World

IBM Layoffs: కొనసాగుతున్న ఐబీఎంలో భారీగా ఉద్యోగాల కోత, 3900 మందిని తొలగిస్తూ నిర్ణయం, ఐటీ కంపెనీలపై కొనసాగుతున్న ఆర్ధిక మాంధ్యం ఎఫెక్ట్‌

VNS

సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్‌ టెక్‌ కంపెనీలైన గూగుల్‌ (Google), అమెజాన్‌ (Amazon), మైక్రోసాఫ్ట్‌, మెటా (Meta) ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) కూడా చేరింది. కంపెనీలోని 3900 మంది ఉద్యోగులను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నది.

Trump is Back on Facebook, Instagram: సోషల్ మీడియాలోకి డోనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఆసక్తికర పరిణామం, రెండేళ్ల తర్వాత నిషేదం ఎత్తివేసిన మెటా

VNS

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై (Donald Trump) ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ఎత్తివేశాయి. 2021లో యూఎస్‌ క్యాపిటల్‌పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్‌ చేశాయి. అయితే రెండేండ్ల తర్వాత ఆయన అకౌంట్లను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా (Meta) ప్రకటించింది.

Video: పార్ల‌మెంట్ భ‌వ‌నం ముందే ప‌విత్ర ఖురాన్ ప్రతులు కాల్చివేత, స్థానిక అధికారులే త‌మ‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ట్లు తెలిపిన నెద‌ర్లాండ్స్‌ వివాదాస్ప‌ద రాజకీయ నేత ఎడ్విన్ వాగెన్స్‌వెల్డ్‌

Hazarath Reddy

నెద‌ర్లాండ్స్‌లో వివాదాస్ప‌ద నేతగా పేరున్న ఎడ్విన్ వాగెన్స్‌వెల్డ్‌.. డ‌చ్ పార్ల‌మెంట్ భ‌వ‌నం ముందే ప‌విత్ర ఖురాన్ పుస్త‌కంలో ప్ర‌తుల్ని చింపేశారు. వాటిని కాల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఖురాన్‌ను ముస్లింలు ప‌విత్ర గ్రంధంగా భావిస్తారు

Lockdown in North Korea: ఉత్తర కొరియాలో అంతు చిక్కని వ్యాధి, కొత్త కరోనా అనే అనుమానాలు, 5 రోజులు పాటు రాజధానిలో లాక్‌డౌన్ విధించిన కిమ్ ప్రభుత్వం, ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు

Hazarath Reddy

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరాన్ని అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 5 రోజుల లాక్ డౌన్ (Lockdown in North Korea) విధించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, ఎవ్వరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Washington Post Lays Off: మీడియాకు పాకిన లే ఆఫ్స్, 20 మంది జర్నలిస్టులకు ఉద్వాసన పలికిన వాషింగ్టన్ పోస్ట్, ఆన్‌లైన్ గేమింగ్ వర్టికల్ లాంచర్ మూసివేస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

మీడియా దిగ్గజం వాషింగ్టన్ పోస్ట్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది, కనీసం 20 మంది జర్నలిస్టులను తన న్యూస్ రూం నుండి తొలగించింది. వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందికి పంపిన నోట్ ప్రకారం, మంగళవారం తన న్యూస్‌రూమ్ నుండి 20 మందిని తొలగించింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాలీ బజ్బీ పంపిన నోట్‌లో కంపెనీ భర్తీ చేయని 30 ఓపెన్ పొజిషన్‌లను కూడా గుర్తించిందని చెప్పారు.

New Zealand PM: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్‌, కరోనా కట్టడిలో కీలకంగా వ్యవహరించిన క్రిస్, అక్టోబర్‌ వరకు పదవిలో కొనసాగనున్న కొత్త పీఎం

VNS

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్‌కిన్స్ (Chris Hipkins) ఎన్నికయ్యారు. దేశ 41వ ప్రధానిగా క్రిస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. లేబర్ పార్టీ తరఫున ప్రధాని పదవికి క్రిస్ (Chris Hipkins) ఒక్కడే పోటీ పడగా, పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంది. 44 ఏళ్ల క్రిస్ గతంలో కోవిడ్ నియంత్రణ విభాగాన్ని పర్యవేక్షించడంతోపాటు, పోలీస్ మినిస్టర్‌గా కూడా పని చేశారు.

