క్రీడలు

Smriti Mandhana Century: స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన టీమిండియా బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన‌, సౌతాఫ్రికాతో వ‌న్డేలో సెంచ‌రీ చేసి కొత్త రికార్డు

VNS

భార‌త మ‌హిళా జ‌ట్టు ఓపెన‌ర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చ‌రిత్ర సృష్టించింది. వ‌న్డేల్లో ఆరో సెంచ‌రీతో 7 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరింది. దాంతో, ఈ ఫీట్ సాధించిన రెండో మ‌హిళా క్రికెట‌ర్‌గా మంధాన‌ రికార్డు నెల‌కొల్పింది. ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న వ‌న్డేలో 56 ప‌రుగుల వ‌ద్ద భార‌త వైస్ కెప్టెన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 7,000 ప‌రుగుల మైలురాయికి చేరింది.

ICC T20 World Cup 2024: హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన వెస్టిండీస్‌, 13 పరుగుల తేడాతో కివీస్ చిత్తు, గ్రాండ్‌గా సూపర్ 8లోకి అడుగుపెట్టిన విండీస్ జట్టు

Vikas M

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ అదరగొట్టింది. ఈ టోర్నీకి ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న ఆ జట్టు హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్‌- 8లో చోటు దక్కించుకుంది. ట్రినిడాడ్‌ లోని బ్రియాన్‌ లారా స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ను 13 పరుగుల తేడాతో విండీస్‌ ఓడించింది.

ICC T20 World Cup 2024: పోరాడకుండానే ప్రపంచకప్ నుంచి న్యూజీలాండ్ ఔట్, సూపర్ 8 బెర్తులోకి ప్రవేశించిన ఆఫ్ఘ‌నిస్తాన్, ఇప్పటికే వెస్టిండీస్ ఎంట్రీ

Vikas M

ఆఫ్ఘ‌నిస్తాన్ విక్ట‌రీతో గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్ జ‌ట్టు నాకౌట్ అయ్యింది.ఈ గ్రూపు నుంచి ఇప్ప‌టికే వెస్టిండీస్ జ‌ట్టు సూప‌ర్ 8లోకి ప్ర‌వేశించగా తాజాగా ఆఫ్ఘ‌నిస్తాన్ కూడా ఆరు పాయింట్ల‌తో సూప‌ర్‌-8 బెర్తును క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న‌ది.

ICC T20 World Cup 2024: ఒమ‌న్‌ విసిరిన టార్గెట్‌ని మూడు ఓవర్లలోనే ఫినిష్ చేసిన ఇంగ్లండ్, 8 వికెట్ల తేడాతో ఘన విజయం

Vikas M

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 World Cup)లో గ్రూప్ బీలో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో ఒమ‌న్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం న‌మోదు చేసింది. ఇంగ్లండ్ బౌల‌ర్ అదిల్ ర‌షీద్ నాలుగు వికెట్లు తీయ‌డంతో.. ఒమ‌న్ కేవ‌లం 47 ప‌రుగులే చేసి ఆలౌట్ అయ్యింది

Advertisement

Virat Kohli Gloden Duck Video: ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ వీడియో ఇదిగో, టీ20లలో డకౌట్ కావడం కోహ్లీకి ఇది 6వసారి

Vikas M

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ అమెరికాపై మ్యాచ్‌‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

Virat Kohli Ducks Record: టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండవ భారత క్రికెటర్‌గా కోహ్లీ

Vikas M

టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు డకౌట్ అవ్వగా.. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. 5 డకౌట్‌లతో రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్‌ని విరాట్ దాటేశాడు. మొత్తం 6 డకౌట్‌లతో రెండో స్థానంలో నిలిచాడు.

India Vs USA, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికాను ఓడించి టీమిండియా హ్యాట్రిక్ విజయాల నమోదు...7 వికెట్ల తేడాతో USAను ఓడించి సూపర్ 8కి అర్హత సాధించిన టీమిండియా

sajaya

టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికాను ఓడించి భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసింది. దీంతో ఆతిథ్య జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా సూపర్ 8కి అర్హత సాధించింది. సూర్యకుమార్ యాదవ్ మరియు శివమ్ దూబేతో పాటు, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ విజయాన్ని భారత్ గెలవడంలో ముఖ్యమైన సహకారం అందించారు.

