తెలంగాణ

Telangana Elections 2024: వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య, మిగతా మూడు స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

Hazarath Reddy

వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

Hyderabad: వీడియో ఇదిగో, దాదాపు 1000 బైక్ మోడిఫైడ్ సైలెన్సర్‌లను రోడ్డు రోలర్‌ కింద వేసి ధ్వంసం చేసిన హైదరాబాద్ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ పోలీసులు బైక్‌లకు సంబంధించిన దాదాపు 1000 సవరించిన సైలెన్సర్‌లను రోడ్డు రోలర్‌ కింద వేసి ధ్వంసం చేశారు. MV చట్టంలోని 190(2) ప్రకారం, బైక్‌పై ప్రెజర్ హార్న్ & మోడిఫైడ్ సైలెన్సర్‌లను అమర్చడం వల్ల గాలి & శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. అలా ఏర్పడితే రూ.10వేల వరకు జరిమానా & 6 నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

Viral Video: రైతన్నకు సహాయం చేసిన పోలీసన్న.. నెట్టింట్ల ప్రశంసల వర్షం.. అసలేమైంది?

Rudra

తాండూరులో ఎడ్ల బండిపై వెళుతున్న ఓ రైతు బండి చక్రం ఉన్నట్టుండి ఊడిపోయింది. దీంతో చక్రాన్ని సరిచేసేందుకు అతడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.

Bhadrachala Seetha Rama Swamy Kalyana Talambralu: రూ. 151 చెల్లిస్తే మీ ఇంటికే భద్రాచల సీతారాముల స్వామి కళ్యాణ తలంబ్రాలు, ఎలా బుక్ చేసుకోవాలంటే..

Hazarath Reddy

భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను ఈ ఏడాది భక్తులకు హోం డెలివరీ రూపంలో అందజేసేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఈ తలంబ్రాలు కావాలనుకొనే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్‌ ఆర్టీసీ తెలిపింది.

Advertisement

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు, కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4కు వాయిదా పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఈడీకి నోటీసులు

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4 తర్వాత చేపడతామని తెలిపింది.

Nizam Sagar Canal: ఆర్మూర్‌ లో తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట.. ఇండ్లలోకి చేరిన నీరు.. వీడియో వైరల్

Rudra

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ లో నిజాంసాగర్‌ కాలువ కట్ట తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్‌ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది.

Ayodhya Ram Mandir: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక అయోధ్య రామయ్య దర్శనం మరింత సులభం.. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులోకి

Rudra

అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే హైదరాబాద్ వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది.

KCR Tour: మ‌రోసారి రైతుల వ‌ద్ద‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏప్రిల్ 5న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ లో ప‌ర్య‌ట‌న‌

VNS

క్రమంలోనే ఏప్రిల్‌ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పర్యటనకు కేసీఆర్‌ సిద్ధమయ్యారు. కరీంనగర్‌, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో కేసీఆర్‌ పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు.

Advertisement

KCR Nalgonda Tour: జనగాంలో కేసీఆర్ పర్యటన.. ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న కేసీఆర్.. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కేసీఆర్

sajaya

BRS Chief KCR Tour in Combined Nalgonda District : సాగు నీటి సమస్య వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం నల్గొండ జిల్లాలో పొలం బాట పట్టారు. ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు.

USB Charger Scam: పబ్లిక్‌ ప్లేస్ లలో ఉండే యూఎస్బీ చార్జింగ్‌ పోర్టళ్ల పట్ల జాగ్రత్త.. పోర్టళ్ల ద్వారా దుండగులు ఫోన్‌ లలోని సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం.. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

Rudra

దేశ ప్రజలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హోటళ్లు, బస్టాండ్లు, కేఫ్‌ లు, ఎయిర్‌పోర్టులు తదితర ప్రదేశాల్లో ఉండే పబ్లిక్‌ చార్జింగ్‌ పోర్టళ్ల స్మార్ట్‌ ఫోన్‌ లకు చార్జింగ్‌ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నది.

