Technology

Avast Warning: వెంటనే ఈ 7 యాప్స్ మీ మొబైల్ నుంచి డిలీట్ చేయండి, వినియోగదారులను హెచ్చరించిన ప్రముఖ డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం అవాస్ట్

Hazarath Reddy

డిజిటల్ సెక్యూరిటీ దిగ్గజం ‘అవాస్ట్’ గేమర్స్‌ని టార్గెట్ చేస్తున్న 7 యాప్స్‌ని గుర్తించి లిస్ట్ (Avast Warning) బయటపెట్టింది. కాగా మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్ అభిమానులనే ఈ యాప్స్ (Malicious mobile apps) ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. ఫ్లీస్‌వేర్ అప్లికేషన్స్ యూజర్లకు వాల్‌పేపర్స్, మాడిఫికేషన్స్ లాంటివి ఎర వేసి డబ్బులు కాజేస్తున్నాయి.

Google: జీమెయిల్ వినియోగదారులకు హెచ్చరిక, రెండు సంవత్సరాలు మీ అకౌంట్ ఉపయోగించకుంటే ఖాతాను డిలీట్ చేయనున్న గూగుల్

Hazarath Reddy

గూగుల్ జీమెయిల్ వాడేవారికి షాక్ లాంటి వార్త చెప్పింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి మీరు ఒకటి, అంతకంటే ఎక్కువ సేవల్లో రెండు సంవత్సరాలు ఉపయోగించనటైతే (inactive accounts) మీ ఖాతాలోని క్రియారహితంగా ఉన్న సమాచారాన్ని గూగుల్‌ (Google) తొలగించనుంది.

RIL Investments Row: ముఖేష్ అంబానీ కంపెనీ భారీ పెట్టుబడులు, బ్రేక్‌త్రూ ఎనర్జీలో రిలయన్స్ రూ.373 కోట్ల పెట్టుబడి, Urban Ladderలో రూ. 182.12 విలువైన ఈక్విటీ షేర్లు కొనుగోలు

Hazarath Reddy

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (Reliance Industries Ltd) అమెరికాలో ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కి (Bill Gates) చెందిన బ్రేక్‌త్రూ ఎనర్జీ వెంచర్స్‌ (Breakthrough Energy Ventures) సంస్థలో 50 మిలియన్‌ డాలర్ల (రూ.373 కోట్ల) పెట్టుబడి పెట్టనున్నది.

Vivo Diwali Offer: రూ.101 కే వివో స్మార్ట్‌ఫోన్లు, దివాళి ఆఫర్ అంటూ ట్వీట్ చేసిన వివో కంపెనీ, మైక్రోమాక్స్‌ నుంచి బడ్జెట్ ధరకు రెండు స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

రానున్న దీపావళి పండగ సీజన్‌ను పురస్కరించుకుని స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వివో బంపర్‌ ఆఫర్‌ (Vivo Diwali Offer) ప్రకటించింది. పండుగ సందర్భంగా వీ 20ఎస్‌, వీ 20, ఎక్స్‌ 50 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

Advertisement

PSLV-C49 Rocket: పీఎస్‌ఎల్‌వీ సి49 ప్రయోగం విజయవంతం, EOS-01 సహా మరో 9 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో

Team Latestly

ఇక ఈరోజు భారత్ ప్రయోగించిన ఉపగ్రహం EOS-01 విషయానికి వస్తే, ఇది దేశానికి సంబంధించిన భూతల పరిశీలన, వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణ మొదలకు తదితర సేవలకు ఉద్దేశించబడింది....

WhatsApp Pay: ఇకపై వాట్సాప్ ద్వారా కూడా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు, వాట్సాప్ ద్వారా నగదు చెల్లింపు మరియు పొందడంలో కొన్ని ముఖ్యవిషయాలు మీకోసం

Team Latestly

ఇది అచ్ఛంగా గూగుల్ పే, ఫోన్ పే, బిహెచ్ఐఎం మరియు బ్యాంకుల వివిధ అనువర్తనాలు ఉపయోగించే వ్యవస్థ. కాబట్టి మీరు వాట్సాప్ ‘వాలెట్’ లో డబ్బును నిల్వ చేసుకోనవసరం లేదు. డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుంచే ఇతర వ్యక్తులకు బదిలీ చేయడానికి ఇది ఒక ప్లాట్‌ఫాంలా సహాయపడుతుంది....

BSNL New Plans: బీఎస్ఎన్ఎల్ మూడు సరికొత్త ప్లాన్లు, అపరిమిత వాయిస్ కాల్స్, డిసెంబర్ 1, 2020 నుంచి అందుబాటులోకి..

Hazarath Reddy

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ( BSNL postpaid plans) కస్టమర్లకు పరిచయం చేసింది. ఇటీవల కొత్త బ్రాడ్ బ్యాండ్‌ ప్లాన్లను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా డేటా రోల్‌ఓవర్ సదుపాయంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లందించే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను (BSNL New Plans) ప్రకటించింది. డిసెంబర్ 1, 2020 నుంచి దేశవ్యాప్తంగా వీటిని లాంచ్ చేయనున్నామని తెలిపింది.

iPhone Sales: ఇండియాలో రికార్డు స్థాయిలో ఐఫోన్ అమ్మకాలు, యూజర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, గ్లోబల్ ఐఫోన్ అమ్మకాల్లో క్షీణత

Hazarath Reddy

దేశీయ మొబైల్ మార్కెట్లో ఆపిల్ సత్తా చాటింది. దేశంలో తన తొలి ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్.. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా గణనీయమైన అమ్మకాలను (Apple saw record sales in India) నమోదు చేసింది.

Advertisement

PUBG: గేమింగ్ అభిమానులకు షాక్, నేటి నుండి పబ్‌జీ ఎక్కడా కనపడదు, ఇండియాలో పబ్‌జీ సేవలన్నింటినీ ఆపేస్తున్నామని తెలిపిన టెన్సెంట్ గేమ్స్

Hazarath Reddy

వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్న కారణంగా చైనాకి చెందిన చాలా కంపెనీల మొబైల్ యాప్స్ పై (China Mobile Apps) ఇండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ విధంగానే పబ్జీ మొబైల్ పై (PlayerUnknown’s Battlegrounds) నిషేధం విధించింది. ఇండియాలో ఎక్కువ మంది ఆడుతున్న ఈ మొబైల్ గేమ్ ని (PUBG MOBILE) సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రభుత్వం నిషేధించింది. నిషేధం గురించిన ప్రకటన వచ్చిన తర్వాత కూడా పబ్జీ మొబైల్ చాలామందికి అందుబాటులో ఉండింది.

WhatsApp Privacy Features: వాట్సాప్ ఛాట్ సెక్యూరిటీగా ఉంచుకోవడం ఎలా? హ్యాకింగ్ బారీ నుండి మీ వాట్సాప్ ఛాట్‌ను కాపాడుకునేందుకు సులువైన మార్గాలు

Hazarath Reddy

Always Mute Option:వాట్సాప్ గ్రూపుల నుండి విముక్తి, ఆల్వేస్ మ్యూట్ ఆప్షన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్స్‌యాప్, అధికారిక ట్విట్టర్లో వెల్లడించిన అమెరికా దిగ్గజం

Hazarath Reddy

అమెరికా దిగ్గజం ఫేస్‌బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్స్‌యాప్ యూజర్ల కోసం కీలక ఫీచర్‌ను (WhatsApp new features) తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు ఈ కొత్త అప్ డేట్ అందించింది. ఇకపై వాట్సాప్‌లోని గ్రూప్ చాట్‌లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ (Always Mute Option) తో ఎప్పటికీ మ్యూట్ చేసే విధంగా ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది.

Paytm Credit Cards: పేటీఎం నుంచి 2 మిలియన్ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు మార్కెట్లో పాగా వేసేందుకు పేటీఎం సరికొత్త వ్యూహం

Hazarath Reddy

భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం 'నెక్స్ట్ జనరేషన్ క్రెడిట్ కార్డులు'(next-generation credit cards) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 'న్యూ టు క్రెడిట్' వినియోగదారులను డిజిటల్ ఎకానమీలో చేరడానికి వీలు కల్పించడం ద్వారా క్రెడిట్ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

‘Jio 5G Smartphone’: జియో మరో సంచలనం, తక్కువ ధరకే మార్కెట్లోకి 5జీ స్మార్ట్‌ఫోన్, రూ.2500 నుంచి రూ. 5 వేల లోపే ధర, దేశంలోకి ఇంకా రాని 5జీ

Hazarath Reddy

టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరతీయనున్నది. అత్యంత తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను (Reliance Jio planning to sell 5G smartphones) త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నది. జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ (Jio 5G Smartphone) కేవలం రూ.2500 నుంచి రూ. 5000లోపే ఉంటుందని సమాచారం. దీనిపై జియో అధికారికంగా స్పందించనప్పటికీ ఆ సంస్థ అధికారి ఒకరు ఈ వార్తను ధృవీకరించారు. అయితే, మన దేశంలో ఇంకా 5జీ సేవలు ప్రారంభం కాలేదు.

BrahMos: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్, వదిలితే అవతల భస్మీ పటలమే, బహుళ లక్ష్యాలపై మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగల ఏకైక సూపర్ సోనిక్ మిసైల్

Hazarath Reddy

ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని (BrahMos, Supersonic Cruise Missile) ఇండియన్ నేవీ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. బ్రహ్మోస్, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇండియన్ నేవీ దేశీయంగా నిర్మించిన స్టీల్త్ డిస్ట్రాయర్‌ను ఐఎన్ఎస్ చెన్నై నుంచి ప్రయోగించగా.. అది అరేబియా సముద్రంలో లక్ష్యాన్ని చేధించింది.అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిపిన ప్రయోగంలో గురితప్పకుండా లక్ష్యాన్ని చేధించిందని ప్రకటనలో డీఆర్డీఓ తెలిపింది. సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ చేధిస్తుందని డీఆర్డీఓ తెలిపింది.

