తెలంగాణ
CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. రోజుకు 18 గంటలు పని చేయండి.. లేదంటే బాధ్యతల నుంచి తప్పుకోండి...
sajayaఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రోజుకు 18 గంటలు పని చేయండి.. పని చేయడం కుదరదనుకుంటే బాధ్యతల నుంచి తప్పుకోండి.. పనిచేయడం ఇష్టం లేని వాళ్లు సీఎస్‌, డీజీపీకి చెప్పి తప్పుకోండి.. బాధ్యత తీసుకుంటే పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.
TS Govt. Rs 500 LPG Scheme: తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికే రూ.500లకు గ్యాస్‌ బండ స్కీమ్‌?? లబ్దిదారుల ఎంపికపై తెలంగాణ సర్కారు కసరత్తు
Rudraఎన్నికల హామీలను అమలు చేయడంపై తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు దృష్టి సారించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయగా తాజాగా రూ.500లకే గ్యాస్ పంపిణీపై కసరత్తు మొదలుపెట్టింది.
Telangana Election Commission: మీ ఓటు మార్చుకోవాల‌ని అనుకుంటున్నారా? ఈ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోక‌పోతే మీ ఓటు గ‌ల్లంతే! తెలంగాణ ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం
VNS2024 జనవరి ఒకటవ తేదీలోగా 18 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి ఆరున ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి అదే రోజునుంచి 22వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి రెండవ తేదీవరకు పరిష్కరిస్తారు.
Accidental Insurance To Cab Drivers: క్యాబ్ డ్రైవ‌ర్లు, ఆటోవాలాల‌కు రూ. 5 ల‌క్ష‌ల యాక్సిడెంట‌ల్ బీమా, కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
VNSఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ దరఖాస్తులు వివరాలు అందించాలని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్స్‌కు, ఆటో సీఎం రేవంత్‌ సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చన్నారు.
Telangana Congress New Incharge: కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం, తెలంగాణ ఇంచార్జ్ మార్పు, రేవంత్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే కార‌ణంతోనే తొల‌గించార‌ని చ‌ర్చ‌!
VNSతెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీని (Telangana Congress Incharge) కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చేసింది. ప్ర‌స్తుతం ఇన్‌చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను త‌ప్పిస్తూ శ‌నివారం ఏఐసీసీ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ప‌శ్చిమ బెంగాల్ సీనియ‌ర్ నేత దీపాదాస్ మున్షీని నియ‌మిస్తూ ఆదేశాలు జారీ చేసింది
Telangana Covid Cases: తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు, ఒక్క‌రోజే 12మందికి కొత్త‌గా క‌రోనా పాజిటివ్
VNSతెలంగాణలో కొత్తగా 12 మందికి కరోనా పాజిటివ్‌గా (Corona Cases) తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,44,540కు చేరింది. తాజాగా ఒకరు కరోనా నుంచి కోలుకోగా కోలుకున్న వారి సంఖ్య మొత్తం 8,40,391కి పెరిగింది. ప్రస్తుతం 38 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ (TS Corona Bulliten) బులిటెన్‌లో పేర్కొంది.
Breaking News, Gudimalkapur Fire Accident: హైదరాబాద్‌ గుడిమల్కాపూర్ అంకురా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం...
sajayaహైదరాబాద్‌ గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని అంకురా ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం. 7 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ప్రాణనష్టంపై ఇంకా తెలియని వివరాలు.
Bhadrachalam: భద్రాద్రి రామచంద్రుడికి 40 లక్షల విలువైన 109 బంగారు తులసి దళాల కానుక ఇచ్చిన భక్తుడు..
sajayaకోయంబత్తూర్ కు చెందిన బాలాజీ శారద అనే భక్తులు భద్రాద్రి రామచంద్రుడికి 45 లక్షల రూపాయల విలువైన 109 బంగారు తులసీ దళాలను కానుకగా సమర్పించారు.
