Technology
China Apps Ban Row: మళ్లీ 15కు పైగా చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం, బ్యాన్ లిస్టులో షియోమి ఎంఐ బ్రౌజర్ ప్రో,బైదూ సెర్చ్, భారత ప్రభుత్వం నుంచి ఇంకా రాని అధికారిక ప్రకటన
Hazarath Reddyభారత ప్రభుత్వం కొద్ది వారాల క్రితం నిషేధిత 59 చైనా యాప్‌లను (China Apps Ban) పోలిన క్లోన్‌లను బ్యాన్ చేసిన సంగతి విదితమే. మొత్తం 47 క్లోన్ యాప్‌లపై వేటు వేసింది. తాజాగా మరో 15పైగా చైనా యాప్‌లను కేంద్రం నిషేధించినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో నిషేధానికి గురైన యాప్‌లకు చెందిన ప్రో, లైట్ వర్షెన్లు కూడా ప్రస్తుతం బ్యానయ్యాయని అనధికార సమాచారం. వీటిల్లో షియోమి కార్ప్ బ్రౌజర్ (Xiaomi’s Mi Browser Pro), బైదూ సెర్చ్ (Baidu Search) కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Redmi 9 Prime: రూ. 9,999లకే నాలుగు కెమెరాల స్మార్ట్‌ఫోన్, రెడ్‌మి 9 ప్రైమ్‌ను ఇండియాలో లాంచ్ చేసిన షియోమి, ఆగస్టు 6వ తేదీన ఫస్ట్ సేల్
Hazarath Reddyచైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి తాజా స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. రెడ్‌మి 9 ప్రైమ్ (Redmi, Redmi 9) పేరుతో రెండు వేరియంట్లలో భారత మార్కెట్లలో మంగళవారం సరికొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఇది ఆగస్టు 17వ తేదీ నుంచి అమెజాన్ , ఎంఐ స్టోర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. నాలుగు రంగుల్లో రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ (Redmi 9 Prime India) లభ్యమవుతోంది. అలాగే ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ ద్వారా ఆగస్టు 6 న ఉదయం 10 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో (Redmi India smartphone) తొలిసారి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Microsoft Plan to Buy TikTok: టిక్‌టాక్‌పై మైక్రోసాఫ్ట్‌ కన్ను, అమెరికా హక్కులు సొంతం చేసుకునేందుకు పావులు, ట్రంప్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాతనే తుది నిర్ణయం
Hazarath Reddyచైనా వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌కు సంబంధించిన అమెరికా హక్కులు సొంతం (Microsoft Plan to Buy TikTok) చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ధ్రువీకరించింది. సెప్టెంబరు 15, 2020 నాటికి టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో (ByteDance) ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆదివారం స్పష్టం చేసింది. జాతీయ భద్రతా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు పేర్కొంది.
Samsung Galaxy M31s: శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ విడుదల, సింగిల్‌ టేక్‌ కెమెరా ప్రధాన ఆకర్షణ, 6జీబీ ర్యామ్..128జీబీ స్టోరేజ్ ధర రూ.19,499, ఫీచర్లపై ఓ లుక్కేయండి
Hazarath Reddyసౌత్‌కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్ ఎం-సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. శాంసంగ్ ‘గెలాక్సీ ఎం31ఎస్’ (Samsung Galaxy M31s) పేరుతో విడుదలైన ఈ ఫోన్ ఆగస్టు 6 నుంచి భారత వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అమెజాన్‌ ఇండియా (Amazon Prime Day Sale 2020), శాంసంగ్‌ డాట్‌కామ్‌ల ద్వారా ఆసక్తి ఉన్న యూజర్లు ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ ఎం31ఎస్ ఫోన్‌ ప్రారంభ ధర రూ.19,999 కాగా టాప్‌ ఎండ్‌ మోడల్‌ ధర రూ.21,999గా నిర్ణయించారు.
Google Work From Home: గూగుల్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌, వ‌చ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు పొడిగింపు, భారతదేశంలో గూగుల్ రూ.75,000 కోట్ల డిజిటల్‌ పెట్టుబడులు
Hazarath Reddyక‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో గూగుల్ సంస్థ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను (Google Work From) పొడిగించింది. త‌మ ఉద్యోగుల కోసం ఇంటి నుంచి ప‌నిచేసే సౌల‌భ్యాన్ని వ‌చ్చే ఏడాది జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు గూగుల్ సంస్థ (Google) వెల్ల‌డించింది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ సంస్థ‌.. ఆఫీసులో ప‌ని అవ‌స‌రం లేని వారికి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది. వాస్త‌వానికి ఈ ఏడాది జూన్‌లో ఆఫీసులు తెరువాల‌నుకుంటున్న‌ట్లు మొద‌ట్లో గూగుల్ ప్ర‌క‌టించింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర్క్ హోమ్ కాన్సెప్ట్‌ను (Google India Work From Home) ఎంక‌రేజ్ చేసింది. ఈ ఏడాది చివ‌ర వ‌ర‌కు తమ ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను వ‌చ్చే ఏడాది జూన్ చివ‌ర వ‌ర‌కు పెంచేసింది.
