ప్రపంచం

Maharashtra Battle: సుప్రీంకోర్టుకు చేరిన 'మహా' రాజకీయం, ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌, దాఖలు చేసిన మహారాష్ట్ర వికాస అఘాడి కూటమి, గవర్నర్ నిర్ణయంపై ఆగ్రహం

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరాయి. దేవేంద్ర ఫడ్నవిస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రి(Devendra Fadnavis and Ajit Pawar)గా ఏర్పడిన ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ శనివారం సాయంత్రం సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాయి.

Who Is Ajit Pawar: అజిత్ పవార్ ఎవరు? అతని ప్రస్థానం ఏంటీ? అతనిపై ఉన్న ఆరోపణలు,కేసులు ఏంటీ? మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన అజిత్ పవార్ గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

అజిత్ పవార్ (Ajit Pawar).. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఎన్సీపీ (NCP), కాంగ్రెస్ (COngress) పార్టీలకు షాకిస్తూ బీజేపీ(BJP)ని అధికారం పీఠంపై కూర్చోబెట్టిన 60 ఏళ్ల అజిత్ పవార్ ఎన్సీపీ నేత, శరద్ పవార్ (Sharad Pawar) అన్న కుమారుడు. ట్విస్టుల మధ్య సాగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) కీ రోల్ పోషించి బీజేపీకి అధికారాన్ని అందించాడు. తమ అధినేత శరద్ పవార్‌ను ధిక్కరించి బీజేపీకి జై అన్నాడు.

‘Modi Hai Toh Mumkin Hai’: మోడీ ఉంటే అన్నీ సాధ్యమే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆసక్తికర వ్యాఖ్యలు, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

Hazarath Reddy

మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో అనూహ్య ట్విస్టుల మధ్య రాత్రికి రాత్రే సీఎంగా రెండవసారి ప్రమాణం స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా ముందుకు వచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం ఫడ్నవిస్ ( Maharashtra CM Devendra Fadnavis) ధన్యవాదాలు తెలిపారు.

Thought Modi Was Giving Money: ప్రధాని మోడీ డబ్బులు వేస్తున్నారని తీసుకున్నా, నాకు ఇంకేం తెలియదు, అమాయకంగా సమాధానం ఇచ్చిన అకౌంట్ హోల్డర్, మిస్టరీ డిపాజిట్లపై తలపట్టుకున్న ఎస్‌‌బీఐ అధికారులు

Hazarath Reddy

దేశంలోని అతి పెద్ద జాతీయ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరోసారి డొల్లతనం బయటపడింది. బ్యాంకు సిబ్బంది చేసిన పొరపాటుకు ఖాతాదారుడు రూ. 89 వేల వరకు లాస్ అయ్యాడు. ఆలస్యం చేయకుండా వివరాల్లోకెళితే మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా(Madhya Pradesh’ Bhind district)లో గల స్టేట్ బ్యాంకులో ఇద్దరు వ్యక్తులు అకౌంట్ ఓపెన్ చేశారు.

Advertisement

Sanjay Raut Intersting Comments: అజిత్ పవార్ మళ్లీ తిరిగివస్తాడు, జైలుకు వెళతాననే భయంతోనే బీజేపీకి మద్ధతు ఇచ్చాడు, అతని వెంట 8 మంది ఎమ్మెల్యేలు వెళితే 5 మంది తిరిగివచ్చారు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

మహారాష్ట్ర(Maharashtra )లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలో అధికార ఏర్పాటు మేమే చేస్తామని ఆదినుంచి చెబుతూ వస్తున్న సంజయ్ రౌత్ (Sanjay Raut) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడి అజిత్ పవార్ (Ajit Pawar feared going to jail) బీజేపీకి మద్దతు ఇచ్చాడన్నారు.

NCP MP Supriya Sule: పార్టీతో పాటు, కుటుంబంలోనూ చీలిక వచ్చింది, శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలె ఆసక్తికర వ్యాఖ్యలు, ప్రతి ఎన్సీపీ కార్యకర్త పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలె (NCP's Supriya Sule) తన వాట్సాప్ స్టేటస్ (WhatsApp Status)లో ఓ ఆసక్తికర విషయాన్ని పేర్కొన్నారు. 'పార్టీతో పాటు కుటుంబంలోనూ చీలిక వచ్చింది'(Party And Family Split) అని అన్నారు. ఈ వాట్సప్ స్టేటస్ ఆమెదేనని ఆమె కార్యాలయ సిబ్బంది కూడా నిర్ధారించారు.

