Cricket

Jasprit Bumrah to Miss IPL 2023: ఐపీఎల్ నుంచి బుమ్రా అవుట్, ముంబై ఇండియన్స్‌కి పెద్ద ఎదురుదెబ్బ, వెన్ను నొప్పితో బాధపడుతున్న భారత్ పేసర్

Hazarath Reddy

ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్-2023కి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఒక స్పోర్ట్స్ మీడియా సంస్థ వెల్లడించింది. బుమ్రా కొంత కాలంగా వెన్ను నొప్పి (బ్యాక్ స్ట్రెస్ ఫ్రాక్చర్)తో బాధపడుతున్నాడు.

T-20 Worst Record: టీ20లో అత్యంత చెత్త రికార్డు ఇదే.. 10 పరుగులకే టీమ్ ఆలౌట్..

Rudra

టీ-20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ‘ఐల్ ఆఫ్ మ్యాన్’-‘స్పెయిన్’ జట్ల మధ్య కార్గజెనాలోని లా మంగా క్లబ్ బోటమ్ గ్రౌండ్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది.

PSL 2023: వీడియో ఇదిగో.. షాహిన్ అఫ్రిది సంధించిన వేగానికి విరిగిన బ్యాట్, రెండో బంతికి స్టంప్ గాల్లోకి, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్

Hazarath Reddy

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ 2023 సీజన్‌లో ఖలందర్ తరపున ఆడుతున్న షాహీన్‌ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు.

IPL 2023: ముంబై ఇండియన్స్‌కు షాక్, ఐపీఎల్ నుంచి బుమ్రా పూర్తిగా అవుట్, గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసర్

Hazarath Reddy

గాయం కారణంగా గత ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా ఐపీఎల్‌-2023 సీజన్‌తో పాటు జూన్‌లో జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి.

Advertisement

Women T20 World Cup Final: ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా, ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసి ట్రోఫీ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్..

kanha

దక్షిణాఫ్రికాలో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బెత్ మూనీ అర్ధశతకం ఆధారంగా 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 137 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆరోసారి గెలుచుకుంది.

CCL 2023, Bengal Tigers vs Telugu Warriors: మరోసారి దుమ్ము లేపిన అఖిల్ అక్కినేని, బెంగాల్ టైగర్స్ జట్టును చిత్తు చేసిన తెలుగు వారియర్స్ జట్టు..

kanha

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా శనివారం బెంగాల్ టైగర్స్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో, తెలుగు వారియర్స్ జట్టు భారీ విజయం నమోదు చేసింది.

Virat Kohli: ధోనీతో నా అనుబంధం ఏంటంటే?? కోహ్లీ వీడియో వైరల్

Rudra

తాను ధోనీ రైట్ హ్యాండ్ అని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తెలిపిన కోహ్లీ.. తనకు దగ్గరైన నిజాయతీ గల వ్యక్తి ధోనీ అంటూ ధోనీతో ఉన్న తన అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు.

KCC 2023: కన్నడ నాట క్రికెట్ టోర్నీ, స్టార్ హీరోలు, క్రికటర్లతో సందడి చేయనున్న Kannada Chalanachitta Cup 2023

Hazarath Reddy

కన్నడ చలనచిత్ర కప్ యొక్క మూడవ ఎడిషన్ ఫిబ్రవరి 24, 2023న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో మాజీ క్రికెటర్లు, కన్నడ నటులు పాల్గొంటారు. ఈ లీగ్‌లో ఆరు జట్లు ఉన్నాయి - కదమబా లయన్స్, రాష్ట్రకూట పాంథర్స్, విజయనగర పేట్రియాట్స్, గంగా వారియర్స్, హోయసల ఈగల్స్, వడియార్ ఛార్జర్స్

Advertisement

Harry Brook: వినోద్ కాంబ్లీ రికార్డు బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్, తొలి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన ఇంగ్లండ్ యువ క్రికెటర్

Hazarath Reddy

ఇంగ్లండ్‌ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో తొలి తొమ్మిది ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ(798పరుగులు) పేరిట ఉన్న రికార్డును.. 9 ఇన్నింగ్స్‌లలో అతడు 807 పరుగులు సాధించి బ్రేక్ చేశాడు

Ind vs Aus ICC T20 WC Semifinal: టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో చతికిలపడ్డ టీమిండియా ఉమెన్స్ జట్టు, చెదిరిన ప్రపంచకప్ కల, ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

kanha

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్‌కు టికెట్‌ దక్కించుకుంది.

