APPSC Good News: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్.. అధికారికంగా ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ

ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

APPSC Good News: దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో  దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్.. అధికారికంగా ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ
epresentational picture. (Photo credits: Needpix.com)

Vijayawada, Oct 27: ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) ఓ శుభవార్త (Good News) చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా  అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆర్డర్ నెం.77 మేరకు ఈ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, చెవిటివారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగాల వారు దివ్యాంగుల జాబితాలో చేర్చారు.

Ayodhya Ram Mandir: రామమందిరం నిర్మాణ పనుల వీడియో విడుదల చేసిన ట్రస్ట్.. 500 ఏళ్ల పోరాటానికి ఇది ముగింపు అంటూ వ్యాఖ్య

కండీషన్ ఇదే

ఉద్యోగానికి సంబంధించి ఇతర నిబంధనలకు లోబడే రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగార్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులై ఉండాలని పేర్కొంది. దివ్యాంగుల కమిషన్ వెబ్‌సైట్‌ లో లబ్ధిదారులు తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.

Board Of Intermediate: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు తేదీల విడుదల.. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 14 వరకూ జరిమానా లేకుండానే ఫీజు చెల్లింపునకు అవకాశం.. ఆ తర్వాత జరిమానా ఎలాగంటే?

 

(The above story first appeared on LatestLY on Oct 27, 2023 10:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).