రాష్ట్రీయం

Vanteru Venugopal Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని వెల్లడి

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలోని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. పదేళ్లుగా వైసీపీలో ఉంటే సరైన గుర్తింపు లేదని, హీనంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు

PM Modi Road Show in Malkajgiri: మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో, భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. మల్కాజిగిరి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన రోడ్‌షోకి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రధాని మోదీ రోడ్‌ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి ప్రారంభమైంది

KTR on Kavita Arrest: ఈడీ అధికారుల‌తో కేటీఆర్ వాగ్వాదం, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ నిల‌దీసిన కేటీఆర్ (వీడియో ఇదుగోండి)

VNS

ఈడీ అధికారులు కావాలనే శుక్రవారం వచ్చి అరెస్ట్‌కు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. సోదాలు పూర్తయిన తర్వాత కూడా కుటుంబసభ్యులు ఇంట్లోకి రావద్దని అధికారులు హుకుం జారీ చేస్తున్నారని ఆయన చెప్పారు.

Telangana Elections 2024: తెలంగాణకు కాంగ్రెస్ కరవును తెచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి 10 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్లడమే 100 రోజుల పాలన అంటూ హరీష్ రావు విమర్శలు

Hazarath Reddy

కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయుల డీఏలు చెల్లించలేదని తెలిపారు.

Advertisement

BRS MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, ఢిల్లీకి త‌ర‌లించిన అధికారులు, క‌విత ఇంటిముందు హైటెన్ష‌న్

VNS

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను అరెస్ట్ (BRS MLC Kavitha Arrest) చేశారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న ఆమెను అదుపులోకి తీసుకొని ఢిల్లీకి త‌ర‌లిస్తున్నారు. మ‌ధ్యాహ్నం క‌విత నివాసానికి వ‌చ్చిన ఈడీ అధికారుల (ED) బృందం.. ఆమెకు నోటీసులు ఇచ్చింది. అనంత‌రం ఆమె నివాసంలో సోదాలు నిర్వ‌హించారు.

Chandrababu on APPSC: డీజీపీగా ఉండి తప్పులు చేసిన గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించారు, జగన్ సర్కారుపై మండిపడిన చంద్రబాబు నాయుడు

Hazarath Reddy

ఏపీపీఎస్సీ (APPSC)లో జరిగిన అక్రమాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు (National President of Telugu Desam), మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్

Hazarath Reddy

చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2011, 2017లో ఈస్ట్‌ రాయలసీమ నుంచి రెండుసార్లు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా శ్రీనివాసులు రెడ్డి ఎన్నికయ్యారు

Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, సీఎం జగన్‌ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడి

Hazarath Reddy

సీనియర్‌ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని ముద్రగడ తెలిపారు.

Advertisement

Group-1 Deadline Extended: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

Rudra

గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది.

Ramadan Iftar Feast: ముస్లిం సోదరులకు నేడు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరుఫున ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం రేవంత్

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు నేడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది.

President, PM in Telangana: నేడు తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. 'ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌- 2024'లో పాల్గొననున్న రాష్ట్రపతి.. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..

Rudra

నేడు తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ రానున్నారు. నగర శివారులోని కన్హ శాంతి వనంలో నిర్వహించే 'ప్రపంచ ఆథ్యాత్మిక మహోత్సవ్‌- 2024' కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.

Half Day Schools: నేటి నుంచే ఒంటిపూట బడులు.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు.. 12.30 గంటల తర్వాత మధ్యాహ్న భోజనం

Rudra

తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు.

Advertisement

DSC Exam Dates in Telangana: తెలంగాణలో జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు, టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఉపాధ్యాయ అర్హత పరీక్ష-TET నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీకి ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాశాఖ త్వరలో టెట్ నోటిఫికేషన్‌ ను జారీ చేయనుంది.

Telangana Elections 2024: మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, అదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కు, అధికారికంగా ప్రకటించిన బీఆర్ఎస్

Hazarath Reddy

మరో రెండు లోక్‌సభ స్థానాలు మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్‌ చేసింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది

Andhra Pradesh Elections 2024: టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌, బీసీలకు జగన్ అన్యాయం చేశాడని మండిపాటు

Hazarath Reddy

కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ టీడీపీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి సాదరంగా ఆయన్ను ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంజీవ్‌కుమార్‌ రాజీనామా చేశారు. టీడీపీలో చేరిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.

Andhra Pradesh Elections 2024: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తున్నానని తెలిపిన దర్శకుడు వర్మ, ట్విట్టర్ వేదికగా వెల్లడి

Hazarath Reddy

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పిఠాపురం నుంచి పోటీ చేస్టున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ఆర్జీవీ కూడా పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించడం గమనార్హం. ‘ఇది ఆకస్మిక నిర్ణయం. నేను పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నా.

Advertisement

Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలో చేరిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని(వెంకట మధుసూదనరావు) వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈలి నానికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్‌.2009లో తాడేపల్లిగూడెం నుంచి ప్రజారాజ్యం(పీఆర్పీ) తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈలి నాని.. ఆపై టీడీపీలో చేరిపోయారు. తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్‌గా కూడా ఈలి నాని పని చేశారు.

Andhra Pradesh Elections 2024: ఈ సారి 121 సీట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి, స్పష్టం చేసిన పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వే, టీడీపీ- జనసేన-బీజేపీకి 54 స్థానాలు వస్తాయని వెల్లడి

Hazarath Reddy

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది. పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వేలో మొత్తం 175 సీట్లలో 121 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. అలాగే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది.

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో టీడీపీ జెండాలను తగలబెట్టిన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ప్రకటనతో భగ్గుమన్న తెలుగు తముళ్ళు వీడియోలు ఇవిగో.

Hazarath Reddy

కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీ‌ఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు

Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ ప్రకటనతో పిఠాపురంలో భగ్గుమన్న నిరసన జ్వాలలు, టీడీపీ జెండాలు,ఫ్లెక్సీలను దహనం చేసిన ఎన్‌వీ‌ఎస్‌ఎన్ వర్మ అనుచరులు

Hazarath Reddy

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటనతో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీ‌ఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు.

Advertisement
Advertisement