తెలంగాణ

Rajya Sabha: రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట కలకలం, ఘటనపై స్పందించిన అభిషేక్‌ సింఘ్వీ, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో జరుగుతున్న వేళ ఎగువ సభ (Rajya Sabha)లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ (Abhishek Singhvi) సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైనట్లు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) వెల్లడించారు.

Telangana: మార్ఫింగ్ ఫోటోలతో సంపన్నులను బ్లాక్ మెయిల్, వేమలవాడలో కిలేడి హోమ్ గార్డును అరెస్ట్ చేసిన పోలీసులు, దర్యాప్తులో షాకింగ్ విషయాలు

Hazarath Reddy

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లేడీ హోమ్ గార్డు సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో డబ్బును గుంజుతూ పోలీసులకు చిక్కింది.హోమ్ గార్డు వడ్ల అనూష వసూళ్ల కోసం మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

AEE Nikesh Kumar: ఏఈఈ నిఖేశ్ కుమార్ కేసు అప్‌డేట్, బ్యాంకు లాకర్లలో 2 కిలోల బంగారం, డైమండ్స్ గుర్తింపు

Arun Charagonda

AEE నిఖేశ్ కుమార్‌ కేసులో విచారణ కొనసాగుతోంది. నిఖేశ్ కుమార్‌ బ్యాంక్ లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు లభించగా దాదాపు 2 కిలోల బంగారం, ప్లాటినం డైమండ్స్‌ ఇతర ఆభరణాలు గుర్తించారు. కేవలం 2 లాకర్లు మాత్రమే నిఖేశ్ పేరు పై ఉన్నట్లు గుర్తించగా మిగతా 16 స్నేహితులు , కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

Telangana Benefit Shows: పుష్ప 2 ఎఫెక్ట్..తెలంగాణలో ఇక బెనిఫిట్‌ షోలు బంద్..మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన

Arun Charagonda

పుష్ప 2 ఎఫెక్ట్...మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు బంద్ అని తేల్చిచెప్పారు. సంధ్య థియేటర్లో పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Ponnam Prabhakar: కేసీఆర్, కిషన్ రెడ్డి ఇప్పటివరకు కుల సర్వేలో పాల్గొనలేదు, అభ్యంతరాలుంటే చెప్పాలి కానీ కుల సర్వేపై అసత్య ప్రచారం తగదన్న మంత్రి పొన్నం ప్రభాకర్

Arun Charagonda

రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని... రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ,అధికారులు , ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న అన్నారు.

CM Revanth Reddy: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్...స్వయం సహాయక బృందాలను మరింత బలోపేతం చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.

HYDRA Demolitions: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్న అధికారులు (వీడియో)

Rudra

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్నది. స్థానికంగా ఉన్న అక్రమ నిర్మాణాలను జేసీబీలతో హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

Driving License Revoke: తాగి నడిపితే లైసెన్స్‌ రద్దే.. అతివేగంగా, అధిక లోడ్‌ తో వెళ్లినా ఇక కఠిన చర్యలే.. రవాణాశాఖకు పోలీసుల సిఫార్సు

Rudra

మద్యం తాగి వాహనం నడిపితే వాహనదారుడిపై కేసు నమోదు చేయడమే కాకుండా సదరు వాహనదారుడి లైసెన్స్‌ కూడా రద్దు కానున్నది. అంతేకాదు అధిక వేగం, బరువుతో గూడ్స్‌ వెహికల్స్‌ నడిపినా లైసెన్స్‌ రద్దు అవుతుంది.

Advertisement

Leopard on Flyover: ప్లై ఓవర్‌పై చిరుత పులి.. హడలిపోయిన వాహనదారులు.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులి వణికిస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మడి జిల్లాలో పులులు, చిరుతల సంచారం ఎక్కువైంది. ఐదు రోజుల క్రితం ఓ మహిళ పులి దాడిలో చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.

Srikakulam Horror: శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి.. బెల్టుతో దాడి చేసి.. (వైరల్ వీడియో)

Rudra

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ పైశాచికం తాజాగా బయటపడింది. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని నిరుద్యోగులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ దారుణంగా హింసిస్తున్నాడు.

