దేశంలో కొత్తగా 14,506 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,33,345కు పెరిగాయి. ఇందులో 4,28,08,666 మంది బాధితులు కోలుకోగా, 5,25,077 మంది కరోనాకు బలయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతుండటంతో యాక్టివ్‌ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం 99,602 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 30 మంది మృతిచెందారని, 11,574 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతానికి పెరిగిందని పేర్కొన్నది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.56 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 197.46 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో మంగళవారం ఒకేరోజు 13,44,788 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని వెల్లడించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)