India

Mumbai Car Fire: వీడియో ఇదిగో, ముంబై జోగేశ్వరి వంతెనపై కారులో ఒక్కసారిగా మంటలు, నిమిషాల్లోనే కారు దగ్ధం

Hazarath Reddy

డిసెంబరు 9వ తేదీ సోమవారం ముంబైలోని జోగేశ్వరి వంతెనపై కారులో మంటలు చెలరేగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియో, వాహనం మంటల్లో చిక్కుకున్నట్లు, కారు నుండి దట్టమైన పొగలు కమ్ముకోవడం, రద్దీగా ఉండే వంతెనను అడ్డుకోవడం చూపిస్తుంది

Lady Aghori: వీడియో ఇదిగో, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న లేడీ అఘోరి, ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశం వదిలి పారిపోవాలని బెదిరింపులు

Hazarath Reddy

లేడీ అఘోరి మళ్లీ హల్ చల్ చేస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది. అదిలాబాద్ జిల్లా నెన్నెల్ మండలం కుషేనపల్లి గ్రామానికి చెందిన యెల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి ముస్లింలు, క్రైస్తవులను ఊచకోత కోస్తానంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో విషాదం, భార్యను చంపాననే మనస్థాపంతో ఆమె సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న భర్త

Hazarath Reddy

గంగిరెడ్డి క్షణికావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణా­లు కోల్పోయింది. భార్య­ను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలల జైలు జీవి­తం గడిపిన తరువాత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు.

Telangana: మలక్‌పేట మెట్రోస్టేషన్‌ కింద బైక్‌లకు నిప్పు పెట్టింది ఇతడే, చాదర్‌ఘాట్‌కు చెందిన జాకర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

మూడు రోజుల క్రితం మలక్‌పేట మెట్రోస్టేషన్‌ కింద బైక్‌లకు నిప్పు పెట్టిన వ్యక్తిని హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. కమీషనర్ టాస్క్ ఫోర్స్ బృందం మరియు చాదర్‌ఘాట్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుడిని చాదర్‌ఘాట్‌కు చెందిన జాకర్‌గా గుర్తించారు.

Advertisement

Telangana Shocker: దారుణం, నిద్రిస్తున్న భర్తను రాయితో తలపై కొట్టి హత్య చేసిన భార్య, వికారాబాద్ జిల్లా తాండూర్ ఇందిరమ్మ కాలనీలో ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ ఇందిరమ్మ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తను హత్య చేసింది భార్య. మహమ్మద్ ఖాజా అనే వ్యక్తిని ఆయన భార్య హర్షయా ఇంట్లో రాయితో తలపై కొట్టి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Astrology: ఆదివారం రోజున పొరపాటున కూడా ఇటువంటి పనులు చేయకండి ఆర్థిక నష్టాలు వస్తాయి..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని సూర్యదేవుడికి అంకితంగా కోలుస్తూ ఉంటారు. ప్రతిరోజు సూర్య భగవాన్ కి నమస్కరించుకోవడం ద్వారా వారి వ్యాపారాలు వారి పనులు వృత్తులు అన్నీ కూడా మంచిగా ఉంటాయని నమ్మకం.

Rajya Sabha By-Election 2024: ఏపీ నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య, త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం

Hazarath Reddy

ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజ్యసభ (Rajya Sabha) ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, హర్యాణా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ పార్టీ సోమవారం ప్రకటించింది.

Astrology: డిసెంబర్ 18 శుక్రుడు, రాహు మహా సంయోగం వల్ల ఈ 5 రాశుల వారు ధనవంతులవుతారు.

sajaya

ఇంకొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. 2025 వ సంవత్సరంలో గ్రహాలు వాటి కదలికలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. 2025వ సంవత్సరంలో గ్రహాల కలయిక అధికంగా ఉంటుంది.

Advertisement

Astrology: డిసెంబర్ 11న 5 అరుదైన యోగాల కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ 11వ తేదీన ఉదయం 3 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదే రోజున 5 యోగాల కలయిక ఉంటుంది. భద్రవల, రవి యోగం, వారి యోగం ,వాణిజ్య యోగం, విష్టియోగం అనే ఐదు యోగాల అరుదైన కలయిక జరగబోతుంది.

Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 20 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసిన ఆమ్ ఆద్మీ, జంగ్‌పురా స్థానం నుండి బరిలో దిగనున్న మనీష్ సిసోడియా

Hazarath Reddy

రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం 20 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది, జంగ్‌పురా స్థానం నుండి పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను బరిలోకి దింపింది. ఇటీవలే ఆప్‌లో చేరిన విద్యావేత్త అవధ్ ఓజా ప్రస్తుత అసెంబ్లీలో సిసోడియాకు చెందిన పట్‌పర్‌గంజ్ స్థానం నుంచి బరిలోకి దిగారు

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్య మళ్లీ మళ్లీ వేధిస్తుందా అయితే ఈ తప్పులే కారణం కావచ్చు..

sajaya

కిడ్నీలో రాళ్లు రావడం అనే సమస్య ఈమధ్య తరచుగా అందరిలో చూస్తూ ఉన్నాము. కిడ్నీలో రాళ్లు వచ్చినప్పుడు ఆ సమస్య చాలా బాధాకరంగా ఉంటుంది.ముఖ్యంగా కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు, చలి జ్వరము వంటి సమస్యలు ఏర్పడతాయి.

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీరు జింక్ లోపంతో బాధపడుతున్నట్లే..

sajaya

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి పోషకాలతో పాటు కొన్ని రకాలైన పోషకాలు కూడా అవసరం అందులో జింక్ అనేది చాలా ముఖ్యం. ఇది దీనిలోపం వల్ల మన శరీరం చాలా బలహీనంగా మారుతుంది.

Advertisement

Health Tips: పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల గుండె, క్యాన్సరు, మెదడు సంబంధ సమస్యలు తగ్గుతాయి..

sajaya

పుట్టగొడుగుల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సరు, మతిమరుపు వంటి జబ్బులతో బాధపడే వారికి ఇది సహాయపడుతుందని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Manchu Family Conflict: వీడియోలు ఇవిగో, మంచు మనోజ్ ఇంటి వద్ద ఉద్రిక్తత, భారీగా తన బౌన్సర్‌లను మోహరించిన విష్ణు

Hazarath Reddy

జల్పల్లిలో మంచు మనోజ్ నివాసానికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ చేరుకున్నారు. మనోజ్ ఇంటి సీసీ పుటేజ్ హార్డ్డిస్క్ తీసుకెళ్లాడు. మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా ఉన్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మంచు విష్ణు కాసేపట్లో జల్పల్లిలోని మంచు మనోజ్ ఇంటికి రానున్నారు.

Health Tips: ఈ జబ్బులతో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి తినకూడదు. తింటే చాలా ప్రమాదం..

sajaya

బొప్పాయిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది అనేకరకాల పోషకాలను కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మనకు విటమిన్ ఏ, ఐరన్, జింక్ ఫైబర్ పుష్కలంగా అందుతుంది.

Komati Reddy Venkata Reddy: TRS పార్టీని BRSగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలకు వాళ్లకు బంధం తెగిపోయింది, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

TRS పార్టీని BRSగా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలకు వాళ్లకు బంధం తెగిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదని స్పష్టం చేశారు. ఆనాడేమో మీరు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు తల్లి అని కేసీఆర్ సోనియమ్మ కాళ్ళు మొక్కాడు.

Advertisement

Chennamaneni Ramesh: చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడే, తేల్చి చెప్పిన తెలంగాణ హైకోర్టు, విధించిన రూ.30లక్షల జరిమానా నెలలోపు చెల్లించాలని స్పష్టం

Hazarath Reddy

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ (Chennamaneni Ramesh)కు తెలంగాణ హైకోర్టు (TS High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది.

Telangana Assembly Session 2024: ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ తల్లిని ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరిస్తున్నాం.

BRS MLAs Arrest: రాహుల్ గాంధీ ఆదాని టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లాడు, మేము ధరించి అసెంబ్లీకి వస్తే తప్పేంటి ? అరెస్టులపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ శాసనసభ్యులు సోమవారం ఉదయం నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది . సెషన్ ప్రారంభానికి నిమిషాల ముందు ఈ నిరసన చెలరేగింది.

IRCTC Down: ఐఆర్‌సీటీసీ సేవలు డౌన్, నిలిచిపోయిన రైల్వే టికెట్ బుకింగ్స్ యాప్స్, మెయింటెనెన్స్ యాక్టివిటీస్ కొనసాగుతుండటం వల్లే అంతరాయమని తెలిపిన సంస్థ

Hazarath Reddy

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) సేవలకు పాక్షిక అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్, యాప్ పనిచేయడంలేదని నెటిజన్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదుల చేస్తున్నారు. IRCTC ఈ టికెటింగ్ సర్వీస్ వెబ్ సైట్, యాప్ ఇవాళ (సోమవారం) ఉదయం పనిచేయడం లేదు.

Advertisement
Advertisement