‘Nokia 4G on The Moon’: చంద్రునిపై నోకియా 4జీ నెట్‌వర్క్, ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు తెలిపిన నాసా, ఆర్టెమిస్ మిషన్‌ను 2024 లో ప్రారంభించేందుకు నాసా కసరత్తు

Hazarath Reddy

చందమామ మీదకు వెళ్లేందుకు ఆర్టెమిస్ మిషన్‌ను 2024 లో నాసా ప్రారంభించిందేకు రెడీ అవుతోంది. అయితే దీని కోస నాసాకు సహజంగా సమర్థవంతమైన మరియు నమ్మదగిన కమ్యూనికేషన్ సెటప్ అనేది చాలాఅవసరం. ఈ నేపథ్యంలో నాసా నోకియాతో జత కట్టింది. చంద్రునిపై 4 జి ఎల్‌టిఇ సెల్యులార్ నెట్‌వర్క్‌ను (Nokia 4G Networks On The Moon) నిర్మించేందుకు నోకియాకు భారీ ఎత్తున నిధులు అందించేందుకు నాసా రెడీ అయింది. చంద్రునిపై 14.1 మిలియన్ డాలర్లతో సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి నోకియా (Nokia) చేపట్టిన ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు నాసా (Nasa) ప్రకటించింది.

COVID-19 Vaccine: షాకింగ్..కరోనా వ్యాక్సిన్ బయటకు వస్తే 50 లక్షల షార్క్ చేపలు బలి, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న శాస్ర్తవేత్తలు, షార్క్ చేపలను చంపొద్దంటూ సోషల్ మీడియాలో ఉద్యమం

Hazarath Reddy

కోవిడ్ వ్యాక్సిన్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) బయటకు వస్తే కొన్ని లక్షల షార్క్ చేపలు కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం షార్క్‌ చేపల కాలేయం నుంచి తీసే నూనెను (Shark liver oil) కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. స్క్వాలిన్‌ పేరుతో (Squalene and COVID-19 vaccine) పిలవబడే ఈ నూనె రోగ నిరోధక శక్తి పెంచటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement

Big Billion Days Sale: రూ.5,999 కేహెచ్‌డి టీవీ, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్‌ని ప్రారంభించిన థామ్సన్, టీవీల వివరాలు ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

యూరప్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ (Thomson) అత్యంత తక్కువ ధరకే టీవీలు అందుబాటులోకి తెస్తోంది. అక్టోబర్ నుంచి 16 - 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ( Flipkart) జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో (Big Billion Days sale) ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. కాగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' (Big Save on Bigger TV offer) పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభమవుతుంది.

RTGS Payment Update: బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్, ఆర్టీజీఎస్‌ సేవలు 24 గంటల పాటు అందుబాటులో.., డిసెంబర్ నుంచి అమల్లోకి, వివరాలను వెల్లడించిన ఆర్‌బీఐ

Hazarath Reddy

బ్యాంకు ఖాతాదారులకు ఆర్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ (RTGS) (RTGS payment system) వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ (RBI) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది.

Smartphone Prices May Rise: మొబైల్ యూజర్లకు షాక్, స్మార్ట్‌ఫోన్ల ధరలు 3 శాతం పెరిగే అవకాశం, డిస్‌ప్లేల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం విధించిన 10 శాతం సుంకమే కారణం, ఆందోళన వ్యక్తం చేసిన ఐసీఈఏ

Hazarath Reddy

మొబైల్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ లాంటి వార్తే.. కేంద్ర ప్రభుత్వం డిస్‌ప్లేల దిగుమతిపై 1 శాతం సుంకం విధించిన నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల ధరలు 3శాతం దాకా పెరిగే అవకాశం (Smartphone Prices May Rise) ఉంది. ఈ విషయంపై ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ICEA) ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్, హువాయి, షియోమి, వివో, విన్‌స్ట్రాన్‌ వంటి సంస్థలకు ఇందులో సభ్యత్వం ఉందని,ఈ నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల (SmartPhones) రేట్లపై 1.5-3 శాతం దాకా సుంకాల ప్రభావం ఉంటుంది‘ అని ఐసీఈఏ నేషనల్‌ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ ఒక ప్రకటనలో తెలిపారు.

WhatsApp New Features: వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్లు, ఆల్వేస్‌ మ్యూట్‌ బటన్‌, కొత్తగా 138 ఎమోజీలు, న్యూ అటాచ్‌మెంట్‌ ఐకాన్స్‌..ఇతర ఫీచర్లు మీకోసం

Hazarath Reddy

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ సరికొత్త ఫీచర్లను (WhatsApp New Features) యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా మ్యూట్‌ బటన్‌, న్యూ ఐకాన్స్‌, కేటలాగ్‌ షార్ట్‌కట్‌, లెక్కలేనన్ని ఎమోజీలు.. ఇలా యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో పొందుపరిచింది. వీటిలో కొన్ని బీటా వెర్షన్లకే పరిమితమవగా మిగిలినివి సాధారణ యూజర్లకూ అందిస్తోంది.

Advertisement
Advertisement