Donald Trump: 3వ ప్రపంచ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, ఈ భూమిపై ఏమీ మిగలదు, మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుందని హెచ్చరిక
ఉక్రెయిన్పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. అందుకు దీటుగా కీవ్ సేనలు బదులిస్తున్నారు. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి
US, Oct 10: ఉక్రెయిన్పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. అందుకు దీటుగా కీవ్ సేనలు బదులిస్తున్నారు. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై స్పందించారు . ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై మాస్కో దాడి చేసిన తరువాత ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణ మరియు "శాంతియుత ముగింపు" కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Former US president Donald Trump) పిలుపునిచ్చారు.
అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో శనివారం జరిగిన ‘సేవ్ అమెరికా’ ర్యాలీలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. అణ్వాయుధాల పెంపుదల, అణ్వాయుధాల ప్రమాదాల గురించి హెచ్చరించారు. అజ్ఞానుల కారణంగా ఈ భూమిపై ఏమీ మిగలదు. మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుంది. దాంతో మన భూమండలంపై ఏమీ మిగలదు.’ అని ప్రపంచాన్ని హెచ్చరించారు
షాకింగ్ వీడియో, కైవ్ నగరంలో బ్రిడ్జి పక్కన భారీ పేలుడు, బాంబుల మోతతో మారుమోగుతున్న ఉక్రెయిన్ రాజధాని
ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై మాస్కో దాడి చేసిన తరువాత ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణ మరియు "శాంతియుత ముగింపు" కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. అజ్ఞానుల కారణంగా ఈ భూమిపై ఏమీ మిగలదు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో శనివారం జరిగిన ‘సేవ్ అమెరికా’ ర్యాలీలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. అణ్వాయుధాల పెంపుదల, అణ్వాయుధాల ప్రమాదాల గురించి హెచ్చరించారు.
అణ్వాయుధాల వినియోగంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు చేసిన తర్వాత ట్రంప్ ఈ మేరకు స్పందించటం సంచలనంగా మారింది.క్యూబన్ మిసైల్స్తో ఏర్పాడిన సంక్షోభంతో 60 ఏళ్ల తర్వాత మళ్లీ న్యూక్లియర్ బాంబుల ముప్పు పొంచి ఉందంటూ వ్యాఖ్యానించారు బైడెన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల హెచ్చరికలు జోక్ కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రపంచానికి సూచించారు. గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే చేశారు పలువురు ప్రపంచ నేతలు. వరుస హెచ్చరికల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే భావనలు మొదలైనట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 60 ఏళ్లలో తొలిసారిగా అణు "ఆర్మగెడాన్" ప్రమాదం గురించి హెచ్చరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత మొట్టమొదటిసారిగా, వాస్తవానికి, అవి వెళ్తున్న మార్గంలో విషయాలు కొనసాగితే, అణ్వాయుధాల వాడకం నుండి మనకు ప్రత్యక్ష ముప్పు ఉంది" అని అరవైలో జరిగిన అణు ప్రతిష్టంభనను ప్రస్తావిస్తూ జో బిడెన్ అన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 10, 2022 02:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

