ప్రపంచం

US Visa Policy Update: అక్రమ పౌరసత్వం పొందకుండా యూఎస్ ప్రెసిడెంట్ కఠిన చర్యలు, 'బర్త్ టూరిజం' పేరుతో అమెరికాకు వచ్చే గర్భినీ స్త్రీలపై ఆంక్షలు విధించిన వైట్ హౌజ్

Vikas Manda

విదేశీయులు "అమెరికన్ గడ్డపై జన్మనివ్వడం ద్వారా తమ పిల్లలకు సాధారణంగా మరియు శాశ్వత అమెరికన్ పౌరసత్వం పొందటానికి" ఆ వీసాలను ఉపయోగిస్తున్నారని వైట్ హౌజ్ ప్రతినిధులు పేర్కొన్నారు....

Novel Coronavirus Row: చైనాలో వేగంగా విస్తరిస్తున్న నోవెల్ కరోనా వైరస్, అప్రమత్తమైన భారత్, అన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రాయాలలో స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు

Vikas Manda

ఈ కరోన వైరస్ వ్యాధి లక్షణాలు గతంలో చైనా ద్వారా విస్తరించిన తీవ్రమైన శ్వాస సంబంధ ఇబ్బందులు కలిగిచే 'సార్స్' లక్షణాలకు దగ్గరగా ఉంది. 2000 ఏడాది ప్రారంభంలో సార్స్ వైరస్ విస్తరించి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మంది ప్రాణాలు కోల్పోయారు....

Rajinikanth On EV Ramasamy: సారీ చెప్పే ప్రసక్తే లేదు,ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలపై రజినీకాంత్ స్పందన, ఇవి పత్రికల్లో వచ్చిన వార్తలేనన్న దక్షిణాది సూపర్ స్టార్

Hazarath Reddy

ద్రవిడ పితామహుడు, సంఘ సంస్కర్త..పెరియార్ రామసామి‌పై(Periyar E. V. Ramasamy) తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణ చెప్పేది లేదని తలైవర్ రజనీ కాంత్(Superstar Rajinikanth) స్పష్టం చేశారు. నేను చేసిన వ్యాఖ్యలు నేను రాసుకున్నవి కాదని.... వాటిపై పత్రికల్లో కధనాలు కూడా వచ్చాయని, కావాలంటే వాటిని చూపిస్తానని ఆయన చెప్పారు. జనవరి 14 న జరిగిన తుగ్లక్ పత్రిక స్వర్ణోత్సవ సభలో పాల్గోన్నరజనీకాంత్ పెరియార్ రామసామిపై( Ramasamy) వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

Oxfam Report: 63 మంది భారతీయుల సంపద దేశ బడ్జెట్ కంటే ఎక్కువ, ఒకేడాదిలో దేశం మొత్తానికి సరిపోయే డబ్బు పిడికెడు మంది చేతిలోనే, ఆసక్తికర విషయాలను వెల్లడించిన 'ఆక్స్‌ఫాం' సర్వే

Vikas Manda

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఈ 1% సంపన్నులు పదేళ్ల పాటు తమ సంపదపై 0.5 % అదనపు పన్ను చెల్లిస్తే ఒక్క సంక్షేమ రంగంలోనే 117 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించవచ్చు. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆ రిపోర్ట్ సూచనలు చేసింది.....

Advertisement

Shirdi Bandh: షిర్డీ బంద్, సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలకు నిరసనగా బంద్ ప్రకటించిన షిర్డీ గ్రామస్తులు, ఆలయం తెరిచే ఉంటుందన్న ట్రస్ట్, పత్రిలో కూడా బంద్ ప్రకటించిన పత్రి కృతి సమితి, రాజకీయ వివాదంగా మారుతున్న సాయి జన్మస్థల అంశం

Hazarath Reddy

సీఎం ఉద్దశ్ థాకరే వ్యాఖ్యలతో మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థలంపై వివాదం(Sai Baba Birthplace Row) ముదురుతోంది. పత్రిని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ.. 2020, జనవరి 19వ తేదీ ఆదివారం బంద్(Shirdi Bandh) పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. అయితే బాబా ఆలయం(Sai Baba,Sai Baba temple) మాత్రం..తెరిచే ఉంటుందని, యదావిధిగా దర్శనాలు కొనసాగుతాయని సాయి బాబా సంస్థాన్ ట్రస్టు(Shirdi Sai Baba Temple Trust) వెల్లడించింది.

Novel Corona Virus: చైనా నుంచి మరో ప్రమాదకరమైన వైరస్, ఆ దేశానికి వెళ్లవద్దని కేంద్రం హెచ్చరిక, ఇప్పటికే చైనాలో 41 మందికి సోకిన వైరస్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

చైనా ( China) పర్యటనకు వెళ్లే భారతీయులకు(Indians) కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశంలో ఇప్పుడు కొత్త వైరస్ (New virus) ఒకటి వ్యాప్తి చెందుతోందని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వీలయితే ఆ దేశ పర్యటన రద్దు చేసుకోవాలని కోరింది. ఇప్పుడు చైనాలో ప్రమాదకర ‘నావల్‌ కరొనా’ వైరస్‌ (novel corona virus) వ్యాప్తి చెందుతోంది.

