World

Female Cancer Patient Offloaded: హ్యాండ్‌ బ్యాగ్‌ను పైన పెట్టమన్నందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది, న్యూయార్క్- ఢిల్లీ విమానంలో భారతీయ మహిళకు అవమానం

VNS

మీనాక్షి విమాన సిబ్బందికి దీనిపై ఫిర్యాదు చేసింది. అయితే చాలా అసౌకర్యంగా అనిపిస్తే విమానం నుంచి దిగిపోవాలని వారు ఖరాఖండీగా (offloaded from New York-bound flight) చెప్పారు. దీంతో మీనాక్షి విమానం దిగిపోయింది. వీల్‌చైర్‌ కోరినప్పటికీ వారు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది.

Fire Breathing Viral Video: నిప్పుతో స్టంట్ చేయబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు, విన్యాసం చేస్తుండగా నోట్లో చెలరేగిన మంటలు, వైరల్ వీడియో ఇదుగోండి?

VNS

ఓ ఫైర్‌ బ్రీతింగ్ స్టంటర్‌ (fire breathing) అలాంటి పొరపాటే చేశాడు. ఒక కట్టెపుల్లకు బట్టముక్కను చుట్టి కిరోసిన్‌లో ముంచి వెలిగించాడు. ఆ తర్వాత నోట్లో కిరోసిన్‌ను బుక్కపట్టి చేతిలో ఉన్న మంటపై ఉమ్మబోయాడు. ఈ ప్రయత్నంలో చేతిలోని మంటను నోటికి చాలా దగ్గరికి తీసుకురావడంతో నోట్లోని కిరోసిన్‌ కూడా అంటుకుంది.

Pervez Musharraf Dies: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మృతి, సుదీర్ఘ అనారోగ్యంతో దుబాయ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ (రిటైర్డ్) ఆదివారం కన్నుమూశారు. నివేదికల ప్రకారం, పర్వేజ్ ముషారఫ్ సుదీర్ఘ అనారోగ్యంతో దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించినట్లు పాకిస్తాన్ జియో న్యూస్ నివేదిక తెలిపింది. ముషారఫ్‌ వయసు 79. పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు దుబాయ్‌లోని అమెరికన్‌ హాస్పిటల్‌లో గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.

Uganda: ఆయనకు 12 మంది భార్యలు, 102 మంది సంతానం, నెలకోసారి భార్యలతో సమావేశమై సమస్యలపై చర్చించే పెద్దాయన, ఆయనది ఒక విచిత్ర కుటుంబం

VNS

ఏకంగా 12 పెళ్లిళ్లు (12 Wives) చేసుకున్నాడు. పిల్ల‌ల‌ను కూడా ప‌దుల సంఖ్య‌లో క‌న‌లేదు.. ఏకంగా 102 మందికి తండ్రి అయ్యాడు. 578 మంది మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌కు తాత (578 Grandchildren) అయ్యాడు ఆ వ్య‌క్తి. మ‌రి ఆ ఘ‌నుడి గురించి తెలుసుకోవాలంటే ఉగాండా దేశానికి వెళ్ల‌క త‌ప్ప‌దు. తూర్పు ఉగాండాకు చెందిన ముసా హ‌స‌హ్యా క‌సేరా(68) బుగిసాలో నివసిస్తున్నాడు.

Advertisement

5 Lakh Free Air Tickets: 5 లక్షల ఉచిత విమానయాన టిక్కెట్లను అందిస్తోన్న హాంగ్‌కాంగ్, టూరిజంలో ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకునే పనిలో పర్యాటక దేశం

Hazarath Reddy

హాంగ్‌కాంగ్ తమ దేశానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నంలో 5 లక్షల ఉచిత విమానయాన టిక్కెట్లను, వోచర్లను అందిస్తోంది.ఇటీవలి నెలల్లో నగరం కోవిడ్ ప్రయాణ పరిమితులను ఉపసంహరించుకుంది. మహమ్మారి తన పర్యాటక పరిశ్రమపై చూపిన భారీ ప్రభావం నుండి ఇప్పుడు తిరిగి బౌన్స్ అవ్వాలని భావిస్తోంది.

Pakistan Mosque Blast: మసీదును పేల్చిన ఉగ్రవాదులు, 100 మందికి పైగా మృతి, వారిలో 97 మంది పాకిస్తాన్ పోలీసులే..

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో గల ఓ మసీదులో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య 100కి పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 150 మందికిపైగా గాయపడ్డారు.

FedEx Layofffs: మరో కంపెనీలో ఊడుతున్న ఉద్యోగాలు, 10 శాతం ఎంప్లాయిస్‌ను తొలగించనున్న ఫెడెక్స్, రానున్న రోజుల్లో మరింత ఉద్యోగాలు ఊస్ట్

VNS

ఇప్పటికే ఐటీ కంపెనీలు, పలు మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఫెడెక్స్ (FedEx) కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఆఫీసర్, డైరక్టర్ ర్యాంకుల్లోని 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫెడెక్స్ (FedEx) ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Mukesh Ambani Overtakes Gautam Adani: గౌతం అదానీని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ, 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా బిలియనీర్

Hazarath Reddy

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, బిలియనీర్ ముఖేష్ అంబానీ సంపదలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీని వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం 84.3 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్‌ అదానీ 83.9 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానానికి పడిపోయారు.

Advertisement

Layoffs in PayPal: మరో మూడు కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు, అన్ని కంపెనీలకు పాకిన లే ఆఫ్స్, ఈ ఏడాది మరిన్ని సంస్థల్లో ఉద్యోగులకు కష్టాలు తప్పేలా లేదు, పేపాల్, హబ్ స్పాట్, హర్పర్ కొలిన్స్ లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు

VNS

తాజాగా పేపాల్ (Layoffs in PayPal) కంపెనీతో పాటూ హబ్ స్పాట్, హర్పల్ కొలిన్స్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కొంతమందికి ఉద్వాసన పలికాయి. పేపాల్ కంపెనీలోని 2వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అటు హబ్ స్పాట్ (Layoffs in HubSpot) కూడా తమ కంపెనీలో పనిచేస్తున్న 500 మందిని తొలగించింది. ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కంపెనీలు ప్రకటిస్తున్నాయి.

Valentine’s Day 2023: తొమ్మిది కోట్ల 50 లక్షల కండోమ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్న థాయిలాండ్, సురక్షితమైన సెక్స్‌ను ప్రోత్సాహించే దిశగా అడుగులు వేస్తున్న ఆగ్నేయాసియా దేశం

Hazarath Reddy

వాలెంటైన్స్ డే 2023 దగ్గరలోనే ఉంది.ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశం ప్రేమికుల దినోత్సవానికి ముందు సురక్షితమైన సెక్స్‌ను ప్రోత్సహించాలని కోరుతున్నందున, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STDలు), యుక్తవయస్సులో గర్భధారణను అరికట్టడానికి థాయిలాండ్ 95 మిలియన్ల ఉచిత కండోమ్‌లను పంపిణీ చేయాలని యోచిస్తోంది.

Pakistan Mosque Blast: పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి, 83కి పెరిగిన మృతుల సంఖ్య, పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో తాలిబన్‌లు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 83కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. 100 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Pakistan Horror: పాకిస్తాన్‌లో హిందూ మహిళపై గ్యాంగ్ రేప్, ఇస్లాం మతంలోకి రాలేదని కిడ్నాప్, 3 రోజులు బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ సామూహిక అత్యాచారం

Hazarath Reddy

పాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. మతం మారలేదని హిందూ మహిళపై కామాంధులు (Married Hindu woman abducted, gang-raped) తెగబడ్డారు. మూడు రోజుల పాటు రూంలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

Pakistan Mosque Blast: మసీదును కూడా వదలని ఉగ్రవాదులు, పాక్ మసీదు బాంబ్ బ్లాస్ట్ మా పనేనని తెలిపిన తెహ్రిక్‌-ఐ-తాలిబన్‌ పాకిస్థాన్‌, ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి ఘటనలో (Pakistan Mosque Blast) మృతుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. ఇవాళ మధ్యాహ్నం దాడి జరగగా సాయంత్రానికి మృతుల సంఖ్య 32కు చేరింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.

