Cricket Stadium | Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, June 16: భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య వైరం కారణంగా ఈ ఏడాది ఆసియా కప్ (Asia Cup) వేదికపై (Host) అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ-ACC) ఆ అనిశ్చితికి ఎట్టకేలకు తెరదించింది. టోర్నీలో 4 మ్యాచ్ లకు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుందని, మిగిలిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరుగుతాయని ఏసీసీ పేర్కొంది. ఇక టోర్నీ తేదీలు కూడా ఖరారయ్యాయి. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రాంతీయ టోర్నీ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. సెప్టెంబరు 17న జరిగే ఫైనల్ తో ఆసియా కప్ టోర్నీ ముగుస్తుంది. కాగా, ఈ 16వ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు పోటీపడనున్నాయి. టోర్నీలో భాగంగా 13 వన్డే మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

Edible Oil Prices Comedown: సామాన్యులకు ఊరట.. తగ్గనున్న వంటనూనెల ధరలు.. రిఫైన్డ్ నూనెలపై దిగుమతి సుంకం 17.5 నుంచి 12.5 శాతానికి తగ్గించిన కేంద్రం .. అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు

జట్లు ఇలా..

టోర్నీ తొలి దశలో మొత్తం 6 జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. సూపర్-4 దశలో ఈ నాలుగు జట్లలో టాప్-2లో నిలిచే జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. భారత్, పాకిస్థాన్, నేపాల్ ఒక గ్రూపులో ఉండగా.... శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మరో గ్రూపులో ఉన్నాయి.

Cyclone Biparjoy: కోట్‌ లఖ్‌పత్‌ సమీపంలో తీరాన్ని తాకిన బిపర్ జాయ్‌ తుపాను, అర్థరాత్రి పూర్తిగా తీరం దాటే అవకాశం, భారీ నుంచి అతి భారీ వర్షాలు