ICC Women's T20 World Cup 2023: భారత్ ఫైనల్ చేరాలంటే 173 పరుగులు చేయాలి, ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారీ టార్గెట్ విసిరిన ఆస్ట్రేలియా వుమెన్స్

Hazarath Reddy

ప్రపంచకప్ 2023లో భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు .. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

Umesh Yadav Father Dies: భారత క్రికెటర్ ఉమేష్ యాదవ్ తండ్రి కన్నుమూత, గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్ యాదవ్

Hazarath Reddy

భారత క్రికెటర్ ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. ఉమేష్ యాదవ్ తండ్రి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఖపర్ఖేడాలోని మిలన్ చౌక్‌లోని అతని ఇంటికి తీసుకువచ్చారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉమేష్ తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

Advertisement

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడెన్ మార్క్‌రామ్, మాజీ IPL ఛాంపియన్స్‌ను ముందుండి నడిపించనున్న ఐడెన్

Hazarath Reddy

#IPL2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడెన్ మార్క్‌రామ్ నియమితులయ్యారు. మార్క్రామ్.. SRHసోదరి ఫ్రాంచైజీ, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇటీవలే ప్రారంభ SA 20 టైటిల్‌ తీసుకురావడంలో ముందుండి నడిపించాడు. ఇప్పుడు అతను కొత్త సీజన్ కోసం మాజీ IPL ఛాంపియన్స్‌ను టేకోవర్ చేయనున్నాడు.

Australia Team for ODIs: ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌, టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే, భారత్ జట్టుపై కూడా ఓ లుక్కేయండి

Hazarath Reddy

మార్చి 17 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌ సహా పేసర్‌ జై రిచర్డ్‌సన్‌ పునరాగమనం చేయనున్నట్లు తెలిపింది.

IND W vs AUS W Semi-Final: ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్‌లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకునేందుకు బరిలోకి దిగనున్న హర్మన్ సేన

VNS

మహిళల టీ20 ప్రపంచ కప్ – 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాను (India vs Australia) ఢీకొట్టనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. టీ20 ప్రపంచ కప్‌లో‌ ఆదినుంచి భారత్ జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తుంది. అయితే, గత ఐదేళ్లుగా అగ్రశ్రేణి జట్లలో ఒకటిగాఉన్న భారత్ జట్టు పెద్ద ట్రోఫీని గెలుచుకోలేక పోయింది.

ICC Women's T20 World Cup 2023: ఆస్ట్రేలియాతో చావో రేవో తేల్చుకోనున్న భారత్, గెలిస్తే ఇక ప్రపంచకప్‌ మనదే, ఐర్లాండ్‌పై గెలిచి సెమీస్‌కు చేరుకున్న టిమిండియా మహిళా జట్టు

Hazarath Reddy

ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో (ICC Women's T20 World Cup 2023) నేరుగా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌–2 చివరి లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Woman Kisses Kohli’s Wax Statute: విరాట్ కోహ్లీ పెదాలపై ముద్దు పెట్టిన అమ్మడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

స్టార్ ఇండియన్ క్రికెటర్‌ విరాట్ కోహ్లికు భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది.ఈ అభిమానం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో విరాట్ కోహ్లీ మైనపు ప్రతిమను ఓ మహిళ ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. కోహ్లీ మైనపుతో కొంత 'క్లోజ్ టైమ్' గడిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

MS Dhoni Last Match: మే 14న ఐపీఎల్ చివరి మ్యాచ్ ఆడనున్న ధోనీ, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్, ఇంకా అధికారికంగా ప్రకటించిన భారత మాజీ కెప్టెన్

Hazarath Reddy

చెన్నై సూపర్ కింగ్స్ తరపున తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత MS ధోని ఐపీఎల్ వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, మే 14న చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో CSK కోసం ధోని వీడ్కోలు గేమ్ ఆడనుంది.

KL Rahul: కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్.. వైస్ కెప్టెన్సీ నుంచి తొలగింపు

Rudra

ఫామ్ కోల్పోయి పరుగుల కోసం ఏడాదిగా తంటాలు పడుతున్న టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాకిచ్చింది. వైస్ కెప్టెన్సీ పదవిని లాక్కుంది.

India Vs Australia: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్ ప్రకటన, తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు, మార్చి 17 నుంచి వన్డే సిరీస్ షురూ..

kanha

ఆస్ట్రేలియాతో (IND vs AUS) జరగనున్న 3-మ్యాచ్‌ల ODI సిరీస్‌కు భారత్ జట్టును ప్రకటించింది. తొలి వన్డేలో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ తొలి వన్డేలో ఎంపికకు అందుబాటులో ఉండడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే మార్చి 17న జరగనుంది.

Advertisement
Advertisement