తెలంగాణ

Corona in TS: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 193 మందికి కరోనా, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,018 శాంపిళ్లు పరీక్షించగా, 193 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.

Cyclone Jawad: భయం గుప్పిట్లో ఉత్తరాంధ్ర, వణికిస్తున్న జవాద్ తుపాన్, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

Hazarath Reddy

ఇప్పటికే భారీ వర్షాలతో రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలు వణికిపోగా తాజాగా ఉత్తరాంధ్రను ‘జవాద్‌’ తుపాన్‌ (Cyclone Jawad) వణికించేందుకు రెడీ అయింది.ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష (CM Jagan Mohan Reddy Review Meeting) నిర్వహించారు.

Car in Agricultural Well: సాయం చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు, సిద్దిపేట కారు బావిలో పడ్డ ఘటనలో గజ ఈతగాడు మృతి, కారులో రెండు మృతదేహాలు లభ్యం

Naresh. VNS

సిద్దిపేట(Siddipet)లో విషాదం నెలకొంది. రోడ్డుపై వెళ్తున్నకారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అయితే కారును బయటకు తీసేందుకు బావి(Well)లోకి దిగిన గజ ఈతగాడు(Swimmer) కూడా నీటిలో ఊపిరాడక చనిపోయాడు. వృత్తి ధర్మంతో ఇతరులకు సాయం చేసేందుకు బావిలోకి దిగిన వ్యక్తి కూడా మరణించడం అందరినీ కలిచివేసింది.

KTR on NDA: ఎన్డీయేపై మంత్రి కేటీఆర్ సెటైర్స్, ఎన్డీయే అంటే నో డాటా అవైలెబుల్ అంటూ ట్వీట్, రైతు మరణాలపై కేంద్రం స్పందించిన తీరును తప్పబట్టిన విపక్షాలు

Naresh. VNS

కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరాలు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR). ఎన్డీయే(NDA) అంటే నో డాటా అవైలబుల్(No Data Available) అంటూ ట్వీట్ చేశారు. రైతు ఆందోళనల్లో మరణించిన వారి రికార్డులు తమ వద్ద లేవని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి లోక్‌సభ(Loksabha)లో రాతపూర్వక సమాధానం ఇవ్వడంపై మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.

Advertisement

Parliament Winter Session: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలి, లోక్‌సభలో డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలని & రబీ కోసం వరిపై ఎటువంటి ఆంక్షలు వద్దని లోక్‌సభలో డిమాండ్ చేసారు. ఖరీఫ్‌ పంటను కేసీఆర్‌ కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు హితవు పలికారు.

Parliament Winter Session: ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాలని డిమాండ్, రాజ్య‌స‌భ రేప‌టికి వాయిదా

Hazarath Reddy

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న స్వ‌రం పెంచారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం స‌మ‌గ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్య‌స‌భ రేప‌టికి వాయిదాప‌డ‌గా.. లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న కొన‌సాగుతున్న‌ది. పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బైఠాయించారు.

Car Plunges into Well: కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు, ఎంతమంది కారులో ఉన్నారనే దానిపై ఇంకా తెలియని సమాచారం

Hazarath Reddy

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి బావిలో (Car Plunges into Well) ప‌డిపోయింది. చిట్టాపూర్‌, భూంపల్లి గ్రామాల మధ్యలో.. రోడ్డుపక్కన ఉన్న ఒక వ్యవసాయ బావిలో కారు అదుపుతప్పి పడిపోయింది.

TSRTC Bus Fare Hike: తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపు, ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు మేర పెరిగే అవకాశం, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన టీఎస్‌ఆర్టీసీ అధికారులు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఎప్పటి నుంచో టీఎస్‌ఆర్టీసీ ఛార్జీల పెంపుపై (TSRTC Bus Fare Hike) సాగుతున్న చర్చ తాజాగా ఇది కొలిక్కి వచ్చింది. ఆర్డినరీ బస్సుల్లో (RTC Bus)కిలోమీటర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు మేర ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.

Advertisement

TSRTC MD Sajjanar: ఆర్టీసీ డిపోల‌ మూసివేత అవాస్తవం, భూములు అమ్మే ఆలోచ‌న ఆర్టీసీకి లేదని తెలిపిన ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్

Hazarath Reddy

హైద‌రాబాద్‌లోని ప‌లు ఆర్టీసీ డిపోల‌ను మూసివేస్తున్న‌ట్లు ప‌లు మీడియాల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ స్పందించారు. ఆర్టీసీ డిపోల మూసివేత‌పై వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం అని స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. భూములు అమ్మే ఆలోచ‌న ఆర్టీసీకి లేదు. ఉద్యోగుల సంక్షేమం ఆర్టీసీ చాలా ముఖ్యం అని తేల్చిచెప్పారు.

CM KCR Press Meet: వరి ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ క్లారిటీ , యాసంగిలో కొనుగోలు కేంద్రాలు లేవు, 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ...సీఎం కేసీఆర్ ఫైర్

Krishna

ధాన్యం కొనుగోలుపై తెలంగాణ కేబినేట్ భేటీ ముగిసిన త‌ర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం.. ఈసంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం అవ‌లంభిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. 750 మంది రైతుల‌ను పొట్ట‌న పెట్టుకున్న బీజేపీ రైతు హంత‌కుల పార్టీ అని సీఎం కేసీఆర్ విమర్శించారు.

