తెలంగాణలో ఎస్ఎల్‌బీసీ ప్ర‌మాద ఘ‌ట‌న జ‌రిగి ఆరు రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికీ రాలేదు.. ఎందుకింత బాధ్య‌తారాహిత్యం..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్ వ‌ద్ద హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.ఎన్నికల ప్రచారం ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు కాపాడటం ముఖ్యమా? అని రేవంత్ రెడ్డిని హ‌రీశ్‌రావు నిల‌దీశారు. బృందాల మ‌ధ్య సమ‌న్వ‌యం సాధించ‌డంలో ప్ర‌భుత్వం విల‌ఫ‌మైంది. ట‌న్నెల్‌లోకి (SLBC Tunnel Collapse Update) వెళ్లేందుకు మాకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. స‌హాయ చ‌ర్య‌ల‌కు ఇబ్బంది అవుతుంద‌ని ఇన్ని రోజులు రాలేదు. ప్రజాప్రతినిధులం మంత్రిని కలవకూడదా..? ప్రమాదానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడకూడదా..? ఇదెక్కడి ప్రజా పాలన..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల ప్రమాదం..6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్, ఇంతవరకు లభ్యం కానీ 8 మంది ఆచూకీ

Harish Rao on SLBC Tunnel Collapse 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)