Information

Court Orders about Wife Maintenance: ఆదాయం లేకున్నా భర్త భరణం ఇవ్వాల్సిందే.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Rudra

ఆదాయం లేకున్నా, విడాకులు తీసుకున్న భార్యకు ప్రతి నెలా భరణం చెల్లించడం భర్త విద్యుక్త ధర్మం అని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.

Ration Card e-KYC Date Extended: రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు.. చాలా రాష్ట్రాల్లో ఈ-కేవైసీ ధ్రువీకరణ పూర్తికాకపోవడమే కారణం

Rudra

రేషన్‌ కార్డుదారులకు శుభవార్త. రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా దానిని ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

TSRTC Goodnews for Medaram Jatara: తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మేడారం జాతర సమయంలో మహిళలకు ప్రయాణం ఉచితం.. అయితే, తొలుత మహిళలకు టికెట్ వసూలు చేయాల్సిందేనన్న సజ్జనార్.. వద్దన్న మంత్రి భట్టి విక్రమార్క.. చివరకు ఫ్రీ బస్ ప్రయాణమే ఖరారు.. వచ్చే నెల 18 నుంచి 25 వరకు మేడారం జాతర.. 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ

Rudra

మేడారం జాతరకు వెళ్లే తెలంగాణ మహిళలకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. జాతరకు నడిపే ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తోసిపుచ్చారు.

Lok Sabha Elections 2024: ఈ సారి ఎన్నికల్లో ఓటు వేయనున్న 96 కోట్ల మంది ఓటర్లు, వారిలో 47 కోట్ల మంది మహిళలే, వివరాలను వెల్లడించిన ఎన్నికల కమిషన్

Hazarath Reddy

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 47 కోట్ల మంది మహిళలతో సహా 96 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు, ఇందుకోసం దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 1.73 కోట్ల మంది ఓటు హక్కు కలిగిన వారు 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులే.

Advertisement

UPSC ISS, IES 2023 Results: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‍‌, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్‌ తుది ఫలితాలు విడుదల, నియామకాల ప్రక్రియ ఇలా!

Vikas M

TTD Accommodation: శ్రీవారి దర్శనం టికెట్లు ఉంటేనే తిరుమల కొండపై వసతి గదులు.. భక్తుల రద్దీ తగ్గించేందుకు టీటీడీ కీలక నిర్ణయం

Rudra

తిరుమల కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్‌ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌ లైన్‌ లో చేపట్టింది. దీంతో భక్తుల రద్దీని కొంతమేర తగ్గించొచ్చని టీటీడీ భావిస్తున్నది.

TS EAPCET Exam Dates Announced: తెలంగాణ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌గా మార్చిన TSCHE, ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ విడుదల

Hazarath Reddy

తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET) పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో పాటుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ షెడ్యూల్‌ విడుదల చేసింది.

HC on Miscarriage: మృతి చెందిన మహిళ గర్భస్రావంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, తల్లి కడుపులో బిడ్డ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తరువాత గర్భస్రావం చేస్తే ఎటువంటి కేసు లేదని తెలిపిన ధర్మాసనం

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇటీవలే మృతి చెందిన తల్లి కడుపులో ఉన్న బిడ్డ నిండుగా పెరిగినా లేదా గర్భం దాల్చేలోపు గర్భం నుండి పిండాన్ని బహిష్కరించకపోయినా గర్భస్రావం కలిగించిన నేరానికి ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేమని పేర్కొంది.

Advertisement

Lok Sabha Election on April 16? ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు వార్త నిజం కాదు, క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం, ఎన్నికల షెడ్యూల్‌ను సరైన సమయంలో ప్రకటిస్తామని వెల్లడి

Hazarath Reddy

ఏప్రిల్ 16 అనేది లోక్ సభ ఎన్నికల తేదీ కాదని, దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బంది ఎన్నికల పనులు పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు తేదీ అని స్పష్టం చేసింది. ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది. ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది.

APPSC Group-1: జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు, మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష

Hazarath Reddy

ఏపీలో గ్రూప్‌- 1 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, గ్రూప్‌-1 అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది

Special Trains to Ayodhya: తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి బయలుదేరే రైళ్ల పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

న్నో ఏళ్ళ తరువాత అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

CRPF Recruitment: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో సీఆర్పీఎఫ్ ఉద్యోగం, పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, మొత్తం ఎన్నిపోస్టులు, ఏయే అర్హ‌త‌లు కావాలంటే?

VNS

సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు విధానం ఉండ‌గా.. ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ త‌దిత‌ర‌ల ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. ఇక ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని వివిధ ప్రాంత‌ల్లో ప‌ని చేయ‌వ‌ల‌సి ఉంటుంది.

Advertisement

EPFO Removes Aadhaar As Birth Proof: పుట్టిన తేదీ ఫ్రూఫ్‌కు ఆధార్ కార్డు చెల్లుబాటు కాదు, ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి తొలగించిన ఈపీఎఫ్ఓ

Hazarath Reddy

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక ప్రధాన నిర్ణయంలో, పుట్టిన తేదీ (DOB) రుజువుగా ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్ కార్డును తొలగించింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) నుండి వచ్చిన ఆదేశాల తర్వాత పుట్టిన తేదీకి ఆమోదయోగ్యమైన పత్రంగా ఆధార్ కార్డ్‌ను తీసివేసినట్లు EPFO ​​తెలియజేసింది.

Sankranti Holidays Extended: సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగించిన ఏపీ సర్కారు, జనవరి 22న పాఠశాలలు పునఃప్రారంభం

Hazarath Reddy

ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. ముందుగా గురువారం వరకు (జనవరి 18) సంకాంత్రి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోరిక మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు.

DGCA New Guidelines: విమానాలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎయిర్‌ లైన్స్ రద్దు చేయవచ్చు.. విమాన టికెట్‌ పైనే ఈ విషయం ముద్రణ.. ఇటీవల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసిన డీజీసీఏ

Rudra

విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ ను (ఎస్‌వోపీ) జారీ చేసింది.

NHAI on FASTags Without KYC Link: వాహనదారులకు అలర్ట్‌, KYC అసంపూర్తిగా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ అకౌంట్లను డియాక్టివేట్ చేస్తున్న NHAI, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) KYC అసంపూర్తిగా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ అకౌంట్లను డీయాక్టివేట్ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేస్తామని తెలిపింది.

Advertisement

Makar Sankranti 2024: ఊరెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త, సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన

Hazarath Reddy

సంక్రాంతి పండుగకు ఊరెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను తెలిపింది. రద్దీ నేపథ్యంలో ఇప్పటికే పలు రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో నాలుగు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

APPSC Group 2 Recruitment 2024: గుడ్ న్యూస్, APPSC గ్రూప్‌ -2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు, జనవరి 17 అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు అంటే జనవరి 17 వరకు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు (APPSC Group 2 Application Date Extended 2024) ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు

Six Guarantees Application Status: ఆరు గ్యారెంటీలకు అప్లై చేసి ఉంటే దరఖాస్తు స్టేటస్ ఇలా తెలుసుకోండి, అయితే మీ అప్లికేషన్ నంబర్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి

Hazarath Reddy

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా ఆరు గ్యారంటీల (six guarantees) ఆమలుకు శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ప్రజాపాలన పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించి ప్రజాపాలన వివరాలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈమేరకు prajapalana.telanga na.gov.in వెబ్‌సైట్‌ రూపొందించింది.

Sankranthi Holidays in AP: ఏపీలో జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు, 19న పాఠశాలలు పునఃప్రారంభం

Hazarath Reddy

అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 9 నుంచి 18 వరకూ సంక్రాంతి సెలవులను నిర్ణయించారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలిచ్చారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Advertisement
Advertisement