Politics
President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు, చెల్లని ఓట్ల సంఖ్య 15, ఇంకా కొనసాగుతున్న ఓటింగ్
Hazarath Reddyదేశ 15వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ద్రౌపది ముర్ము 3,78,000 విలువ గల 540 ఓట్లు సాధించగా, యశ్వంత్ సిన్హా 1,45,600 విలువతో 208 ఓట్లు సాధించారు. ఇవి పార్లమెంటుకు సంబంధించిన గణాంకాలు మాత్రమే.
National Herald Case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మూడు గంటల పాటు విచారణ, ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన సోనియా గాంధీ
Hazarath Reddyనేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజనానికి విరామం ఇవ్వడంతో సోనియా ఈడీ కార్యాలయం నుంచి తన నివాసానికి వెళ్లిపోయారు
Congress Protest: కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ ఫిరంగులు మోగించిన పోలీసులు, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన
Hazarath Reddyనేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)ని ఈడీ(ED) అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు సీఆర్‌పీఎఫ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు
CM Mamata Banerjee: స్వీట్లు, లస్సీ, పెరుగుపై కూడా జీఎస్టీ విధిస్తే ప్రజలు ఏమి తింటారు, TMC యొక్క అమరవీరుల దినోత్సవ ర్యాలీలో మమత ఫైర్
Hazarath Reddyకేంద్రం కొత్తగా తీసుకువచ్చిన జీఎస్టీ మార్పుల పై దీదీ మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు పఫ్ రైస్‌పై కూడా జీఎస్టీ విధించారు కాబట్టి బీజేపీ వాళ్లు ఇప్పుడు ఏమీ తినరు. స్వీట్లు, లస్సీ, పెరుగుపై కూడా వారు జీఎస్టీ విధిస్తారు. ఇక ప్రజలు ఏమి తింటారు?
CM Mamata Banerjee: బీజేపీయేత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల్చడమే బీజేపీ లక్ష్యం, ప్రధాని మోదీ సర్కారుపై బెంగాల్ సీఎ మమతా బెనర్జీ మండిపాటు
Hazarath Reddyకేంద్రంలోని ప్రధాని మోదీ సర్కారు.. బీజేపీయేత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కూల‌దోయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ మండిప‌డ్డారు.
Congress Protest: పోలీసుల అదుపులో 75 మంది కాంగ్రెస్ ఎంపీలు, సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన
Hazarath Reddyనేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)ని ఈడీ(ED) అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతకుముందు సీఆర్‌పీఎఫ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
President Election 2022: పార్లమెంట్‌లో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్, నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం
Hazarath Reddyదేశ 15వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. న్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను పార్లమెంట్‌ హౌస్‌లో లెక్కిస్తున్నారు
Ranil Wickremesinghe: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే, గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక
Hazarath Reddyశ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ ను శ్రీలంక పార్లమెంటు ఎన్నుకుంది. 221 ఓట్లకు గాను విక్రమసింఘేకు మొత్తం 134 ఓట్లు వచ్చాయి.
LDF Convener Jayarajan: నడిచైనా వెళతా కాని జన్మలో ఇండిగో విమానం ఎక్కను, శపథం చేసిన కేరళ ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్
Hazarath Reddyఈ జన్మలో ఇండిగో విమానం ఎక్కనంటూ కేరళ రాజకీయనేత, అధికార పక్షం ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ శపథం చేశారు. తానే కాదు, తన కుటుంబ సభ్యులు కూడా ఇండిగో విమానాల్లో ప్రయాణించరని అన్నారు.
Aligireddy Joins Congress: టీఆర్ఎస్‌ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్ర‌వీణ్ రెడ్డి టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Polavaram Project: సెగలు పుట్టిస్తున్న మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు, ఎన్నికలు కోసం ఆంధ్రా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని మండిపాటు, కొత్త వివాదాన్ని సృష్టించొద్దన్న అంబటి రాంబాబు
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుతో (Polavaram Project) భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి ఉందన్న తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో అగ్గిని రాజేస్తున్నాయి. దీనిపై వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు వేస్తున్నారు
Telangana: పోలవరంతో భద్రాచ‌లానికి పెను ముప్పు, సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల‌ను తెలంగాణ‌లో క‌ల‌పాలని డిమాండ్
Hazarath Reddyతెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌ (telangana minister puvvada ajay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుతో భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి ఉంద‌న్నారు.
MP Dharmapuri Arvind: కేసీఆర్‌ మానసిక పరిస్థితి దిగజారుతోంది, ఇకపై పరుష పదజాలంతో ఆయనను విమర్శించను, రాజకీయంగా, సాంకేతికంగానే సీఎంను విమర్శిస్తానని తెలిపిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
Hazarath Reddyగత కొంతకాలంగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇకపై సీఎంను పరుష పదజాలంతో విమర్శించబోనని స్పష్టంచేశారు. రాజకీయంగా, సాంకేతికంగానే కేసీఆర్‌ను విమర్శిస్తానని, ఇవి ఆవేదనతో చెబుతున్న మాటలని వ్యాఖ్యానించారు.
Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం, ఒక్కో ఎమ్మెల్యే ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశాలు
Hazarath Reddyగడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు.
Presidential Election 2022: అసెంబ్లీలోకి అడుగుపెట్టిన చంద్రబాబు, రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న టీడీపీ అధినేత, ఒట్టు తీసి గట్టున పెట్టేశాడని వైసీపీ ఎంపీ వ్యంగ్యం
Hazarath Reddyదేశంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాష్ట్ర అసెంబ్లీకి తరలి వెళ్లారు.
Presidential Election 2022: ఎమ్మెల్యే సీతక్క ఓటుపైనే అందరి చర్చ, పొరపాటున ఎన్డీఏ అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, నా ఆత్మ సాక్షిగా నేను వేయాల్సిన వారికే ఓటు వేశానని వెల్లడి
Hazarath Reddyకాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(Congress MLA Seethakka) విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwanth Sinha)కు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూ(Murmu)కు వేశారు.
Presidential Poll 2022: రాష్ట్రప‌తి ఎన్నికలో 99.18 శాతం పోలింగ్ న‌మోదు, ఢిల్లీలో ఓటు హక్కును వినియోగించుకున్న 730 మంది సభ్యులు, ఓటింగ్‌కు దూరంగా ఆరుగురు సభ్యులు
Hazarath Reddyభార‌త నూత‌న రాష్ట్రప‌తి ఎన్నిక కోసం సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌కు సంబంధించి 99.18 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది. ఈ మేర‌కు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌ రిట‌ర్నింగ్ అధికారిగా వ్య‌వ‌హ‌రించిన రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ పీసీ మోదీ సోమ‌వారం సాయంత్రం పోలింగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.
Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నిక.. తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్‌కు దూరంగా నలుగురు ఎమ్మెల్యేలు, ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో 117 మంది ఎమ్మెల్యేలు
Hazarath Reddyటీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి ( Balakrishna, Butchaiah Chowdary) తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసింది.