World

Warren Buffett on AI: ఏ టెక్నాలజీ మానవ మేధస్సు కంటే మెరుగ్గా ఆలోచించలేదు, అపర కుబేరుడు వారెన్ బఫెట్ కీలక వ్యాఖ్యలు, ఏఐని సృష్టించడం అంటే అణుబాంబును తయారు చేయడమేనని వెల్లడి

Hazarath Reddy

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌జీపీటీ వినియోగంపై ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐని సృష్టించడం అంటే అణు బాంబును తయారు చేయడంతో సమానమన్నారు. ఈ వ్యాఖ్యలతో కృత్తిమ మేధస్సు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రముఖుల్లో వారెన్‌ బఫెట్‌ చేరిపోయారు.

PIA Plane Crosses Into Indian Airspace: భారత గగనతలంలోకి పాక్ విమానం, 10 నిమిషాల పాటు ప్రయాణించి 141 కిలోమీటర్లు చక్కర్లు, అలర్ట్ అయిన ఏవియేషన్ అధికారులు

Hazarath Reddy

పాకిస్తాన్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ) విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఈ విమానం భారత్‌లో దాదాపు 10 నిమిషాల పాటు ప్రయాణించి 141 కిలోమీటర్లు చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది.పీకే248 అనే పీఐఏ విమానం మస్కట్‌ నుంచి తిరిగి పాకిస్తాన్‌కు మే4న రాత్రి 8 గంటల సమయంలో చేరుకుంది.

US Mass Shooting Incident: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. నిందితుడు సహా 9 మంది దుర్మరణం.. కనిపించిన వారిపై తుపాకీతో కాల్పుల జరిపిన నిందితుడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం

Rudra

అమెరికాలో తుపాకీ సంస్కృతి వెర్రితలలకు పోతున్నది. కాల్పులతో అగ్రరాజ్యం మరోసారి కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్రంలో ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌ సమీపంలో శనివారం ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అమాయకులు మరణించగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు.

Apple Wont Fire Employees: ఆర్ధికమాంధ్యం వేళ ఆపిల్‌ కంపెనీ గుడ్‌న్యూస్, తమ ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదన్న టిమ్‌ కుక్, తప్పనిసరి అయితేనే లే ఆఫ్స్‌

VNS

ఆపిల్ కంపెనీలో తమ ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) క్లారిటీ ఇచ్చారు. అలాంటిదే జరిగితే మాత్రం.. ఆపిల్ కంపెనీలో భారీ తొలగింపులు అనేది చివరి ప్రయత్నంగా ఉంటాయని సీఈఓ కుక్ స్పష్టం చేశారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాట్లాడుతూ.. కంపెనీలో భారీ తొలగింపులను ‘చివరి ప్రయత్నం’గా మాత్రమే పరిగణిస్తుందని చెప్పారు.

Advertisement

Pak Decides To Release 600 Indian Fishermen: భారత్ లో భుట్టో పర్యటన.. 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించిన పాక్

Rudra

భారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని పాక్ నిర్ణయించింది.

Hindu Temple Vandalised in Australia: ఆస్ట్రేలియాలో మళ్లీ హిందూ దేవాలయంపై దాడి, సిడ్నీలో స్వామినారాయణ మందిర్‌ని ధ్వంసం చేసిన ఖలిస్తానీయులు

Hazarath Reddy

సిడ్నీలోని ప్రముఖ హిందూ దేవాలయాన్ని ఖలిస్థానీ అనుకూల శక్తులు శుక్రవారం నాడు గోడలపై భారతదేశ వ్యతిరేక గ్రాఫిటీలతో ధ్వంసం చేశాయని ఆరోపిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై తాజా విధ్వంసం ఘటన జరిగింది.

Bishop Fox Layoffs: దూసుకువస్తున్న ఆర్థిక మాద్యం, ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న కంపెనీలు, తాజాగా 13 శాతం మందిని తీసేసిన బిషప్ ఫాక్స్

Hazarath Reddy

అమెరికాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ బిషప్ ఫాక్స్ 13 శాతం మంది ఉద్యోగులను లేదా దాదాపు 50 మంది ఉద్యోగులను తొలగించినట్లు మీడియా పేర్కొంది. కంపెనీ RSA సైబర్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పార్టీని నిర్వహించిన కొద్ది రోజులకే ఉద్యోగాల కోతలు వచ్చాయి, ఇక్కడ "సైబర్ సూప్" అని పిలువబడే బ్రాండెడ్ డ్రింక్స్ అందించినట్లు టెక్ క్రంచ్ నివేదించింది.

