ణపట్నం నోడ్‌ పనులకు టెండర్లు, సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనులు
Hazarath Reddyఏపీ పారిశ్రామిక విస్తరణలో భాగంగా బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (CBIC)లో భాగంగా ప్రతిపాదిత కృష్ణపట్నం నోడ్‌ (Krishnapatnam Node) పనులకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) శ్రీకారం చుట్టింది. సుమారు 13,882.9 ఎకరాల్లో ఉద్దేశించిన ఈ పారిశ్రామిక నోడ్‌లో రానున్న సెప్టెంబర్‌ నుంచి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం (AP Govt) కార్యాచరణను సిద్ధంచేసింది. తొలిదశలో రూ.2,139 కోట్ల పెట్టుబడి అంచనాతో 3,090 ఎకరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
Bus Catches Fire: ఎండాకాలం ఏసీ బస్సు ప్రయాణాల్లో జాగ్రత్త, హైదరాబాద్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు
Vikas Mandaప్రైవేట్ ట్రావెల్స్ వారు ప్రయాణికుల భద్రత నియమాలు ఏవీ పాటించకుండా, ధనార్జనే ధ్యేయంగా బస్సులకు విశ్రాంతి లేకుండా ట్రిప్పులు నడపడం వల్లే ఈ లాంటి ప్రమాదాలకు కారణమవుతాయి. మార్గమధ్యంలో ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగినా, ఇబ్బందులు తలెత్తినా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎంతమాత్రం స్పందిచవు.....
Coronavirus In India: భారత్‌లో 75కు పెరిగిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, బెంగళూరు గూగుల్ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ
Vikas Mandaఇప్పటివరకు, ఇండియాలో కరోనావైరస్ ద్వారా ఒక మరణం సంభవించింది. కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి హైదరాబాదులో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు....
SSC 2020 Hall Ticket: పదో తరగతి హాల్ టికెట్లు అన్‌లైన్‌లో విడుదల, సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇలా. మార్చి 19 నుంచి పరీక్షలు ప్రారంభం
Vikas Mandaమార్చి 19, 2020 నుంచి ప్రారంభం అవుతున్న పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 6, 2020 వరకు కొనసాగుతాయి. అన్ని పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అయి మధ్యాహ్నం 12:45 లోపు ముగుస్తాయి, ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి బోర్డ్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 08 వరకు జరగనున్నాయి.
YS Viveka Murder Case: ఏపీ పోలీసులపై అసంతృప్తి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన హైకోర్ట్, సాధ్యమైనంత త్వరగా కేసును ఛేదించాలని సూచన
Vikas Mandaదీంతో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు, తమ పిటిషన్ లో 15 మంది నిందితుల పేర్లను పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్ట్, తాజాగా సీబీఐకి విచారణకు ఆదేశించింది.....
TDP vs YSRCP: మాచెర్లలో టీడీపీ నేతలపై దాడి, వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ ఆరోపణ, ఘటనను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, ఇదంతా టీడీపీ డ్రామా అని కొట్టిపారేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
Vikas Mandaటీడీపీ ఆరోపణలు వైసీపీ నేతలు తిప్పికొట్టారు. టీడీపీ నేతలే కావాలని రెచ్చగొట్టి, దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ దాడులు ఇదంతా టీడీపీ కుట్రగా అభివర్ణించారు.....
COVID 19 in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు, వందల సంఖ్యలో ఆంధ్రా మరియు తెలంగాణ విద్యార్థులు ఇటలీలో నిర్బంధం
Vikas Mandaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు (COVID 19 Positive Case in AP) నమోదైంది. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరుకి (Nellore) చెందిన యువకుడికి కరోనావైరస్ సోకినట్లు రిపోర్టుల్లో తేలింది.....
Foreigners Not Allowed in Tirumala: తిరుమలను సందర్శించే విదేశీయులు, ప్రవాస భారతీయులపై టిటిడి ఆంక్షలు, నెల వరకు తిరుమలకు రావొద్దని సూచన
Vikas Mandaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే కరోనాప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 465 మంది ప్రయాణికులను పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. వీరిలో 232 మందిని ఇప్పటికే గృహ నిర్భంధంలో ఉంచాము, 7 మంది మినహా మిగతా 226 మంది 'నిర్భంధ కాలాన్ని' పూర్తి చేసుకున్నట్లు వెళ్లడించారు.....
AP Politics: టీడీపీకి భారీ షాక్, వైసీపీలోకి వెల్లువలా చేరికలు, పులివెందులలో సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీ తీర్థం
Hazarath Reddyస్థానిక ఎన్నికలకు ముందే ఏపీలో టీడీపీకి (TDP) భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఏపీ రాజకీయ ముఖచిత్రం (AP Politics) ఇప్పుడు పూర్తిగా హాట్ హాట్ గా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ (YSRCP) కంచుకోట పులివెందులలో (Pulivendula) అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
Parimal Nathwani Meets AP CM: సీఎం జగన్‌తో పరిమల్‌ నత్వానీ, రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తానని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్‌ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని (Parimal Nathwani Meets AP CM) కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిత్వం ఇచ్చినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు.