Major Terror Attack Averted: భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు, జైషే మహ్మద్‌ ఉగ్రవాద మూక అరెస్ట్, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం,వెల్లడించిన జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌

Hazarath Reddy

దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు జరిపిన కుట్రలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు( Jammu & Kashmir Cops) భగ్నం చేశారు. రిపబ్లిక్ డేకి (Republic Day 2020)ముందు భారీ పేలుళ్లు జరపాలని జైషే మహ్మద్‌ ఉగ్రవాద (Jaish-e-Mohammed)మూకలు చేసిన ప్రయత్నాలను పోలీసులు తిప్పి కొట్టారు.

India to Invite Pakistan: భారత్ రానున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్? ఆహ్వానించనున్న భారత ప్రభుత్వం, ఎస్‌సీఓ సదస్సు కోసం సభ్యులందరికీ ఆహ్వానం పంపుతున్నట్లు ధృవీకరించిన భారత విదేశాంగ శాఖ

Vikas Manda

గతేడాది జూన్‌లో కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్‌కేక్‌లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు, ఈ సమయంలో....

Advertisement

US-China Trade Deal: అమెరికా -చైనాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం, రెండేళ్ల వాణిజ్య యుద్ధానికి ముగింపు అని పేర్కొన్న యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Vikas Manda

యూఎస్- చైనా తాజా ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి చైనాకు వ్యవసాయ, పారిశ్రామిక ఎగుమతులు పెరగనున్నాయి. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ ఒప్పందంలో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం...

Russian Government Resigns: రష్యా ప్రధానమంత్రి సహా, మంత్రివర్గం మొత్తం రాజీనామా, ప్రభుత్వ రద్దును ఆమోదించిన అధ్యక్షుడు పుతిన్, 'రాజకీయ' పరమైన రాజ్యాంగ సంస్కరణలే కారణమని వెల్లడించిన రష్యన్ మీడియా

Vikas Manda

2012 నుంచి నేటి వరకు డిమిత్రి మెడ్వెడెవ్ ప్రధానమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అంతేకాకుండా మెడ్వెడెవ్ మరియు పుతిన్ ల మధ్య ఎన్నో ఏళ్లుగా మిత్రుత్వం ఉంది. రష్యన్ మీడియా కథనాల ప్రకారం.. 2024లో అధ్యక్షుడు పుతిన్ పదవీకాలం ముగియనుంది.....

Delhi Assembly Elections 2020: ప్రతిపక్షాలకు షాకిచ్చిన అరవింద్ కేజ్రీవాల్, 70 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల ఎంపిక, 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు లిస్ట్ నుంచి అవుట్, 8 మంది మహిళలకు అవకాశం

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం ఉదయం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ(Aam Aadmi Party)) విడుదల చేసింది.

Kaifi Azmi: 20వ శతాబ్దపు ప్రఖ్యాత భారతదేశపు కవి, 11 ఏళ్లకే ఘజల్ రాసిన కైఫి అజ్మీ, ప్రేమ కవిత్వం నుంచి అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఆయన కవిత్వం, కైఫి అజ్మీ 101వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

Hazarath Reddy

20వ శతాబ్దపు భారతదేశపు ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ(Kaifi Azmi) 101వ పుట్టిన రోజు సంధర్భంగా(101st Birth Anniversary) గూగుల్ తన పేజిపై డూడుల్(Google Doodle) ను అంకితమిచ్చింది. ఈ డూడుల్ ద్వారా గొప్ప భారతీయ ఉర్దూ కవి మరియు గేయ రచయిత కైఫీ అజ్మీకి ఘనంగా నివాళి అర్పించింది. ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ 14 జనవరి 1919 న ఉత్తర ప్రదేశ్ లోని అజమ్‌ఘర్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించారు.

Advertisement

Pakistan BAT: క్రూరమైన చర్యకు పాల్పడిన పాక్, ఇద్దరు పోర్టర్లను చంపి ఒకరి తలను తీసుకెళ్లిన దాయాది దేశం, విచక్షణా రహితంగా మోర్టార్లను ప్రయోగించిన పాకిస్తాన్, సరైన సమయంలో స్పందిస్తామని పాక్‌ను హెచ్చరించిన ఆర్మీ చీఫ్ నరవణే

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి తన దుర్మార్గపు నిజ స్వరూపాన్ని చాటుకుంది. పాక్‌ సైన్యానికి చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం(బీఏటీ)(Pak Border Action Team) అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడింది. భారత సైన్యానికి సామగ్రిని సరఫరా చేసే ఇద్దరు పోర్టర్లను(Indian Porters) చంపి ఒకరి తలను నరికి తమ వెంట తీసుకెళ్లింది. గతంలో భారత జవాన్ల (Indian army) తలు నరికిన ఘటనలు ఉన్నప్పటికీ, ఇలా పౌరుని తలను మాయం చేయడం ఇదే మొదటిసారని సైన్యం పేర్కొంది.

