Technology

RIL AGM 2020: తక్కువ ధరకే జియో నుంచి 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు, ఏజీఎంలో వెల్లడించిన ముఖేష్ అంబానీ, గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం

Hazarath Reddy

నేడు జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (AGM)లో ముఖేష్ అంబానీ పలు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భాగస్వామ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ( mukesh ambani) తెలిపారు.

Telecom War: ప్రపంచ ఆరవ కుబేరుడు ముకేష్ అంబానీ, కొత్త వినియోగదారులతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, బ్లూజీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ఎయిర్‌టెల్

Hazarath Reddy

భారత టెలికాం మార్కెట్లో జియో (Reliance Jio) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కొత్త వినియోగదారులను చేర్చుకుంటూ ప్రత్యర్థులకు అందనంతగా ఎత్తులో దూసుకుపోతోంది. మార్చి నెలలో కొత్తగా 4.68 మిలియన్ల మొబైల్ యూజర్లు జియోను ఎంచుకున్నారు. ఫలితంగా జియో మొత్తం యూజర్ల బేస్ 387 మిలియన్లు దాటిపోయినట్టు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను బట్టి తెలుస్తోంది. మార్చి నెలలో ఢిల్లీలో కొత్తగా 2.59 లక్షల మంది జియో ఖాతాదారులుగా మారారు.

Social Media Ban Row: ఆర్మీలో ఫేస్‌బుక్‌తో పాటు సోష‌ల్ మీడియా బ్యాన్, సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన ఆర్మీ అధికారి, పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం

Hazarath Reddy

భారత ఆర్మీలో పనిచేసే అధికారులు, సైనికులు ఫేస్‌బుక్‌తో పాటుగా 89 యాప్‌లను వారి ఫోన్‌ల నుంచి తొలగించాలని (Social Media Ban) కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ ఆర్మీ అధికారి (Army Officer Challenges Facebook Ban) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫేస్‌బుక్ లాంటి వాటిని సైనికులు వాడ‌రాదు అని విధించిన నిషేధాన్ని స‌వాల్ చేస్తూ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ పీకే చౌద‌రీ ఢిల్లీహైకోర్టులో పిటిష‌న్ వేశారు. రేపు ఆ పిటిష‌న్‌పై ఢిల్లీ హైకోర్టు వాద‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ది.

#GoogleForIndia: భారత్‌లో రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొస్తున్న గూగుల్, రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో వివిధ రూపాల్లో వెచ్చిస్తామని తెలిపిన గూగుల్ సీఈఓ

Hazarath Reddy

ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను (Google for India Digitisation Fund) వెల్లడించింది. భార‌తీయ స్టార్ట్ అప్స్‌లో సుమారు 75 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ (Sundar Pichai) తెలిపారు. గూగుల్ ఆఫ్ ఇండియా (Google for India) కార్య‌క్ర‌మంలో భాగంగా భారీ పెట్టుబ‌డుల‌ను ప్ర‌క‌టించారు. ప‌ది బిలియ‌న్ల డాల‌ర్ల నిధుల‌తో భార‌తీయ డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం కానున్న‌ట్లు సుంద‌ర్ పిచాయ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం గ‌ర్వంగా ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. డిజిట‌ల్ ఇండియా విజ‌న్‌తో ప్ర‌ధాని మోదీ ప‌నిచేస్తున్న తీర ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Advertisement

'Made in India': లావా నుంచి Z61 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల, 'మేడ్ ఇన్ ఇండియా' ఫోన్‌గా ప్రాచుర్యం, దీని ధర మరియు ఇతర స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి

Team Latestly

భారత్ మరియు చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో భారతీయ ఉత్పత్తుల పట్ల డిమాండ్ పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని లావా సంస్థ అన్ని మెరుగైన ఫీచర్లతో, బడ్జెట్ ధరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది...

E-Commerce Firms: అమ్మే వస్తువు ఏ దేశానిదో తప్పనిసరిగా చెప్పాలి, ఈ కామర్స్ దిగ్గజాలను కోరిన డిపిఐఐటి, కొంత సమయం కావాలని కోరిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు

Hazarath Reddy

దిగ్గజ ఈ-కామర్స్ ప్లేయర్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ (Flipkart, Amazon) తమ వెబ్ ఫ్లాట్ ఫాం మీద అమ్మే ప్రతి వస్తువు ఏ దేశానిదో చెప్పాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపిఐఐటి ఈ కామర్స్ దిగ్గజాలను కోరింది. ఇ-కామర్స్ కంపెనీలకు (E-Commerce Players) తమ ప్లాట్‌ఫామ్‌లో ఉత్పత్తి గురించి సమాచారం ఇవ్వడం తప్పనిసరి అని, ఉత్పత్తి ఎక్కడ నుండి వచ్చింది లేదా ఎక్కడ తయారైంది, లేదా పుట్టిన దేశం అని చెప్పాలని తెలిపింది. ఈ విషయంపై డిపిపిఐటి (DPIIT) ఈ-కామర్స్ ప్లేయర్‌లతో ఈ రోజు సమావేశం నిర్వహించింది.