Telangana: భార్య వివాహేతర సంబంధం, భర్తను చంపి ఆ శవాన్ని ఏడు ముక్కలుగా నరికి పారేసిన ఆమె ప్రియుడు, నా పేరు శివ సినిమా తరహాలో సాక్ష్యాలు మాయం, ఎట్టకేలకు పోలీసులకు దొరికిన నిందితుడు

Hazarath Reddy

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గల రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కలకలం రేపిన కాంపెల్లి శంకర్‌ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ హత్య కేసుకు సంబంధించి సోమవారం ఎన్టీపీసీ పోలీసు స్టేషన్‌ ఆవరణలో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి ( Commissioner of Police S Chandrashekhar Reddy) వివరాలను మీడియాకు వెల్లడించారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 184 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ట స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 33,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

Coronavirus in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్  వైరస్ అలర్ట్, ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన ప్రజారోగ్య సంచాలకుడు, డెల్టా కంటే ఒమిక్రాన్ 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెదుతుందని వెల్లడి

Hazarath Reddy

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న ఒమిక్రాన్‌ వేరియెంట్‌ (Telangana on alert amid Omicron ) ధాటికి తెలంగాణ రాష్ట్రం అలర్ట్ అయింది. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

COVID in TS: తెలంగాణలో కరోనా అలజడి, గురుకులంలో 43 మందికి పాజిటివ్, దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు గత మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు, ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ముత్తంగి గురుకుల పాఠశాలలో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. ఏకంగా 43 మంది విద్యార్థులతో పాటు ఒక టీచర్ కరోనా బారిన పడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులతో పాటు 27 మంది సిబ్బంది ఉన్నారు. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కాగా... వైద్య పరీక్షలు నిర్వహించారు.

Hyderabad: హైదరాబాద్‌లో హోమో సెక్సువల్ రేవ్ పార్టీ భగ్నం, పెద్ద మొత్తంలో మద్యం బాటిల్స్‌, కండోమ్ ప్యాకెట్ల, హుక్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు, వరంగల్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలు అరెస్ట్

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో కూకట్‌పల్లిలో రేవ్ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం (Hyderabad police bust rave party) చేశారు. కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లోని ఇంటిపై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కి (Kukatpally police station) తరలించారు.

Parliament's Winter Session: లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, తెలంగాణలో మ‌క్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాల‌ని ఎంపీలు డిమాండ్, రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు

Hazarath Reddy

టీఆర్ఎస్ నేత‌లు స‌భ‌లో నిర‌స‌న చేప‌ట్టారు. లోక్‌స‌భ‌లో పోడియం ద‌గ్గ‌ర‌కు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు (TRS MPs Protest) చేశారు. ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం త‌మ విధానాన్ని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

CM KCR Meeting With MPs: బాయిల్డ్‌ రైస్‌ కొనేలా కేంద్రాన్ని పార్లమెంట్‌లో నిలదీయండి, ఎంపీలకు దిశానిర్దేశం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఉభయసభల్లో తెలంగాణ రైతుల సమస్యలపై పోరాడాలని సూచన

Hazarath Reddy

రాష్ట్రంలో పండించిన వరిధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఉభయసభల్లో కేంద్రాన్ని నిలదీసేలా గళమెత్తాలని ఎంపీలకు సూచించారు. అవసరమైతే ధర్నాలు చేయాలని సూచించారు.

Mariamma Lock-Up Death Case: మరియమ్మ లాక్ అప్ డెత్ కేసు, సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన హైకోర్టు, ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ అంశంపై (Mariamma Lock up Death Case) తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించింది. మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు (Telangana High Court) ఆదేశించింది

Walking in OU Campus: ఓయూ క్యాంపస్‌లో వాకింగ్ చేస్తే రూ. 200 చెల్లించాల్సిందే, డిసెంబర్ నుంచి యూజర్‌ చార్జీలు వసూలు, క్యాంపస్‌లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు

Hazarath Reddy

వాకర్స్‌కు ఓయూ యూనివర్సిటీ షాక్‌ ఇచ్చింది. డిసెంబర్‌ నెల నుంచి యూనివర్సిటి గ్రౌండ్‌లో (OU Campus in Hyderabad) వాకింగ్ చేసే వారి నుంచి 200 రూపాయల యూజర్ చార్జీలను (Rs 200 Per Month For Walking) వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Shilpa Chowdary Arrest: అధిక వడ్డీ పేరుతో ముగ్గురు టాలీవుడ్ హీరోలను బురిడీ కొట్టిన కిలాడీ, కిట్టీ పార్టీలు, పేజ్‌ త్రీ పార్టీలతో కోటీశ్వరులకు దగ్గరైన శిల్పా చౌదరి, రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్లు అనుమానం

Naresh. VNS

కిట్టీ పార్టీలు, పేజ్‌ త్రీ పార్టీల పేరుతో ముగ్గురు టాలీవుడ్ యంగ్‌ హీరోలు, మరికొందరు వ్యాపారవేత్తలు, ప్రొడ్యూసర్లను మోసం చేసిన కిలాడీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. పార్టీల పేరుతో సంపన్న కుటుంబాలకు దగ్గరై…వారి నుంచి ఏకంగా రూ 200 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు గుర్తించారు.

Advertisement
Advertisement