సినిమా

Liger Movie Case: ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ, లైగర్‌ సినిమా లావాదేవీల విషయంలో అవకతవకలపై హీరోని ప్రశ్నించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు

Hazarath Reddy

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన పాన్‌ ఇండియా మూవీ లైగర్‌ సినిమా లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గుర్తించింది.ఈ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారన్న విషయంపై ఇప్పటికే లైగర్‌ నిర్మాతలు పూరీ జగన్నాథ్‌, చార్మీలను ఈడీ అధికారులు విచారించారు.

Pavitra Lokesh On Trolling: ట్రోలింగ్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పవిత్రా లోకేశ్.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నరేశ్, పవిత్రా లోకేష్ లపై ఇటీవల సోషల్ మీడియాలో పెద్దయెత్తున ట్రోలింగ్

Rudra

సీనియర్ నటుడు నరేశ్, దక్షిణాది క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ కు ముడిపెడుతూ తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ పెళ్లి అని, సహజీవనం చేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దీంతో ట్రోలింగ్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేశారు.

Jeevitha Rajashekhar Cheated by Cyber Criminals: సైబర్‌ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయిన జీవితా రాజశేఖర్, సగం ధరకే జియో ప్రోడక్టులు ఇస్తానంటూ కహానీలు చెప్పిన క్రిమినల్, నమ్మి లక్షన్నర ట్రాన్స్‌ఫర్ చేసిన జీవిత

Naresh. VNS

సగం ధరకే జియో బహుమతులు అందిస్తానని తెలిసిన వారి పేర్లను చెప్పి నమ్మించడంతో మేనేజర్‌ ఒప్పుకున్నాడు. సైబర్‌ నేరగాడు ఇచ్చిన జాబితాలో నుంచి పలు వస్తువులను ఎంచుకున్నాడు. అయితే వీటికి సంబంధించిన టోకెన్‌ అమౌంట్‌ పంపించాలని సైబర్‌ నేరగాడు అడిగాడు. అతన్ని పూర్తిగా నమ్మిన మేనేజర్‌ వెంటనే లక్షన్నర రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు

Chaitanya With Sobhita: హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య.. డేటింగ్ ప్రచారానికి మరింత బలం చేకూరిన వైనం.. వైరల్ అవుతున్న ఫొటో!

Rudra

సమంతతో విడిపోయిన తర్వాత యువహీరో నాగచైతన్యకు సంబంధించి గత కొంతకాలంగా ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నాడనేదే ఆ వార్త సారాంశం.

Advertisement

Satheesh Babu Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన ప్రముఖ మాలీవుడ్ రచయిత సతీష్ బాబు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

మాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మలయాళ రచయిత సతీష్ బాబు (59) తిరువనంతపురంలోని వాంచియూర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో శనివారం సాయంత్రం శవమై కనిపించారు. పోలీసులు అనుమానా్సద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Mahesh Emotional Post: ఇటీవల కన్నుమూసిన తండ్రి కృష్ణను తలచుకొంటూ మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్.. ‘ఇప్పుడు నాకు భయం లేదు నాన్నా’ అంటూ భావోద్వేగ సందేశం

Rudra

తండ్రి కృష్ణ మృతి నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన భావోద్వేగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు సినీ పరిశ్రమ తొలి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Kamal Haasan: ఆస్పత్రిలో చేరిన కమల్‌ హాసన్, హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లగానే అస్వస్థత, హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు, ఇంతకీ కమల్‌ హాసన్‌కు ఏమైందంటే?

Naresh. VNS

వంబర్ 23న ఉదయం కమల్ హాసన్ హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ లో కళాతపస్వి విశ్వనాథ్ ని (Viswanath) కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చెన్నై వెళ్లిపోయిన కమల్ అస్వస్థతకి (ill health) గురయ్యారు. కమల్ హాసన్ కి కొద్దిగా అసౌకర్యంగా అనిపించడం, జ్వరం రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

BJP MP Manoj Tiwari: 51 ఏళ్ళ వయసులో రెండో సారి తండ్రి కాబోతున్న ప్రముఖ నటుడు మ‌నోజ్ తివారీ, తన భార్యకు శ్రీమంతం నిర్వహించిన వీడియో షేర్ చేసిన బీజేపీ ఎంపీ

Hazarath Reddy

ప్రముఖ భోజ్‌పూరి న‌టుడు, బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ త‌న భార్య సుర‌భి తివారీకి రెండో సారి తండ్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యకు గ్రాండ్‌గా సీమంతం నిర్వ‌హించారు. ఆ వేడుక‌కు చెందిన వీడియోను ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Advertisement

Megastar Chiranjeevi: చిరంజీవికి అవార్డు రావడంపై ప్రధాని మోదీ ప్రశంసలు, చిరంజీవి ఒక విలక్షణమైన నటుడంటూ తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని

Hazarath Reddy

టాలీవుడ్ ‍అగ్ర నటుడు చిరంజీవికి ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022 అవార్డు వచ్చిన సంగతి విదితమే. తాజాగా అవార్డు రావడంపై భారత ప్రధాని నరేంద్రమోదీ మెగాస్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అవార్డుకు ఎంపికైనందుకు మెగాస్టార్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్‌ చేశారు.

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ అస్థికులను కృష్ణా నదిలో కలిపేందుకు విజయవాడ వచ్చిన మహేష్ బాబు, ఆయన వెంట టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, ఆదిశేషగిరిరావు

Hazarath Reddy

సూపర్ స్టార్ కృష్ణ అస్థికులను ఆయన తనయుడు, సినీ నటుడు మహేష్ బాబు కృష్ణానది, ధర్మ నిలయంలో కలపనున్నారు. ఈ మేరకు మహేష్ హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

IFFI Award For Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు.. 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తింపు.. అవార్డు సంతోషాన్ని కలిగించిందన్న చిరు.. అన్నయ్యకు అవార్డు రావడంపై తమ్ముడు పవన్ ఏమన్నారంటే??