Elyments App: విదేశీ యాప్‌లకు స్వదేశీ యాప్ ఎలిమెంట్స్‌ భారీ షాక్, ఒక్కరోజులోనే 5 లక్షల డౌన్ లోడ్లు, ఎనిమిది భాషల్లో ఆడియో, వీడియో కాల్

Hazarath Reddy

సోషల్‌ మీడియా రంగంలోకి తొలి దేశీయ సూపర్‌ యాప్‌ ఎలిమెంట్స్‌ (Elyments App) అడుగుపెట్టింది. ఈ యాప్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆదివారం నాడు ఆవిష్కరించారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు దీటుగా రూపొందించిన ఈ యాప్‌కు యువతను విశేషంగా ఆకట్టుకుంది. తొలిరోజే గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి అయిదు లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వాలంటీర్లుగా ఉన్న వెయ్యిమందికి పైగా ఐటీ నిపుణులు సంయుక్తంగా ఎలి మెంట్స్‌ యాప్‌ను రూపొందించారు.

Jio Plans 2020: జియో నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు, జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం, కొత్త ప్లాన్ల వివరాలు ఇవే

Hazarath Reddy

రిలయన్స్ జియో కొత్త పథకాలతో (Jio Plans 2020) వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Reliance Jio prepaid plans) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది.

Advertisement

Chingari App: టిక్‌టాక్‌కు ధీటుగా చింగారి యాప్, 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్న మేడ్ ఇన్ ఇండియా యాప్ గురించి తెలుసుకోండి

Hazarath Reddy

చైనీస్ యాప్ టిక్‌టాక్ తో పాటు 59 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇండియా యాప్ చింగారి (Chingari Made in India app) వచ్చేసింది. ఈ యాప్ ను గంటలోనే ఈ యాప్‌ను ( Chingari APP) పదిల‌క్ష‌లమంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ారు. షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ ( TikTok) మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది.

PAN-Aadhaar Card Linking: గుడ్ న్యూస్, ఆధార్-పాన్ లింక్ గడువు 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు, ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేసేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు. 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. పైగా ఏడాది మార్చి 31లోగా పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని గతంలోనే స్పష్టం చేసింది.

Flipkart: తెలుగు ప్రజలకు ప్లిప్‌కార్ట్‌ శుభవార్త, ఇకపై మీరు తెలుగు భాషలో కూడా షాపింగ్ చేయవచ్చు, కొత్త ఫీచర్‌ని యాడ్ చేసిన ప్లిప్‌కార్ట్‌

Hazarath Reddy

ఈ- కామర్స్‌ లో దూసుకుపోతున్న దిగ్గజం ప్లిప్‌కార్ట్‌ (Flipkart) తాజాగా తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు ప్లిప్‌కార్ట్‌ శుభవార్త తెలిపింది. ఇక మీదట (తెలుగు, తమిళ, కన్నడ భాషల)కు చెందిన వినియోగదారులు తమ ప్రాంతీయ భాషలలో (Flipkart Rolls Out Language Interfaces) షాపింగ్‌ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు కేవలం హిందీ మొబైల్‌ అప్లికేషన్‌కు మాత్రమే ఈ వెసలుబాటు ఉండేది.

ATM Usage Charges: రూ.5 వేలు కన్నా ఎక్కువ డ్రా చేస్తే ఛార్జీల మోత తప్పదా? పలు రకాల ఛార్జీలు పెంచుతూ నివేదికను తయారుచేసిన ఆర్బీఐ కమిటీ, నిశితంగా పరిశీలిస్తున్న అత్యున్నత అధికారులు

Hazarath Reddy

కోవిడ్-19 కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్న రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) ఈ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు మరో కీలక నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఏటీఎం ఛార్జీలను (ATM Usage Charges) మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్‌లో 5వేలు మాత్రమే విత్‌డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Advertisement

Happy Summer 2020: ఇకపై పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ, హ్యాపీ సమ్మర్ సీజన్ 2020 వచ్చేసింది, జూన్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న సమ్మర్ సీజన్

Hazarath Reddy

నాలుగు సమశీతోష్ణ సీజన్లలో వేసవి అనేది చాలా హాటెస్ట్ సీజన్ గా (Happy Summer 2020) చెప్పవచ్చు. ఇది (Summer Season) వసంత రుతువు తరువాత అలాగే శరదృతువు ముందు వస్తుంది. ఈ వేసవికాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయంలో పలు మార్పులు సంభవిస్తాయి. రోజులు చాలా ఎక్కువ అనిపిస్తాయి. రాత్రులు తక్కువగానూ పగలు ఎక్కువగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్ది పగలు తగ్గిపోయి రాత్రి ఎక్కువ అవుతుంది. కాగా వేసవి ప్రారంభ తేదీ (Happy Summer 2020 Dates) వాతావరణం, సంప్రదాయం మరియు సంస్కృతి ప్రకారం మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు, ఇది దక్షిణ అర్ధగోళంలో శీతాకాలంతో విరుద్ధంగా ఉంటుంది. ఈ సీజ్ జూన్ 21న ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది.

