వైరల్
Hyderabad: వీడియో ఇదిగో, గంజాయి పుల్లుగా తీసుకుని ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేసిన ముగ్గురు యువకులు, సూరారం పీఎస్‌ పరిధిలో ఘటన
Hazarath Reddyహైదరాబాద్ - సూరారం పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్ డ్రైవర్ మీద దాడి చేసి ముగ్గురు గంజాయి బ్యాచ్. హైదరాబాద్‌లోని సూరారం పీఎస్‌ పరిధిలో ముగ్గురు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ పై దాడి చేసి పారిపోవడంతో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
Women Danced to Naatu Naatu: లండన్ వీధుల్లో చీరలు కట్టుకుని నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసిన 700 మంది మహిళలు, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం
Hazarath Reddyలండన్ వీధుల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన 700 మంది మహిళలు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద నాటు నాటు పాటకు 700 మంది మహిళలు చక్కగా చీర కట్టుకొని స్టెప్పులేస్తూ సందడి చేశారు. వీడియో ఇదిగో..
Nara Lokesh: పాదయాత్రలో నారా లోకేష్ సంచలన హామీ, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి రూ. 15 వేలు అకౌంట్లో వేస్తామని ప్రకటన
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది, అప్పుడే హామీల వర్షం మొదలయింది. తాజాగా నారా లోకేష్ పాదయాత్రలో సంచలన హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ..మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే ప్రతి ఒక్కరికీ సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని అన్నారు. ఒక బిడ్డ ఉంటే రూ.15,000, ఇద్దరు ఉంటే రూ.30000, ముగ్గురు ఉంటే రూ.45000ల చొప్పున నేరుగా బిడ్డ తల్లి అకౌంట్లో చదువు కోసం వేస్తామని నారా లోకేష్ తెలిపారు.
Couple Dies in Road Accident: విశాఖలో తీవ్ర విషాదం, పుల్లుగా తాగి కారు నడిపి భార్యభర్తలను ఢీకొట్టిన మందుబాబులు, సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలిన దంపతులు
Hazarath Reddyవిశాఖలోని బీచ్ రోడ్డులోని రాడిసన్ బ్లూ వద్ద మద్యం మత్తులో అరుగులు యువకులు కారు నడుపుతూ భీభత్సం సృష్టించారు. అతివేగంతో ఉన్న కారు అదుపు తప్పి డీవైడరును ఢీ కొట్టి, పక్క రోడ్డులో వెళ్తున్న మరో బైకును ఢీ కొట్టగా బైక్ మీద ఉన్న దంపతులు పృధ్వీరాజ్ (28), ప్రియాంక (21) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు.కారులో ఉన్న ఆరుగురిలో ఓ యువకుడు కూడా దుర్మరణం చెందాడు.
IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ లో మరో విద్యార్థి బలవన్మరణం.. మృతుడిని ఒడిశా వాస్తవ్యుడిగా గుర్తించిన పోలీసులు
Rudraప్రతిష్టాత్మక సంస్థ ఐఐటీ హైదరాబాద్‌ లో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎంటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మమైత నాయక్ మానసిక ఒత్తిడి కారణంగా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Tomato Prices: సామాన్యులకు ఊరట.. హైదరాబాద్‌ లో దిగొస్తున్న టమాటా ధర.. మార్కెట్‌ కు నిన్న 2,450 క్వింటాళ్లు.. రైతు బజార్లలో కిలో టమాటా రూ. 63
Rudraపెరిగిన టమాటా ధరలతో కుదేలైన సామాన్యులకు ఊరటనిచ్చే విషయమిది. మార్కెట్లోకి టమాటాల రాక మళ్లీ పెరుగుతుండడంతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్‌ కు నిన్నమొన్నటి వరకు 850 క్వింటాళ్ల టమాటాలు రాగా నిన్న 2,450 క్వింటాళ్లు వచ్చాయి.
Jayaprakash Narayan: వైసీపీలో జయప్రకాశ్ నారాయణ చేరబోతున్నారా? లోక్ సత్తా స్పందన ఏమిటి?
Rudraఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హాజరయ్యారు.
Vizag Car Accident: విశాఖలో కారు బీభత్సం.. డివైడర్ ను దాటి బైక్ ను ఢీకొట్టి.. ఆపై చెట్టు పొదల్లోకి వెళ్లిన వాహనం.. ప్రమాద ఘటనలో ముగ్గురి మృతి
Rudraవిశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా బైక్ పై వస్తున్న వారిని అనంతరం ఢీకొట్టింది. ఆపై చెట్టు పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పైన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు.
Malayalam Director Siddique: మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ కు గుండెపోటు... పరిస్థితి విషమం
Rudraమలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ గుండెపోటుతో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. 69 ఏళ్ల ఈ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.
Jagtial Shocker: శిథిలావస్థకు ఎంపీడీఓ ఆఫీసు.. హెల్మెట్లు ధరించి డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు.. జగిత్యాల జిల్లా బీర్‌ పూర్ లో ఘటన.. ఫోటోలు వైరల్
Rudraజగిత్యాల జిల్లా బీర్‌ పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకొండి. చూరు ఎప్పుడు కూలుతుందా అని భయపడుతూ ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండంతో నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం బయటే టేబుళ్లు వేసుకుని పని చేసుకుంటున్నారు.
Students Fight in College: వీడియో ఇదిగో, విశాఖపట్నం కృష్ణా కాలేజీ ఆవరణలో తన్నుకున్న విద్యార్థులు, ఆరుమందికి గాయాలు
Hazarath Reddyవిశాఖలోని మద్దిలపాలెం డాక్టర్ వి.ఎస్. కృష్ణా కాలేజీ ఆవరణలో సోమవారం కొట్లాట. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక వర్గం తరుపు నుండి బయట వ్యక్తులు రావడంతో గొడవ పెరిగింది. ఒకరినొకరు కొట్టుకోవడంతో కృష్ణా కాలేజ్ మొత్తం యుద్ధ వాతావరణం తలపించింది. కొట్లాటలో ఆరుగురికి గాయాలయ్యాయి.
CM Jagan Request To PM Modi: అయ్యా.. మీరే బటన్‌ నొక్కండి, ప్రధాని మోదీకి సీఎం జగన్ రిక్వెస్ట్, నాకు కావాల్సిందల్లా మా ప్రజలకు మంచి జరగడమేనని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyపోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంలో నేను ప్రధాని మోదీకి ఒక్కటే చెప్పాను. అయ్యా.. మీరే బటన్‌ నొక్కండి.. నిర్వాసితుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేయండి. నాకు కావాల్సిందల్లా మా వాళ్లకు మంచి జరగాలని చెప్పాను. త్వరలోనే ఇవ్వాల్సినవన్నీ అందుతాయి
Firefighting Helicopter Crash: అట‌వి మంట‌ల్ని ఆర్పుతుండగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు హెలికాప్టర్లు, ముగ్గురు మృతి
Hazarath Reddyఅమెరికాలోని కాలిఫోర్నియాలో అట‌వి మంట‌ల్ని ఆర్పేందుకు రంగంలోకి దిగిన రెండు హెలికాప్ట‌ర్లు గాలిలోనే ఢీకొన్నాయి. రివ‌ర్‌సైడ్ కౌంటీలోని కేబ‌జాన్ వద్ద‌ ఆదివారం సాయంత్రం ఈ ఘ‌ట‌న జ‌రిగంది. రెండు హెలికాప్ట‌ర్లు ఢీకొన్న స‌మ‌యంలో.. ఒక‌టి క్షేమంగా కింద‌కు దిగింది.
What is Eris? కొత్త కరోనా వేరియంట్ ఎరిస్ లక్షణాలు ఇవే, ముక్కు కారడంతో పాటుగా 5 లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని నిపుణులు సూచన
Hazarath Reddyప్రపంచం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూనే ఉంది.ఈ పోరాటం కొనసాగుతుండగానే Eris లేదా EG.5.1 అనే కొత్త వేరియంట్ యూకేలో ఉద్భవించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
What Is Disease X? కరోనా తర్వాత ప్రపంచానికి డిసీజ్ X రూపంలో పొంచి ఉన్న మరో ముప్పు, ఇంతకీ డిసీజ్ ఎక్స్ అంటే ఏమిటీ, అది ప్రమాదకరంగా ఎలా మారబోతోంది..
Hazarath Reddyకోవిడ్ 19 మహమ్మారి తాకిడి నుండి ప్రపంచమంతా కోలుకోలేకపోయింది, ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేదిక ప్రకారం , ఒక కొత్త, మరింత కృత్రిమమైన, చాలా ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచాన్ని తలకిందులు చేయబోతోంది.
Disease X: మానవాళిపై డిసీజ్ ఎక్స్ రూపంలో మరో ప్రమాదకర వైరస్ పంజా, వ్యాక్సిన్ తయారు చేసే పనిలో బిజీ అయిన 200 మందికి పైగా శాస్త్రవేత్తల బృందం
Hazarath Reddyకోవిడ్ 19 మహమ్మారి తాకిడి నుండి ప్రపంచమంతా కోలుకోలేకపోయింది, ఆరోగ్య నిపుణులు కొత్త బాంబును విసిరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) నివేదిక ప్రకారం , ఒక కొత్త, మరింత కృత్రిమమైన, చాలా ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు దీనిని ' డిసీజ్ X 'గా పేర్కొన్నారు.
Dengue Cases Rise in Delhi: దేశ రాజధానిలో పంజా విప్పిన డెంగ్యూ, వారంలోనే భారీగా పెరిగిన కేసులు, 348కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో డెంగీ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు కేవలం ఏడు రోజుల్లో 105 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ఢిల్లీలో ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన మొత్తం డెంగీ కేసుల సంఖ్య 348కి చేరింది. 2018 నుంచి ఇప్పటివరకు గడిచిన ఐదేండ్లలో ఆగస్టు 6 నాటికే డెంగీ కేసుల సంఖ్య 175 దాటడం ఇదే తొలిసారి.
Telangana: మద్యం మత్తులో లారీ డ్రైవర్ భీభత్సం, షాపు ముందు బైక్ పార్కింగ్ చేస్తున్న వ్యక్తిని వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ, నిందితుడుకి తీవ్ర గాయాలు
Hazarath Reddyభూపాలపల్లి పట్టణంలోని ఓ షాపు ముందు టూ వీలర్ పార్కింగ్ చేస్తున్న క్రమంలో మైపల్లి గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. రంజిత్ లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. పార్కింగ్ చేసిన కార్లు, బైక్ పై నుంచి లారీ దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Andhra Pradesh Horror: నెల్లూరు జిల్లాలో దారుణం, కోడలితో సహా ముగ్గురిని కత్తులతో నరికి చంపిన అత్తింటి వారు, నిందితులంతా పరారీలో..
Hazarath Reddyనెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం కొండబిట్రగుంటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
Actress Sindhu Dies: ఆస్పత్రిలో చికిత్సకు డబ్బుల్లేక తెలుగు నటి మృతి, రొమ్ము క్యాన్సర్ బారీన పడి ప్రాణాలు వదిలేసిన షాపింగ్‌మాల్ సినిమా నటి సింధు
Hazarath Reddy2010లో విడుదలైన 'షాపింగ్‌మాల్' సినిమాలో నటించిన తెలుగుమ్మాయి సింధు రొమ్ము క్యాన్సర్ బారిన పడి మృతి చెందింది. ఆస్పత్రి ఖర్చులకు డబ్బులేక ప్రాణాలు వదిలేసింది. 2020లో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన సింధు మధ్య తరగతి జీవితం కావడం..క్యాన్సర్ మహమ్మారి చికత్సకు డబ్బులు లేకపోవడంతో తిరిగి రాని లోకాలు వెళ్లింది.