Information

iRobot Layoffs: ఆగని లేఆప్స్, 350 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న రోబోటిక్స్ కంపెనీ ఐరోబోట్

Vikas M

యుఎస్‌కు చెందిన రోబోటిక్స్ కంపెనీ ఐరోబోట్ తన ఉద్యోగులలో 16% మందిని తగ్గించుకుంటూ మరో రౌండ్ తొలగింపులను నిర్వహించింది. మసాచుసెట్స్‌కు చెందిన టెక్ కంపెనీ ఒక SEC ఫైలింగ్‌లో రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉద్యోగాల కోత ప్రారంభించినట్లు తెలిపింది.

Jagan Slams TDP-led Govt: అధికారంలోకి వచ్చాక ఏ పోలీసును వదలం, సప్త సముద్రాల అవతల ఉన్నా వెతికి మరీ పట్టుకుంటాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

SC on Recruitment Rules for Govt Jobs: రిక్రూట్‌మెంట్‌ మధ్యలో రూల్స్ మార్చకూడదు, ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Hazarath Reddy

ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ నిబంధనలకు సంబంధించి సుప్రీంకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. రిక్రూట్‌మెంట్‌ మధ్యలో రూల్స్ మార్చకూడదని అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది.

SC on Private Properties: ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల అంశంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

Hazarath Reddy

ఉమ్మడి ప్రయోజనాల కోసం పంపిణీ చేయడానికి ప్రైవేట్ ఆస్తులను రాష్ట్రం స్వాధీనం చేసుకోవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ తీర్పును వెలువరిస్తూ, అన్ని ప్రైవేట్ ఆస్తులు కాదని తీర్పు చెప్పింది.

Advertisement

TS TET Notification 2024: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల,2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు, నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ

Hazarath Reddy

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న సంగతి విదితమే.

AP TET Results 2024 Out: ఏపీ టెట్ ఫలితాల విడుదల, మీ రిజల్ట్స్ aptet.apcfss.in ద్వారా చెక్ చేసుకోండి, అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు

Hazarath Reddy

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) విడుదల చేశారు. అక్టోబర్‌ 3 నుంచి 21వ వరకు టెట్‌ పరీక్షలు (AP TET Exam) జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్‌ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

TET Day Today: టెట్ కు సంబంధించి నేడు రెండు కీలక పరిణామాలు.. మరికాసేపట్లో ఏపీ టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. ఇక, నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Rudra

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్) కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు నేడు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ టెట్-2024) ఫలితాలు నేడు విడుదలకానున్నాయి.

Free Insurance for Sabarimala Pilgrims: శబరిమల అయ్యప్ప భక్తులకు ఉచిత బీమా.. ఈ ఏడాది వరకు మాత్రమే

Rudra

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు కేరళ దేవాదాయ శాఖ ప్రకటించింది.

Advertisement

Delhi Air Pollution: దీపావళి రోజున ఢిల్లీలో తగ్గిన గాలి నాణ్యత.. ఉదయం వరకు కమ్మేసిన పొగమంచు, బాణసంచాతో గాలి మరింత విషపూరితమవుతుందని ఆందోళన

Arun Charagonda

దీపావళి రోజు దేశ రాజధాని ఢిల్లీని ముంచేసింది పొగమంచు. ఆనంద్ విహార్‌లో గాలి నాణ్యత సూచి 418గా నమోదుకాగా అక్షరధామ్‌ ఆలమ సమయంలోనూ గాలి నాణ్యత పడిపోయింది.దీపావళి పండుగ కావడంతో బాణాసంచాలు కాలిస్తే గాలి నాణ్యత మరింత పడిపోయే ప్రమాదం ఉన్నది. దీంతో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరికి చేరే ప్రమాదం ఉంటుందని.. ప్రజలంతా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

TSPSC Group 3 Exam Date 2024: వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు, తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

Hazarath Reddy

తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది.

Weather Forecast: సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, ఈ జిల్లాలకు అలర్ట్

Hazarath Reddy

నిన్న దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ చత్తీస్ ఘడ్, ఒడిస్సా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

Wife Calling Husband Hijra is Cruelty: భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వమే, ఎందుకూ పనికిరాని వాడిని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసే, కోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందకే వస్తుందని పంజాబ్, హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. ‘భర్తను హిజ్రా అని పిలవడం, ఎందుకూ పనికిరాని వాడిని కన్నావని అత్తను తిట్టడం మానసిక హింసకు గురిచేయడమేనని తెలిపింది.

Advertisement

AI Chatbot: ఏఐ చాట్‌బాట్ తో ప్రేమలో టీనేజర్, డిప్రెషన్ తో ఆత్మహత్య, ఏఐ- గూగుల్‌పై దావా వేసిన టీనేజర్ తల్లి...వివరాలివిగో

Arun Charagonda

అమెరికాలోని ఫ్లోరిడాలో విషాదం చోటు చేసుకుంది. ఏఐ చాట్‌బాట్ కారణంగా ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆ టీనేజర్ తల్లి. Character.AI చాట్‌బాట్ తన కుమారుడిని ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహించిందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ, Character.AI మరియు Googleకి వ్యతిరేకంగా దావా వేసింది.

Cyclone Dana: రేపు తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఉత్తరాంద్రకు హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అక్టోబర్ 23 నాటికి తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ మరో హెచ్చరిక, బంగాళాఖాతంలో అక్టోబర్ 22న అల్పపీడనం, ఇప్పటికే భారీ వర్షాలతో విలవిల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు దంచికొట్టాయి. తడ వద్ద వాయుగుండం తీరం దాటింది, ఈ ముప్పు వీడిందని ప్రజలు భావిస్తుండగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది.

Supreme Court On Working Journalists: వర్కింగ్ జర్నలిస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, జర్నలిస్టులను కొట్టినా, తిట్టినా రూ.50,000 జరిమానా.. 5 ఏళ్లు జైలు శిక్ష అని తీర్పు వెల్లడి

Arun Charagonda

వర్కింగ్ జర్నలిస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వర్కింగ్ జర్నలిస్టులతో ప్రభుత్వాలు జాగ్రత్త ఉండాలని...జర్నలిస్టులను కొట్టినా, తిట్టినా రూ.50,000 జరిమానా అని, 5 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Advertisement

Weather Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు.. వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా

Rudra

తెలుగు రాష్ట్రాలపై వరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

Weather Forecast: ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు, పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్, నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది.

Telangana Group-1 Exams Update: గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్, మరో ఆరు రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, నోటిఫికేష‌న్ల‌పై ప‌లువురు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను కొట్టివేసిన హైకోర్టు

Hazarath Reddy

తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు.

Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)

Rudra

రానున్న నాలుగు రోజుల్లో చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తమయ్యారు.

Advertisement
Advertisement