India

Lady Aghori Attacked on Journalist: జర్నలిస్టు, పోలీసులపై అఘోరి దాడి.. మంగళగిరిలో ఘటన (వీడియో)

Rudra

ఆలయాల సందర్శనతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ హద్దుమీరి ప్రవర్తించారు. మంగళగిరిలో కారు వాష్ చేయిస్తుండగా వీడియో తీస్తున్న ఓ జర్నలిస్ట్ పై దాడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. అఘోరీ చర్యలను పలువురు తప్పుబడుతున్నారు.

HYDRA 2.0: హైడ్రా 2.0.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు షురూ.. (వీడియో)

Rudra

భూఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపిన హైడ్రా వెర్షన్ 2.0 ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Railway Helped Groom: ముహూర్త సమయం ముగిసిపోతున్నది.. వరుడు ఇక్కడ.. పెండ్లి అక్కడ.. దీంతో వరుడి కోసం ఆగిన రైలు.. ఏంటా సంగతి??

Rudra

అనుకోని కారణాల వల్ల ముహూర్త సమయానికి ఓ వరుడు మండపానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో అతన్ని పెండ్లి వేదికకు చేర్చేందుకు రైల్వే శాఖ ఏకంగా ఓ రైలును ఆలస్యంగా నడిపింది.

AP Cabinet Meeting Postponed: నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా.. కారణం ఏమిటంటే?

Rudra

నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.

Advertisement

New EV Policy in Telangana: తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ... 100 శాతం పన్నుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినహాయింపు.. నేటి నుంచే అమల్లోకి..!

Rudra

తెలంగాణలో విద్యుత్తు వాహనాలకు సంబంధించి నూతన ఈవీ పాలసీని తీసుకొచ్చారు. ఆ కొత్త ఈవీ పాలసీ నేటి (నవంబరు 18) నుంచే అమల్లోకి వచ్చింది. తాజా ఈవీ పాలసీ ప్రకారం... ఫోర్ వీలర్ ఈవీలు, టూ వీలర్ ఈవీలు, కమర్షియల్ ఈవీలకు 100 శాతం పన్ను మినహాయింపు ఉండనుంది.

Man Killed By His Brothers: కార్తీక మాసంలో ఇంటికి చికెన్ తెచ్చాడ‌ని త‌మ్ముడ్నిచంపిన ఇద్ద‌రు అన్న‌లు, ఆ ఇద్ద‌ర్నీ కాపాడేందుకు త‌ల్లి ఏం చేసిందంటే?

VNS

తాడుతో గొంతు నొక్కి తమ్మడు అన్షుల్‌ను హత్య చేశారు. ఆ తర్వాత తల్లితో కలిసి అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తిరిగి రాగానే స్పృహతప్పి పడిపోయాడని చెప్పారు. అయితే అన్షుల్‌ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు

Delhi Air Pollution: ఢిల్లీలో తారాస్థాయికి చేరిన కాలుష్యం, అన్ని స్కూళ్లు మూసివేత‌, సోమ‌వారం నుంచి తీవ్ర‌మైన ఆంక్ష‌లు..

VNS

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. వాయు కాలుష్యం (Air Pollution) స్థాయిలు పెరగడంపై ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ (CAQM) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది

Kantara Chapter 1 Release Date: కాంతారా చాప్ట‌ర్ -1 రిలీజ్ డేట్ వ‌చ్చేసింది, ఏకంగా రూ. 120 కోట్ల‌తో భారీ స్కెచ్ వేసిన రిష‌బ్

VNS

ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్‌ 1 ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను షేర్ చేశారు

Advertisement

Income Tax Department: ఇన్ క‌మ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ త‌ప్పు చేశారంటే రూ. 10 ల‌క్ష‌లు ఫైన్

VNS

ఆదాయపు పన్నుశాఖ (Income tax) పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే రూ.10లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆదివారం హెచ్చరిస్తూ.. కంప్లయన్స్‌ కం అవేర్‌నెస్‌’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Shreyas Iyer As Mumbai Captain: ర‌హానేకు షాక్ ఇచ్చిన సెల‌క్ట‌ర్లు, ముంబై కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్, పూర్తి జ‌ట్టు ఇదే!

VNS

గ‌త సీజ‌న్‌లో ముంబై జ‌ట్టును రంజీ విజేత‌గా నిలిపిన అంజిక్యా ర‌హానేకు సెలెక్ట‌ర్లు షాకిచ్చారు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)కోసం శ్రేయ‌స్ అయ్య‌ర్‌ (Shreyas Iyer)ను సార‌థిగా ప్ర‌క‌టించారు. ముంబై స్క్వాడ్‌కు అయ్య‌ర్ కెప్టెన్‌గా నియ‌మిస్తూ ఆదివారం ముంబై సెలెక్ట‌ర్లు ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

Korutla: గ్రూప్ 3 పరీక్షకు హాజరైన 9 నెలల గర్భిణి, పరీక్ష సిబ్బంది పూర్తి సహకారం అందించారని వెల్లడి, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త బాలకృష్ణ..వీడియో

Arun Charagonda

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 3 ఎగ్జామ్ కు హాజరైంది 9 నెలల గర్భిణి. భర్త కొమురోజు బాలకృష్ణ సహాయంతో పరీక్షకు హాజరు అయింది గర్భిణీ రీనా. ప్రస్తుతం రీనా కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తుండగా భర్త బాలకృష్ణ హైదరాబాద్ లోని ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.