KTR Legal Notices: త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై కేటీఆర్ లీగ‌ల్ యాక్ష‌న్, 10 న్యూస్ ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ కు నోటీసులు

VNS

కేటీఆర్‌ నోటీసులు పంపిన ఛానెల్స్‌లో మహాన్యూస్‌, ఐన్యూస్‌, సీఆర్‌వాయిస్‌, మన తొలివెలుగు టీవీ, మనంటీవీ, పాలిట్రిక్స్‌, రేవంత్‌ దండు, వైల్డ్‌ వూల్ఫ్‌ న్యూస్‌, రెడ్‌ టీవీతో పాటు యూట్యూబ్‌కు నోటీసులు పంపారు.

Summer Heat Wave In Telangana: ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా వడగాలులు ప్రారంభం..హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ శాఖ (IMD)

sajaya

భారత వాతావరణ శాఖ (IMD) ఏప్రిల్ 1 న తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేసింది. IMD సూచన ప్రకారం, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్‌తో సహా పలు జిల్లాల్లో వడగాలి పరిస్థితులు ప్రబలే అవకాశం ఉంది.

Advertisement

Viral Video : న‌ల్ల‌మ‌ద్ది చెట్టు నుంచి ఉప్పొంగిన నీళ్లు.. చెట్టును నరికే కొద్దీ ఉబికి వస్తున్న నీరు.. పాపికొండల అటవీ ప్రాంతంలో అద్భుత దృశ్యం..

sajaya

అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం.. పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిందు చేసిన నల్లమద్ది చెట్టు. నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి.

Hyderabad Horror: ఫుట్‌ పాత్ మీద కొబ్బరిబోండాల బండి.. తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. ఆగ్రహంతో రాళ్లు, ఇటుకలతో దాడి చేసిన వ్యాపారి, అనుచరులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ - సులేమాన్ నగర్ పరిధిలో ఘోరం జరిగింది. ప్రధాన రహదారిపై ఫుట్‌ పాత్ మీద కొబ్బరి బోండాలు అమ్ముతూ ఏర్పాటు చేసిన బండ్లను జీహెచ్ఎంసీ ఎన్‌ ఫొర్స్‌ మెంట్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు.

Kamareddy Horror: పెళ్లి బరాత్‌ లో డాన్స్ చేయొద్దన్న భార్య.. ఆవేశంలో భర్త సూసైడ్.. కామారెడ్డిలో ఘటన

Rudra

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో చిన్నఆరెపల్లికి చెందిన చెన్నబోయిన అనిల్ ఇటీవల బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లి అనంతరం బరాత్ కార్యక్రమం ఉండగా డాన్స్ చేయాలనుకున్నాడు.

Election Commission Exit Polls: ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ బ్యాన్.. కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం

Rudra

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్‌ సభ ఎన్నికలు2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది.

Advertisement

Telangana Inter Summer Holidays: తెలంగాణలో మార్చి 30వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు, జూన్ 1వ తేదీ నుంచి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు(Telangana Intermediate Board) రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలకు సెలవులు(Summer Holidays) ప్రకటించింది. మార్చి 30వ తేదీ నుంచి అన్ని ఇంటర్ కాలేజీలకు(Inter Colleges) సెలవులు ప్రకటించింది.

Telangana Phone-Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు, చంచలగూడ జైలుకు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, 14 రోజులు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

Hazarath Reddy

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే కొందరు అధికారులను అరెస్ట్ చేయగా.. తాజాగా అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Telangana Weather Update: తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి వడగాల్పులు, మండుతున్న ఎండలతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

Hazarath Reddy

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి

Telangana Phone-Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలన విషయాలు బయటకు, కీలక వికెట్‌ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, జైల్లో చిప్పకూడు తప్పదన్న సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (SIB) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్‌ టాస్క్‌­ఫోర్స్‌ మాజీ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (OSD) పి.రాధాకిషన్‌రావును సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

Advertisement
Advertisement