రాజకీయాలు

YSR Arogya Aasara: పేదలకు భరోసానిచ్చే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా, శస్త్రచికిత్స తరువాత విశ్రాంత సమయంలో రోజుకు రూ. 225, గుంటూరులో అధికారికంగా ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, పథకం ద్వారా నాలుగున్నర లక్షల మందికి లబ్ధి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకం(YSR Arogya Sri)లో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా(YSR Arogya Aasara Scheme) పథకాన్ని గుంటూరు (Guntur) జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు.

Justice For Disha: డిసెంబర్ 31లోపు 'దిశ' కేసులో నేరస్తులను ఉరి తీయాలి, పార్లమెంటులో హైదరాబాద్ హత్యోదంతంపై చర్చ, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు

Vikas Manda

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినతరం చేయాలని, దోషులకు వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సభ్యులు గళమెత్తారు.....

Onions Shortage: ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం కీలక చర్యలు, టర్కీ నుంచి 11,000 టన్నుల ఉల్లి దిగుమతులు, ఆర్డర్ ఇచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ, ధరల సమీక్షకు అమిత్‌ షా నేతృత్వంలో మంత్రుల బృందం

Hazarath Reddy

చుక్కలు తాకుతున్న ధరలతో కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం( Central government) రంగంలోకి దిగింది. దేశంలో ఉల్లి సరఫరాలను పెంచేందుకు టర్కీ (Turkey) నుంచి 11వేల మెట్రిక్ టన్నుల ఉల్లి దిగుమతులకు(9MMTC to import of 11000 MT of Onions) ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ (MMTC) ఆర‍్డర్‌ ఇచ్చింది.

Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెనకు ప్రభుత్వం ఉత్తర్వులు, పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని నిర్ణయం, పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS Jagan) ఎన్నికల హామీల్లో ఇచ్చిన నవరత్నాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), జగనన్న వసతి దీవెన (Jagananna vasathi deevena)పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Government of Andhra Pradesh) శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

Advertisement

Good News To RTC Workers: ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాల జల్లులు, సమ్మె కాలానికి జీతాలు, కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు, మహిళలు రాత్రి 8 గంటలకే డ్యూటీ ముగించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ (Telangana CM KCR) వరాలు ఇచ్చారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా.. ఆర్టీసీ కార్మికులతో కలిసి కేసీఆర్‌ భోజనం(Telangana CM KCR Lunch Meeting With RTC Employees) చేశారు. అనంతరం కార్మికులపై వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ(RTC)ని లాభాల్లోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్‌లు ఇస్తామని వెల్లడించారు.

Maharashtra Assembly Speaker: స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నానా పటోలే, ప్రధాని మోడీపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన పటోలే, రైతు సమస్యలపై మంచి పట్టున్న నేత, రేసులోనుంచి తప్పుకున్న బీజేపీ

Hazarath Reddy

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నానా పటోలే ( Maharashtra assembly speaker Nana Patole)బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే(Maharashtra chief minister Uddhav Thackeray), ప్రతిపక్ష నేత దేవేంద్ర(Devendra Fadnavis) ఫడ్నవీస్​.. పటోలేను సభాపతి స్థానంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్​ రేసు నుంచి బీజేపీ తప్పుకోవడంతో పటోలే ఎన్నిక ఏకగ్రీవం అయింది.

UP Govt School English Teacher: పేరుకే ఇంగ్లీష్ టీచర్, రెండు ముక్కలు ఇంగ్లీష్ చదవడం రాదు, బిత్తరపోయి వెంటనే సస్పెండ్ చేసిన అధికారులు, ఉత్తరప్రదేశ్‌లో ఘటన

Hazarath Reddy

దేశంలో ప్రభుత్వ స్కూళ్లలో (government schools) విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యం కొంత అయితే టీచర్ల వైఫల్యం మరికొంత అని చెప్పవచ్చు. అడ్డదారిలో జాబు తెచ్చుకున్న కొంతమంది టీచర్లు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో ఫెయిల్ అవుతూ వస్తున్నారు.

Earthquake Helmets: భూకంపం నుంచి రక్షించుకోవడానికి హెల్మెట్లు ధరించిన స్పీకర్, ఎంపీలు, జపాన్ పార్లమెంట్‌లో ఆసక్తికర సంఘటన, ఎర్త్‌కేక్ డ్రిల్ చర్చలో భాగంగా హెల్మెట్లు ధరించిన నేతలు

Hazarath Reddy

జపాన్ పార్లమెంట్‌(Japan Parlment)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్పీకర్, ఎంపీలు తలకు హెల్మెట్లు (Earthquake Helmets) ధరించారు. దీనికి కారణం ఏంటంటేతమను తాము భూకంపాల నుంచి రక్షించుకోవాడానికేనని వారు చెబుతున్నారు. జపాన్‌ ని భూకంపాల దేశం (Earthquake Country) అని కూడా అంటుంటారు దీనికి ప్రధాన కారణం అక్కడ తరచుగా భూకంపాలు ఏర్పడుతుండటమే.

Advertisement

Jharkhand Polls: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు, తొలి విడతలో 62.87 శాతం పోలింగ్ నమోదు, 81 అసెంబ్లీ స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌, ఐదు విడతలుగా ఎన్నికలు, గన్‌తో హల్ చల్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి త్రిపాఠి

Hazarath Reddy

జార్ఖండ్ ( Jharkhand) రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం నాడు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ శాతం 62.87గా నమోదైంది. ఆరు జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. 37 లక్షల మంది ఓటర్లు మొదటి విడతలో తమ ఓటు హక్కును వినుయోగించుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ వినయ్ కుమార్ చౌబే తెలిపారు.

Maharashtra Assembly Floor Test: బల పరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం, రాజ్యాంగ విరుద్ధమంటూ అసెంబ్లీ నుంచి ఫఢ్నవిస్ టీం వాకౌట్, కనీసం వందేమాతర గీతం కూడా పాడలేదంటూ బీజేపీ విమర్శలు

Hazarath Reddy

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray-led Maharashtra government) కీలకమైన బలపరీక్ష(Maharashtra floor test)లో నెగ్గారు.మొత్తం 169 ఓట్లతో మహావికాస్ అఘాడి (Maha Vikas Aghadi) కూటమి విజయం సాధించింది.

Karnataka MLAs Honey-Trapping Case: ఎమ్మెల్యేల హానీ ట్రాప్ కేసు, 8 మందిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు, కోట్ల రూపాయలను పోగేసుకున్న హానీ ట్రాప్ ముఠా

Hazarath Reddy

ఆ మధ్య బెంగుళూరు(Bengaluru)లో ఎమ్మెల్యేల హానీ ట్రాప్ (MLA Honeytrap) కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల(Karnataka politicians and businessmen )కు అందమైన అమ్మాయిలను ఎర వేసి వారు అమ్మాయిలతో రాసలీలల్లో మునిగి తేలుతున్నప్పుడు వీడియో(Videos)లు తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.

Thieves Steal Onions In Bengal: డబ్బులు వదిలేసి ఉల్లిపాయలను దొంగిలించిన దొంగలు, పశ్చిమ బెంగాల్‌లో ఘటన, వాటి విలువ రూ. 50 వేలకు పైగానే..,ధరల పెరుగుదలతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి

Hazarath Reddy

దేశంలో ఉల్లి ధరలు (onions Price) ఆకాశాన్ని తాకుతున్నాయి. వాటి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంచి రకం ఉల్లి ధర మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతోంది. ఈ నేపథ్యంలో దొంగలు ఉల్లిపాయలను దొంగిలించే పని(Thieves Steal Onions)లో బిజీ అయ్యారు.

Advertisement

Maharashtra Floor Test: నేడు బల పరీక్ష ఎదుర్కోనున్న ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం, కొత్త ప్రొటెం స్పీకర్‌గా ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్‌ వాల్సే పాటిల్‌, శివసేన ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని ట్విస్టుల నడుమ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే (Shiv Sena chief Uddhav Thackeray) ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బల పరీక్ష(Maharashtra Assembly Floor Test) ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు మూడు కలిసి మహా వికాస్‌ ఆఘాడి కూటమి(Maha Vikash Aghadi govt)గా ఏర్పాడిన సంగతి అందిరికీ తెలిసిందే.

Jharkhand Election 2019: జార్ఖండ్ ఎన్నికలకు సర్వం సిద్ధం, తొలి విడతలో 13 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్, మొత్తం అయిదు దశల్లో ఎన్నికలు, ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకు పోలింగ్, డిసెంబర్ 23న ఫలితాలు

Hazarath Reddy

జార్ఖండ్‌లో ఎన్నికల నగారా (Jharkhand Election 2019) నేడు పోలింగ్ జరుగనుంది. ఇక్కడ మొత్తం 37 కోట్ల 83 లక్షల 055 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలన్నాయి. మొదటి దశలో (first phase of vote in the Jharkhand Assembly polls) బీజేపీ 12 చోట్ల పోటీ చేస్తోంది. ఒక చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి.

YS Jagan Rule: నేటితో ఆరు నెలల పాలనను పూర్తి చేసుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్, 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం, సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత చేరువగా, జగన్ ఆరు నెలల పాలనపై ఓ విశ్లేషణ

Hazarath Reddy

ఒక్కడు.. ఒంటరిగా వచ్చాడు. వేలు లక్షలుగా జనం అతని వెంట నడిచారు. ప్రజాసంకల్పంతో తను గెలిచాడు. కోట్లాది మంది ప్రజలను తన గెలుపులో భాగస్వామిని చేశాడు. వైయస్‌ఆర్‌‌సీపీ అధినేత (YSRCP Ledaer)గా ఎనిమిదేళ్ల ప్రయాణం. ఏపీ (Andhra Pradesh) ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పోరాటం. ఇలా అన్నింటిలో ఆయన అడుగులు తడబడలేదు. స్వయంకృషిని నమ్ముకున్నాడు.

CM KCR Meeting With RTC Staff: ఈ ఆదివారం అందరూ లంచ్‌కి రండి! ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి సమావేశం, ప్రతి డిపో నుంచి ఐదుగురికి ఆహ్వానం, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం

Vikas Manda

కార్మికులందరూ డిసెంబర్ 1, మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రగతి భవన్‌కు చేరుకునేటట్లుగా చూడాలని, వారికి ఇక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. లంచ్ తర్వాత కార్మికులతో ....

Advertisement

Midday Meal Scheme In UP: బకెట్ నీళ్లు..లీటరు పాలు, తాగమంటూ పిల్లలకు ఇచ్చిన వంట మనిషి, యూపీలో ఘటన, ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Hazarath Reddy

ప్రభుత్వ పాఠశాలకు పంపితే చదువుతో పాటు మధ్యాహ్న భోజన పథకం ద్వారా తమ పిల్లల కడుపు కూడా నిండుతుందని ఆశపడే నిరుపేదలు దేశంలో ఎంతోమంది ఉన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఈ పథకానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే వాటి ఫలాలు మాత్రం విద్యార్థులకు అందడం లేదని మరోసారి రుజువైంది.

Post-TSRTC Strike Tussle: కార్మిక సంఘాల నేతలకు డ్యూటీ రిలీఫ్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం, 'చిల్లర చర్య' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వత్థామ రెడ్డి

Vikas Manda

ఆర్టీసీని అధికారులు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. సంస్థను కాపాడుకోవడం కోసమే ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేశామన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక సమ్మెగా అశ్వత్థామ రెడ్డి తెలిపారు...

Goa Political Earthquake: గోవాకు పాకిన మహారాష్ట్ర రాజకీయ ప్రకంపనలు, కాషాయ పార్టీలో కలకలం రేపుతున్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలు, శివసేన ఎంపీని కలిసిన జీఎఫ్‌పీ అధ్యక్షుడు విజయ్‌ సర్ధేశాయ్‌, ముగ్గురు ఎమ్మెల్యేలు

Hazarath Reddy

శివసేన దెబ్బకు బీజేపీ పార్టీ మహారాష్ట్ర(Maharashtra)లో అధికారాన్ని కోల్పోయిన సంగతి విదితమే. ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ పని మహారాస్ట్రతో అయిపోయేలా లేదు, మహారాష్ట్ర రాజకీయ ప్రకంపనలు గోవాను కూడా తాకేలా ఉన్నాయి. ఇందుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay Raut) చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Reverse Tendering In Housing Projects: జగన్ సర్కారు మరో సంచలనం, ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ ద్వారా మరోసారి రూ.105.91 కోట్లు ఆదా, ఏపీ టిడ్కోలోని 65,969 హౌసింగ్‌ యూనిట్లకు దశలవారీగా రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టాలంటూ ఏపీ సీఎం జగన్ ఆదేశాలు

Hazarath Reddy

పోలవరం రివర్స్ టెండరింగ్ (Polavaram Reverse Tendering) ద్వారా డబ్బును ఆదా చేసిన ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) తాజాగా మరో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ .105.91 కోట్లను ఆదాచేసింది. ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండర్ (Reverse Tendering In Homes) ద్వారా జగన్ సర్కారు మరోసారి ప్రజాధనాన్ని ఆదా చేసింది.

Advertisement
Advertisement