India Bans 47 Chinese Apps: పబ్‌జీ ఇండియా నుంచి త్వరలో అవుట్, చైనా కంపెనీలకు మరో షాకిచ్చిన కేంద్రం, 59కు తోడుగా మరో 47 యాప్స్‌ బ్యాన్‌, 275 యాప్‌ల‌పై నిషేధం దిశగా అడుగులు
Hazarath Reddyజాతీయ భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా ఉందన్న కారణంతో 59 చైనా యాప్‌లను బ్యాన్‌ చేసిన కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌లకు అనుసంధానంగా ఉన్న మరో 47 చైనా యాప్స్‌ను బ్యాన్‌ (India Bans 47 Chinese Apps) చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బ్యాన్‌ చేసిన వాటిలో టిక్‌టాక్‌ లైట్‌, హెలో లైట్, షేర్‌ఇట్‌ లైట్‌, బిగో లైవ్‌ లైట్‌, వీఎఫ్‌ఐ లైట్‌ (Helo Lite, ShareIt Lite, TikTok, Tiktok Lite, UC Browser) ఉన్నాయి.
Galaxy M01 Core: రూ.6 వేలకే శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ ఎం01 కోర్‌ను విడుదల చేసిన దక్షిణ కొరియా దిగ్గజం, ఈ నెల 29 నుంచి సేల్స్
Hazarath Reddyదక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా రూ. 6 వేల లోపు ధరతో ‘గెలాక్సీ ఎం01 కోర్’ను (Galaxy M01 Core) విడుదల చేసింది. భారత్‌లో లభ్యమయ్యే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో ఇదే అత్యంత చవకైన ఫోన్. ఇందులో 1జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీలతో రెండు వేరియంట్లు తీసుకొచ్చింది. ఇందులో మొదటి దాని ధర ( Galaxy M01 Core Price) రూ. 5,499 కాగా, రెండో దాని ధర రూ. 6,499 మాత్రమే. ఈ నెల 29 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
OnePlus Nord 5G: రూ.25 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్, వన్‌ప్లస్ నార్డ్‌ను విడుదల చేసిన కంపెనీ, ఆగస్టు 4 నుంచి ఇండియాలో అమ్మకాలు
Hazarath Reddyఅందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్‘నార్డ్’ (OnePlus Nord 5G) 5జీ ఫోన్ ఎట్టకేలకు ఇండియన్‌ మార్కెట్లో విడుదల అయింది. తన కొత్త మొబైల్‌ OnePlus Nord 5జీ ఫోన్ ను కంపెనీ ఇండియాలో లాంచ్‌ చేసింది. 5జీ కనెక్టివిటీ, పంచ్ హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌, క్వాడ్ రియర్‌ కెమెరా ప్రధాన ఫీచర్లుగా (OnePlus Nord Features) ఉన్నాయని వన్‌ప్లస్ కంపెనీ ప్రకటించింది. అంతేకాదు "ఫాస్ట్ అండ్ స్మూత్" అనుభవాన్ని అందించడానికి వన్‌ప్లస్ నార్డ్‌కు దాదాపు 300 ఆప్టిమైజేషన్లను అందించినట్లు కంపెనీ పేర్కొంది.
Bitcoin Scam in Twitter: రెండు గంటలు..రూ.90ల‌క్ష‌లకు పైగా సంపాదన, సంపన్నుల ట్విట్టర్ అకౌంట్లే లక్ష్యంగా రెచ్చిపోయిన బిట్ కాయిన్ హ్యాకర్లు, చరిత్రలో చీకటి రోజని తెలిపిన ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే
Hazarath Reddyనిన్నంతా ట్విట్టర్ హ్యాకింగ్ తో (Twitter Accounts Hack) వణికిపోయింది. అమెరికాలో రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్, సంపన్నుల అకౌంట్లే లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోయారు. ధనవంతుల అకౌంట్లను హ్యాక్ (US Twitter accounts) చేసి భారీ మొత్తంలో హ్యాకర్లు సంపాదనను పోగేసుకున్నారు. హ్యాక్ అయిన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (US Former president Barack Obama), డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ (Joe Biden), టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్, మీడియా మొఘల్‌ మైక్‌ బ్లూమ్‌బర్గ్ (Mike Bloomberg), అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్ (Amazon CEO Jeff Bezos), మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో (Bill Gates) పాటు యాపిల్, ఉబర్‌ వంటి సంస్థల అకౌంట్లు ఉన్నాయి. నిన్న మూడు నాలుగు గంటల పాటు వారి అధికారిక ఖాతాలలో హఠాత్తుగాక్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
RIL AGM 2020: తక్కువ ధరకే జియో నుంచి 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు, ఏజీఎంలో వెల్లడించిన ముఖేష్ అంబానీ, గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం
Hazarath Reddyనేడు జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (AGM)లో ముఖేష్ అంబానీ పలు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ భాగస్వామ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ( mukesh ambani) తెలిపారు.
