టెక్నాలజీ
iPhone Sales: ఇండియాలో రికార్డు స్థాయిలో ఐఫోన్ అమ్మకాలు, యూజర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, గ్లోబల్ ఐఫోన్ అమ్మకాల్లో క్షీణత
Hazarath Reddyదేశీయ మొబైల్ మార్కెట్లో ఆపిల్ సత్తా చాటింది. దేశంలో తన తొలి ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్.. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా గణనీయమైన అమ్మకాలను (Apple saw record sales in India) నమోదు చేసింది.
PUBG: గేమింగ్ అభిమానులకు షాక్, నేటి నుండి పబ్‌జీ ఎక్కడా కనపడదు, ఇండియాలో పబ్‌జీ సేవలన్నింటినీ ఆపేస్తున్నామని తెలిపిన టెన్సెంట్ గేమ్స్
Hazarath Reddyవినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్న కారణంగా చైనాకి చెందిన చాలా కంపెనీల మొబైల్ యాప్స్ పై (China Mobile Apps) ఇండియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ విధంగానే పబ్జీ మొబైల్ పై (PlayerUnknown’s Battlegrounds) నిషేధం విధించింది. ఇండియాలో ఎక్కువ మంది ఆడుతున్న ఈ మొబైల్ గేమ్ ని (PUBG MOBILE) సెప్టెంబర్ 2వ తేదీన భారత ప్రభుత్వం నిషేధించింది. నిషేధం గురించిన ప్రకటన వచ్చిన తర్వాత కూడా పబ్జీ మొబైల్ చాలామందికి అందుబాటులో ఉండింది.
Always Mute Option:వాట్సాప్ గ్రూపుల నుండి విముక్తి, ఆల్వేస్ మ్యూట్ ఆప్షన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్స్‌యాప్, అధికారిక ట్విట్టర్లో వెల్లడించిన అమెరికా దిగ్గజం
Hazarath Reddyఅమెరికా దిగ్గజం ఫేస్‌బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్స్‌యాప్ యూజర్ల కోసం కీలక ఫీచర్‌ను (WhatsApp new features) తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు ఈ కొత్త అప్ డేట్ అందించింది. ఇకపై వాట్సాప్‌లోని గ్రూప్ చాట్‌లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ (Always Mute Option) తో ఎప్పటికీ మ్యూట్ చేసే విధంగా ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది.
Paytm Credit Cards: పేటీఎం నుంచి 2 మిలియన్ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డు మార్కెట్లో పాగా వేసేందుకు పేటీఎం సరికొత్త వ్యూహం
Hazarath Reddyభారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం 'నెక్స్ట్ జనరేషన్ క్రెడిట్ కార్డులు'(next-generation credit cards) ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 'న్యూ టు క్రెడిట్' వినియోగదారులను డిజిటల్ ఎకానమీలో చేరడానికి వీలు కల్పించడం ద్వారా క్రెడిట్ మార్కెట్‌ను సొంతం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
‘Jio 5G Smartphone’: జియో మరో సంచలనం, తక్కువ ధరకే మార్కెట్లోకి 5జీ స్మార్ట్‌ఫోన్, రూ.2500 నుంచి రూ. 5 వేల లోపే ధర, దేశంలోకి ఇంకా రాని 5జీ
Hazarath Reddyటెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరతీయనున్నది. అత్యంత తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ను (Reliance Jio planning to sell 5G smartphones) త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నది. జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ (Jio 5G Smartphone) కేవలం రూ.2500 నుంచి రూ. 5000లోపే ఉంటుందని సమాచారం. దీనిపై జియో అధికారికంగా స్పందించనప్పటికీ ఆ సంస్థ అధికారి ఒకరు ఈ వార్తను ధృవీకరించారు. అయితే, మన దేశంలో ఇంకా 5జీ సేవలు ప్రారంభం కాలేదు.
