తెలంగాణ

Telangana Shocker: సదాశివపేటలో విషాదం... క్రికెట్ బెట్టింగ్‌లో 25 లక్షలు లాస్.. బీటెక్ విద్యార్థి సూసైడ్

sajaya

క్రికెట్ బెట్టింగ్‌లో 25 లక్షలు లాస్.. బీటెక్ విద్యార్థి సూసైడ్ సంగారెడ్డి - సదాశివపేట పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి చింత వినీత్(25) రూ.25 లక్షలు అప్పు తెచ్చి బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. తెచ్చిన అప్పులు చెల్లించే దారిలేక వినీత్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Heat Waves in Telangana: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు

Rudra

భారీ ఉష్ణోగ్రతలతో (High Temperatures) తెలంగాణ (Telangana) నిప్పులు కొలిమిలా మారుతోంది. 45 డిగ్రీలు దాటేసిన ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల దిశగా పరుగులు పెడుతున్నాయి.

Premikudu Re-Release: ముప్పై ఏండ్ల కిందట సంచలనం సృష్టించి మళ్లీ వస్తున్న ‘ప్రేమికుడు’.. 1న 300 థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Rudra

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్-ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కాంబినేషన్‌ లో మూడు దశాబ్దాల క్రితం వచ్చిన లవ్, పొలిటికల్ డ్రామా ‘ప్రేమికుడు’ మళ్లీ విడుదలకు సిద్ధమైంది.

2024 భారతదేశం ఎన్నికలు: ఏపీలో పెద్ద ఎత్తున నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ‌, 175 స్థానాల్లో 2705 నామినేష‌న్ల‌కు ఆమోదం, తెలంగాణ‌లో 17 లోక్ సభ స్థానాల‌కు 625 నామినేష‌న్లకు ఈసీ ఓకే

VNS

పరిశీలన తరువాత 1,060 సెట్ల నామినేషన్లకు ఆమోదం తెలిపారు. మొత్తం 893 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 268 మంది అభ్యర్థులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను 625 మంది అభ్యర్థులు నామినేషన్లకు ఆమోదం పొందాయి.

Advertisement

Inter Advanced Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌, మే 24 నుంచి ప‌రీక్ష‌లు, పూర్తి టైం టేబుల్ ఇదుగోండి

VNS

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ (Inter Advanced Supplementary) ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. మే 24వ తేదీ నుంచి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు ఇంట‌ర్ సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు (Inter Advanced Supplementary) నిర్వ‌హించ‌నున్నారు.

CM Revanth Reddy: మోడీ, అమిత్‌ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేస్తుంది. -సీఎం రేవంత్‌ రెడ్డి

sajaya

ఎన్నికల్లో ఏదో రకంగా లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మోడీ, అమిత్‌ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేస్తుంది. -సీఎం రేవంత్‌ రెడ్డి

Mallareddy Meets Etala Rajender: మ‌ల్కాజిగిరిలో ఈట‌ల‌దే గెలుపు! షాకింగ్ కామెంట్స్ చేసిన మ‌ల్లారెడ్డి, వివాహ వేడుక‌లో ఈట‌ల‌ను క‌లిసిన మ‌ల్లారెడ్డి (వీడియో ఇదుగోండి)

VNS

మల్లారెడ్డి మల్కాజిగిరిలో ఈటలదే విజయం అంటూ జోస్యం చెప్పారు. అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్‌‌ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు. దాంతో తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Orange Alert for Telangana: మండుతున్న ఎండలు, తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్, వచ్చే 5 రోజులు వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక 

Hazarath Reddy

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. వచ్చే అయిదు రోజులు తెలంగాణలో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌లో వాతావరణం కేంద్రం పేర్కొంది. ఈనెల 28, 29, 30 అధికంగా వడగాల్పులు వీచే అవకాశంతో ఉందని తెలిపింది.

Advertisement

Hyderabad Fire Video: షాద్ నగర్ అగ్నిప్రమాదం, మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికుల ప్రాణాలను కాపాడిన బాలుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్‌ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి.

Hyderabad Fire: వీడియోలు ఇవిగో, భారీ అగ్నిప్రమాదంలో భయంతో బిల్డింగ్ పై నుండి దూకుతున్న సిబ్బంది, మంటల్లో చిక్కుకున్న 50 మంది

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్‌ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి.

Breaking News, Fire Accident: షాద్ నగర్ లో ఓ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం...మంటల్లో చిక్కుకున్న 50 మంది కార్మికులు

sajaya

రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ పరిధిలో అల్వీన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 50 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద చోటుచేసుకుంది.

Telugu States Weather Update: మరో మూడు రోజులు వడగాడ్పులు మరింతగా పెరిగే అవకాశం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ నివేదికలు చెబుతున్నాయి.

Advertisement

Harish Rao Vs Revanth Reddy: ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ సవాల్, రాజీనామా లేఖతో వచ్చిన హరీష్ రావు, దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా లేఖతో రావాలని ఛాలెంజ్

Hazarath Reddy

తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశంలో రెండు పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా గన్‌ పార్క్‌ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

2024 భారతదేశం ఎన్నికలు: తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు.. మొదలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ... 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు.. మే 13న పోలింగ్.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు

Rudra

తెలంగాణలో ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. 17వ లోక్ సభ స్థానాలకు గాను 547 నామినేషన్లు దాఖలయ్యాయి.

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన, ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు

Hazarath Reddy

రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలతోపాటు డమ్మీ, ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు భారీగానే నామినేషన్లు వేశారు. రేపు(శుక్రవారం) నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, విదేశాల్లో దాక్కున్న ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు, నిందితులపై సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు నమోదు

Hazarath Reddy

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.నిందితులపై దర్యాప్తు బృందం సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఈ కేసులో ఐటీ యాక్ట్‌ 66(ఎఫ్‌)ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు.

Advertisement

Warangal Road Accident: ఇంటర్ పాసైన ఆనందంలో పార్టీ, ఒకే బైక్‌పై వస్తుండగా బస్సు ఢీకొని నలుగురు స్నేహితులు మృతి, వరంగల్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోగా మరో యువకున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

Hyderabad Road Accident: రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టిన కారు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఓ కారు వేగంగా ఢీకొట్టింది. పటాన్‌చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్- 3 దగ్గర ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టిన కారు ఒక్కసారిగా మంటలు చెలరేగి.. కారు పూర్తిగా దగ్ధం కాగా.. మంటలు లారీకి కూడా అంటుకున్నాయి కారులో ఇద్దరు సజీవ దహనం అయినట్టు సమాచారం.

Road Accident in Kodada: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి

Rudra

సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

Telangana: ఇంటర్ ఫెయిల్, ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య, తెలంగాణలో ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం

Hazarath Reddy

నిన్న వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement
Advertisement