Telangana CM Revanth Reddy: నేడు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్‌ సమావేశం.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న సమావేశం
sajayaఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ సర్కారు ఫోకస్‌.. సాయంత్రం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్‌ సమావేశం.. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరగనున్న సమావేశం.. ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి పోతోందంటున్న ఆటో డ్రైవర్లు.. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, సంక్రాంతి నాటికి 200 కొత్త డీజిల్ బస్సులు అందుబాటులోకి..
Hazarath Reddyప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను #TSRTC అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది.
Hyderabad Car Accident: వీడియో ఇదిగో, గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ఒకరు మృతి, ముగ్గురుకి గాయాలు
Hazarath Reddyహైదరాబాద్‌ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా.. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి
TSRTC: ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగవు, తక్కువ దూరం వెళ్లే మహిళలు పల్లె వెలుగు బస్సులో వెళ్ళండి, మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి
Hazarath Reddyమహాలక్ష్మీ పథకంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి విదితమే. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. రద్దీ కూడా చాలా ఎక్కుగా ఉండటంతో మహిళలకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
Vaikuntha Ekadashi 2023 Wishes and Messages: వైకుంఠ ఏకాదశికి సంబంధించి మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.
Rudraవైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పర్వదినంనాడు మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.
Corona Virus: తెలంగాణలో కరోనా కలకలం... కొత్తగా తొమ్మిది కేసుల నమోదు.. రెండు నెలల చిన్నారికీ కరోనా... వెంటి లేటర్‌ పై చికిత్స
Rudraతెలంగాణ‌లో క‌రోనా భయాలు పెరుగుతున్నాయి. కొత్త కొవిడ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంట‌ల్లో కొత్త‌గా తొమ్మిది క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది.
BRS PPT Today: కేటీఆర్‌ కీలక ప్రకటన.. తెలంగాణ భ‌వ‌న్‌ లో ‘స్వేద పత్రం’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
Rudraకాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధ‌మైంది. తొమ్మిదిన్న‌రేళ్ల పాల‌న‌పై స్వేద‌ప‌త్రం పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ కు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది.
Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తప్పిన ప్రమాదం.. స్టేజ్ ఎక్కుతూ కిందపడిన వైనం.. భద్రతా సిబ్బంది సహకారంతో పైకి లేచిన గవర్నర్ (వీడియోతో)
Rudraతెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం హైదరాబాద్‌ జేఎన్టీయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Pallavi Prashanth Bailed: ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ కు బెయిల్ మంజూరు, ఆదివారం పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశం
VNSబిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు (Pallavi Prashanth) నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.
TSRTC: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, అద్దెకు బస్సులు కావాలని ప్రకటన విడుదల చేసిన టీఎస్‌ఆర్టీసీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyమహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రయాణీకులు పెరిగారు. ఈ క్రమంలో పలు రూట్లలో చాలినంత బస్‌ సర్వీసులు లేక ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడుతున్నారు.దీంతో స్పందించిన టీఎస్‌ఆర్టీసీ.. అర్జెంటుగా అద్దె బస్సులు కావాలని ఓ ప్రకటన విడుదల చేసింది.
Discounts on Traffic Challans: పెండింగ్ చలాన్లు ఉన్నవారికి గుడ్ న్యూస్, ట్రాఫిక్‌ చలాన్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించిన తెలంగాణ పోలీస్ విభాగం
Hazarath Reddyపెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు ఉన్నవారికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు శుభవార్తను అందించారు. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను (Discounts on Traffic Challans) ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ (huge discounts on traffic challans) ప్రకటించింది.
Hyderabad Fire Video: వీడియో ఇదిగో, పంజాగుట్ట అగ్ని ప్రమాదంలో తలుపులు పగులగొట్టి కుటుంబాన్ని రక్షించిన పోలీసులు
Hazarath Reddyఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తరలించారు. ఆరో అంతస్తులో చిక్కుకున్న వారిలో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.