Pushpa-2 Collections: బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ సందడి.. తొలిరోజు మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?? ఏ భాషలో ఎన్ని వసూళ్లు దక్కించుకుందంటే??

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

Padi Kaushik Reddy Gets Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్.. రెండు షూరిటీల‌తో పాటు రూ. 5 వేల జ‌రిమానాతో బెయిల్ మంజూరు చేసిన న్యాయ‌మూర్తి

Rudra

పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి గురువారం రాత్రి బెయిల్ మంజూరు అయింది. సీఐ రాఘ‌వేంద్ర ఫిర్యాదు మేర‌కు బంజారాహిల్స్ పీఎస్‌ లో కౌశిక్ రెడ్డిపై కేసు న‌మోదైంది.

Advertisement

Harish Rao Fire on Revanth Reddy: ఎఫ్ఐఆర్ లు గాంధీభ‌వ‌న్ నుంచే వ‌స్తున్నాయ్, రేవంత్ రెడ్డి పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వజం, పోలీస్ స్టేష‌న్ నుంచి హ‌రీష్ రావు రిలీజ్

VNS

అవ్వాతాతలకు 4వేల పెన్షన్‌ ఇస్తానన్నావ్‌ ఎప్పుడిస్తావ్?. మూసీలో పేదల ఇళ్లు కూలగొట్టొద్దన్నారు. ఇది సూచన కాదా?. సూచనలు తీసుకునే సోయి నీకు లేదు. గల్లీ నాయకుడిలా, ముఠా నాయకుడిలా కక్షతో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు’’ అంటూ హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Police Case on Allu Arjun: అల్లు అర్జున్ పై కేసు న‌మోదు, మ‌హిళ మృతిపై నిర్ల‌క్ష్యం విష‌యంలో పోలీసుల సీరియస్ యాక్ష‌న్

VNS

నిన్న రాత్రి అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా ప్రీమియర్ షోలు వేయగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక (Rashmika), మరికొంతమంది మూవీ టీమ్ వెళ్లారు. అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీగా వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందింది.

TGSRTC Renamed As TGTD: టీజీఎస్ఆర్టీసీని టీజీటీడిగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రవాణా శాఖ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రజాపాలన విజయోత్సవాలు వేడుకల్లో భాగంగా తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ నూతన లోగోను ఆవిష్కరించారు.తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయాన్ని గుర్తు చేస్తూ, ప్రభుత్వం TGSRTCని తెలంగాణ రవాణా శాఖ (TGTD) గా రీబ్రాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది .

Indiramma Illu Mobile App: ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు

Hazarath Reddy

తెలంగాణలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సొంత ఇళ్లు ఉంటే పేదలు ఆత్మగౌరవంతో, ఉన్నతంగా బతుకుతారని అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు

Advertisement

Weather Forecast: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ఐఎండీ, తెలంగాణలో చంపేస్తున్న చలిపులి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఈ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telangana Shocker: లైంగిక వేధింపులు..కామారెడ్డి జిల్లాలో ఫార్మాసిస్ట్ ఆత్మహత్య...దుబాయ్‌లో ఉంటున్న మృతురాలి భర్త, స్థానికంగా విషాదం

Arun Charagonda

లైంగిక వేధింపులు భరించలేక ఫార్మాసిస్ట్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలోని రేకుల షెడ్డులో ఉరివేసుకుంది శిరీష (28). బిచ్కుందలో కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్ గా పనిచేస్తోంది శిరీష. పని చేస్తున్న చోట శిరీషను కొందరు వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దుబాయ్ లో ఉంటున్నారు శిరీష భర్త.

CM Revanth Reddy: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పేదలకు వెసులుబాటు కల్పించేలా విధివిధానాలు రూపొందించాం, ప్రాధాన్యత క్రమంలో ఇళ్ల కేటాయింపు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

PDSU On Pushpa 2: అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయాలి..పీడీఎస్‌యూ డిమాండ్, పుష్ప 2 సినిమా చూసేందుకు వెళ్లి ఓ మహిళ ప్రాణం పోయింది..సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిక

Arun Charagonda

హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది PDSU. పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణం పోయిందని...అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకుంటే 'పుష్ప 2' సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించింది. హైదరాబాద్-RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement