Cricket

Viral Video: ఫుట్‌బాల్ తెలిసిన వ్యక్తి క్రికెట్ ఆడితే ఇలాగే ఉంటుంది మరి.. అంటూ దిగ్గజ క్రికెటర్ సచిన్ కామెంట్ చేసిన ఆ వీడియో చూశారా?

Rudra

ఓ మ్యాచ్‌లో బ్యాటర్ బంతిని బలంగా బాదడంతో అది గాల్లోకి లేచి బౌండరీకి ఆవల పడబోయింది. అక్కడే ఉన్న ఫీల్డర్ దానిని అడ్డుకున్న విధానం సూపర్. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరూ చూడండి.

Women's T20 World Cup, India Vs Pakistan: టీ 20 మహిళా ప్రపంచ కప్ బోణీ అదిరింది, పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం, ఏడు వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసిన టీమిండియా మహిళలు..

kanha

Women's T20 World Cup, India Vs Pakistan: కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది.

India vs Australia 1st Test: నాగ్ పూర్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్, మూడు రోజుల్లోనే ముగిసిన టెస్టు మ్యాచు, 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన రోహిత్ సేన

kanha

నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ (India vs Australia 1st Test)లో భారత్ ఇన్నింగ్స్ మరియు 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పేరుతో జరుగుతున్న ఈ సిరీస్‌లో 1-0తో ఆధిక్యం టీమిండియా సాధించింది

Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి నడిచిన రిషబ్ పంత్, కర్ర పట్టుకొని నడుస్తున్న రిషబ్ పంత్, ఈ సారి ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం

VNS

టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్ త‌న ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు. క‌ర్ర సాయంతో న‌డుస్తున్న ఫొటోల్ని అత‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో (Rishab pant Instagram) షేర్ చేశాడు. ‘ఒక అడుగు ముంద‌కు. ఒక అడుగు బ‌లంగా. ఒక అడుగు మ‌రింత మెరుగ్గా’ అంటూ ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ రాశాడు. కారు యాక్సిడెంట్‌కు (Pant accident) గురైన‌ త‌ర్వాత పంత్ సోష‌ల్‌మీడియాలో ఫొటోలు షేర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.

Advertisement

Bharat Reply To CM Jagan Tweet: మీ ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టం సర్, సీఎం జగన్‌ ట్వీట్‌కు కేఎస్‌ భరత్‌ రిప్లై, తెలుగు జాతికి గొప్ప పేరు తీసుకు వస్తానని వెల్లడి

Hazarath Reddy

బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన భరత్‌కి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపిన విషయం విధితమే. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు. సీఎం జగన్‌ చేసిన ట్వీట్‌కు కేఎస్‌ భరత్‌ రిప్లై ఇచ్చాడు."

IND vs AUS 1st Test 2023: తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసిన ఇండియా

Hazarath Reddy

బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ (IND vs AUS) మొదటి రోజు ఆట ముగిసింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మొదటి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.

KS Bharat Stumping Video: కేఎస్ భ‌ర‌త్ ఫస్ట్ స్టంప్ ఔట్ వీడియో ఇదిగో, ఫ్రంట్ ఫుట్ ఆడిన లబుషేన్‌ను రెప్ప‌పాటులో స్టంప్ ఔట్ చేసిన తెలుగు కుర్రాడు

Hazarath Reddy

బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీకి రిష‌భ్ పంత్ ప్లేస్‌లో కీప‌ర్‌గా భ‌ర‌త్‌ జట్టులో స్థానం సంపాదించిన సంగతి విదితమే. తొలి టెస్టులో ఉస్మాన్ ఖ‌వాజా ఎల్బీగా ఔట్ కావ‌డంలో అత‌ని పాత్రం ఉంది. సిరాజ్ ఎల్బీకి అప్పీల్ చేశాడు

Jadeja Dismissed Smith Video: వీడియో ఇదిగో, రవీంద్ర జడేజా అద్భుతమైన బంతికి షాక్ తిన్న స్టీవ్ స్మిత్, ఒక్కసారిగా టర్న్‌ అయి వికెట్లను గిరాటేసిన ఆఫ్‌సైడ్‌ పడిన బంతి

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఔట్‌ చేసిన వీడియో వైరల్ అవుతోంది. క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తున్న స్మిత్‌ను అద్భుతమైన బంతితో స్మిత్‌ బోల్తా కొట్టించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 42 ఓవర్‌లో జడేజా వేసిన ఆఖరి బంతికి స్మిత్‌ ఢిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

Advertisement

CM Jagan Wishes to KS Bharat: భారత్ క్రికెట్ జట్టులోకి వైజాగ్ కుర్రాడు భరత్, తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభినందనలు తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

భారత క్రికెట్‌ జట్టులోకి వైజాగ్ కుర్రాడు కోన శ్రీకర్‌ భరత్‌ అరంగేట్రం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా భరత్‌ ఫొటో షేర్‌ చేస్తూ అభినందనలు తెలియజేశారు.

MS Dhoni Ploughing Farm Video: రైతుగా మారిన ధోనీ, ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న వీడియో వైరల్, పొలం చదును చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టిందని ట్వీట్

Hazarath Reddy

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ట్రాక్టర్ తో పొలం చదును చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.రెండేళ్ల తర్వాత ధోనీ పోస్ట్ కనిపించడంతో క్షణాలలోనే అది వైరల్ గా మారింది

Kapil Dev: రిషబ్ పంత్ కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా, కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు, తన ఆరోగ్యంపై అభిమానులకు అప్‌డేట్‌ ఇచ్చిన టీమిండియా క్రికెటర్

Hazarath Reddy

పంత్ పూర్తిగా కోలుకోగానే.. అతడిని చెంప దెబ్బ కొట్టాలని ఉందని చెప్పారు. ‘అన్ కట్’ చానల్ తో మాట్లాడిన కపిల్.. పంత్ లేకపోవడంతో టీమిండియా బలం తగ్గిందని అన్నారు. పంత్ పై నాకు ఎంతో ప్రేమ ఉంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.

Virat Kohli's Phone Lost?: ఫోన్ సీల్ చేయకుండానే పోగొట్టుకున్న విరాట్ కోహ్లీ, బాభి ఫోన్ నుండి ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేయాలని జొమాటో సలహా, ఫన్నీ ట్వీట్లు వైరల్

Hazarath Reddy

స్టార్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లోకి వెళ్లి, "అన్‌బాక్సింగ్" చేయకుండానే "తన కొత్త ఫోన్‌ను పోగొట్టుకున్నట్లు" వెల్లడించాడు. "మీ కొత్త ఫోన్‌ని అన్‌బాక్స్ చేయకుండానే పోగొట్టుకున్న బాధ ఉంది. ఎవరైనా చూశారా?" అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

Advertisement

Anil Kumble 10 Wickets Video: కుంబ్లే 10 వికెట్లు తీసిన వీడియో ఇదే, దాయాది దేశానికి చుక్కలు చూపించిన భారత మాజీ స్పిన్నర్

Hazarath Reddy

ఫిబ్రవరి 07, 1999న, అనిల్ కుంబ్లే ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీసిన రెండవ బౌలర్, మొదటి భారతీయుడు అయ్యాడు. ఢిల్లీలో దాయాది దేశం ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 10/74తో చెలరేగాడు. 420 పరుగుల భారీ ఛేదనలో కుంబ్లే తన తొలి వికెట్‌ను తీయడంతో పాకిస్థాన్ 101/0తో ఉంది. కుంబ్లే అన్ని వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్ 207 పరుగులకే ఆలౌటైంది.

Aaron Finch: ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ అరోన్ ఫించ్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

Rudra

టీ-20 ఫార్మాట్‌లో సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా కొనసాగిన వెటరన్ బ్యాటర్ అరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గతేడాదే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఫించ్.. 2021లో దేశానికి ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందించాడు.

Shikhar Dhawan vs Aesha: శిఖర్ ధవన్ మాజీ భార్యకు కోర్టు అక్షింతలు, భారత క్రికెటర్‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎటువంటి విష ప్రచారం చేయరాదని ఆదేశాలు

Hazarath Reddy

భారత క్రికెటర్‌, వెటరన్ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌.. తన భార్య తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని కోర్టు మెట్లు ఎక్కిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ పై ఎటువంటి ఆరోపణలు చేయకుండా ఉండాలని భార్యను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది.

Monty Desai: నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు కోచ్‌గా భారత క్రికెటర్ మాంటీ దేశాయ్, అధికారిక ఉత్తర్వులు జారీచేసిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్

Hazarath Reddy

నేపాల్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా భారత ఆటగాడు మాంటీ దేశాయ్ నియమితులైనట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) ప్రకటించింది.

Advertisement

Joginder Sharma Retires: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన 2007 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ, అన్ని ఫార్మాట్ల నుంచి వెదొలుగుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

భారత క్రికెటర్ జోగిందర్ శర్మ శుక్రవారం, ఫిబ్రవరి 03, 2023న అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల ఆల్ రౌండర్.. 2004లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. అతను 4 ODI, 4 T20I మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

Joginder Sharma Retires: అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన మరో భారత క్రికెటర్, అన్ని క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్న ప్రకటించిన 2007 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ

Hazarath Reddy

భారత క్రికెటర్ జోగిందర్ శర్మ శుక్రవారం, ఫిబ్రవరి 03, 2023న అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 39 ఏళ్ల ఆల్ రౌండర్.. 2004లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. అతను 4 ODI, 4 T20I మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.

Suryakumar Yadav Catch Video: స్లిప్‌లో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్న సూర్యకుమార్ యాదవ్, పైకి జంప్ చేసి క‌ళ్లు చెదిరే రీతిలో అందుకున్న వీడియో ఇదే..

Hazarath Reddy

భారత స్టార్ ప్లేయర్ సూర్య‌కుమార్ యాదవ్ కివీస్‌తో జ‌రిగిన మూడ‌వ టీ20 మ్యాచ్‌లో సూర్య అద్భుత‌మైన రీతిలో రెండు క్యాచ్‌లు అందుకున్నాడు. స్లిప్స్‌లో ఉన్న సూర్య స్టన్నింగ్ రీతిలో ఆ క్యాచ్‌లు ప‌ట్టేశాడు. పాండ్యా బౌలింగ్‌లోనే ఆ రెండు క్యాచ్‌ల‌ను అత‌ను అందుకున్నాడు.

IND vs NZ: మూడో టీ20లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకున్న భారత్, శతకంతో దున్నేసిన గిల్, 66 పరుగులకే కివీస్ ఆలౌట్, 2023లో వరుసగా నాలుగో సిరీస్‌ కైవసం

kanha

శుభ్‌మన్ గిల్ సెంచరీతో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో (IND vs NZ) బుధవారం జరిగిన మూడో , చివరి మ్యాచ్‌లో భారత్ 168 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.

Advertisement
Advertisement