Politics

2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటరు మహాశయులు.. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇతరత్రా ప్రముఖులు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలున్న ఏపీలో ఓటింగ్ ప్రారంభమైంది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్‌ సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది.

2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో నేటితో ఎన్నికల ప్రచారానికి తెర.. తది దశకు చేరిన ఎన్నికల ఏర్పాట్లు

Rudra

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనున్నది. నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారపర్వాన్ని ముగించాల్సి ఉండటంతో ఇరు రాష్ట్రాలలోని వందలాది అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు ప్రచారం ముగియనున్నది.

Arvind Kejriwal Released From Tihar Jail: వీడియో ఇదిగో, తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్‌ కేజ్రీవాల్‌, కారులో నుంచి అభివాదం చేస్తూ వెళ్లిపోయిన ఢిల్లీ సీఎం

Hazarath Reddy

ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు మధ్యంత బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే శుక్రవారం(మే10) సాయంత్రం ఢిల్లీ సీఎం జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి బయటికి వచ్చిన ఆయన కారులో నుంచి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు.

Lok Sabha Elections 2024: చివరి నిమిషం వరకు ఎన్నికల ప్రచారం, నామినేషన్‌ దాఖలు సమయం ముగుస్తుందని తెలిసి రోడ్డుపై పరుగెత్తిన బీజేపీ అభ్యర్థి, వీడియో వైరల్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శశాంక్‌ మణి త్రిపాఠి ( Shashank Mani Tripathi) పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పడిన నామినేషన్ వేయడం సంగతి మరచిపోయారు. చివరకు నామినేషన్ దాఖలు కోసం రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్‌ కేంద్రానికి పరుగులు తీశారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో నా తమ్ముడికి మద్ధతుగా ప్రచారానికి వెళ్లడం లేదు, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన చిరంజీవి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తాను తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం వెళుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పిఠాపురానికి తాను రావాలని కల్యాణ్ కోరుకోడన్నారు. కల్యాణ్ బాబు ఎప్పుడూ బాగుండాలని... జీవితంలో అనుకున్నవి సాధించాలని కోరుకుంటానన్నారు. మా తమ్ముడు రాజకీయంగా ఎదగాలని మా కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోందన్నారు.

Arvind Kejriwal Gets Interim Bail: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు, జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని ఆదేశాలు

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది.

Andhra Pradesh Elections 2024: జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వండి, ముద్రగడ పద్మనాభం లేఖ ఇదిగో..

Hazarath Reddy

రాష్ట్ర ప్రజలు, పిఠాపురంవాసులకు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్ర గర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను ముద్రగడ కోరారు.గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారు

India-Maldives Row: భారత్‌పై ఇంకెప్పుడు అలాంటి వ్యాఖ్యలు రిపీట్ కానివ్వం, గత పరిణామాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మాల్దీవులు ప్రభుత్వం, జై శంకర్ తో మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భేటీ

Hazarath Reddy

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ఈరోజు న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో భారత్-మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ మరియు భద్రతా సమస్యలపై అన్ని అంశాలపై చర్చించారు.

Advertisement

India-Maldives Row: మాల్దీవులు-భారత్‌ సమావేశమైన మరుసటి రోజే కీలక పరిణామం, మాల్దీవుల్లో ఉన్న చివరి బ్యాచ్ సైనికులను పూర్తిగా స్వదేశానికి రప్పించిన భారత్

Hazarath Reddy

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన మాల్దీవుల సహచరుడు మూసా జమీర్‌ను కలిసిన ఒక రోజు తర్వాత (Day after Maldives FM-India EAM Meet), అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ నిర్దేశించిన మే 10 గడువు కంటే ముందే మాల్దీవుల నుండి తన సైనికులందరి ఉపసంహరణను (New Delhi completely withdraws soldiers) భారతదేశం పూర్తి చేసింది.