Shardul Thakur: ఆస్ప‌త్రి బెడ్ పై టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్! కాలికి స‌ర్జరీ చేయించుకున్న క్రికెట‌ర్, త్వ‌ర‌లోనే మైదానంలో క‌లుద్దామంటూ పోస్ట్

VNS

టీమ్ఇండియా ప్ర‌స్తుతం టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో బిజీగా ఉంది. అయితే.. భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) మాత్రం ఆస్ప‌త్రి బెడ్ పై ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అత‌డి ఏమైంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

PAK YouTuber Shot Dead: వీడియో ఇదిగో, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అభిప్రాయం అడిగినందుకు యూట్యూబర్‌ని కాల్చి చంపిన గార్డు

Vikas M

జియో న్యూస్ నివేదిక ప్రకారం, సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ కరాచీలోని మొబైల్ మార్కెట్‌కి వెళ్లాడు, అక్కడ అతను మ్యాచ్ గురించి వారి అభిప్రాయాలను పలువురు దుకాణదారులను అడిగాడు.ఈ నేపథ్యంలో ఓ సెక్యూరిటీ గార్డుని కూడా అభిప్రాయం అడగగా అతను సహనం కోల్పోయి అహ్మద్‌ను కాల్చాడు.దీంతో యూట్యూబర్ కుప్పకూలి పడిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

ICC T20 World Cup 2024: పోరాడి ఓడిన బంగ్లాదేశ్, ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి..

Vikas M

న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా సూపర్‌ ఎయిట్‌ ర్యాంక్‌ కోసం డ్రైవర్‌ సీటులో దృఢంగా కూర్చుంది.

Naseem Shah Crying Video: వీడియో ఇదిగో, మ్యాచ్ ఓడిపోగానే వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వెళ్ళిన పాక్ పేసర్ న‌సీమ్ షా, ఓదార్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Vikas M

పాకిస్థాన్‌తో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివ‌రి ఓవ‌ర్‌లో 18 ప‌రుగులు అవ‌స‌రం కాగా, న‌సీమ్ షా(Naseem Shah) రెండు బౌండ‌రీలు కొట్టినా టార్గెట్‌ను అందుకోలేక‌పోయారు. 4 బంతుల్లో 10 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన న‌సీమ్ షా మ్యాచ్ ఓడిపోగానే ఒక్కసారిగా ఏడ్చేశాడు

Amol Kale Dies: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ తర్వాత గుండెపోటుతో MCA అధ్యక్షుడు అమోల్ కాలే మృతి, ముంబై క్రికెట్లో విషాదకర ఛాయలు

Hazarath Reddy

షాకింగ్ ఘటనలో, ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడు అమోల్ కాలే అమెరికాలో గుండెపోటుతో మరణించారు. జూన్ 9న న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు MCA ఆఫీస్ బేరర్‌లతో కలిసి కాలే హాజరయ్యాడు.

Advertisement

IND vs PAK, ICC T20 World Cup 2024: అమెరికా చేతిలో పాకిస్తాన్ ప్లే అప్ అవకాశాలు, భారత్‌తో ఓడిన తరువాత మారిన సూపర్-8 సమీకరణలు, ఉత్కంఠ పోరులో టీమిడింయా ఘన విజయం

Hazarath Reddy

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2024లో ఆదివారం జరిగిన అత్యంత ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత్ చేతిలో పాక్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టుకు టోర్నీలో వరుసగా రెండవ ఓటమి ఎదురైంది

IND Vs PAK: పాకిస్థాన్ పై ఇండియా రికార్డుల మోత‌! ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పై భార‌త్ కు ఉన్న తిరుగులేని రికార్డులివే..

VNS

పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో పాక్‌పై (IND Vs PAK) భార‌త స్టార్ ఆట‌గాళ్లు అద‌ర‌గొట్టారు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థితో గేమ్ అంటేనే రెచ్చిపోయే విరాట్ కోహ్లీ(Virat Kohli).. రెండేండ్ల క్రితం సిడ్నీలో వీరోచిత హాఫ్ సెంచ‌రీతో జ‌ట్టును గెలిపించ‌డం ఇప్ప‌ట్లో మ‌ర్చిపోలేం. ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్‌పై భార‌త్‌కు తిరుగులేని రికార్డు ఉంది.

IND vs PAK T20 World Cup 2024: పాకిస్తాన్‌తో మ్యాచ్.. టీమిండియాకు బిగ్ షాక్, మ‌ళ్లీ గాయప‌డిన కెప్టెన్ రోహిత్ శ‌ర్మ, నెట్ ప్రాక్టీస్‌లో బొట‌న వేలికి గాయం

Vikas M

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో ఆదివారం(జూన్ 9)న న్యూయ‌ర్క్ వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.ఈ పోటీకి ముందే టీమిండియాకు బిగ్ షాక్ త‌గిలింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మ‌ళ్లీ గాయప‌డ్డాడు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ శ‌ర్మ బొట‌న వేలికి గాయమైంది.

ICC T20 World Cup 2024: శ్రీలంకను రెండు వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను విజయంతో ప్రారంభించిన బంగ్లా

Vikas M

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 సంచలనాలు నమోదు అవుతున్నాయి. పసికూనలు అగ్రశ్రేణి జట్లను ఓడించి చరిత్ర సృష్టిస్తున్నాయి. తాజాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 World cup)లో భాగంగా గ్రూప్ డీలో జ‌రిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌లో రెండు వికెట్ల తేడాతో శ్రీలంక‌పై విజ‌యం సాధించింది.

Advertisement

ICC T20 World Cup 2024: ఆప్ఘన్ల చేతిలో న్యూజీలాండ్‌కు ఘోర పరాభవం, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో 84 పరుగుల తేడాతో ఘన విజయం

Vikas M

అమెరికాలో జరుగుతున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్(T20 Worldcup) క్రికెట్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ సంచ‌ల‌నం సృష్టించింది.న్యూజిలాండ్‌కు ఘోర ప‌రాభ‌వాన్ని రుచి చూపించింది. గయానా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది.

ICC T20 World Cup 2024: బాబోయ్, భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఒక్క సెక‌న్ యాడ్‌కు రూ. 4 లక్షలు, హాట్ కేకుల్లా అమ్ముడ‌పోయిన న్యూయార్క్ స్టేడియంలో టికెట్లు

Vikas M

పొట్టి ప్రపంచకప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఈ నెల 9న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం న్యూయార్క్ స్టేడియంలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడ‌వుతున్నాయి.ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ మ‌ధ్య‌లో ప్ర‌క‌ట‌న‌ల‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు భారీగా పైస‌లు వ‌సూల్ చేస్తున్నాయి.

ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి విజయాన్ని నమోదు చేసిన స్కాట్లాండ్, 5 వికెట్ల తేడాతో నమీబియాపై ఘన విజయం

Hazarath Reddy

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో స్కాట్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బార్బోడస్‌ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

BCCI Announces Domestic Calendar: 2024-25 దేశవాలీ సీజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ, సెప్టెంబర్‌ 5న దులీప్‌ ట్రోఫీతో సీజన్ ప్రారంభం

Hazarath Reddy

2024-25 దేశవాలీ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నిన్న (జూన్‌ 6) విడుదల చేసింది. ఈ సీజన్‌ సెప్టెంబర్‌ 5న ప్రారంభమయ్యే దులీప్‌ ట్రోఫీతో మొదలై 2025 ఏప్రిల్‌ 1న జరిగే సీనియర్‌ మహిళల ఛాలెంజర్‌ ట్రోఫీతో ముగుస్తుంది. సీనియర్‌ పురుషులు, మహిళలకు సంబంధించిన పలు మల్టీ ఫార్మాట్‌ ట్రోఫీలతో పాటు పలు జూనియర్‌ స్థాయి టోర్నీలు జరుగనున్నాయి.

Advertisement
Advertisement