BrahMos: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్, వదిలితే అవతల భస్మీ పటలమే, బహుళ లక్ష్యాలపై మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగల ఏకైక సూపర్ సోనిక్ మిసైల్
Hazarath Reddyఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని (BrahMos, Supersonic Cruise Missile) ఇండియన్ నేవీ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. బ్రహ్మోస్, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇండియన్ నేవీ దేశీయంగా నిర్మించిన స్టీల్త్ డిస్ట్రాయర్‌ను ఐఎన్ఎస్ చెన్నై నుంచి ప్రయోగించగా.. అది అరేబియా సముద్రంలో లక్ష్యాన్ని చేధించింది.అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిపిన ప్రయోగంలో గురితప్పకుండా లక్ష్యాన్ని చేధించిందని ప్రకటనలో డీఆర్డీఓ తెలిపింది. సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ చేధిస్తుందని డీఆర్డీఓ తెలిపింది.
‘Nokia 4G on The Moon’: చంద్రునిపై నోకియా 4జీ నెట్‌వర్క్, ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు తెలిపిన నాసా, ఆర్టెమిస్ మిషన్‌ను 2024 లో ప్రారంభించేందుకు నాసా కసరత్తు
Hazarath Reddyచందమామ మీదకు వెళ్లేందుకు ఆర్టెమిస్ మిషన్‌ను 2024 లో నాసా ప్రారంభించిందేకు రెడీ అవుతోంది. అయితే దీని కోస నాసాకు సహజంగా సమర్థవంతమైన మరియు నమ్మదగిన కమ్యూనికేషన్ సెటప్ అనేది చాలాఅవసరం. ఈ నేపథ్యంలో నాసా నోకియాతో జత కట్టింది. చంద్రునిపై 4 జి ఎల్‌టిఇ సెల్యులార్ నెట్‌వర్క్‌ను (Nokia 4G Networks On The Moon) నిర్మించేందుకు నోకియాకు భారీ ఎత్తున నిధులు అందించేందుకు నాసా రెడీ అయింది. చంద్రునిపై 14.1 మిలియన్ డాలర్లతో సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి నోకియా (Nokia) చేపట్టిన ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు నాసా (Nasa) ప్రకటించింది.
COVID-19 Vaccine: షాకింగ్..కరోనా వ్యాక్సిన్ బయటకు వస్తే 50 లక్షల షార్క్ చేపలు బలి, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న శాస్ర్తవేత్తలు, షార్క్ చేపలను చంపొద్దంటూ సోషల్ మీడియాలో ఉద్యమం
Hazarath Reddyకోవిడ్ వ్యాక్సిన్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) బయటకు వస్తే కొన్ని లక్షల షార్క్ చేపలు కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం షార్క్‌ చేపల కాలేయం నుంచి తీసే నూనెను (Shark liver oil) కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. స్క్వాలిన్‌ పేరుతో (Squalene and COVID-19 vaccine) పిలవబడే ఈ నూనె రోగ నిరోధక శక్తి పెంచటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Big Billion Days Sale: రూ.5,999 కేహెచ్‌డి టీవీ, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్‌ని ప్రారంభించిన థామ్సన్, టీవీల వివరాలు ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddyయూరప్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ (Thomson) అత్యంత తక్కువ ధరకే టీవీలు అందుబాటులోకి తెస్తోంది. అక్టోబర్ నుంచి 16 - 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ( Flipkart) జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో (Big Billion Days sale) ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. కాగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' (Big Save on Bigger TV offer) పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభమవుతుంది.
RTGS Payment Update: బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్, ఆర్టీజీఎస్‌ సేవలు 24 గంటల పాటు అందుబాటులో.., డిసెంబర్ నుంచి అమల్లోకి, వివరాలను వెల్లడించిన ఆర్‌బీఐ
Hazarath Reddyబ్యాంకు ఖాతాదారులకు ఆర్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. నగదు బదిలీ సౌకర్యం రియల్‌టైం గ్రాస్‌ సెటిల్మెంట్‌ (RTGS) (RTGS payment system) వారంలో ప్రతి రోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ (RBI) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది.