Reliance Net Debt-Free: జియో ముఖేష్ అంబానీ మ్యాజిక్, రిల్‌లోకి 58 రోజుల్లో రూ.1,68,818 కోట్ల పెట్టుబడులు, రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో ఉందన్న జియో అధినేత

Hazarath Reddy

రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అనుకున్నది సాధించాడు. వరుస పెట్టుబడుల సునామీతో రిలయన్స్ ను అప్పులు లేని సంస్థగా (Reliance Net Debt-Free) మార్చివేశాడు. కాగా 2021 మార్చి నాటికి ఆర్ఐఎల్ (Reliance) సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దుతానన్న వాగ్దానాన్ని ముందే నెరవేర్చామని ఛైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందుగానే సాధించాం. "రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో" (Reliance In Golden Decade) ఉందని బిలియనీర్ అంబానీ ప్రకటించారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 58 రోజుల్లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1,68,818 కోట్లు సేకరించింది.

Atmanirbhar Bharat: చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న ఇండియా, 4జీ అప్‌గ్రేడ్‌‌లో చైనా పరికరాల వినియోగం బంద్, బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికం సంస్థలకు త్వరలో డాట్ ఆదేశాలు

Hazarath Reddy

భారత్ - చైనా సరిహద్దులోని గాల్వార్ లోయ దగ్గర జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు (China) తగిన గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తోంది. కేవలం సైనిక చర్యల ద్వారా మాత్రమే కాకుండా వాణిజ్యపరంగానూ తగిన సమాధానం చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికమ్ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (Bharat Sanchar Nigam Limited) (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాలను వినియోగించరాదని నిర్ణయించారు. భద్రత కారణాల వల్ల చైనా పరికరాలను పక్కనబెట్టాలని టెలికం శాఖ (Department of Telecom) నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి రీ-టెండరింగ్‌ కూడా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి.

Jio Fiber Offers: జియో నుంచి మరో సంచలన ఆఫర్, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితం, జియో ఫైబర్ గోల్డ్, ఆపైన ప్లాన్ లో ఉన్నవారికి మాత్రమే

Hazarath Reddy

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తాజాగా జియోఫైబర్ (Reliance Jio Fiber) వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ (Jio Fiber offers) అందిస్తోంది. రూ. 999 అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా (free Amazon Prime) అందిస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. జియో ఫైబర్ గోల్డ్ , ఆపైన ప్లాన్ లో ( Jio Fiber Bronze plans) ఉన్న జియోఫైబర్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ పథకం గోల్డ్, డైమండ్, ప్లాటినం మరియు టైటానియం ప్లాన్‌లపై లభిస్తుంది.

Advertisement

iQOO 3 Volcano Orange: ఐక్యూ 3 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆకర్శనీయమైన వోల్కనో ఆరెంజ్ కలర్ వేరియంట్ భారత మార్కెట్లో విడుదల; ధర, ఫీచర్లు మరియు ఇతర స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి

Team Latestly

ఆఫర్ల విషయానికొస్తే, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్‌ ద్వారా కూడా గరిష్ఠంగా రూ.13,950 వరకు తగ్గింపు పొందవచ్చు....

OnePlus Smart TV: తక్కువ ధరలకే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు, ధరలు రూ. 1X,999/- నుండి ప్రారంభమవుతాయని సస్పెన్స్ క్రియేట్ చేసిన సంస్థ

Team Latestly

వన్‌ప్లస్ ఇండియా ఇటీవల చేసిన ట్వీట్‌లో రాబోయే వన్‌ప్లస్ టీవీ సిరీస్ ధరకు సంబంధించిన విషయాన్ని కొద్దిగా సస్పెన్స్ లో ఉంచుతూ టీజర్‌లో చూపించారు. ఈ స్మార్ట్ టీవీ మోడళ్ల ధర రూ .1X, 999 నుండి ప్రారంభమవుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు....

Upcoming WhatsApp Features: వాట్సాప్‌లోకి 5 కొత్త ఫీచర్లు, త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి

Hazarath Reddy

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో మరో ఐదు వినూత్న ఫీచర్లను (Upcoming WhatsApp features) అందుబాటులోకి తీసుకురానుంది.ఇప్పటికే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను లాంఛ్‌ చేసిన వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాల్‌ పరిమితిని నలుగురి నుంచి ఎనిమిదికి పెంచి యూజర్లను ఆకట్టుకుంది. మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్‌ (WhatsApp) కసరత్తు ముమ్మరం చేసింది.

PUBG Addiction: తెల్లారేదాక పబ్‌జీ ఆడాడు, తరువాత ఉరేసుకున్నాడు, రాజస్థాన్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసిన కోట పోలీసులు

Hazarath Reddy

పబ్‌జీ గేమ్ లు ఇప్పటికే ఎందరో ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ 14 ఏళ్ల కుర్రాడు తెల్లారేదాకా పబ్జీ గేమ్ ఆడి, అనంతరం పక్క గదిలోకి వెళ్లి ఉరేసుకుని (Rajasthan Teen Hangs Self) మరణించాడు..

Advertisement
Advertisement