తెలుగు రాష్ట్రాల్లో 2018లో సంచలనం రేపిన పరువు హత్య కేసులు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) ప్రణయ్‌(24)ను అత్యంత దారుణంగా చంపిన (Telangana 2018 honour killing) సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.

ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి వారందరికీ.. వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కలగాలి. మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం.వందమంది సాక్షులతో.. 1600 పేజీల చార్జిషీట్‌తో ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో కేసును సాధించారు. ఈ కేసులో న్యాయవాదిగా వ్యవహరించిన దర్శనం నరసింహ ఎలాంటి ప్రలాభాలకు లోను కాకుండా న్యాయం పోరాటం చేశాడు న్యాయం కోసం.న్యాయస్థానాలు న్యాయవాదుల ద్వారా ఈ దేశంలో చట్టం న్యాయం అనేది ఉందని రుజువైందని తెలిపారు.

Pranay Parents Reaction on Court Verdict

Court convicts 7 accused, awards death penalty to one

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)