Information

TTD News: తిరుమలలో ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

Tulsi Gowda Passes Away: పద్మ శ్రీ తులసి గౌడ కన్నుమూత, లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీగా గుర్తింపు, పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన తులసిగౌడ

Arun Charagonda

లక్షల్లో మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీ గా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ(86) కన్నుమూశారు. కర్ణాటక రాష్ట్రం హొన్నాలికి చెందిన తులసి గౌడ, 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటింది.

TS Inter Exam Schedule 2025: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదిగో, మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు, ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్‌ మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు సోమవారం ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి.

Health Tips: గోరువెచ్చటి పాలలో ఒక స్పూను తేనె కలుపుకొని తాగడం వల్ల అనేక వ్యాధులు తగ్గుతాయి..

sajaya

ఆయుర్వేదం ప్రకారం పాలు తేనెల కలయిక చాలా కాలంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇది మన శరీరానికి అనేక పోషకాలను అందించడమే కాకుండా మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఔషధంలా పనిచేస్తుంది.

Advertisement

Good News For Farmers: రైతులకు ఆర్బీఐ శుభవార్త.. తాకట్టు లేకుండానే రూ.2 లక్షల వరకూ అప్పు.. జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమలులోకి

Rudra

దేశంలోని అన్నదాతలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. వ్యవసాయ అవసరాలకు, పంట సాగు కోసం ఎలాంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

Group 2 Exams Today: నేడు, రేపు గ్రూప్‌-2 పరీక్షలు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌

Rudra

నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి.

Weather Forecast: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్షాలు తప్పవని సూచన, తెలంగాణను చంపేస్తోన్న చలి పులి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడే సూచనలు కనపడటం లేదు. ఫెంగల్ తుఫాను తీసుకొచ్చిన నష్టం మరువక ముందే మరో పిడుగు లాంటి వార్త ఏపీని కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నట్లుగా ఐఎండీ తెలిపింది.

RBI Receives Bomb Threat: ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఈమెయిల్‌కు బెదిరింపు లేఖ..బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు

Arun Charagonda

ముంబై RBI కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు లేఖ కలకలం రేపింది. రష్యన్ బాషలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈమెయిల్‌ కు బెదిరింపు లేఖ రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.

Advertisement

Swarnandhra Vision 2047: నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన

Rudra

విజయవాడలో నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమాన్ని ఏపీ సర్కారు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Telangana Cold Wave: తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Rudra

తెలంగాణను చలిపులి వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

One Nation, One Election: జమిలి ఎన్నికలు అంటే ఏమిటి ? ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడైనా జరిగాయా, ఒకే దేశం-ఒకే ఎన్నిక పై సమగ్ర విశ్లేషణాత్మక కథనం

Hazarath Reddy

ఒకే దేశం-ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఈ ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్రం ఏం చేయాల్సి ఉంటుందనే దానిపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Weather Forecast: ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భాతర వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ అల్పపీడనం దక్షిణ కోస్తా, రాయలసీమపై నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది .

Advertisement

Sanjay Malhotra: రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా, మూడేండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్న సంజయ్..వీడియో

Arun Charagonda

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన గవర్నర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ 26వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. నేటి నుంచి మూడేండ్లపాటు ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా బాధ్యతల్ని నిర్వర్తించనున్నారు.

Hottest Year 2024: అత్యంత వేడి సంవత్సరంగా 2024 రికార్డ్.. నవంబర్‌ లో అత్యధిక ఉష్ణోగ్రతలు.. యూరోపియన్‌ వాతావరణ సంస్థ కోపర్నికస్‌ వెల్లడి

Rudra

2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచింది. సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఈ రికార్డు నమోదు చేసింది. ఈ మేరకు యూరోపియన్‌ వాతావరణ సంస్థ కోపర్నికస్‌ తెలిపింది.

AP Weather Update: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాల ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

Rudra

ఫెంగల్ తుఫాను ముప్పు తప్పిపోయినట్టు భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.

RBI Repo Rate Unchanged: వరుసగా 11వ సారి వడ్డీ రేట్లు యథాతథం, మరో 27 టన్నుల గోల్డ్‌ను కొనుగోలు చేసిన ఆర్భీఐ

Hazarath Reddy

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తమ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరిపింది.ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) నేడు వెల్లడించారు.ఈ సందర్భంగా వడ్డీ రేట్ల (Repo Rate) విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) శుక్రవారం కీలక ప్రకటన చేసింది.

Advertisement

Weather Forecast: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ఐఎండీ, తెలంగాణలో చంపేస్తున్న చలిపులి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఈ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

PSLVC59: పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా, ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతికలోపం కారణంగా ప్రయోగం రీషెడ్యూల్ చేసినట్లు ఇస్రో వెల్లడి

Arun Charagonda

పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రేపు 4.12 గంటలకు ప్రయోగం రీషెడ్యూల్ చేసినట్టు 'ఎక్స్' వేదికగా ప్రకటించింది ఇస్రో.

Cyclone Fengal Update: తీరం దాటినా కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్, నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు కీలక అలర్ట్

Hazarath Reddy

ఫెంగల్ తుఫాను తీరం దాటినా దాని అల్పపీడన ప్రాంతం ఉత్తర అంతర్భాగంలో కొనసాగుతున్నందున మంగళవారం (డిసెంబర్ 3) తమిళనాడు, కేరళ, కర్ణాటక సహా దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది.

LPG Price Hike: బిగ్‌ షాక్‌.. మరోసారి గ్యాస్‌ ధరల పెంపు, ఏఏ నగరాల్లో గ్యాస్ ధరలు ఎంత ఉన్నాయో తెలుసా?

Arun Charagonda

వినియోగదారులకు షాక్. గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. డిసెంబర్ 1న తొలిరోజే గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ షాకిచ్చాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్‌ ధర రూ.16 పెరుగగా ఇది నేటి నుండే అమల్లోకి రానుంది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,818గా ఉంది. కోల్ కతాలో రూ. 1,927 రూపాయలకు పెరిగింది.

Advertisement
Advertisement