Shopify Layoffs: ఈ కామర్స్ రంగంలో ఆగని లేఆఫ్స్, 20 శాతం మంది ఉద్యోగలను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ షాపిఫై

Hazarath Reddy

ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ షాపిఫై తన ఉద్యోగులలో 20 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది, ఇది 2,000 మందికి పైగా ప్రభావితం చేస్తుంది. అమెరికా బహుళజాతి సంస్థ ఫ్లెక్స్‌పోర్ట్.. షాపిఫై లాజిస్టిక్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.ఈ నేపథ్యంలో ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని తెలిపింది.

Advertisement

Meesho Layoffs: ప్రతి కంపెనీ నుంచి రోడ్డుమీదకు వస్తున్న ఉద్యోగులు, తాజాగా రెండవసారి 251 మంది ఉద్యోగులను తొలగించిన మీషో

Hazarath Reddy

ఇకామర్స్ స్టార్టప్ మీషో ఖర్చుల ఒత్తిడి, లాభదాయకత కోసం రేసు కారణంగా 251 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగులకు CEO Vidit Aatrey పంపిన ఇమెయిల్ ప్రకారం, కంపెనీ " ఎక్కువ మందిని నియమించుకుని తప్పులు చేసిందని తెలిపింది. మీషో కూడా గత సంవత్సరం ఇదే సమయంలో 150 మంది కార్మికులను తొలగించింది

Earthquake in Japan: జపాన్‌లో భారీ భూకంపం, కుప్పకూలిన భవనాలు, 6.3 తీవ్రతతో సునామిలా విరుచుకుపడిన భూకంపం

Hazarath Reddy

సెంట్రల్ జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో శుక్రవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. సునామీ ముప్పు ఏమీ లేదని, అయితే సముద్ర మట్టంలో 20 సెం.మీ కంటే తక్కువ మార్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. ధ్వంసమైన భవనాల నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాయపడినట్లు తక్షణ నివేదికలు ఏమీ లేవు.

Serbia Shooting: క్లాసు రూంలో టీచర్లపై ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన విద్యార్థి, సెక్యురిటీ గార్డుతోపాటు ఎనిమిది మంది విద్యార్థులు మృతి

Hazarath Reddy

సెర్బియా దేశంలో ఓ పాఠశాలలో 14 ఏళ్ల విద్యార్థి తుపాకీతో వీరంగం సృష్టించాడు. తన టీచర్‌పై క్లాస్‌రూమ్‌లోనే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అంతేగాక మిగతా విద్యార్థులు, సెక్యూరిటీగార్డుపై ఇష్టారీతిగా కాల్పులకు తెగబడ్డాడు.

Volvo Cars Layoffs: ఆగని లేఆప్స్, 1300 మంది ఉద్యోగులను తీసేస్తున్న ప్రముఖ కార్ల దిగ్గజం వోల్వో, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Hazarath Reddy

వోల్వో కార్స్ స్వీడన్‌లో దాదాపు 1,300 మంది కార్యాలయ ఆధారిత ఉద్యోగులను తొలగించనుంది, ఎందుకంటే ఇది ఖర్చు తగ్గింపును వేగవంతం చేస్తుంది. CEO జిమ్ రోవాన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గత సంవత్సరం తీసుకున్న ఖర్చు తగ్గింపు చర్యలు ఫలితాలను చూపించడం ప్రారంభించాయని, అయితే మరిన్ని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు

Advertisement

Pakistan Shooting: పాకిస్థాన్‌లో స్కూలులో కాల్పులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి, స్టాఫ్‌రూమ్‌లోకి ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులు జరిపిన దుండగుడు

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అప్పర్ కుర్రం తహసీల్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఒకే పాఠశాలకు చెందిన ఎనిమిది మంది ఉపాధ్యాయులు మృతి చెందినట్లు జియో న్యూస్ నివేదించింది. ఎగువ కుర్రం తహసీల్‌లో కనీసం ఏడుగురు ఉపాధ్యాయులు మృతి చెందారు.

