Ayodhya Ram Mandir: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక అయోధ్య రామయ్య దర్శనం మరింత సులభం.. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులోకి
Flight (Credits: X)

Hyderabad, Apr 1: అయోధ్య (Ayodhya) రామయ్యను దర్శించాలనుకునే హైదరాబాద్ (Hyderabad) వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు (Flight Service) అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌ జెట్ ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రెండు గంటల్లోనే చేర్చనుంది.

KCR Tour: మ‌రోసారి రైతుల వ‌ద్ద‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏప్రిల్ 5న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ లో ప‌ర్య‌ట‌న‌

షెడ్యూల్ ఇలా..

మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ నుంచి విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అదే రోజుల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ చేరుకుంటుంది.

KCR Nalgonda Tour: జనగాంలో కేసీఆర్ పర్యటన.. ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న కేసీఆర్.. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కేసీఆర్