Smartphone Prices May Rise: మొబైల్ యూజర్లకు షాక్, స్మార్ట్‌ఫోన్ల ధరలు 3 శాతం పెరిగే అవకాశం, డిస్‌ప్లేల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం విధించిన 10 శాతం సుంకమే కారణం, ఆందోళన వ్యక్తం చేసిన ఐసీఈఏ
Hazarath Reddyమొబైల్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ లాంటి వార్తే.. కేంద్ర ప్రభుత్వం డిస్‌ప్లేల దిగుమతిపై 1 శాతం సుంకం విధించిన నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల ధరలు 3శాతం దాకా పెరిగే అవకాశం (Smartphone Prices May Rise) ఉంది. ఈ విషయంపై ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ICEA) ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్, హువాయి, షియోమి, వివో, విన్‌స్ట్రాన్‌ వంటి సంస్థలకు ఇందులో సభ్యత్వం ఉందని,ఈ నేపథ్యంలో మొబైల్‌ ఫోన్ల (SmartPhones) రేట్లపై 1.5-3 శాతం దాకా సుంకాల ప్రభావం ఉంటుంది‘ అని ఐసీఈఏ నేషనల్‌ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ ఒక ప్రకటనలో తెలిపారు.
WhatsApp New Features: వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్లు, ఆల్వేస్‌ మ్యూట్‌ బటన్‌, కొత్తగా 138 ఎమోజీలు, న్యూ అటాచ్‌మెంట్‌ ఐకాన్స్‌..ఇతర ఫీచర్లు మీకోసం
Hazarath Reddyసోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఇన్ స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ సరికొత్త ఫీచర్లను (WhatsApp New Features) యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా మ్యూట్‌ బటన్‌, న్యూ ఐకాన్స్‌, కేటలాగ్‌ షార్ట్‌కట్‌, లెక్కలేనన్ని ఎమోజీలు.. ఇలా యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లను అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో పొందుపరిచింది. వీటిలో కొన్ని బీటా వెర్షన్లకే పరిమితమవగా మిగిలినివి సాధారణ యూజర్లకూ అందిస్తోంది.
Reliance-GIC,TPG Deal: రిలయన్స్‌లోకి తాజాగా రూ.7,350 కోట్లు పెట్టుబడులు, రిలయన్స్ రిటైల్ విభాగంలో ఈ మొత్తాన్ని పెట్టనున్నట్లు తెలిపిన జీఐసీ, టీపీజీ సంస్థలు, రూ.32,197.50 కోట్లకు చేరిన రిలయన్స్ మొత్తం పెట్టుబడులు
Hazarath Reddyజియో అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా రిలయన్స్ రిటైల్ విభాగంలో (Reliance Retail Ventures Ltd (RRVL) రూ.7,350 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ సంస్థ జీఐసీ, గ్లోబల్ ప్రయివేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ కాపిటల్ (Reliance-GIC,TPG Deal) అంగీకరించినట్టు ఆర్ఐఎల్ ప్రకటించింది.
BrahMos Cruise Missile: దుమ్మురేపిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్, 400 కిలోమీటర్ల దూరంలో ఏమున్నా భస్మీ పటలం చేసే శక్తి దీని సొంతం, మిసైల్‌ను ప్రయోగించడం రెండోసారి
Hazarath Reddyబ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాత్మక పరీక్ష బుధవారం విజయవంతమైంది. స్వదేశీ బూస్టర్, ఎయిర్‌ఫ్రేమ్ విభాగంతో పాటు అనేక ఇతర మేడ్ ఇన్ ఇండియా ఉప వ్యవస్థలను కలిగి ఉన్న “బ్రహ్మోస్” సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి (BrahMos Cruise Missile) ఒడిశాలోని ఐటీఆర్ బాలాసోర్ నుంచి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు నిర్వహించిన ప్రయోగం విజయవంతం అయినట్టు ప్రకటించారు. దీంతో డీఆర్డీవో (DRDO) ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఇతర సిబ్బందిని భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అభినందించారు.
PUBG-Jio Deal Talks: పబ్‌జీ‌పై జియో కన్ను, 50-50 డీల్ కోసం ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు, ఇంకా అధికారికంగా ప్రకటించని రిలయన్స్ జియో
Hazarath Reddyఇండియాలో నిషేధం విధించబడిన పాపులర్ మొబైల్ గేమ్ పబ్‌జీని (PUBG) భారతీయ వినియోగదారులకు తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ టెలికాం విభాగం జియో (Reliance Jio) పబ్‌జీ కార్పొరేషన్‌తో చర్చలు (PUBG-Jio Deal Talks) జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయని, ఇరు సంస్థలు (PUBG Corp, Jio in talks) కొనుగోలు ఒప్పందంపై తీవ్ర కసరత్తుచేస్తున్నాయని అనధికార వర్గాలు వెల్లడించాయి.
