Fake Toll Plaza: గుజరాత్ లో జాతీయ రహదారిపై నకిలీ టోల్ ప్లాజా.. 75 కోట్లకు పైగా వసూలు
దొంగలు తెలివిమీరి పోతున్నారు. అసలు టోల్ ప్లాజాకు వెళ్ళకుండా నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేసిన దుండగులు ఏకంగా రూ. 75 కోట్లు కొట్టేశారు. ఎట్టకేలకు ఆ దొంగలను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Newdelhi, Dec 8: దొంగలు (Thieves) తెలివిమీరి పోతున్నారు. అసలు టోల్ ప్లాజాకు (Toll Plaza) వెళ్ళకుండా నకిలీ టోల్ ప్లాజా (Fake Toll Plaza)ను ఏర్పాటు చేసిన దుండగులు ఏకంగా రూ. 75 కోట్లు కొట్టేశారు. ఎట్టకేలకు ఆ దొంగలను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోర్బి జిల్లాలో సుమారు ఏడాది నుంచి నిర్వహిస్తున్న ఈ నకిలీ టోల్ ప్లాజా ద్వారా నిందితులు 75 కోట్లకు పైగా వసూలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు స్థానికంగా పలుకుబడి ఉన్న ఒక నేత కుమారుడు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
In Gujarat, after fake government offices, now a fake toll plaza https://t.co/sY5zFOpzmR
— ParanjoyGuhaThakurta (@paranjoygt) December 6, 2023
బంబన్బోర్-కుచ్ నేషనల్ హైవేపై మోర్బి-వాంకనర్ ఊర్ల మధ్య వఘాసియా టోల్ ప్లాజా ఉంది. అయితే ఆ టోల్ ప్లాజా తగలకుండా నిందితులు అక్కడ ఉన్న సిరమిక్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డును మళ్లించి కొత్త రోడ్డు వేసి మధ్యలో నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేసి దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Dec 08, 2023 09:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