Rudra

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం చేరింది. చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 అవార్డు వరించింది. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం నిన్న ప్రారంభమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.

Aindrila Sharma Dies: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి, 24 ఏళ్లకే కన్నమూయడంతో విషాదంలో సినీ పరిశ్రమ, గతంలో రెండు క్యాన్సర్లతో పోరాటం, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో పోరాడిన బెంగాలీ నటి

Naresh. VNS

చిన్న వయసులోనే అండ్రియా చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కువమంది కార్డియాక్‌ అరెస్ట్‌తో (Cardiac Arrest) మరణించడం చర్చనీయాంశమవుతోంది. అండ్రిలా కొన్నాళ్ల క్రితం రెండు క్యాన్సర్లతో (Cancer) పోరాడి గెలిచారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ (brain stroke) రావడంతో ఆమె నవంబరు 1న ఆస్పత్రిలో చేరారు.

Advertisement

Naga Shaurya Wedding: ఇంటివాడైన టాలీవుడ్ యంగ్ హీరో, బెంగళూరులో ఘనంగా నాగశౌర్య వెడ్డింగ్, ఇంతకీ నాగశౌర్య భార్య ఏం చేస్తుంటుందో తెలుసా?

Naresh. VNS

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య (Naga Shourya) ఓ ఇంటి వాడయ్యాడు. కర్ణాటకకు చెందిన ప్రముఖ ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టిని (Anusha Shettey) వివాహం చేసుకున్నాడు. బెంగళూరులోని ఓ స్టార్‌ హోటల్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ఇరుకుంటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు పాల్గొన్నారు.

Chargesheet On Raj Kundra: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై చార్జి షీట్.. పోర్నోగ్రఫీ కేసులో మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు ముందడుగు

Rudra

వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు తాజాగా చార్జి షీట్ నమోదు చేశారు. వీడియోల్లో అశ్లీల దృశ్యాలు ఉన్నట్టు అందులో పేర్కొన్నారు.

Director Madan No More: టాలీవుడ్ కి మరో షాక్.. ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూత.. నాలుగు రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమించడంతో మృతి.. ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు

Rudra

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో శోక సంద్రంలో మునిగిపోయిన టాలీవుడ్ కి మరో షాక్. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో అవార్డ్ విన్నింగ్ సినిమా ‘ఆ నలుగురు’ చిత్రంతో రచయితగా గుర్తింపు పొంది, ఆపై దర్శకుడిగా మారిన ప్రముఖ డైరెక్టర్ మదన్ కన్నుమూశారు.

Mahesh Kind Nature: కృష్ణ మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనూ ఓ చిన్నారిని ఆదుకున్న మహేశ్ బాబు.. క్లిష్ట సమయంలోనూ వెంటనే స్పందించి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయించిన వైనం

Sriyansh S

సూపర్ స్టార్ కృష్ణ కొన్నిరోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే. తండ్రిని ఎంతగానో ప్రేమించే మహేశ్ బాబు ఆయన మరణంతో తీవ్ర వేదనకు గురయ్యారు. కృష్ణ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయలో మహేశ్ బాబు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే, అంత బాధలోనూ మహేశ్ బాబు మానవతా దృక్పథాన్ని వీడలేదు.

Advertisement

Harikumar Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం, అనారోగ్యంతో ప్రముఖ నటుడు, కామెడీ కింగ్‌ బి హరికుమార్ కన్నుమూత

Hazarath Reddy

ప్రముఖ మలయాళ నటుడు, రచయిత బి హరికుమార్ కన్నుమూశారు. మాలీవుడ్‌లో కామెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన గురువారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మృతికి మాలీవుడ్‌కు చెందిన సినీప్రముఖలు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు

Sunitha Boya Nude Protest: మరోమారు హల్‌చల్ చేసిన సునీత బోయ.. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు నగ్నంగా బైఠాయింపు.. బన్నీవాసు తనను మోసం చేశాడని ఆరోపణ.. వీడియోలో ఆమె ఏమన్నదంటే??

Sriyansh S

సునీత బోయ మరోసారి హల్‌చల్ చేసింది. ప్రముఖ నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ఆమె గతంలో పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా, గత రాత్రి మరోమారు కార్యాలయం వద్దకు చేరుకుని నగ్నంగా బైఠాయించింది.

ED Eyes On Liger Funding: లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఫిర్యాదు.. ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, చార్మి.. జనగణమన సినిమా పెట్టుబడులపైనా ఆరా.. పూరీ, చార్మిలను వేర్వేరుగా పది గంటలకు పైగా విచారించిన అధికారులు

Sriyansh S

‘లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌ నిన్న ఈడీ విచారణకు హాజరయ్యారు. అవసరమైన పత్రాలతో బషీరాబాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న వీరిద్దరినీ వేర్వేరుగా 10 గంటలకుపైగా విచారించారు.

RK Roja on Her Daughter: కూతురు సినిమాల్లోకి వస్తుందనే వ్యాఖ్యలపై స్పందించిన రోజా, వారికి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టమని వెల్లడి

Hazarath Reddy

యాక్టింగ్‌ చేయడం తప్పని నేనెప్పుడూ చెప్పను. నా కూతురు, కొడుకు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకుని సైంటిస్ట్‌ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను చదువు మీదే దృష్టిపెట్టింది. ప్రస్తుతానికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు

Advertisement
Advertisement