Sues to Twitter: మరో చిక్కుల్లో ట్విట్టర్, ఆఫీసుల అద్దె కట్టలేదని ఎలాన్‌ మస్క్‌ కు నోటీసులు, రెండు నెలలుగా రెంట్‌ కట్టకపోవడంతో కోర్టులో దావా వేసిన భవన యజమానులు

VNS

ప్రముఖ మైక్రో బ్లాంగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ కారణంగా కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. యూకే, అమెరికాలోని ట్విట్టర్‌ కార్యాలయాలకు అద్దె చెల్లించడంలో ప్రపంచ కుబేరుడు విఫలమయ్యాడు. ఈ క్రమంలో యూఎస్‌లోని శాన్‌ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి ట్విట్టర్‌ దాదాపు 3.42 మిలియన్ల అద్దెను చెల్లించాల్సి ఉంది.

Cough Syrup Deaths Row: దగ్గు మందు కారణంగా 300 మంది చిన్నారులు మృతి, దగ్గు మందులో విషపూరిత రసాయనాలు కారణం, ఆ మందులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన WHO

Hazarath Reddy

ఇటీవలికాలంలో దగ్గు మందు కారణంగా చాలా మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇండోనేషియా, ఉబ్జెకిస్తాన్‌లో ఐదేళ్లపు చిన్నారులు దాదాపు 300 మందికిపైగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Jeff Bezos to Sell Washington Post?: వాషింగ్టన్ పోస్ట్‌ న్యూస్ పేపర్ అమ్మకానికి పెట్టినట్లుగా వార్తలు, అంతా పుకారేనని ఖండించిన బెజోస్ అధికార ప్రతినిధి

Hazarath Reddy

అయితే ఈ వార్తలను బెజోస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. వాషింగ్టన్ పోస్ట్‌ను అమ్మడం లేదని తెలిపారు.వాషింగ్టన్‌ పోస్ట్‌ను బెజోస్‌ 2013లో 250 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు సొంతం చేసుకున్నారు.

Des Moines Shooting: అమెరికా స్కూల్లో విద్యార్థులపై కాల్పులు, ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి, మృత్యువుతో పోరాడుతున్న మరో టీచర్

Hazarath Reddy

అమెరికాలో మరో తుపాకీ దాడి. లాస్ ఏంజిల్స్‌లో కాల్పులు జరిగిన మూడు రోజుల తర్వాత, దేశం మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లింది.డెస్ మోయిన్స్ పాఠశాలలో విద్యా కార్యక్రమంలో సోమవారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థుల చనిపోగా ఓ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి.

US Mass Shooting: కాల్పుల మోతతో మళ్లీ దద్దరిల్లిన అమెరికా కాలిఫోర్నియా, విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు, ఏడుగురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

అమెరికా కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోతమోగింది. సోమవారం రెండు వేరు చోట్ల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాన్ మటేవో కౌంటీలోని హాల్ఫ్ మూన్‌ బే ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి.

World Migration Report 2022: విదేశాలకు వెళుతున్న వారిలో మనమే టాప్, భారత్‌ను వదిలిన 1.80 కోట్ల మంది, పొట్టకూటి కోసం ఎడారి దేశానికే ఎక్కువగా వలసలు, ప్రపంచ వలస నివేదిక 2022లో సంచలన విషయాలు

Hazarath Reddy

విదేశాలకు వలసబాటపడుతున్న వారిలో ప్రపంచంలోనే భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారని World Migration Report 2022 వెల్లడించింది. విద్య, ఉపాధి అవకాశాల కోసం అత్యధికంగా భారతీయులు (India tops list of countries) విదేశాలకు వెళుతున్నారని నివేదిక తెలిపింది

Advertisement

Pakistan Power Outage Memes: పాకిస్తాన్‌లో నిలిచి పోయిన విద్యుత్ సరఫరా, ట్విట్టర్లో పేలుతున్న జోకులు, వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే..