China Gigantic Telescope: గ్రహాంతరవాసుల గుట్టు చైనా చేతిలో, అతిపెద్ద టెలిస్కోప్‌ను ప్రారంభించిన చైనా, 30 ఫుట్‌బాల్‌ మైదానాలంత వైశాల్యంలో నిర్మాణం, ప్రారంభమైన కార్యకలాపాలు

Hazarath Reddy

హాంతరవాసుల జాడను కనుగునేందుకు చైనా ఎప్పటినుంచో కొత్త టెక్నాలజీని(New Technology) రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖగోళ రహాస్యాన్ని కనిపెట్టేందుకు చైనా అతిపెద్ద టెలిస్కోప్ (China Gigantic Telescope)లాంచ్ చేసింది. ఇది చైనా అభివృద్ధిచేసిన ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌. పేరు ఫాస్ట్‌(ఫైవ్‌ హండ్రెడ్‌ మీటర్‌ అపెర్చ్యూర్‌ స్పెరికల్‌ రేడియో టెలిస్కోప్‌).

Vijay Sai Reddy Letter: చంద్రబాబుకు బిగిస్తున్న ఉచ్చు, వైసీపీ ఎంపీ లేఖపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖకు సూచన

Hazarath Reddy

ఏపీకి సంబంధం లేని వ్యక్తిని హైదరాబాద్‌ సీబీఐ జేడీగా (CBI JD) నియమించాలంటూ వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాసిన లేఖపై(Vijay Sai Reddy Letter) కేంద్రహోంమంత్రి అమిత్‌షాకు లెటర్ రాసిన సంగతి విదితమే.. అయితే ఈ లేఖపై అమిత్ షా(Union Home Minister Amit Shah) స్పందించారు. ఆయన లేఖకు జవాబు ఇచ్చారు.

Dr Syama Prasad Mookerjee Port: కోలకతా పోర్టు ఇకపై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు, పేరు మార్చిన ప్రధాని, పౌరసత్వంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి, అది ఇచ్చేదే కాని రద్దు చేసేది కాదు, కోల్‌కతాలో ప్రధాని స్పీచ్ హైలెట్స్..

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో(West Bengal) ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. కోల్‌కత నౌకాశ్రయానికి (Kolkata Port) భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ(Syama Prasad Mookerjee Port) పేరు పెడుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. నేతాజీ స్టేడియంలో జరిగిన కోల్‌కత నౌకాశ్రయ ట్రస్ట్ 150వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు.

Advertisement

Ukrainian Aircraft Crash: ఉక్రెయిన్ విమానం కూల్చివేత, మానవ తప్పిదమే కారణమన్న ఇరాన్, భారీ నష్టపరిహారం చెల్లించాలని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు, అధికారికంగా ఇరాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

Hazarath Reddy

ఉక్రెయిన్ విమానాన్ని(Ukrainian aeroplane) కూల్చివేయడంపై ఇరాన్ (Iran) కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో పొరపాటను అంగీకరించింది. ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహానీ ( Iranian President Hassan Rouhani ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షమించరాని తప్పు జరిగిందని, ఈ కారణంగా 176 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. దీనిపై తాము ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

M M Navarane: పార్లమెంట్ ఓకే అంటే పీఓకే మనదే, ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే కీలక వ్యాఖ్యలు, చొరబాట్లను అడ్డుకోవడమే భారత సైనికుల ముందున్న తక్షణ కర్తవ్యమన్న ఆర్మీ చీఫ్

Hazarath Reddy

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)పై (Pakistan Occupied Kashmir (PoK))నూతన ఆర్మీ జనరల్‌ ఎమ్‌ ఎమ్ నరవణే (Indian Army Chief Manoj Mukund Naravane)కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకె భారత్‌కే చెందాలని పార్లమెంట్ భావిస్తే.. దానికి అనుగుణంగా ఆర్మీ యాక్షన్ ఉంటుందని వ్యాఖ్యానించారు. పైనుంచి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకోవడానికి సిద్దమని తెలిపారు.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది సజీవదహనం..,మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం, కొనసాగుతున్న సహాయక చర్యలు, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh)ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ బస్సు.. ట్రక్కును ఢీకొనడంతో (Truck, bus catch fire) మంటలు చెలరేగి, 20 మందికిపైగా ప్రయాణికులు చనిపోయారు. కన్నౌజ్‌ జిల్లాలోని (Kannauj)చిబ్రమౌ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు, డీజిల్‌ ట్యాంకర్‌ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో దాదాపు 20 మంది సజీవదహనమైనట్లు తెలుస్తోంది.

Supreme Court: జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ బంద్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆంక్షలు సరికాదు, భావ ప్రకటనా స్వేచ్ఛని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు, అన్ని ఆంక్షలను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌లో (Jammu and Kashmir) కొద్ది రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court )కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకశ్మీర్‌లో విధించిన ఆంక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. వారం రోజుల్లో కశ్మీర్‌లోని అన్ని ఆంక్షలను సమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్‌పై (Internet) అపరిమిత ఆంక్షలు సరికాదని, ఆంక్షలకు సంబంధించిన ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

Advertisement
Advertisement