UK Horror: పెన్సన్ డబ్బులు ఎంజాయ్ చేయడం కోసం స్నేహితుడి శవాన్ని 2 సంవత్సరాలు ఫ్రీజర్‌‌లో ఉంచిన ఓ వ్యక్తి, నిందితుడికి అనుకూలంగా షాకింగ్ తీర్పు ఇచ్చిన కోర్టు

Hazarath Reddy

యూకేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పెన్షన్‌ (Pension) డబ్బు కోసం ఆశపడి 71 ఏళ్ల వృద్ధుడి (Pensioner) మృతదేహాన్ని రెండేళ్ల పాటు ఫ్రీజర్‌ (Freezer)లో దాచాడు. బర్మింగ్‌హామ్‌ (Birmingham)లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Himalayan Viagra: వయాగ్రా కోసం హిమాలయాలకు, మంచు తుపానులో గల్లంతైన 5 మంది, హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానాలు

Hazarath Reddy

హిమాలయన్ వయాగ్రాగా పిలిచే అత్యంత విలువైన మూలికను తీసుకు వచ్చేందుకు వెళ్లిన కొంతమంది గల్లంతైన ఘటన నేపాల్ లో చోటు చేసుకుంది. హిమాలయన్ వయాగ్రా లేదా యార్సగుంబా కోసం వెళ్లిన ఐదుగురు వ్యక్తులు పశ్చిమ దార్చులా జిల్లాలో హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు.

Viral Video: షాకింగ్ వీడియో, తల తెగిపడిన పాము గిలగిల కొట్టుకుంటూ తనను తాను ఎలా కాటేసుకుందో చూడండి

Hazarath Reddy

విష సర్పం తనను తాను కరుచుకోవడం మీరెప్పుడైనా చూశారా..అయితే ఈ కింది వీడియోను మీరు చూడాల్సిందే. ఓడ్లీ టెర్రిఫైయింగ్‌ పేరుతో ఉన్న ట్విటర్‌ హ్యాండిల్లో పోస్టు చేసిన ఈ 15 సెకన్‌ల నిడివిగల వీడియోలో ఓ పాము (రక్తపింజరి) తల తెగిపోయి ఉంది.

Advertisement

Ajay Banga As Next World Bank President: వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భారత సంతతి వ్యక్తి, జూన్ 2వ తేదీన బాధ్య‌త‌లు స్వీకరించనున్న అజ‌య్ బంగా

Hazarath Reddy

వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా భార‌త సంత‌తికి చెందిన‌ అజ‌య్ బంగా నియామ‌కం కానున్నారు. ఈ మేర‌కు వ‌ర‌ల్డ్ బ్యాంక్ ధృవీక‌రించింది. మాస్ట‌ర్ కార్డ్ మాజీ సీఈవో అయిన అజ‌య్ బంగా వ‌ర‌ల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా ఈ ఏడాది జూన్ 2వ తేదీన బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

Putin's Assassination Attempt: రష్యా అధ్యక్షుడు పుతిన్ పై హత్యాయత్నం, డ్రోన్లతో దాడి , ఉక్రెయిన్ పనే అంటున్న మాస్కో వర్గాలు..

kanha

మంగళవారం రాత్రివేళ రెండు డ్రోన్‌లతో దాడి చేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ugandan Minister Shot Dead: జీతం ఇవ్వలేదని దేశ మంత్రిని కాల్చి చంపిన బాడీగార్డు, కాల్పుల్లో అక్కడికక్కడే మరణించిన ఉగాండా దేశ కార్మిక శాఖ సహాయమంత్రి చార్లెస్‌ ఎంగోలా

Hazarath Reddy

ఉగాండా రాజధాని కంపాలా (Kampala)లో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్‌ కల్నల్‌ (Retired Colonel ) చార్లెస్‌ ఎంగోలా (Charles Engola) నివాసంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ వివాదంలో ఆయన వద్ద పనిచేసే బాడీగార్డు మంత్రిని కాల్చి చంపాడు.

Body of Man Found Inside Crocodile: మొసలి కడుపులో తప్పిపోయిన వ్యక్తి ఆచూకి, ఆస్ట్రేలియాలో విషాదంగా మారిన చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి కథ

Hazarath Reddy

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలో తన స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లి తప్పిపోయిన వ్యక్తి మృతదేహం మొసలి లోపల కనిపించిందని బుధవారం మీడియా కథనం తెలిపింది.65 ఏళ్ల బాధితుడు, కెవిన్ డార్మోడీ, ఉత్తర క్వీన్స్‌లాండ్‌లోని మారుమూల ప్రాంతంలోని ప్రసిద్ధ ఉప్పునీటి మొసళ్ల నివాసమైన కెన్నెడీస్ బెండ్‌లో చివరిసారిగా ఏప్రిల్ 30న కనిపించాడని BBC నివేదిక తెలిపింది.

Advertisement
Advertisement