Paper in Samosa: వేడి వేడి సమోసా వచ్చింది.. ఆవురావురుమంటూ తిందామని అతను దాన్ని కొరికాడు.. ఇంతలో నోటికి ఏదో తగిలింది.. ఏమిటా అని చూస్తే.. షాక్.. ఐఆర్సీటీసీకి ప్రయాణికుడి ఫిర్యాదు.. క్షమాపణలు కోరిన సంస్థ.. ఇంతకీ ఏమైందంటే??
రైలు ప్రయాణంలో ఉల్లాసంగా సమోసా తిందామనుకొన్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. దానిని కొరకగానే అందులో ఓ పచ్చ కాగితం కనిపించింది. అంతే.. ప్రయాణికుడు అజి కుమార్ దానిని తినడం మాని ఫొటో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. స్పందించిన ఐఆర్సీటీసీ క్షమాపణలు కోరింది.
Mumbai, October 11: రైలు (Train) ప్రయాణంలో ఉల్లాసంగా సమోసా (Samosa) తిందామనుకొన్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. దానిని కొరకగానే అందులో ఓ పచ్చ కాగితం (Yellow Paper) కనిపించింది. అంతే.. ప్రయాణికుడు అజి కుమార్ దానిని తినడం మాని ఫొటో తీసి ట్విట్టర్లో (Twitter) షేర్ చేశాడు. స్పందించిన ఐఆర్సీటీసీ క్షమాపణలు కోరింది.
ఈ నెల 9న ముంబై నుంచి లక్నోకు వెళ్తున్న రైలులో ఈ ఘటన జరిగినట్టు వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రైల్వే వ్యవస్థ రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోందంటూ విరుచుకుపడ్డారు.
I am on the way to Lucknow today 9-10-22 I bought one Samosa to eat.. Some portions taken and lastly this is inside in it... Pls look the yellow paper inside somosa... Its served by the IRCTC pantry person in the Train No. 20921 Bandra Lucknow train.... Started train 8-10-22.. pic.twitter.com/6k4lFOfEr6
— Aji Kumar (@AjiKuma41136391) October 9, 2022
(The above story first appeared on LatestLY on Oct 11, 2022 08:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

