తెలంగాణ
Student Bitten by Snake: వీడియో ఇదిగో, ప్రకృతి పిలిచిందని వెళ్లిన గురుకుల విద్యార్థిని కాటేసిన పాము, వెంటనే ఆస్పత్రికి తరలించిన స్కూలు యాజమాన్యం
Hazarath Reddyపెద్దపల్లి జిల్లా(Peddapally district) సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా లలో మన్విత్ అనే ఆరో తరగతి విద్యార్థిని పాము కాటు(Snake bite) వేసింది. మన్విత్ను గురుకుల సిబ్బంది కరీంనగర్లోని ఓ హాస్పిటల్కు తరలించారు.
Dog Last Rites: పోలీస్ శాఖలో 8 ఏళ్ల పాటు సేవలందించిన కుక్క మృతి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన నిజామాబాద్ పోలీసులు
Hazarath Reddyఅధికారిక లాంఛనాలతో శునకానికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో దాదాపు 8 ఏళ్ల పాటు సేవలు అందించిన డాగ్ గోల్డి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు డాగ్ గోల్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
HMDA Services: హెచ్ఎండీఏ సేవలకు అంతరాయం , ఓవర్ లోడ్ కారణంగా నిలిచిపోయిన ఆన్లైన్ సేవలు
Arun Charagondaహెచ్ఎండీఏ సేవలకు అంతరాయం ఏర్పడింది. డేటా ఓవర్ లోడ్ అయినట్లు నిన్న అర్ధరాత్రి గుర్తించారు అధికారులు. ఓవర్ లోడ్ అయిన డేటాను ప్రత్యేకంగా స్టోరే చేసే ప్రయత్నాలు చేయగా దీంతో ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
Khammam: ఖమ్మంలో జిల్లాలో కేంద్ర బృందం, పంట నష్టంపై అంచనా, రైతులను కలిసిన కమిటీ సభ్యులు
Arun Charagondaఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. ఖమ్మం జిల్లాలో పంట నష్టంపై అంచనా వేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చింది అరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం. కూసుమంచి మండలంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి పంట నష్టంపై ఆరా తీసింది కేంద్ర బృందం.
Gachibowli Rave party: గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం.. పార్టీలో సినీ ప్రముఖులు
Arun Charagondaహైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఓ గెస్ట్హౌస్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రాగా గెస్ట్ హౌస్పై దాడులు చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న..18 మంది యువతీ యువకులకు అరెస్ట్ చేశారు. వారిలో సినీ ప్రముఖులు, సాప్ట్వేర్ ఇంజనీర్లు 10 మంది ఉన్నారు. మరో 8 మంది అమ్మాయిలు. వీరితోపాటు గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
CM Revanth Reddy On Hydra: అక్రమార్కులు ఎంత గొప్పోల్లైన వదలిదేది లేదు..హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్
Arun Charagondaహైడ్రా అక్రమ నిర్మాణాలపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్ స్పెక్టర్లుగా ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 547 మందితో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్...ఎంత గొప్పోలైన సరే.. కూల్చకుండా వదిలేది లేదు వార్నింగ్ ఇచ్చారు.
Telangana Police: 11 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ పోలీసులు, సీఎం రేవంత్కు చెక్కును అందించిన డీజీపీ జితేందర్ రెడ్డి..వీడియో
Arun Charagondaతెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేశారు. ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి రూ.11,06,83,571ల విరాళంకు సంబంధించిన చెక్ని అందజేశారు డీజీపీ జితేందర్, శివధర్ రెడ్డి తదితరులు.
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనంపై కీలక అప్డేట్, 70 అడుగుల విగ్రహాం 17న మధ్యాహ్నం ఒంటి గంట లోపు నిమజ్జనం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరుపోయిన ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు (Khairatabad Big Ganesh Darshan) దర్శనమిస్తున్నారు.
Special Police Force For Hydra: హైడ్రా మరింత దూకుడు, 15 మంది సీఐలతో పాటు 8 మంది ఎస్సైలతో ప్రత్యేక సిబ్బంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత మరింత వేగవంతం
Arun Charagondaఓ వైపు హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతపై వివాదం కొనసాగుతుండగా ప్రభుత్వం మాత్రం వెనకగుడుగు వేయడం లేదు. తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించింది ప్రభుత్వం. 15 సీఐ స్థాయి, 8 మంది ఎస్ఐ స్థాయి ప్రత్యేక పోలీసులను కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Mahbubnagar: దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్తో ఇద్దరు దొంగలు మృతి, మహబూబ్నగర్లో షాకింగ్ సంఘటన
Arun Charagondaదొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్లో చోటు చేసుకుంది. జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామంలో కరంటు షాక్ కొట్టి ఇద్దరు దొంగలు మృతి చెందారు. ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతుండటంతో వాటిని అరికట్టేందుకు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు.
Stray Dogs Attack: కామారెడ్డిలో వీధికుక్కల స్వైర విహారం, 15 మందిపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక...వీడియో
Arun Charagondaతెలంగాణలోని కామారెడ్డిలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. కామారెడ్డి - మాచారెడ్డి, ఘన్పూర్ తో పాటు పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేశారు. వేర్వేరు సంఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.
Pawan Kalyan With Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ, సీఎంఆర్ఎఫ్కు రూ. కోటి విరాళం అందజేత
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇవాళ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పవన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంకు సంబంధించిన చెక్ను రేవంత్కు అందించారు పవన్.
Flipkart Delivery Boy: ఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం,కేకలు వేయడంతో పరారైన నిందితుడు
Arun Charagondaఫ్లిప్ కార్ట్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం చేశాడు. గృహిణి పై అత్యాచారయత్నానికి పాల్పడగా కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. నిర్మల్ పట్టణం మంజులపూర్ కాలనీలో ఆర్డర్ డెలివరి చేసే క్రమంలో గృహిణి పై ఆత్యచారాయత్నం చేశాడు. నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Stray Dogs Attack:నిజామాబాద్లో దారుణం, 10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు...విషాద సంఘటన
Arun Charagondaనిజామాబాద్ జిల్లా బోధన్ బస్స్టాండ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లింది తల్లి. అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్నాయి వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టినన పోలీసులు... బస్ డిపో పరిసరాలలో బాలుడి అవయవాలు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
16th Finance Commission Meet: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటా 41 నుంచి 50 శాతానికి పెంచాలి: 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyదేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని..అందుకే ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పేర్కొన్నారు.
Godavari Water Level Rise: భద్రాచలం వద్ద 47 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం, పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు బంద్, రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్న అధికారులు
Hazarath Reddyభద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు ఎక్కువవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం (Godavari Water Level Rise) పెరుగుతోంది. సోమవారం 26 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఈ రోజు మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది.
Ganesh Visarjan in Hussain Sagar: హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జనంకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని వ్యాఖ్యలు
Hazarath Reddyహైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం వేడుకలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ పిటిషన్ ను కొట్టివేసింది. మరో పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. 2021 ఆదేశాలు (Ganesh Visarjan in Hussain Sagar) యధావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది.
Telangana: అత్త మరణాన్ని తట్టుకోలేక అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి కోడలు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్త మరణం తట్టుకోలేక మనస్తాపానికి లోనై కోడలు ఆత్మహత్య చేసుకుంది. చెన్నైకి చెందిన హరిత్ ప్రభు కుటుంబం బేగంపేటకు వచ్చి స్థిరపడింది. కొన్ని రోజుల క్రితం హరిత్ తల్లి మృతి చెందగా అప్పటినుంచి హరిత్ భార్య రంజీత తీవ్ర మనస్తాపానికి గురైంది.
BJP MLA Alleti Maheshwar Reddy: హైడ్రా పేరుతో వందలు, వేల కోట్ల వసూళ్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తోంది. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ganesh Visarjan 2024: హైదరాబాద్ వాసులకు షాక్, హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు
Hazarath Reddyగణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది.అయితే ఈ ఏడాది హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి (Ganesh Visarjan 2024) అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు (Flexis Viral in Social Media) పెట్టారు.