తెలంగాణ
Tollywood Director Suicide: టాలీవుడ్ లో విషాదం.. ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొన్న ‘జీఎస్టీ’ సినిమా దర్శకుడు.. హైదరాబాద్ లో ఘటన
Rudraటాలీవుడ్ సినీ దర్శకుడు కొమరి జానయ్య సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని భాగ్య నగర్ కాలనీలో ఉన్న ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
Time Square: న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై సీఎం రేవంత్ ఫొటో సందడి.. వీడియో మీరూ చూడండి..!
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది.
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసుపై విచారణకు హాజరవ్వండి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు.. మాజీ మంత్రి హరీశ్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి కూడా సమన్లు
Rudraతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై భూపాలపల్లి జిల్లా కోర్టు స్పందించింది.
Cognizant New Centre in Hyd: హైదరాబాద్లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్, 15 వేల మందికి ఐటీ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి, కాగ్నిజెంట్ సంస్థ మధ్య ఒప్పందం
Vikas Mప్రముఖ ఐటీ దిగ్గజం `కాగ్నిజెంట్` హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 20 వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు వీలుగా పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయనున్నది
Beware Of Parcel Fraud: పార్సిల్ లేదా కొరియర్ కాల్స్తో జాగ్రత్త.. నకిలీ కాల్స్ నమ్మి మోసపోకండి!
Arun Charagondaరోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా పంజా విసిరేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా పార్సిల్ లేదా కొరియర్ కాల్స్ స్కాంకు తెగబడ్డారు. మీ పేరిట వచ్చిన కొరియర్లో నిషేధిత, మత్తు పదార్థాలు ఉన్నాయని, మీపై కేసులు నమోదయ్యాయని సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని బురిడీ కొట్టించి, టెన్షన్ లో పెట్టి డబ్బులు గుంజుతారు.
Vemulawada Temple VIP Darshan: వేములవాడ రాజన్న ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభం, టికెట్ ధర ఎంతో తెలుసా?
Arun Charagondaదక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న దేవాలయం(రాజరాజేశ్వర స్వామి)లో వీఐపీ బ్రేక్ దర్శనం నేటి నుండి ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించారు. వీఐపీ బ్రేక దర్శన టికెట్ ధర రూ.300గా ఉండగా ఈ టికెట్ తీసుకున్న వారికి ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వనున్నారు.
Telangana: సీఐ పుట్టినరోజు వేడుకలు, భవనం మూడో అంతస్తు పై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి, కూకట్పల్లిలో విషాదకర ఘటన
Hazarath Reddyప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన కూకట్పల్లిలోని దేవినగర్లో చోటుచేసుకుంది.రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్లో సీఐగా పనిచేస్తున్న శేఖర్ పుట్టినరోజు వేడుకకు హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ సహా 30 మంది స్నేహితులు వెళ్లారు.
Telangana Runamafi: మీకు రుణమాఫీ కాలేదా, అయితే మీకోసమే బీఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్, రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు నిద్రపోనివ్వంటున్న గులాబీ నేతలు
Arun Charagondaతెలంగాణ రాష్ట్రం లో రైతులు గౌరవంగా బతకగలమని గుండె మీద చేయి వేసుకుని చెప్పేలా కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి....కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయం ఇచ్చి సంపూర్ణ రక్షణ వలయం ఏర్పాటు చేశారు...వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత స్వామి నాథన్ సైతం కేసీఆర్ తీసుకున్న చర్యలను మెచ్చుకున్నారు అన్నారు.
Anand Mahindra: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా, కీలక నిర్ణయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyయంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా పేరును న్యూయార్క్లో ఎన్నారైల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ... యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు.
KTR On MLAs Disqualification: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు, త్వరలో ఉప ఎన్నిక ఖాయమన్న కేటీఆర్
Arun Charagondaపార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు అని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందంతో కలిసి రాజ్యంగ నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు తేల్చి చెప్పారు.
Nagarjuna Sagar Project: కృష్ణమ్మ పరవళ్లు, నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్, పర్యాటకుల సందడి
Arun Charagondaశ్రీశైలం నుండి నాగార్జున సాగర్కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఇన్ ఫ్లో అధికంగా ఉండటంతో సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు.