NCP Chief Sharad Pawar: అజిత్ వెంట 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారు, బల నిరూపణలో బీజేపీ ఓడిపోతుంది, బల నిరూపణ తరువాత మూడు పార్టీలు కలిసి అధికారం ఏర్పాటు చేస్తాయి, మీడియా సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడి

Hazarath Reddy

మహా రాజకీయాలు ఇప్పుడు వాడీ వేడిగా సాగుతున్నాయి. తమ పార్టీకి ఎన్సీపీ నుంచి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇందుకు సంబంధించిన లేఖను ఆ పార్టీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఇచ్చారని బీజేపీ నేతలు చెబుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Nationalist Congress Party (NCP) chief Sharad Pawar) వివరణ ఇచ్చారు.

Maharashtra Assembly Floor Test: సీఎం తంతు పూర్తయింది, బల నిరూపణే మిగిలి ఉంది, సీఎం ఫడ్నవిస్ బలనిరూపణలో నెగ్గుతారా, శివసేన, ఎన్సీపీ వ్యూహ రచన ఎలా ఉండబోతోంది ?

Hazarath Reddy

అనుకోని మలుపులతో సాగుతూ వచ్చిన మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలకు బీజేపీ శుభం కార్డు వేసింది. రాత్రికి రాత్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ (Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మద్దతు ప్రకటించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, కాంగ్రెస్‌ నేతలతో పాటు శరద్‌ పవార్‌కు ఊహించిన షాక్‌ ఇచ్చిన అజిత్‌ పవార్ (NCP's Ajit Pawar) డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

Advertisement

Sanjay Raut Criticizes Ajit Pawar: అజిత్ పవార్‌ది వెన్నుపోటు, మా కళ్లలోకి కళ్లు పెట్టి చూడటానికి భయపడ్డాడు, తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు, మహా ట్విస్టుపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Hazarath Reddy

గత కొంతకాలంలో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మహా సీఎం రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో ముగిసాయి. రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం (Devendra Fadnavis was sworn in as Maharashtra chief minister )చేశారు. దీంతో శివసేన ఒక్కసారిగా షాక్ కు గురయింది. మహారాష్ట్ర సీఎం అంశం మీద ఆది నుంచి మీడియాకు ఎప్పటికప్పుడు ట్విస్టులు ఇస్తూ వచ్చిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay raut)ఈ విషయం మీద స్పందించారు.

Fadnavis Takes Oath As 'MAHA' CM: రాత్రికి రాత్రే మారిన మహా రాజకీయాలు, మరోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Hazarath Reddy

గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా మారిన మహారాష్ట్ర రాజకీయాలకు ఎండింగ్ కార్డు పడింది. అక్కడ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాత్రికి రాత్రే పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ నుంచి విబేధాలతో బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న శివసేనకు ఎన్సీపీ భారీ షాకిచ్చింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో జట్టు కట్టిన బీజేపీ ఆగమేఘాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Suspense Continues Over 'MAHA' CM: అయిదేళ్లు శివసేన నుంచే మహారాష్ట్ర సీఎం, రేసులో ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, అరవింద్‌ సావంత్‌, చర్చల అనంతరం సీఎంపై కీలక ప్రకటన,వెల్లడించిన సంజయ్ రౌత్

Hazarath Reddy

మహారాష్ట్ర (Maharashtra)లో దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు నేటితో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం చేజిక్కుంచుకునే దిశగా శివసేన(Shivsena), ఎన్సీపీ(NCP), కాంగ్రెస్‌ (Congress) చేసిన ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి.

Indian Army Daring Operation: ఇండియన్ ఆర్మీ సాహసోపేత ఆపరేషన్, సిలిండర్ ఆకారంలో ఉన్న ఐఈడి బాంబులను నిర్వీర్యం చేసిన ఆర్మీ టీమ్, అవి పేలితే భారీ నష్టమే..

Hazarath Reddy

ఇండియన్ ఆర్మీ డేరింగ్ ఆపరేషన్ (Indian Army Daring Operation) చేపట్టింది. భార‌త ఆర్మీకి చెందిన బాంబు డిస్పోజ‌ల్ స్క్వాడ్ రెండు భారీ ఐఈడీ బాంబుల‌( Improvised Explosive Device)ను నిర్వీర్యం చేసింది. జ‌మ్మూక‌శ్మీర్‌(Jammu and Kashmir)లోని కుద్వానీ బ్రిడ్జ్ వ‌ద్ద భారత ఆర్మీ ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. సిలిండ‌ర్ ఆకారంలో ఉన్న రెండు ఐఈడీ బాంబు బాక్సుల‌ను తొవ్వి తీసి.. వాటిని విజ‌య‌వంతంగా నిర్వీర్యం చేశారు.

Advertisement

Pink Ball Test Day-Night: ఈడెన్ గార్డెన్స్‌లో విరబూసిన గులాబీ, భారత క్రికెట్‌లో చారిత్రాత్మక ఘట్టం, తొలిసారి డే-నైట్ టెస్టుకు వేదికైన కోల్‌కతా, ప్రేక్షకులతో పూర్తిగా నిండిపోయిన స్టేడియం

Vikas Manda

ఈ మ్యాచ్ పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నట్లు తెలిపాడు. "ఈడెన్ గార్డెన్స్ లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా అది చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా సాగుతుంది. ఈరోజు భారత క్రికెట్ లో ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రేక్షకులతో నిండిన స్టేడియంలో పింక్ బాల్ తో టెస్ట్ మ్యాచ్ ఆడటం....

Tomato price In Pakistan: పాకిస్తాన్‌లో టమోటా ధర కిలో రూ. 400, రూ.100కు నాలుగు టమోటాలు,లబోదిబోమంటున్న పాక్ ప్రజలు,ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న దాయాది దేశం

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్థాన్‌(Pakistan)లో టమాట ధరలు (Tomato Price In Pak) ఆకాశాన్నంటుతున్నాయి. ఎన్నడూలేని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా కరాచీ (Karachi) నగరంలో బుధవారం కిలో టమాట ధర రూ.400 పలికింది. కొన్ని ప్రధాన మార్కెట్లలో కిలో దాదాపు రూ. 350 నుంచి రూ. 380 మధ్యలో పలికింది.

Rajinikanth Intersting Comments: 2021లో తమిళ ప్రజలు అద్భుతాన్ని సృష్టించబోతున్నారు, కమల్‌తో పొత్తుపై మాటను దాటవేసిన తలైవార్, ఆ అధ్భుతం మళ్లీ మేము అధికారంలోకి రావడమేనన్న తమిళనాడు సీఎం పళని స్వామి

Hazarath Reddy

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)ఈ మధ్య రాజకీయాల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మొన్న బీజేపీ మీద విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరోమారు రాజకీయాలపై తన మనసులోని మాటను బయటపెట్టారు.

Maharashtra Vikas Aghadi: 'మహా'లో మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడి కూటమి, అధికార ఏర్పాటుకు తెరుచుకున్న దారులు, పదవుల పంపకాలపై ఇంకా రాని స్పష్టత

Hazarath Reddy

మహారాష్ట్రలో అధికార ఏర్పాటు(Maharashtra government formation)కు తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌(Shiv Sena, NCP and Congres) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుదిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో నాలుగైదు రోజుల్లో కొత్త సర్కారు కొలువుదీరే అవకాశం ఉన్నది.

Advertisement

FIR Filed Against Nithyananda: నిత్యానందపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, చిన్నారులను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్, నేపాల్‌లో తల‌దాచుకున్న నిత్యానంద

Hazarath Reddy

స్వామి నిత్యానందపై గుజరాత్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు (FIR filed Against Nithyananda) చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని తమ ఆశ్రమంలో​ నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానంద(Self-Styled Godman Nithyananda)పై కేసు నమోదు చేశారు.

Andhra Techie In Pakistan Case: 'పాకిస్థాన్ చేసిన అరెస్ట్ ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, రెండేళ్ల క్రితమే భారత పౌరుల మిస్సింగ్ గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చాం'! కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని భారత్ డిమాండ్

Vikas Manda

2016-17 మధ్యకాలంలో ఆ ఇద్దరు అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించారని రవీష్ కుమారు తెలిపారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని అందించాము అయితే పాకిస్థాన్ ....

Political Map of India: భారతదేశ నూతన చిత్రపటం చూశారా? ఇక మీదట ఈ సరికొత్త రాజకీయ చిత్రపటాన్నే ఉపయోగించాలని అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Vikas Manda

ఈ నూతన చిత్ర పటంలో లద్దాఖ్ యూటీ కార్గిల్ మరియు లేహ్ రెండు జిల్లాలను కలిగి ఉంది. ఇక మిగతా భాగం జమ్మూ కాశ్మీర్ యొక్క పూర్వ రాష్ట్రం లాగే ఉంచబడింది....

Aadhaar Linking To Social Media: సోషల్ మీడియాకు ఆధార్ లింక్ అనుసంధానించే ఆలోచనేది లేదు, పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడి

Hazarath Reddy

గత కొంత కాలంగా సోషల్ మీడియాకు ఆధార్ అనుసంధానం(Aadhaar Linking To Social Media) ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం (Central government) అధికారికంగా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union Minister Ravi Shankar Prasad) దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ( no plans to link Aadhaar with social media account) ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement