Varanasi Horror: వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డామంటూ సూసైడ్ నోట్.. బాధితులు తూర్పు గోదావరి జిల్లావాసులుగా గుర్తింపు

వారణాసి పుణ్యక్షేత్రంలో ఘోరం జరిగింది. నలుగురు సభ్యులున్న ఓ తెలుగు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

Varanasi Horror: వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డామంటూ సూసైడ్ నోట్.. బాధితులు తూర్పు గోదావరి జిల్లావాసులుగా గుర్తింపు
Suicide (Photo Credits: Twitter)

Varanasi, Dec 8: వారణాసి (Varanasi) పుణ్యక్షేత్రంలో ఘోరం జరిగింది. నలుగురు సభ్యులున్న ఓ తెలుగు కుటుంబం (Telugu Family) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొండా వప్రియ (50) తన భార్య లావణ్య (45) పిల్లలు రాజేశ్ (25), జైరాజ్‌లతో (23) కలిసి కైలాశ్ భవన్‌ లో ఆశ్రయం పొందుతున్నారు. డిసెంబర్ 3న వారు ఆ ధర్మశాలలో చేరారు. అయితే, గురువారం కుటుంబం అంతా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.  ఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ కూడా లభించిందని పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేకే తాము బలవన్మరణానికి పాల్పడినట్టు వారు చిట్టీలో రాశారని పేర్కొన్నారు.

KCR Injured: కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 08, 2023 08:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).