Navneet Rana '15 Seconds' Remarks: బీజేపీ ఎంపీ నవనీత్ రానా 15 సెకన్ల వ్యాఖ్యల దుమారం, వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈసీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన బీజేపీ నాయకురాలు నవనీత్‌కౌర్‌ ఒవైసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

Lok Sabha Elections 2024: ఇద్దరు భార్యలుంటే మహాలక్ష్మి పథకం కింద రెండు లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి సంచలన హామీ, ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇస్తుందని తెలిపారు. ఆ సొమ్ము నేరుగా మహిళ ఖాతాలో జమఅవుతుందని తెలిపారు.

MLA Maganti Gopinath Attacked with Sandal: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి.. వీడియో వైరల్

Rudra

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి జరిగింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా బోరబండలో హైటెక్ హోటల్ సమీపంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గోపీనాథ్ పాల్గొన్నారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఆరు నూరైనా నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే, కర్నూలు సభలో స్పష్టం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

కర్నూలు ఎన్నికల ప్రచార భేరీలో మైనారిటీల రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్‌ స్పందించారు. ఆరు నూరైన.. నూరు ఆరైన నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్‌ మాట. ఇది వైఎస్సార్‌ బిడ్డ మాట’’ అని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు.

Telangana Elections 2024: ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం, భువనగిరి సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ

Hazarath Reddy

తెలంగాణలోని యాదాద్రి భువనగిరిలోని బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీలు.. మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని అన్నారు.

Telangana Elections 2024: కాంగ్రెస్‌లో చేరిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్‌లో ఆమె కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

Lok Sabha Elections 2024: 15 సెకన్లలో మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తామన్న బీజేపీ, దమ్ముంటే చేయమని సవాల్ విసిరిన అక్బరుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గతంలో 15 నిమిషాల్లో తరిమికొడతామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ కౌంటర్ విసిరారు. 15 నిమిషాలు కాదు 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ అన్నారు. మీరు 15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి మాకు ఏం భయం లేదంటూ అసదుద్దీన్ ఒవైసీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు కౌంటర్ వదిలారు.

Advertisement

Muslim Population Grew in India: భారత్‌లో ముస్లిం జనాభా పెరగడానికి కాంగ్రెస్సే కారణం, మండిపడిన బీజేపీ, ఇలా అయితే హిందువులకు దేశం ఉండదంటూ ఫైర్

Hazarath Reddy

దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో ఇదే మనకు చేసిందని, వారిని వదిలేస్తే హిందువులకు దేశం ఉండదని మాన్సుఖ్ మాండవీయ అన్నారు. 1950 నుంచి 2015 వరకు హిందువుల జనాభా 7.82 శాతం క్షీణతకు కాంగ్రెస్‌దే బాధ్యత అని బీజేపీ గురువారం పేర్కొంది

PM Modi in Andhra Pradesh: జూన్ 4వ తేదీతో వైసీపీ ప్రభుత్వం కథ కంచికే, సంచలన ట్వీట్ చేసిన ప్రధాని మోదీ, ఎన్డీయే అభ్యర్థులకు భారీ మెజారిటీ ఖాయమని వెల్లడి

Hazarath Reddy

విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లతో కలిసి ప్రజాగళం రోడ్ షోలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో తాను పాల్గొన్న రోడ్ షో మరపురానిదని పేర్కొన్నారు

Andhra Pradesh Elections 2024: ఐదేళ్ల జగన్ పాలనలో గుండా, రౌడీ రాజ్యం, కలికిరిలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు, విజయవాడలో ముగిసిన ప్రజాగళం రోడ్ షో

Hazarath Reddy

విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా మూడు పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజి సర్కిల్ వద్ద ముగిసింది.

Sam Pitroda Resigns: భారతీయుల రంగుపై వివాదాస్పద వ్యాఖ్యలు, కాంగ్రెస్‌కు శామ్‌ పిట్రోడా రాజీనామా, వెంటనే ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీకి శామ్‌ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Advertisement
Advertisement