Manipur violence: మణిపూర్ అల్లర్లు..బీజేపీకి షాక్, మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీ చీఫ్‌కు లేఖ రాసిన మేఘాల‌యా సీఎం కాన్రాడ్‌ కె.సంగ్మా

Arun Charagonda

మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీకి షాక్ తగిలింది. మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి మద్ద‌తు ఉపసంహరించుకుంది నేషనల్ పీపుల్స్ పార్టీ. మణిపూర్‌లో నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఎన్‌పీపీ అధ్యక్షుడు,

Advertisement

Adulterated Ginger Garlic Paste: కల్తీ 'అల్లం - వెల్లుల్లి పేస్ట్‌' రాకెట్ గుట్టు రట్టు, రూ.4.50 లక్షల విలువ చేసే అల్లం పేస్ట్ డబ్బాలు స్వాధీనం..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఓ గోడౌన్‌పై కమీషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, నార్త్‌జోన్‌ బృందం, పోలీసులతో కలిసి దాడి చేసి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేసి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఓల్డ్ బోవెన్‌పల్లిలోని రాజరాజేశ్వరి నగర్‌లోని ఒక యూనిట్‌పై బృందాలు దాడి చేసి భారీ మొత్తంలో అపరిశుభ్రమైన మరియు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఇతర విచక్షణారహిత పదార్థాలను

Vijayawada: రాంగ్ రూట్‌లో వ‌చ్చిన కారు, ఆపై బస్సు డ్రైవర్‌పైనే దాడి, విజయవాడలో ఘటన...ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వీడియో ఇదిగో

Arun Charagonda

విజ‌య‌వాడ‌లో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌పై ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. న‌గ‌రంలోని బ‌స్టాండ్ వ‌ద్ద రాంగ్ రూట్‌లో వ‌చ్చింది కారు. ఈ క్రమంలో బస్సు త‌మ కారుకి తగిలిందని డ్రైవర్‌పై దాడి చేశారు కారులోని ఆరుగురు యువ‌కులు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

PM Modi: నైజీరియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ గౌరవం అందుకున్న విదేశీ ప్రముఖుడిగా నిలిచిన మోదీ

Arun Charagonda

నైజీరియా దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ పురస్కారాన్ని అందుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 1969లో క్వీన్ ఎలిజబెత్‌కు నైజీరియా ఈ అవార్డును ప్రధానం చేసింది. ఈ అవార్డుతో విదేశాల్లో మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డుల్లో ఇది 17వది.

Pushpa 2 Trailer: పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్..పుష్ప 2 ట్రైలర్‌తో దుమ్మురేపిన అల్లు అర్జున్‌....ట్రైలర్ ను మీరు చూసేయండి

Arun Charagonda

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్‌తో దుమ్మురేపాడు బన్నీ. సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు అల్లు అర్జున్. నాకు కావాల్సింది అణా అయినా అర్ధణా అయినా అది ఏడు కొండల మీద ఉన్నా ఏడు సముద్రాల దాటి ఉన్నా పోయి తెచ్చుకునేదే పుష్ప గాడి అలవాటు అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.

Advertisement

Kailash Gehlot Resigns AAP: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్..ఢిల్లీ ఎన్నికల ముందు ఆప్‌కు రాజీనామా చేసిన మంత్రి కైలాష్ గెహ్లాట్..ఆప్‌తో ఢిల్లీ అభివృద్ధి శూన్యమని ఫైర్

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాకు గల కారణాలను లేఖలో ప్రస్తావించారు కైలాష్ గెహ్లాట్. కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకే ఢిల్లీ ప్రభుత్వం ఎక్కువ సమయం కేటాయించిందని, ఈ క్రమంలో ఢిల్లీ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.ఢిల్లీ ప్రజలు కనీస సేవలు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు అని ఆరోపించారు.

Telangana Electric Vehicle Policy: తెలంగాణ నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ రిలీజ్, 2026 వరకు అమల్లో ఉండనున్న కొత్త పాలసీ, వాయు కాలుష్యం తగ్గించేందుకేనని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

Arun Charagonda

నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ జీవో 41ని విడుదల చేసింది తెలంగాణ‌ ప్రభుత్వం. రేపటి నుంచి 2026 వరకు నూతన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమ‌లులో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాహన కాలుష్యం తగ్గించే ల‌క్ష్యంతో నూత‌న పాల‌సీని రూపొందించినట్లు చెప్పారు.

Actress Kasturi: నటి కస్తూరికి బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్, చెన్నైలోని పుజ‌ల్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించిన పోలీసులు

Arun Charagonda

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న నటి కస్తూరికి గట్టి షాక్ తగిలింది. హైదరాబాద్‌లో కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు పోలీసులు. క‌స్తూరిని చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజ‌రు ప‌ర్చగా ఈనెల 29 వ‌ర‌కూ రిమాండ్ విధించింది కోర్టు.

Hypersonic Missile: భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం, హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన డీఆర్‌డీఓ...వీడియో

Arun Charagonda

ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి డీఆర్‌డీఓ క్షిపణి పరీక్షను విజయవంతంగా ప్రయోగించింది. దీర్ఘశ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి... హైపర్‌ సోనిక్‌ క్షిపణులున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.

Advertisement
Advertisement