What is AFSPA: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు మళ్లీ తెరపైకి, అసలేంటి ఈ చట్టం, దీని ద్వారా సాయుధ బలగాలకు సంక్రమించే అధికారాలు ఏంటి, ఏయే రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో ఉంది
ఈశాన్య సరిహద్దు ప్రాంతం నాగాలాండ్ లో ఆర్మీ బలగాలు తీవ్రవాదులు అనుకుని పనికివెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఈ కాల్పలు ఘటనలో 14 మంది కూలీలు మరణించారు. ఈ నేపథ్యంలో మరోసారి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (Armed Forces (Special Powers) Act) తెరపైకి వచ్చింది.
New Delhi, Dec 6: ఈశాన్య సరిహద్దు ప్రాంతం నాగాలాండ్ లో ఆర్మీ బలగాలు తీవ్రవాదులు అనుకుని పనికివెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఈ కాల్పలు ఘటనలో 14 మంది కూలీలు మరణించారు. ఈ నేపథ్యంలో మరోసారి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (Armed Forces (Special Powers) Act) తెరపైకి వచ్చింది. దాన్ని రద్దు చేయాలని అక్కడ మళ్లీ ఆందోళన మొదలైంది. అసలు AFSPA అంటే ఏమిటి. ఈచట్టంతో ఆర్మీకి ఉండే అధికారాలు ఏంటి అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.
నుండి సాయుధ దళాల (ప్రత్యేక శక్తి) చట్టం (AFSPA), 1958 ద్వారా సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. తీవ్రవాదులు కాని ఉగ్రవాదులు కాని సాయుధ దళాలకు "అంతరాయం కలిగించే ప్రాంతాల"లో ప్రజా శాంతిని నిర్వహించడానికి ఈ చట్టం (Armed Forces (Special Powers) Act, 1958) ద్వారా ప్రత్యేక అధికారాలను మంజూరు కాబడతాయి. అతిపెద్ద నాగా తిరుగుబాటు సమూహం ఇసాక్-ముయివా నేతృత్వంలోని నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలీమ్ మరోసారి దీన్ని రద్దు చేయాలనంటూ అందులో లోపాలను ఎత్తి చూపుతోంది.
ఇటీవలి చరిత్రలో అపూర్వమైన రీతిలో, భారత భద్రతా దళాలు ఈ అధికారం ద్వారా సామాన్యలుపై కాల్పలు జరిపిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కోన్యాక్ ప్రాంతంలోని ఓటింగ్ గ్రామంలో అమాయక గ్రామస్తులను అనాగరికంగా చంపివేశారు. ఇక 1997లో కాల్పుల విరమణ ఒప్పందంపై మరియు 2015లో "ఫ్రేమ్వర్క్ ఒప్పందం"పై సంతకం చేసిన తిరుగుబాటు బృందం, చట్టబద్ధమైన నాగా రాజకీయ ఉద్యమాన్ని అణిచివేసేందుకు భద్రతా బలగాలచే పౌరులను చంపడం ఇది ఒక చర్య అని ఆరోపించింది. 1997లో సంతకం చేసిన ఇండో-నాగా కాల్పుల విరమణలో ఇది అత్యంత దురదృష్టకరం’’ అని సంస్థ పేర్కొంది.
సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కట్టబెట్టిన అపరిమిత అధికారాలతోనే సైన్యం ఇలాంటి అతిక్రమణలకు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. తిరుగుబాట్లను, వేర్పాటువాదాన్ని, నిషేధిత ఉగ్రసంస్థలను అణచివేసే చర్యల పేరిట అమాయాకుల ఊచకోత, మహిళలపై సైన్యం అకృత్యాలు చేసిన దృష్టాంతాలెన్నో ఉన్నాయి. ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని ఇక్కడి పౌర సమాజం, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని, అలజడులను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాలకు సాధ్యం కాకపోవడంతో ఆరు దశాబ్దాల కిందట 1958లో కేంద్ర ప్రభుత్వం ‘ఏఎఫ్ఎస్పీఏ’ చట్టాన్ని తెచ్చింది.
ఈ చట్టం ఏ అధికారాలను కల్పిస్తుంది, ఏయే రాష్ట్రాల్లో ఉంది
1. కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన ప్రదేశాల్లో శాంతిభద్రతలను కాపాడే అధికారం సైనిక బలగాలకు ఉంటుంది. ఐదుగురికి మించి ఒకేచోట గుమిగూడకుండా ఆర్మీ నిషేధం విధించగలదు.
2. ఎవరైనా ఈ ఆజ్ఞలను ఉల్లంఘించారని భావిస్తే బలప్రయోగం ద్వారా నియంత్రించొచ్చు. ముందస్తు హెచ్చరిక జారీచేసి కాల్పులూ జరపొచ్చు.
3. సమంజసమైన అనుమానం ఉంటే వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అరెస్టుకు కారణాలను వివరిస్తూ తర్వాత సమీపంలోని పోలీసుస్టేషన్లో సదరు వ్యక్తిని లేదా వ్యక్తులను అప్పగించవచ్చు.
4. వారెంటు లేకుండానే ఎవరి ఇంట్లోకైనా ప్రవేశించి సోదాలు జరపొచ్చు. ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించొచ్చు.
5. కల్లోలిత ప్రాంతం..అంటే భిన్న మతాలు, జాతులు, భాషలు, కులాలు, ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి ఘర్షణలు తలెత్తితే ఆ ఏరియాను కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించే వీలును ఏఎఫ్ఎస్పీఏ చట్టంలోని సెక్షన్–3 కల్పిస్తోంది.
6. కేంద్ర ప్రభుత్వం (హోంశాఖ), లేదా రాష్ట్ర గవర్నర్ మొత్తం రాష్ట్రాన్ని లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించొచ్చు. శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర యంత్రాంగానికి సైనిక బలగాల సాయం అవసరమైన చోట్ల ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్ఎస్పీఏను ప్రయోగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలివేయవచ్చు.
7. అస్సాం, నాగాలాండ్, మణిపూర్ (మణిపూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాను మినహాయించి), అరుణాచల్ప్రదేశ్లోని చాంగ్లాంగ్, లాంగ్డింగ్, తిరప్ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది.
8. నాగాలాండ్లో డిసెంబరు 31 దాకా దీన్ని పొడిగిస్తూ ఈ ఏడాది జూన్ 30నే ఆదేశాలు జారీ అయ్యాయి. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 11న మరో ఆరునెలలు ఈ చట్టం అమలును పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. మేఘాలయలో ఏప్రిల్ 1, 2018న ఈ చట్టాన్ని కేంద్రం ఎత్తివేసింది.
ఇరోమ్ షర్మిల దీక్ష చేసినా ఆదరణ కరవు
మణిపూర్ ఉక్కుమహిళగా పేరు గాంచిన ఇరోమ్ షర్మిల ఈ పేరు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 2000 నవంబరులో మణిపూర్లోని మలోమ్ పట్టణంలో బస్సు కోసం వేచిచూస్తున్న 10 మంది సాధారణ పౌరులను అస్సాం రైఫిల్స్ దళం కాల్చి చంపింది. ఈ మలోమ్ ఊచకోతకు నిరసనగా, ఏఎఫ్ఎస్పీఏను ఉపసంహరించాలనే డిమాండ్తో 28 ఏళ్ల ఇరోమ్ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. మూడు రోజులకే ఆత్మహత్యకు ప్రయత్నించిందనే అభియోగంపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
2000 నవంబర్ నుంచి 2016 ఆగస్టు దాకా పోలీసు కస్టడీలోనే ఇరోమ్ షర్మిల నిరాహారదీక్షను కొనసాగించారు. ఈ సమయంలో ట్యూబ్ ద్వారా ఆమెకు బలవంతంగా ద్రవాహారం అందించారు. కేంద్రం ఈ చట్టాన్ని ఎంతకీ ఉపసంహరించుకోకపోవడంతో ఆమె మనసు మార్చుకొని 2016 ఆగస్టు 9న తన దీక్షను విరమించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇరోమ్ సొంత పార్టీ పెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబీ సింగ్పై పోటీచేశారు. కేవలం 90 ఓట్లు మాత్రమే పడ్డాయి. తమ ప్రజలపై అకృత్యాలను ఎండగడుతూ... ప్రపంచం దృష్టిని అకర్షించి, ఏకధాటిగా 16 ఏళ్లు దీక్ష చేసినా... సొంత జనమే ఆదరించలేదు. సాయుధ బలగాల అకృత్యాలకు ఊతమిచ్చే ఈ నిరంకుశ చట్టం ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉంది.
రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఇండో-నాగా రాజకీయ చర్చలు చాలా ఫలవంతంగా ఉన్నప్పటికీ, నాగాలపై హింస నిరంతరం అక్కడ కొనసాగుతోంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-K)కి చెందిన నికి సుమీ నేతృత్వంలోని ఖప్లాంగ్ వర్గం కూడా శాంతి చర్చల మధ్య జరిగిన హత్యలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
స్నేహితుల ముసుగులో వచ్చి అమాయక ప్రజలపై అత్యంత హేయమైన చర్యలకు పాల్పడే భద్రతా బలగాల దురాగతాలను నాగాస్ చాలా కాలంగా భరిస్తున్నారు. నాగాలు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నందున..భారత ప్రభుత్వం, నాగాలాండ్ ప్రభుత్వం కూడా ఆలస్యం చేయకుండా సరైన విచారణ ప్రారంభించి, అమాయక ప్రజల జీవితాలతో ఆడుకునే వారిపై తగిన చర్యలు తీసుకోవాలి, ”అని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజధానిలో కొనసాగుతున్న హార్న్బిల్ పండుగను జరుపుకోవద్దని ప్రభావవంతమైన నాగా మదర్స్ అసోసియేషన్ (NMA) నాగ తెగలందరికీ విజ్ఞప్తి చేసింది. మన ఇళ్లలో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ విందు చేయడం మా నాగ సంప్రదాయంలో నిషిద్ధం. ప్రపంచానికి మన బాధలను తెలియజేయండి. AFSPA కింద కొనసాగుతున్న సైనికీకరణ, హత్యలకు వ్యతిరేకంగా మననిరసన గళాలు వినిపించాలి, ”అని NMA అధ్యక్షుడు అబీయు మేరు ఒక ప్రకటనలో తెలిపారు. AFSPA కింద పదేపదే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సంస్థ డిమాండ్ చేస్తోంది
(The above story first appeared on LatestLY on Dec 06, 2021 12:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