Amgen Layoffs: 300 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన డ్రగ్‌మేకర్ ఆమ్జెన్, సంస్థాగత మార్పుల మధ్య కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని వెల్లడి

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల భారీ తొలగింపుల మధ్య, డ్రగ్‌మేకర్ ఆమ్జెన్ యునైటెడ్ స్టేట్స్‌లో 300 మంది ఉద్యోగులను తొలగించింది. రాయిటర్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 1.2 శాతం మంది తొలగించారు.

Pakistan Mosque Blast: పాకిస్థాన్ లోని పెషావర్ లో ఘోరం, మసీదులో సూసైడ్ బాంబ్ పేలి 32 మంది మృతి, 147 మందికి గాయాలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

kanha

పెషావర్‌లోని పోలీస్ లైన్స్ ప్రాంతంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి పేలుడులో కనీసం 32 మంది మరణించారు.

Nigeria Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదాలు, గుర్తు పట్టలేనంతగా కాలిపోయిన 11 మంది, మొత్తం 20 మంది మరణించారని తెలిపిన అధికారులు

Hazarath Reddy

దక్షిణ నైజీరియాలో ట్రక్కులతో కూడిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పిల్లలతో సహా 20 మంది మరణించారని అధికారులు తెలిపారు, చాలా మంది బాధితులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. నైజీరియా యొక్క వాణిజ్య కేంద్రమైన లాగోస్‌లో, నగరంలోని ఓజులెగ్బా ప్రాంతంలో రద్దీగా ఉండే వంతెనపై ఒక కమర్షియల్ బస్సుపై భారీ కంటైనర్‌ను తీసుకెళ్తున్న ట్రక్ పడిపోయింది.

Advertisement

Mexico Mass Shooting: మెక్సికో నైట్ క్లబ్‌లో మారణహోమం, ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన దుండగులు, ఎనిమిది మంది మృతి, ఐదుగురికి గాయాలు

Hazarath Reddy

ఉత్తర మెక్సికోలోని జెరెజ్‌ పట్టణంలో ఉన్న ఓ నైట్‌క్లబ్‌లో సాయుధుడైన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎనిమిది మంది మృతిచెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీగా ఆయుధాలు ఉన్న వ్యక్తులు రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో అనే నైట్‌క్లబ్‌కు వచ్చారని, అనంతరం విచక్షనారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.

Bubble Tea Doodle: బబుల్ టీ వేడుకలు, గూగుల్ డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్న బబుల్ చాయ్ గురించి ఎవరికైనా తెలుసా, తైవాన్ దేశానికి చెందిన రెసిపీ గురించి ఓ సారి తెలుసుకుందామా..

Hazarath Reddy

గూగుల్ ఈ రోజు (శనివారం) తన డూడల్ హ్యాండిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందిన ‘బబుల్ టీ’ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగా గూగుల్ బబుల్ చాయ్ (bubble Tea) పేరుతో డూడుల్ విడుదల చేసింది.

Petrol Price Hike: పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఏకంగా రూ. 35 పెంచిన పాకిస్థాన్

Rudra

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ డబ్బుల్లేక విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో ఖజానాను నింపుకునేందుకు ప్రజలపై తీవ్ర భారాన్ని మోపింది. పెట్రోలు, డీజిల్ ధరను లీటరుకు రూ. 35 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

India-China Clash Row: సరిహద్దు గొడవలపై సంచలన నివేదిక బయటకు, భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణలు మరిన్ని జరిగే అవకాశం ఉందని తెలిపిన రాయిటర్స్

Hazarath Reddy

భారత్‌, చైనా సైనికుల మధ్య సరిహద్దులో మరిన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉందంటూ ఓ నివేదిక బయటకు వచ్చింది. ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగిన అత్యున్నత పోలీసు అధికారుల సమావేశంలో ఈ రహస్య నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement