Delhi Horror: పట్టపగలు నడిరోడ్డు మీద యువతిపై కత్తితో దాడి చేసిన యువకుడు.. ఎందుకు పొడవాల్సివచ్చిందో చెప్పిన నిందితుడు.. ఢిల్లీలో ఘటన (వీడియో వైరల్)
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు.
Newdelhi, Mar 24: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి (Attack) పాల్పడ్డాడు. కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. నిందితుడ్ని 22 ఏళ్ల అమన్ గా గుర్తించారు. స్థానికంగా నివసిస్తున్న అతడు పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో కుక్గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
#WATCH | Delhi: A 22-year-old man Aman has been arrested for attacking a girl in the Mukherjee Nagar area with a knife in broad daylight. The incident occurred on 22 March.
The passers-by intervened and tried to stop and catch the accused. The girl did not suffer grievous… pic.twitter.com/y5M4U4girT
— ANI (@ANI) March 24, 2024
ఎందుకు పొడిచానంటే??
అయితే బాధితురాలు తరుచుగా తనను వెక్కిరించి ఎగతాళి చేయడంతోపాటు వెర్రివాడిగా పిలుస్తున్నదని అమన్ ఆరోపించాడు. దీంతో ఆగ్రహించి కత్తితో ఆమెపై దాడి చేసినట్లు పోలీసులకు చెప్పాడు. ఐతే, నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాధితురాలికి ప్రాణాపాయం తప్పింది. దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
(The above story first appeared on LatestLY on Mar 24, 2024 04:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