Xiaomi’s Travelling Store: రోడ్డు మీదకు షియోమి, ఎంఐస్టోర్ ఆన్ వీల్స్ పేరుతో నేరుగా గ్రామాల్లోకి షియోమి వాహనాలు, అన్ని రకాల ఉత్పత్తులు అందుబాటులోకి..
Hazarath Reddyచైనా..భారత్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఎక్కువయిన నేపథ్యంలో షియోమి కొత్త వ్యూహానికి తెరలేపింది. చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమీ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ ‌ విక్రయాలను విస్తరించడంలో భాగంగా ఎంఐస్టోర్ ఆన్ వీల్స్(MiStore-on-wheels) అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామీణ భారతీయ వినియోగదారులను చేరుకోవాలని యోచిస్తోంది. దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ బ్రాండ్ షియోమి ట్రావెలింగ్ స్టోర్‌ (Xiaomi’s Travelling Store) ప్రారంభించింది. అంటే గ్రామీణులకు చేరువయ్యేలా నిర్దిష్ట ప్రదేశాల్లో ఆగుతూ, వారాంతపు సంతలు, ఉత్సవాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ షావోమి సంత నిర్వహిస్తుంది.
'Jio Cricket Play Along': జియో నుంచి బహుమతులు గెలుచుకోండి, జియో క్రికెట్‌ ప్లే ఎలాంగ్ ద్వారా బంఫర్ ఫ్రైజ్ గెలుచుకునే అవకాశం, వివరాలు జియో యాప్‌లో చెక్ చేసుకోండి
Hazarath Reddyఐపీఎల్‌ ప్రారంభమైన నేపథ్యంలో ప్రేక్షకులకు జియో నెట్‌వర్క్‌ ఒక శుభవార్త చెప్పింది. జియో యూజర్లతో (Jio Users) పాటు నాన్‌ జియో యూజర్లు 'జియో క్రికెట్‌ ప్లే ఎలాంగ్' యాప్‌ (Jio Cricket Play Along)‌ ద్వారా విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పాటు గేమ్‌లో పాల్గొనేవారు తమ నైపుణ్యతను మెరుగుపరుచుకునేలా ప్రశ్నలను రూపొందించడంతో పాటు ఎంటర్‌టైన్మెంట్‌ను కూడా అందించనుంది. దీనికి అదనంగా ప్రీ-మ్యాచ్ ప్రశ్నలు, పోల్స్, క్విజ్‌లతో పాటు మీ ఫేవరెట్‌ టీమ్‌కు స్టికర్‌ చాట్‌ ఏర్పాటు, స్కోర్‌లు, మ్యాచ్ షెడ్యూల్‌లు, ఫలితాలను యాక్సస్‌ చేసుకునే అవకాశాన్ని కూడా జియో కల్పిస్తోంది.
TikTok vs America: ట్రంప్‌పై అమెరికా కోర్టులో టిక్‌టాక్ ఫిర్యాదు, అమెరికా అధ్యక్షుడు తన అధికారాలను దుర్వినియోగం చేశారని కోర్టును ఆశ్రయించిన చైనా యాప్, అగ్రరాజ్యంలో టిక్‌టాక్, వీ చాట్‌‌లపై నిషేధం
Hazarath Reddyచైనాకు చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు (TikTok Ban) అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ఆ దేశ వాణిజ్య విభాగం పేర్కొంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్‌ టాక్, వీ చాట్‌ లను నిషేధించామని యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్‌బుర్‌ రాస్‌ తెలిపింది. కాగా దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధించిన విషయం తెలిసిందే.
Paytm App Removed: గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం యాప్ తొలగింపు, గూగుల్ యొక్క గాంబ్లింగ్ పాలసీకి విరుద్ధంగా పేటీఎం యాప్ వ్యవహరిస్తుందని పేర్కొన్న సెర్చ్ ఇంజన్ దిగ్గజం
Team Latestlyఇప్పటికే పేటీఎం యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వినియోగదారులు యాప్ యొక్క అన్ని సేవలను వినియోగించుకోవచ్చు. కానీ కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభించదు...