సమాచారం

Cyclone Mandous: రాత్రికి తీరం దాటనున్న తుపాను, స్కూళ్లు, పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు, మూడు రోజలు పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్‌ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.

Cyclone Mandous: తీవ్ర తుఫానుగా మారిన మాండూస్.. నేడే తీరం దాటే అవకాశం.. ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల అలర్ట్

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫానుగా బలపడిన మాండూస్.. ప్రస్తుతానికి చెన్నైకి 440 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఏండీ) తెలిపింది. శుక్రవారం తీరం దాటొచ్చని, ఈ సమయంలో బలమైన ఈదురుగాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

C-KYC Portal: బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్, తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేమైనా ఉంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చు, బ్యాంకుకు వెళ్లనవసరం లేదని తెలిపిన RBI

Hazarath Reddy

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్‌బీఐ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఆన్‌లైన్‌లో కేవైసీ (ఖాతాదారుల వివరాలు) వెరిఫికేషన్‌ (e-KYC) పూర్తి చేసే బ్యాంకు కస్టమర్లు వార్షికంగా తమ వ్యక్తిగత వివరాల్లో మార్పులేమైనా ఉంటే వాటిని కూడా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) తెలిపింది.

Cyclone Mandous: దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్షాలు, రేపు మహాబలిపురంలో తీరం దాటనున్న మాండూస్ తుపాను, ప్రస్తుతం తమిళనాడుకు వైపుకు దూసుకు వస్తున్న సైక్లోన్

Hazarath Reddy

బుధవారం రాత్రి ట్రింకోమలీ (శ్రీలంక)కి 410 కిలోమీటర్లు, జాఫ్నాకు (శ్రీలంక) 550 కిలోమీటర్లు, కారైకాల్‌కు 610 కిలోమీటర్లు, చెన్నైకి 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

Advertisement

Cyclone Mandous: మాండూస్ తుపాన్‌గా మారనున్న వాయుగుండం, చిత్తూరు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు, తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడి

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం రానున్న 48 గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనివల్ల చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని ప్రకటించింది.

Cyclone Mandous: చిత్తూరు తీరం వైపు తుపాను, రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్రకు భారీ వర్షాలు, ఈ రోజు సాయంత్రం మాండూస్‌ తుపానుగా బలపడనున్న వాయుగుండం

Hazarath Reddy

ఈ వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి పశ్చిమ వాయవ్యదిశలో కదులుతూ మాండూస్‌ తుపానుగా (Cyclone Mandous) బలపడి రేపు ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Tamil Nadu Rains: తమిళనాడుపై విరుచుకుపడనున్న తుపాను, 13 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, డిసెంబర్ 8న తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు

Hazarath Reddy

తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి చేరుకోనుంది.

Consent Of Minor Is Not Consent: మైనర్ తీసుకునే నిర్ణయాలు చెల్లబోవు.. ఆమె సమ్మతి.. సమ్మతే కాదు.. మైనర్ అంగీకరించినా సరే.. అది అత్యాచారమే.. రేప్ కేసు విచారణలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

మైనారిటీ తీరని అమ్మాయి ఆమోదంతోనే లైంగిక ప్రక్రియ కొనసాగించినప్పటికీ, చట్ట ప్రకారం అది అత్యాచారం కిందికే వస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Word Of The Year ‘Goblin Mode’: ఆక్స్ ఫర్డ్ 2022 సంవత్సరం పదం ‘గోబ్లిన్ మోడ్’.. ఈ ఏడాది మూడు పదాలపై ఓటింగ్.. గోబ్లిన్ మోడ్ కు 3 లక్షల మందికి పైగా అనుకూలం

Rudra

ప్రముఖ ఇంగ్లిష్ డిక్షనరీ ‘ఆక్స్ ఫర్డ్’ 2022 సంవత్సరం పదంగా ‘గోబ్లిన్ మోడ్’ను ప్రకటించింది. వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఎంపిక కోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం మొదటిసారి.

Cyclone Mandous: దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. తుపానుగా మారనున్న వైనం.. ‘మాండస్’గా పేరుపెట్టిన యూఏఈ.. తీర ప్రాంతాల్లో విరుచుకుపడనున్న వానలు

Rudra

తమిళనాడుపై విరుచుకుపడేందుకు మరో తుపాను ఉరుముతూ వస్తున్నది. దక్షిణ అండమాన్ తీరం, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారి తీరం వైపు దూసుకురానుంది.

World's Largest Cargo Plane In Hyderabad: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం మన భాగ్యనగరికి వచ్చిందోచ్... వీడియో ఇదిగో!

Rudra

మేరు పర్వతంలా కనిపిస్తున్న ఈ భారీ విమానం పేరు బెలూగా. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ఈ ఎయిర్ బస్ లోహ విహంగం హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాజసం ఒలికిస్తూ గత రాత్రి ల్యాండైంది.

Free EAMCET Coaching: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఎంసెట్ శిక్షణ.. మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష

Rudra

తెలంగాణలో ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు దీటుగా ఇకపై ప్రభుత్వమే ఉచితంగా విద్యార్థినీ, విద్యార్థులకు ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

Advertisement

Cyclone Mandous: బంగాళాఖాతంలో మరో తుఫాను మాండౌస్ పుట్టింది, ఈ నెల 8న తీరం దాటే అవకాశం, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతం మీదుగా వారం మధ్యలో ఉష్ణమండల తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన సముద్రపు అలజడి, కొనసాగుతున్న తీవ్రత తర్వాత, త్వరలో 'మాండౌస్' తుఫానుగా నైరుతి బంగాళాఖాతంలో ఉధ్భవించే అవకాశం ఉంది.

Cyclone Mandous Live Tracker: ఏపీకి మాండౌస్ సైక్లోన్ ముప్పు, డిసెంబర్ 8 ఉదయం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం, తుఫాను లైవ్ ట్రాకర్ మ్యాప్ ఇదిగో..

Hazarath Reddy

Cyclone Mandous Live Tracker: డిసెంబర్ 8 ఉదయం నాటికి బంగాళాఖాతం సమీపంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తుఫాను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వ్యవస్థ, ఒకసారి తుఫానుగా మారితే, UAE సూచించినట్లుగా, తుఫాను మాండస్ అని పిలుస్తారు. ఈ తుఫాను ప్రత్యక్ష స్థానం కదలికను తనిఖీ చేయడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.

Relief To PhonePe, Google Pay: ఫోన్‌పే, గూగుల్‌ పేలకు గొప్ప ఉపశమనం.. ‘30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌’ రూల్ మరో రెండు సంవత్సరాలు పొడిగింపు

Rudra

ఫోన్‌ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యాప్‌లకు ప్రభుత్వం నుండి పెద్ద ఉపశమనం లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ యాప్‌లు 30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్‌ అనుసరించడానికి గడువును రెండు సంవత్సరాల పాటు డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది.

Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రద్దీ మార్గాల్లో ప్రత్యేక రైళ్ల ఏర్పాటు.. ఏఏ రూట్లలో ఏ సర్వీసు అంటే??

Rudra

నిర్ణీత మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

AP Staff Nurse Recruitment 2022: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ

Hazarath Reddy

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియమాకానికి (AP Staff Nurse Recruitment 2022) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 957 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన శుక్రవారం నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది.

TSPSC Group 4 Notification 2022: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో మరో రెండు గ్రూప్స్ నోటిఫికేషన్లు, తాజాగా 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీపీఎస్సీ

Hazarath Reddy

నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గ్రూప్‌-1 ద్వారా 503 పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ.. తాజాగా గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ జారీ (TSPSC Group 4 2022 Notification out) చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 25 శాఖల్లో ఏకంగా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ICSE Exam Schedule Released: ఐసీఎస్ఈ 10, ఐఎస్‌సీ 12 తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. పరీక్షల తేదీలివే!

Rudra

ఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ వచ్చే ఏడాది జరగనున్న సీఐఎస్‌సీఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సీఐఎస్‌సీఈ 2023 డేట్ షీట్‌ను cisce.org ద్వారా చెక్ చేసుకోవచ్చు.

TTD Srivani Tickets: గుడ్ న్యూస్, భక్తులకు తిరుపతిలోనే శ్రీవారి దర్శనం టికెట్లు, తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు, టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఆన్ లైన్ కాకుండా నేరుగా తిరుపతిలోనే టికెట్లు (Srivani tickets) పొందే ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది.

Advertisement
Advertisement