రాష్ట్రీయం

Andhra Pradesh Elections 2024: పిఠాపురం గత లెక్కలు ఇవిగో, కాపు ఓటర్లు ఈ సారి పవన్ కళ్యాణ్‌ను ఆదరిస్తారా, అక్కడ బలబలాలు ఏమిటీ ?

Hazarath Reddy

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్‌ ఓడిపోయారు.

Andhra Pradesh Elections 2024: పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్, అధికారికంగా ప్రకటించిన జనసేన అధినేత

Hazarath Reddy

ఎట్టకేలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీపై క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్‌ ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్‌ చెప్పుకొచ్చారు.

CM Revanth Reddy Meets Jithender Reddy: బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్‌ రెడ్డి, నాకు సీటు రాలేదని ఓదర్చాడానికే వచ్చాడని తెలిపిన బీజేపీ నేత

Hazarath Reddy

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ ఇంటికి వెళ్లారు.రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం ఆశించగా హైకమాండ్ తేందర్‌ రెడ్డిని కాదని డీకే అరుణకు అవకాశం కల్పించింది.

Telangana Elections 2024: బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు వీళ్లే, మొత్తం 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధినేత కేసీఆర్

Hazarath Reddy

రెండో జాబితాలో వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పేర్లను ప్రకటించారు. జహీరాబాద్‌ పార్లమెంటు స్థానానికి గాలి అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ పార్లమెంటు స్థానానికి బాజిరెడ్డి గోవర్దన్‌ను నిర్ణయించారు

Advertisement

National Law University in Kurnool: కర్నూలులోనే ఏపీ హైకోర్టు, నేషనల్‌ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్, న్యాయ రాజధానికి మంచి జరగాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, లక్ష్మీపురం జగన్నాథగట్టులో "లా యూనివర్సిటీ" పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరించారు. 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం జరగనుంది

Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టులో ఇద్దరు జడ్జిలుగా ప్రమాణస్వీకారం, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

Hazarath Reddy

ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు నేడు ప్రమాణం చేశారు. జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.వీరిద్దరూ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తూ న్యాయమూర్తులుగా నియమించబడ్డారు.

YSR EBC Nestham: మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుధ్దానికి వస్తున్నాయి. వైఎస్సార్‌ ఈబీసీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్‌ ఈబీసీ నిధుల్ని లబ్ధదారుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

Andhra Pradesh Elections 2024: గంటాకు రెండో జాబితాలో దక్కని చోటు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ, 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జీబితా విడుదల

Hazarath Reddy

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో​ జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి 128 బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఈ నెల 16న మొత్తం అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్న సీఎం జగన్, అనంతరం ఎన్నికల ప్రచారంలోకి..

Hazarath Reddy

వచ్చే ఎన్నికల కోసం ఏపీలో అధికార వైసీపీ పార్టీ(YCP) అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు ముమ్మరం చేసింది. ఈనెల 16న ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌(YSR Ghat) వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(CM Jagan) అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు

Andhra Pradesh Shocker: టెన్త్ క్లాస్ విద్యార్థిపై బెల్ట్‌తో దాడి చేసిన కొందరు యువకులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఏపీ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కొందరు యువకులు నిన్న జెడ్పీ హైస్కూల్ బయట టెన్త్ స్టూడెంట్ హేమంత్ కుమార్ పై దాడి చేశారు. బెల్ట్‌తో దారుణంగా కొట్టడంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Geethanjali Suicide Case: గీతాంజలి కేసులో తొలి అరెస్ట్‌, పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగతా వారి కోసం వెతుకులాట

Hazarath Reddy

సోషల్‌ మీడియా ట్రోలింగ్‌తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో తొలి అరెస్ట్‌ జరిగింది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Ganta Srinivasarao: మాజీ మంత్రి గంటా దారెటు, ఇవాళ ముఖ్య అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్న గంటా శ్రీనివాసరావు, టీడీపీలో కొనసాగుతారా? లేదా? ఉత్కంఠ

VNS

చంద్రబాబు మాత్రం గంటాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బుధవారం కూడా ఆయన​ చంద్రబాబును కలిశారు. తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. గంటా శ్రీనివాస్‌ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్య అనుచరులతో గురువారం గంటా తన నివాసంలో భేటీ కానున్నారు. వాళ్లతో చర్చించి తన తర్వాతి అడుగులపై కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.

Advertisement

Telangana BJP MP Candidates List: తెలంగాణలో బీజేపీ నుంచి పోటీ చేసే 15 మంది అభ్యర్థుల లిస్ట్ ఇదిగో, ఏపీ నుంచి ఇంకా తేలని కాషాయం పార్టీ అభ్యర్థులు

Hazarath Reddy

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌లకు 72 మంది అభ్య‌ర్ధుల‌తో బీజేపీ రెండో జాబితాను బుధ‌వారం ప్ర‌క‌టించింది. రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ, పీయూష్ గోయ‌ల్‌, హ‌రియాణా మాజీ సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌ల‌కు చోటు ద‌క్కింది.

418 Kidney Stones Removed From Patient: 60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి 418 రాళ్లను తొలగించిన వైద్యులు, శరీరంపై కోత పెట్టకుండా కొద్దిపాటి శస్త్రచికిత్సతో రాళ్లను తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు

Hazarath Reddy

60 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ నుంచి ఏకంగా 418 రాళ్లను వైద్యులు తీసేశారు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అత్యాధునిక పరికరాలతో కొద్దిపాటి శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ఈ రాళ్లను తొలగించారు.

Telangana: వారి చావుకు కారణం ఆ రిపోర్టర్లు రూ. 25 లక్షలు బ్లాక్ మెయిల్ చేయడమే, ముగ్గురు కొడుకులను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి కేసులో వివరాలను వెల్లడించిన పోలీసులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా టంగటూరు గ్రామంలో నీరటి రవి(35) అనే ప్రైవేట్ ఉద్యోగి తన ముగ్గురు కుమారులు సాయికిరణ్(13), మోహిత్ కుమార్(10), ఉదయ్ కిరణ్(7) లను చంపేసి.. అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.

MLA Hafeez Khan on CAA: కేంద్రం తీసుకువచ్చిన సీఏఏను అంగీకరించలేం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కీలక ప్రకటన, వీడియో ఇదిగో

Hazarath Reddy

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కీలక ప్రకటన చేశారు. సీఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందని దాన్ని అంగీకరించబోమన్నారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ చట్టం వలన ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్‌ కూడా మాకు అనునిత్యం అండగా నిలుస్తున్నారు.

Advertisement

T-Safe: తెలంగాణ మహిళల కోసం రైడ్ మానిటరింగ్ సర్వీస్‌, టి-సేఫ్ సర్వీసును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎలా పనిచేస్తుందంటే..

Hazarath Reddy

మహిళల భద్రతను మెరుగుపరిచే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వినూత్నమైన ట్రావెల్ సేఫ్ (టి-సేఫ్) సేవను ఆవిష్కరించి, ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర పౌరులకు అంకితం చేశారు. ఈ రైడ్ మానిటరింగ్ సర్వీస్, దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీసులచే అందించబడినది

Telangana: ఆరూరి రమేష్‌ ఇంటి వద్ద హైడ్రామా, రంగంలోకి దిగిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని తెలిపిన మాజీ ఎమ్మెల్యే

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత ఆరూరి రమేష్‌ బీజేపీలో చేరేందుకు రెడీ కావడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్‌ అయ్యింది. రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ఆయనను తన కారుతో వేరే చోటకు తరలించారు.

Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసు, మాజీ SIB డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Hazarath Reddy

ఎన్నికలలో BRS ఓడిపోయిన తర్వాత SIBలోని ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేశారనే ఆరోపణలపై మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) DSP ప్రణీత్ రావును రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతని ఇంటి నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా ప్రణీత్‌రావు ఉన్నారు.

TDP Chilakaluripet Sabha: బొప్పూడిలో భూమి పూజ చేసిన నారా లోకేష్, ఈ నెల 17న మూడు పార్టీల భారీ బహిరంగ సభ, హాజరుకానున్న ప్రధాని మోదీ

Hazarath Reddy

ఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం బొప్పూడి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సభా ప్రాంగణం వద్ద భూమిపూజ చేశారు.

Advertisement
Advertisement