Telecom War: ప్రపంచ ఆరవ కుబేరుడు ముకేష్ అంబానీ, కొత్త వినియోగదారులతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, బ్లూజీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ఎయిర్‌టెల్
Hazarath Reddyభారత టెలికాం మార్కెట్లో జియో (Reliance Jio) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కొత్త వినియోగదారులను చేర్చుకుంటూ ప్రత్యర్థులకు అందనంతగా ఎత్తులో దూసుకుపోతోంది. మార్చి నెలలో కొత్తగా 4.68 మిలియన్ల మొబైల్ యూజర్లు జియోను ఎంచుకున్నారు. ఫలితంగా జియో మొత్తం యూజర్ల బేస్ 387 మిలియన్లు దాటిపోయినట్టు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను బట్టి తెలుస్తోంది. మార్చి నెలలో ఢిల్లీలో కొత్తగా 2.59 లక్షల మంది జియో ఖాతాదారులుగా మారారు.
Social Media Ban Row: ఆర్మీలో ఫేస్‌బుక్‌తో పాటు సోష‌ల్ మీడియా బ్యాన్, సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన ఆర్మీ అధికారి, పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం
Hazarath Reddyభారత ఆర్మీలో పనిచేసే అధికారులు, సైనికులు ఫేస్‌బుక్‌తో పాటుగా 89 యాప్‌లను వారి ఫోన్‌ల నుంచి తొలగించాలని (Social Media Ban) కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ ఆర్మీ అధికారి (Army Officer Challenges Facebook Ban) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫేస్‌బుక్ లాంటి వాటిని సైనికులు వాడ‌రాదు అని విధించిన నిషేధాన్ని స‌వాల్ చేస్తూ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ పీకే చౌద‌రీ ఢిల్లీహైకోర్టులో పిటిష‌న్ వేశారు. రేపు ఆ పిటిష‌న్‌పై ఢిల్లీ హైకోర్టు వాద‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ది.
#GoogleForIndia: భారత్‌లో రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొస్తున్న గూగుల్, రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో వివిధ రూపాల్లో వెచ్చిస్తామని తెలిపిన గూగుల్ సీఈఓ
Hazarath Reddyప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను (Google for India Digitisation Fund) వెల్లడించింది. భార‌తీయ స్టార్ట్ అప్స్‌లో సుమారు 75 వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు గూగుల్ సీఈవో సుంద‌ర్ పిచాయ్ (Sundar Pichai) తెలిపారు. గూగుల్ ఆఫ్ ఇండియా (Google for India) కార్య‌క్ర‌మంలో భాగంగా భారీ పెట్టుబ‌డుల‌ను ప్ర‌క‌టించారు. ప‌ది బిలియ‌న్ల డాల‌ర్ల నిధుల‌తో భార‌తీయ డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం కానున్న‌ట్లు సుంద‌ర్ పిచాయ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన డిజిట‌ల్ ఇండియా కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం గ‌ర్వంగా ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. డిజిట‌ల్ ఇండియా విజ‌న్‌తో ప్ర‌ధాని మోదీ ప‌నిచేస్తున్న తీర ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
'Made in India': లావా నుంచి Z61 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల, 'మేడ్ ఇన్ ఇండియా' ఫోన్‌గా ప్రాచుర్యం, దీని ధర మరియు ఇతర స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి
Team Latestlyభారత్ మరియు చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో భారతీయ ఉత్పత్తుల పట్ల డిమాండ్ పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని లావా సంస్థ అన్ని మెరుగైన ఫీచర్లతో, బడ్జెట్ ధరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది...