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పలు నగరాల్లో సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి కరెంటు సరఫరా ఆగిపోయింది. పాకిస్తాన్ మీడియా సంస్ధలు ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత ఆ దేశ విద్యుత్ శాఖ కూడా ట్వీట్ చేసింది.

Ludo Game Affair: లూడో గేమ్ ఆడుతూ ఇండియా అబ్బాయితో ప్రేమలో పడిన పాక్ యువతి, పెళ్లి చేసుకుని బెంగుళూరులో కాపురం, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఓ విచిత్రమైన ఘటనలో ఓ పాకిస్థానీ యువతి ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. నివేదికల ప్రకారం, అమ్మాయి సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి తన ప్రియుడిని కలవడానికి నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చింది.

Spotify Layoffs: స్ఫోటి ఫై లో ఉద్యోగాల కోత.. ఈ వారంలోనే!

Rudra

ఆర్ధిక మాంద్యం భయం, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా మరో టెక్ కంపెనీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నది. స్వీడన్ కు చెందిన టెక్ సంస్థ స్ఫోటి ఫై ఈ వారంలో లే ఆప్స్ కు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం.

Major Power Breakdown In Pakistan: పాకిస్థాన్ కు కరెంట్ కష్టాలు.. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలో గత కొన్ని గంటలుగా విద్యుత్తు సరఫరా కట్

Rudra

ఆహార, ఆర్ధిక సంక్షోభంతో సతమతం అవుతున్న పాకిస్థాన్ ను కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్, కరాచీలో గత కొన్ని గంటలుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Corona In China: చైనాలో కొనసాగుతున్న కరోనా బీభత్సం.. ఇప్పటికే 80 శాతం జనాభాకు వైరస్... వారం రోజుల్లో 13 వేల మరణాలు

Rudra

చైనాలో కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 విజృంభణ కొనసాగుతోంది. ఇటీవల లాక్ డౌన్లు ఎత్తివేయడంతో అత్యధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ రేటు నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు. గడచిన వారం రోజుల్లో చైనాలో 13 వేల మంది కరోనాతో మృత్యువాత పడినట్టు వెల్లడైంది.

China Covid Deaths: చైనాలో కరోనా మరణ మృదగం, ప్రతిరోజు లక్షల్లో కరోనా కేసులు, గడిచిన వారంలో 13వేల మంది మరణించినట్లు వార్తలు

VNS

ఈ ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఆ దేశంలో మొత్తం 13 వేల మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి బారినపడి గడిచిన వారంలో 13 వేల మంది మరణించారని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్‌ (CDC) తన అధికారిక ప్రకటనలో పేర్కొన్న

Bilimoria Praises Modi: భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ.. బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంస (వీడియోతో)

Rudra

భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ అని బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంసించారు. చిన్నతనంలో చాయ్ అమ్మిన పిల్లాడు నేడు భారత ప్రధానియై భూమిపై అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారని కీర్తించారు.

Colombia: 24 రోజుల పాటూ సముద్రంలోనే చిక్కుకున్న వ్యక్తి, ఒక్క బాటిల్ కెచప్, మ్యాగీ మాత్రమే ఆహారం, చివరికి ఎలా బయటపడ్డాడంటే?

VNS

ద్వీపదేశం డొమినికాకు (Dominica) చెందిన ఎల్విస్‌ ఫ్రాంకోయిస్‌ (Elvis Francois) గత డిసెంబర్‌లో తన పడవకు రిపేర్‌ చేస్తుండగా అలల ధాటికి పడవ సముద్రంలోకి కొట్టుకుపోయింది. తర్వాత అక్కడి నుంచి ఒడ్డుకు చేరేందుకు అతను ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దాంతో ఎవరైనా కాపాడకపోతారా అని ఎదురుచూస్తూ ఏకంగా 24 రోజులపాటు ఆయన సముద్రంలో గడపాల్సి వచ్చింది.

Advertisement
Advertisement