Telangana: వీడియో ఇదిగో, రైలు వస్తున్నా గుర్తించలేక పట్టాలపై నడిచిన మతిస్థిమితం లేని మహిళ, రిస్క్ చేసి ప్రాణాలు కాపాడిన మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులు
Hazarath Reddyరైలు వస్తున్నా దాన్ని గుర్తించేలేక పట్టాలపై నడుస్తున్న మతిస్థిమితం లేని మహిళను ఆర్కే ఫౌండేషన్ సభ్యులు కాపాడారు. ఖమ్మం జిల్లా మధిరలోని మోటమర్రి రైల్వే స్టేషన్ దగ్గర ఓ మతిస్థిమితం లేని మహిళ రైలు వస్తుంటే అదే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్లింది. గమనించిన మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు.
Third Degree On Dalit Woman: రంగారెడ్డి జిల్లా పోలీసుల అమానుషం, దళిత మహిళపై థర్డ్ డిగ్రీ,దొంగతనం ఒప్పుకోవాలని చిత్రహింసలు, సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం, బాధిత పోలీస్ పై చర్యలు
Arun Charagondaరంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఓ పోలీస్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఓ దొంగతనం కేసులో దళిత మహిళను చిత్రహింసలకు గురిచేశాడు. ఏకంగా మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. దీంతో నడవలేక ఆ మహిళ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు
Telangana Police: శభాష్ ములుగు జిల్లా పోలీస్, చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ , కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ...వీడియో
Arun Charagondaములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గోడ మీద నుండి పడి స్పృహ కోల్పోయాడు. చనిపోయాడని స్థానికులు వదిలేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ ను అభినందించారు జిల్లా ఎస్పీ.
Boy Missing In Hyd:తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు, ట్యూషన్కు వెళ్లి వస్తున్న బాలుడి కిడ్నాప్?, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు
Arun Charagondaతెలంగాణలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో బాలుడు మిస్సయ్యాడు. ట్యూషన్కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలుడిని బైక్ పై తీసుకువెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని తీసుకెళ్తుండగా సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
CM Revanth Reddy: ప్రపంచంతోనే పోటీ పడుతున్న తెలంగాణ, న్యూ జెర్సీలో భారీ కార్ల ర్యాలీ, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్
Arun Charagondaతెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్కు ఘన స్వాగతం పలకగా ఇవాళ న్యూయార్క్లోని పలు సంస్థల ప్రతినిధులతో రేవంత్రెడ్డి భేటీ కానున్నారు. న్యూజెర్సీలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కారు ర్యాలీలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Telangana Shocker: మెదక్లో దారుణం, వివాహేతర సంబంధం దారుణ హత్య, గొడ్డలితో నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు
Arun Charagondaమెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దా పూర్ గ్రామంలో దారుణ హత్య జరిగింది. ముస్లాపూర్కు చెందిన చిత్తరి బేతయ్య (40 )ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Abids Kidnap Case:వీడియో ఇదిగో.. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు, కిడ్నాప్ చేసిన వ్యక్తిని చితకాదిన కుటుంబ సభ్యులు
Arun Charagondaహైదరాబాద్ అబిడ్స్ కిడ్నాప్ కేసును గంటల్లోనే చేధించారు పోలీసులు. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు బృందాలు బరిలోకి దిగగా గంటల వ్యవధిలోనే చేధించారు పోలీసులు. కిడ్నాప్ చేసిన నిందితుడిని చితకబాదారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది
KTR On CM Revanth Reddy US Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, మాకైతే తెలంగాణ ఫస్ట్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటపై ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి భారీ బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్తున్నది. ఈ సందర్భంగా రేవంత్రెడ్డికి, మంత్రి శ్రీధర్బాబుకు నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ అన్నారు.
Nizamabad: గొడ్డుకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ప్రిన్సిపాల్పై మండిపాటు ,ఎంఈవోకు ఫిర్యాదు
Arun Charagondaగొడ్డు కారంతో మధ్యాహ్న భోజనం వండించిన సంఘటన నిజామాబాద్ కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో చోటు చేసుకుంది. కారంలేని పప్పు వడ్డించారని పిల్లలు తినడానికి ఇష్టపడలేదు. దీంతో పిల్లలకు కారం,నూనె పోసి ఇవ్వగా దాంతోనే తిన్నారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిపై మండిపడి, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.