Maharashtra Shocker: ముంబైలో దారుణం, రూ.300 ఇవ్వలేదని బాలుడిని నగ్నంగా రోడ్డు మీద ఉరికించి కొట్టిన ఇద్దరు వ్యక్తులు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

రూ.300 చెల్లించలేదన్న కారణంతో 17 ఏళ్ల బాలుడిని నగ్నంగా చేసి, బలవంతంగా రోడ్డుపైకి లాక్కెళ్లి బెల్ట్ తో బాదిన దారుణమైన వీడియో బయటకు వచ్చింది. బ్లూటూత్‌ను 'ఫ్లిక్' చేశాడని ఆరోపిస్తూ ఇద్దరు వ్యక్తులు బెల్టులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

Maharashtra Shocker: ముంబైలో దారుణం, రూ.300 ఇవ్వలేదని బాలుడిని నగ్నంగా రోడ్డు మీద ఉరికించి కొట్టిన ఇద్దరు వ్యక్తులు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
Representative Image

ముంబై, నవంబర్ 22:  రూ.300 చెల్లించలేదన్న కారణంతో 17 ఏళ్ల బాలుడిని నగ్నంగా చేసి, బలవంతంగా రోడ్డుపైకి లాక్కెళ్లి బెల్ట్ తో బాదిన దారుణమైన వీడియో బయటకు వచ్చింది. బ్లూటూత్‌ను 'ఫ్లిక్' చేశాడని ఆరోపిస్తూ ఇద్దరు వ్యక్తులు బెల్టులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్వస్థలమైన థానేలోని కాల్వా శివారులోని జామా మసీదు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.

దారుణం, భార్యను చంపి రాత్రంతా శవం పక్కనే భర్త, అర్థరాత్రి ఇంటికి వస్తే భోజనం వడ్డించకపోవడంతో బండతో కొట్టి హత్య

తౌసిఫ్ ఖాన్‌బండే మరియు సమీల్ ఖాన్‌బండే అనే ఇద్దరు వ్యక్తులు సమీపంలోని అన్నపూర్ణ బిల్డింగ్‌లోని మైనర్ బాలుడి ఇంట్లోకి చొరబడ్డారు.బ్లూటూత్ పరికరాన్ని దొంగిలించారని అలాగే రూ. 300 రుణాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే బాలుడు ఆరోపణలను తిరస్కరించాడు. వారికి రుణాన్ని ఇవ్వడానికి నిరాకరించాడు. తౌసిఫ్ బాలుడి ప్యాంటు నుండి బెల్ట్‌ను తీసి, సహాయం కోసం అరుస్తుండగా బాలుడి వీపుపై కొరడాతో కొట్టడం ప్రారంభించాడు, సామిల్ వెనుక నుండి సంఘటన యొక్క వీడియోను చిత్రీకరించాడు.

టీచర్ కాదు కామాంధుడు, ట్యూషన్ పేరుతో బాలికపై తొమ్మిది ఏళ్ల నుంచి అత్యాచారం

ఇద్దరూ పట్టుకుని, బహిరంగ ప్రదేశంలో బాలుడిని పూర్తిగా నగ్నంగా ఉంచారు. అతనిపై దాడి చేయడం కొనసాగించడంతో బాలుడు నగ్నంగా అక్కడి నుండి ఇరుకైన బైలేన్ గుండా పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే సామాజిక కార్యకర్త డాక్టర్ బిను వర్గీస్ ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వీడియోను థానే పోలీసు ఉన్నతాధికారులకు ఫార్వార్డ్ చేశాడు. చివరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్-I) గణేష్ ఎన్. గవాడే ఈ విషయంపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.

Here's Disturbed Video 

ఈరోజు తెల్లవారుజామున, కాల్వా పోలీసులు చర్యకు దిగారు. టీనేజ్ బాలుడి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు, పోక్సో మరియు ఇండియన్ పీనల్ కోడ్‌లోని కఠినమైన సెక్షన్లను అమలు చేశారు, మరియు తదుపరి విచారణలు కొనసాగుతున్నాయని వర్గీస్ చెప్పారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో 20 గంటలకు పైగా ఆలస్యం కావడంతో, మైనారిటీ కమ్యూనిటీకి చెందిన మైనర్ బాధితుడుని పోలీసు స్టేషన్‌కు తీసుకురావడానికి ముందు వైద్య పరీక్షలు మరియు చికిత్స కోసం మొదట తీసుకువెళ్లామని, ఫలితంగా ఆలస్యం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

ప్రధాన నిందితుడు తౌసిఫ్‌ను ఈ రోజు మధ్యాహ్నం అరెస్టు చేశామని, పరారీలో ఉన్న సామిల్ కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయని, గత రాత్రి నుండి అజ్ఞాతంలోకి వెళ్లాడని పోలీసు అధికారి తెలిపారు.

(The above story first appeared on LatestLY on Nov 22, 2023 06:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).