Happy Holi 2020 Wishes: బుక్కాగులాల్ చల్లు.. ఖుషీలు వెదజల్లు, రంగులమయం అవ్వాలి మీ హోలీ వేడుకలు! హోలీ శుభాకాంక్షలు- Holi wishes, Messages, Quotes, Images, Status, Greetings, HD Wallpaper, Pics మరెన్నో హోలీ పండుగ విశిష్టతతో అందిస్తున్నాం, పండగ చేసుకోండి
Vikas Mandaఉల్లాసభరితమైన హోలీ పండుగను జరుపుకోడానికి మీరు సిద్ధమేనా? మీకోసం, మీ స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ హోలీ శుభాకాంక్షలను అందజేస్తున్నాం. ఇవి మీ ఆత్మీయులకు పంపించి వారికి పండగ శుభాకాంక్షలు తెలపండి, వేడుకను కలిసి జరుపుకునేందుకు వారిని ఆహ్వానించండి.....
Coronavirus Threat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు చోట్ల కరోనావైరస్ నిర్ధారణ కేంద్రాలు సహా దేశవ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. పూర్తి జాబితా చూడండి
Vikas Mandaదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనావైరస్ నిర్ధారణ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. రాష్ట్రాల వారిగా ఏయే నగరాలలో వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయో తెలిపే జాబితా....
Rajya Sabha Elections: ఏపీలో ఫలించిన అంబానీ వ్యూహం, ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు పేర్లు బయటకు వచ్చేశాయి, వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వర ప్రసాద్
Hazarath Reddyదేశవ్యాప్తంగా వచ్చే ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు (Rajya Sabha election) జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగే రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి. ఇక ఏపీలో (AP ) ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలను (AP Rajya Sabha) అధికార వైసీపీ కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ అధిష్టానం (YSRCP) ఖరారు చేసినట్లు సమాచారం.
Coronavirus Terrifies: తిరుమల వెళ్లేవారికి హెచ్చరిక, జలుబు, దగ్గు ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దని కోరిన టీటీడీ అధికారులు, లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని స్విమ్స్‌కు తరలించాలని ఆదేశాలు
Hazarath Reddyదేశంలో రోజు రోజుకు పంజా విప్పుతున్న కరోనా వైరస్ (Coronavirus Terrifies) ధాటికి రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తిరుమలలోని శ్రీవారి దర్శనంపై (Lord Venkateswara Swamy temple) ఆంక్షలు విధించారు.కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు ఉన్న భక్తులు తిరుమలలోని శ్రీవారి దర్శనానికి (Tirumala Temple) రావద్దని టీటీడీ (TTD Management) సలహా ఇచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా జలుబు, దగ్గు ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పించకుండానే వెనక్కి పంపించాలని టీటీడీ అధికారి సిబ్బందిని ఆదేశించారు.
AP Local Body Elections 2020: జనసేన పార్టీకి ప్రత్యేకంగా గుర్తు, పంతొమ్మిది రాజకీయ పార్టీలకే గుర్తులు, స్థానిక ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌
Hazarath Reddyఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి (AP local Body Elections 2020) మొదలైంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తోంది. నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు (AP Local Body Election Nomination) స్వీకరించనున్నారు. అయితే అభ్యర్థులు 19 రాజకీయ పార్టీల గుర్తుల నుంచే పోటీ చేయాల్సి ఉంటుంది.
AP Local Body Election Nomination: గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి, ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు నేటి నుంచే, నామినేషన్‌కు కావాల్సిన అర్హతలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా (Andhra Pradesh local Body Elections 2020) మోగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను (AP Local Body Election Nomination) స్వీకరించనున్నారు. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు (MPTC, ZPTC) నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ కార్యాలయాల్లో, ఎంపీటీసీ స్థానాలకు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది.
AB Venkateswara Rao: ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీవీకి కేంద్రం షాక్, సస్పెన్షన్‌ని ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు, ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసని తెలిపిన వెంకటేశ్వర రావు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు (AP former intelligence chief AB Venkateswara Rao) కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్‌ని ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ (Home Ministry) ఆదేశాలిచ్చింది. ఏప్రిల్ 7 లోపు ఏబీ వెంకటేశ్వర రావు పై (AB Venkateswara Rao) నమోదు చేసిన అభియోగాలపై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి (AP Goverment) కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
Maruthi Rao Suicide: మారుతి రావు ఆత్మహత్య, అసలేం జరిగింది?, అమృత తండ్రి ఆత్మహత్యకు కారణమేంటి ?, ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా మారుతీరావు, కేసుల ఒత్తిడే కారణమంటున్న ఆయన భార్య
Hazarath Reddyరెండు సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో (Pranay Murder Case) నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య (Maruthi Rao Suicide) చేసుకోవడం కలకలం రేపింది. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో (Arya Vaishya Bhavan) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చింతల్‌బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
AP SSC Exams New Schedule: ఏపీలో 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల, మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్పు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్ (SSC Exams New Schedule) ప్రకారం మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది.
Tirumala Tirupati Temple: తిరుమల కొండపై మద్యం తాగుతూ, చికెన్ తింటూ.., 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్‌, తిరుమల నోటిఫై ఏరియా చట్టం కింద కేసు నమోదు
Hazarath Reddyప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు (Tirumala) అందరూ దైవ దర్శనం కోసం వెళుతుంటారు. కష్టాలు, బాధలను మర్చిపోయి దేవుడు సేవలో మైమరిచిపోవాలని కోరుకుంటారు. అలాంటి చోట ఆకతాయిలు మరీ పేట్రేగిపోతున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తూ వస్తున్నారు. తాజాగా తిరుమల కొండపై (Venkateswara Temple) కూడా మద్యం తాగుతూ, మాంసం తింటూ కొందరు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు.