Credits: Twitter

Bengaluru, July 18: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లోని ప్రఖ్యాత ఐకియా స్టోర్‌ (IKEA Store) లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్టోర్‌ లో భోజనం చేయాలనుకున్న శరణ్య అనే మహిళకు భయంకరమైన అనుభవం ఎదురైంది. స్టోర్‌ లోని ఫుడ్‌కోర్టులో భోజనం చేస్తుండగా ఆమె టేబుల్‌ పై  పైకప్పు మీద నుంచి చచ్చిన ఎలుక పడింది. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన  ఆమె వెంటనే తేరుకొని తాను తింటున్న స్నాక్స్ పక్కనే పడివున్న చచ్చిన  ఎలుక ఫొటోను తీసి ట్విట్టర్‌ లో షేర్ చేశారు. ‘నా ఫుడ్ టేబుల్‌ పై ఏం పడిందో ఊహించండి’ అని దానికి క్యాప్షన్ తగిలించారు.

Colors Swathi: విడాకుల దిశగా కలర్స్ స్వాతి..? ఇన్‌స్టా నుంచి భర్త ఫొటోలు తొలగించిన నటి.. విడాకులకు మునుపు సమంత, నిహారిక కూడా తమ భాగస్వాముల ఫొటోలు తొలగింపు.. అభిమానుల్లో ఆందోళన

Mystery Object in Australia: ఆస్ట్రేలియా సముద్ర తీరంలో చంద్రయాన్-3 శకలం? రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న వస్తువు.. మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన సంస్థ..

వైరల్ కావడంతో..

శరణ్య ట్వీట్ వైరల్ వైరల్ కావడం, నెటిజన్లు విమర్శలు కురిపించడంతో స్పందించిన ఐకియా జరగిన ఘటనపై ఆమెకు క్షమాపణలు తెలిపింది. దీనిపై తాము దర్యాప్తు చేస్తామని, అవసరమైన అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది. పరిశుభ్రతకు తాము ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది.

Project-K Deepika Padukone First Look: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' నుంచి దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ విడుదల.. సీరియస్ లుక్ లో ఆసక్తికరంగా దీపిక ఫస్ట్ లుక్