E-Commerce Firms: అమ్మే వస్తువు ఏ దేశానిదో తప్పనిసరిగా చెప్పాలి, ఈ కామర్స్ దిగ్గజాలను కోరిన డిపిఐఐటి, కొంత సమయం కావాలని కోరిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు
Hazarath Reddyదిగ్గజ ఈ-కామర్స్ ప్లేయర్‌లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ (Flipkart, Amazon) తమ వెబ్ ఫ్లాట్ ఫాం మీద అమ్మే ప్రతి వస్తువు ఏ దేశానిదో చెప్పాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపిఐఐటి ఈ కామర్స్ దిగ్గజాలను కోరింది. ఇ-కామర్స్ కంపెనీలకు (E-Commerce Players) తమ ప్లాట్‌ఫామ్‌లో ఉత్పత్తి గురించి సమాచారం ఇవ్వడం తప్పనిసరి అని, ఉత్పత్తి ఎక్కడ నుండి వచ్చింది లేదా ఎక్కడ తయారైంది, లేదా పుట్టిన దేశం అని చెప్పాలని తెలిపింది. ఈ విషయంపై డిపిపిఐటి (DPIIT) ఈ-కామర్స్ ప్లేయర్‌లతో ఈ రోజు సమావేశం నిర్వహించింది.
Elyments App: విదేశీ యాప్‌లకు స్వదేశీ యాప్ ఎలిమెంట్స్‌ భారీ షాక్, ఒక్కరోజులోనే 5 లక్షల డౌన్ లోడ్లు, ఎనిమిది భాషల్లో ఆడియో, వీడియో కాల్
Hazarath Reddyసోషల్‌ మీడియా రంగంలోకి తొలి దేశీయ సూపర్‌ యాప్‌ ఎలిమెంట్స్‌ (Elyments App) అడుగుపెట్టింది. ఈ యాప్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ఆదివారం నాడు ఆవిష్కరించారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు దీటుగా రూపొందించిన ఈ యాప్‌కు యువతను విశేషంగా ఆకట్టుకుంది. తొలిరోజే గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి అయిదు లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వాలంటీర్లుగా ఉన్న వెయ్యిమందికి పైగా ఐటీ నిపుణులు సంయుక్తంగా ఎలి మెంట్స్‌ యాప్‌ను రూపొందించారు.
Jio Plans 2020: జియో నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు, జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం, కొత్త ప్లాన్ల వివరాలు ఇవే
Hazarath Reddyరిలయన్స్ జియో కొత్త పథకాలతో (Jio Plans 2020) వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను (Reliance Jio prepaid plans) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది.
Chingari App: టిక్‌టాక్‌కు ధీటుగా చింగారి యాప్, 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్న మేడ్ ఇన్ ఇండియా యాప్ గురించి తెలుసుకోండి
Hazarath Reddyచైనీస్ యాప్ టిక్‌టాక్ తో పాటు 59 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇండియా యాప్ చింగారి (Chingari Made in India app) వచ్చేసింది. ఈ యాప్ ను గంటలోనే ఈ యాప్‌ను ( Chingari APP) పదిల‌క్ష‌లమంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ారు. షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ ( TikTok) మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది.
PAN-Aadhaar Card Linking: గుడ్ న్యూస్, ఆధార్-పాన్ లింక్ గడువు 2021 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు, ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేసేందుకు చివరి తేదీని మరోసారి పొడిగించారు. 2021 మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇన్‌కమ్ టాక్స్ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆధార్‌ కార్డును పాన్‌ కార్డుతో కనెక్ట్ చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం గతంలోనే తప్పనిసరి చేసింది. పైగా ఏడాది మార్చి 31లోగా పాన్ కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయబోదని గతంలోనే స్పష్టం చేసింది.
Flipkart: తెలుగు ప్రజలకు ప్లిప్‌కార్ట్‌ శుభవార్త, ఇకపై మీరు తెలుగు భాషలో కూడా షాపింగ్ చేయవచ్చు, కొత్త ఫీచర్‌ని యాడ్ చేసిన ప్లిప్‌కార్ట్‌
Hazarath Reddyఈ- కామర్స్‌ లో దూసుకుపోతున్న దిగ్గజం ప్లిప్‌కార్ట్‌ (Flipkart) తాజాగా తెలుగు, తమిళ, కన్నడ ప్రజలకు ప్లిప్‌కార్ట్‌ శుభవార్త తెలిపింది. ఇక మీదట (తెలుగు, తమిళ, కన్నడ భాషల)కు చెందిన వినియోగదారులు తమ ప్రాంతీయ భాషలలో (Flipkart Rolls Out Language Interfaces) షాపింగ్‌ చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ప్లిప్‌కార్ట్‌లో ఇప్పటివరకు కేవలం హిందీ మొబైల్‌ అప్లికేషన్‌కు మాత్రమే ఈ వెసలుబాటు ఉండేది.