తెలంగాణ

Earthquake in Telugu States: మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశం, భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు కేంద్రంగా వచ్చిన ఈ భూకంపం ప్రభావంతో దాదాపు 225 కి.మీ. వ్యాసార్థంతో భూమి 5 సెకండ్ల దాకా కంపించింది.

Patnam Narendra Reddy: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ, క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Arun Charagonda

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు.

Phone Scams Alert: ఎవరైనా ఫోన్ చేసి హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్లు నొక్కమంటే అసలు నొక్కవద్దు, అప్రమత్తం చేసిన హైదరబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

Hazarath Reddy

అపరిచితుల నుంచి +56322553736, +37052529259, +94777 455913, +37127913091, +255901130460 ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు

Warangal: వాజేడు ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్, గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిన యువతి..ఎస్‌ఐని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన వైనం!

Arun Charagonda

వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం.

Advertisement

Earthquake In Singareni Areas: సింగరేణి ప్రాంతాల్లో భూకంపం..కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు..తనిఖీల తర్వాతే కార్మికులను అనుమతిస్తామన్న సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి

Arun Charagonda

సింగరేణి ప్రాంతాల్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు సింగరేణి జనరల్ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి. కార్మికులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. మైన్స్ , అండర్ గ్రౌండ్ మైన్స్ లో సూపర్ వైజర్లు, అధికారులు తనిఖీల తరువాతే కార్మికులను అనుమతిస్తాం అన్నారు.

Earthquake In Hyderabad: వీడియోలు ఇవిగో..హైదరాబాద్‌,ఖమ్మం, వరంగల్‌లో భూకంపం, భూ ప్రకంపనల ధాటికి కూలిన ఇల్లు గోడ, రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు

Arun Charagonda

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఉదయం 7.25 గంటల నుంచి 7.28 గంటల మధ్య భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల ధాటికి ఏటూరు నాగారంలో ఇల్లు గోడ కూలిపోయింది.

CM Revanth Reddy: గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్,పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

Arun Charagonda

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ పెద్దపల్లిలో జరిగే విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రూప్-4 విజేతలకు నియామక పత్రాలు అందజేయనున్నారు.

Telangana: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు, అనంతరం గోడదూకి పారిపోయిన టీచర్...వీడియో ఇదిగో

Arun Charagonda

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. మంచిర్యాల - ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడు సత్యనారాయణ. పాఠశాలకు వచ్చిన విద్యార్థినిల తల్లిదండ్రులను చూసి గోడ దూకి పారిపోగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో ఉపాధ్యాయుడు సత్యనారాయణను చితక బాదారు తల్లిదండ్రులు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Earthquake In Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భూకంపం, 10 సెకండ్ల పాటు ఊగిన భూమి..ఉలిక్కిపడ్డ ప్రజలు

Arun Charagonda

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంపం సంభవించింది. జిల్లాలోని మణుగూరులో ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయి. దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

CM Revanth Reddy: హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం, అంతర్జాతీయ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం... ఆ ప్రణాళికల ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రైజింగ్ ఉత్సవాలు హెచ్‌ఎండీఏ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి.

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీచర్, పట్టుకుని రోడ్డు మీద చెప్పులతో చితకబాదిన పేరెంట్స్

Hazarath Reddy

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులను వేధించిన ఉపాధ్యాయుడుకి బాధిత కుటంబ సభ్యులు దేహశుద్ధి చేశారు. గోడ దూకి పారిపోతుండగా ఉపాధ్యాయుడిని పట్టుకుని రోడ్డుపై చెప్పుతో చితకబాదారు పేరెంట్స్. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana Shocker: దారుణం, అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని భార్యను చంపిన భర్త, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల ఆందోళన

Hazarath Reddy

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్త. నాలుగేళ్ల క్రితం వాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు కోదాటి శ్రీను. తన బిడ్డను చంపిన శ్రీను, అతడికి సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు.

Advertisement

Telangana:మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి, తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రైజింగ్‌ వేడుకల్లో సీఎం మాట్లాడారు.భాగ్యనగరం హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు

Telangana: వీడియో ఇదిగో, మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రన్నింగ్‌లో రెండుగా విడిపోయిన గూడ్స్ ట్రైన్

Hazarath Reddy

తెలంగాణలో మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో వేగంగా వెళుతున్న గూడ్స్ ట్రైన్ రెండుగా విడిపోయింది.. మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనకే ఉండిపోయాయి. సిగ్నల్ పడకున్నా రైలు స్లో అవుతోంది ఏంటని చూసిన గార్డ్ కు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది.

Telangana Shocker: వరంగల్‌లో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య, కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి కిరాతకంగా కత్తులు, ఇనుప రాడ్లతో చంపేసిన దుండగులు

Hazarath Reddy

వరంగల్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రంగంపేట (Rangampet)లో కాకతీయ గ్రామీణ బ్యాంక్‌ (Kaktiya Grameen Bank)లో విధులు నిర్వర్తిస్తున్న రాజమోహన్ (Rajamohan) దారుణ హత్యకు గురయ్యాడు.

Accident Caught on Camera: షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్, ఆర్టీసీ బస్సు నుంచి జారిపడిన విద్యార్థిని, కాళ్ళపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్రగాయాలు

Hazarath Reddy

తెలంగాణ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బస్సు కిందపడింది

Advertisement

Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైకును టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, గాయాలతో బయటపడ్డ బైకర్

Hazarath Reddy

మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని నర్సాపూర్‌ చౌరస్తా వద్ద బైక్‌ను ఓ టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. నర్సాపూర్‌ చౌరస్తా వద్ద దశరథ్‌ అనే వ్యక్తి బైక్ మీద మున్సిపల్‌ ఆఫీస్‌ వైపు వెళ్తుండగా టిప్పర్‌ వెనక నుంచి ఢీకొట్టింది.

Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు

Hazarath Reddy

ఫెంగల్ తుఫాను దక్షిణాది రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాన్‌ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు

Pawan Kalyan: 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్‌.. ప‌వ‌న్ సెల్ఫీ వైర‌ల్‌.. సంబురాలు చేసుకుంటున్న ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌

Rudra

రాజ‌కీయాల్లో పూర్తిగా బిజీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం కొంత‌ గ్యాప్ దొర‌క‌డంతో 'హరిహర వీరమల్లు' సినిమా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. ప్రస్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్ మంగళగిరిలో వేసిన ఓ సెట్‌ లో జ‌రుగుతోంది.

Priyanka-Shiva: తిరుమలలో ప్రాంక్ వీడియోపై క్షమాపణలు చెప్పిన ప్రియాంకజైన్, శివ (వీడియో)

Rudra

తిరుమలలో చేసిన ప్రాంక్ వీడియోపై బిగ్ బాస్ కంటె స్టెంట్ ప్రియాంకజైన్, శివకుమార్ లు క్షమాపణలు చెప్పారు. తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Advertisement
Advertisement