Monkeypox in India: భారత్లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్ వైరస్, తాజాగా ఢిల్లీలో మరో కేసు, దేశంలో తొమ్మిదికి చేరుకున్న మంకీ పాక్స్ వైరస్ బాధితుల సంఖ్య
భారత్ లో మంకీపాక్స్ వైరస్ కలకలం రేపుతోంది. కేరళలో ఓ యువకుడికి పాజిటివ్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలో నివశిస్తున్న నైజీరియన్ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాజధానిలో మొత్తం మూడు కేసులు, దేశవ్యాప్తంగా తొమ్మదికి చేరుకున్నట్లు తెలిపారు
భారత్ లో మంకీపాక్స్ వైరస్ కలకలం రేపుతోంది. కేరళలో ఓ యువకుడికి పాజిటివ్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఢిల్లీలో నివశిస్తున్న నైజీరియన్ వ్యక్తికి మంకీపాక్స్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాజధానిలో మొత్తం మూడు కేసులు, దేశవ్యాప్తంగా తొమ్మదికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో నివశిస్తున్న 35 ఏళ్ల నైజిరియన్ వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి, వాటిని పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపినప్పుడు పాజిటివ్గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఢిల్లీ ప్రభుత్వాస్పత్రి ఎల్ఎన్జీపీలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
Another Nigerian man tests positive for monkeypox, third case in Delhi
Read @ANI Story | https://t.co/PeUAPPvxGd#MonkeypoxVirus #Delhi #monkeypox pic.twitter.com/rqCLxL0Ij3
— ANI Digital (@ani_digital) August 2, 2022
(The above story first appeared on LatestLY on Aug 02, 2022 05:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

