రాష్ట్రీయం

2018 Group-1 Mains Cancellation: 2018 గ్రూప్‌-1 మెయిన్స్​ రద్దు చేసిన హైకోర్టు, ఉద్యోగులు ఆందోళన చెందవద్దని తెలిపిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

2018లో ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు (AP High Court) కీలక తీర్పు వెలువరించింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు

YCP 12th List: వైసీపీ తాజా అభ్యర్థుల 12వ లిస్టు ఇదిగో, గాజువాక ఇన్ఛార్జీగా గుడివాడ అమర్ నాథ్, చిలకలూరిపేట ఇన్ఛార్జీగా కావటి మనోహర్ నాయుడు

Hazarath Reddy

రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే 11 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం..మంగళవారం రాత్రి మరో జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. చిలకలూరిపేట ఇన్ఛార్జీగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్ఛార్జీగా గుడివాడ అమర్ నాథ్ పేరును ప్రకటించారు.

Geethanjali Suicide Case: గీతాంజలిని రైలు నుంచి తోసేసిన ఆ ఇద్దరు ఎవరు, ఎక్స్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ, కౌంటర్ విసురుతున్న వైసీపీ సోషల్ మీడియా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు గీతాంజలి మృతి చుటూ తిరుగుతున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు చేసిన ట్రోల్స్ వల్లనే గీతాంజలి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. గీతాంజలి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రాంతంలోనిది అంటూ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Geethanjali Suicide Case: గీతాంజలి మృతిపై స్పందించిన నటి పూనమ్ కౌర్, ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి అంటూ ట్వీట్

Hazarath Reddy

గీతాంజలి ఆత్మహత్య ఘటనపై నటి పూనమ్‌ కౌర్‌ స్పందించింది.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేసింది. గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్‌ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్‌లైన్‌ ట్రోలర్స్‌ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు.

Advertisement

Geethanjali Suicide Case: గీతాంజలి మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక ఆత్మహత్య, ఎవరిని వదిలిపెట్టేది లేదని వెల్లడి

Hazarath Reddy

సోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే 28 ఏళ్ల మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 7వ తేదీన గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు.

Free Haleem Offer: వీడియో ఇదిగో, ఫ్రీ హలీం కోసం ఎగబడిన జనాలు, లాఠీలకు పనిచెప్పిన పోలీసులు, మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఘటన

Hazarath Reddy

ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఉచిత హలీమ్‌(Halim) ఆఫర్ ను ప్రకటించింది. ఫ్రీ హలీం అంటే వందలాది మంది దూసుకు వచ్చారు. ఫలితంగా హోటల్ వద్ద జనం రద్దీతో గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది.

Dedeepya Rao Attacked: బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌ పై మహిళల దాడి, ఫ్లెక్సీ వివాదంలో దేదీప్యరావుపై దాడి చేసిన స్థానికులు, పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల ఫిర్యాదు

VNS

ఫ్లెక్సీల విషయంలో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌పై కొందరు మహిళలు దాడి చేశారు. ఆమె కారులో వెళ్తుండగా అడ్డుకున్న సదరు మహిళలు దేదీప్య రావుపై దాడికి దిగారు. దీంతో, ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, తన భర్త విజయ ముదిరాజ్‌తో కలిసి దేదీప్య రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Hyderabad Liberation Day: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల

sajaya

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఆమోదం తెలిపింది.

Advertisement

Telangana Vehicle Registration: ఇకపై TS కాదు TG..తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ మార్చుతూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

sajaya

దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రం పేరులోని అక్షరాల అబ్రివేషన్‌ను మాత్రమే రిజిస్ట్రేషన్ సీరీస్‌గా వాాడుతుండగా, గత ప్రభుత్వం Telangana State రెండు వేర్వేరు పదాల తొలి అక్షరంతో TS గా నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని TG గా మార్చుతూ కేంద్రం మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Bandi Sanjay on Lord Ram: రాముని పేరు చెప్పుకునే ప్రచారానికి వెళ్తాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో, మీరు బాబర్ పేరు చెప్పుకుని వెళ్లండి అంటూ చురక

Hazarath Reddy

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్‌ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి వారసుడే మా ప్రధాని అభ్యర్థి. రాముడు మా బీజేపీ వాళ్ళకే దేవుడు.. మేము బారాబర్ రాముడి పేరు చెప్పుకొనే ప్రచారం చేస్తామని బండి సంజయ్ అన్నారు.

Telangana Cabinet Meeting: కాళేశ్వరంపై 100 రోజుల్లో విచారణ, రేషన్‌ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కసరత్తు, తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి వర్గ నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరించారు.

Amit Shah Slams Congress: తెలంగాణ గడ్డ మీద నుంచి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, 12 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి చూపించాలని బీజేపీ శ్రేణులకు పిలుపు

Hazarath Reddy

తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. బీజేపీ సోషల్‌మీడియా వారియర్స్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై (Amit Shah Slams Congress) నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ అవినీతి, కుంభకోణాల పార్టీ అని కేంద్రమంత్రి అమిత్‌ షా ఆరోపించారు.

Advertisement

Geethanjali Suicide Case: గీతాంజలి ఆత్మహత్య ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Hazarath Reddy

తెనాలి మహిళ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేవారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Director Varma Slams Nara Lokesh: నువ్వు మూర్ఖుడివే అనుకున్నా.. మూగవాడివి అని ఇప్పుడు తెలిసింది, లోకేష్‌ గ్రాఫిక్స్‌ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన వర్మ

Hazarath Reddy

ముఖ్యమంత్రి జగన్‌ సభలో జనాలే లేరంటూ. అదంతా గ్రాఫిక్స్‌ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ మీద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టైల్లో పంచులు విసిరారు. లోకేష్‌ను ఉద్దేశిస్తూ..'మీ అజ్ఞానానికి అవధులు లేవు.. మీకు సినిమా పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారు.

Andhra Pradesh: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు, రామచంద్రయ్య, వంశీ కృష్ణయాదవ్‌పై వేటు వేసిన శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) కౌన్సిల్ చైర్మెన్ వేటు వేశారు.వైసీపీ నుండి ఎన్నికై వేరే పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించారు

Road Accident in Telangana: వీడియో ఇదిగో, ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్‌ను ఢీకొట్టిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ

Hazarath Reddy

ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్ మంగళవారం కాన్వాయ్ వాహనం ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీగా ఉన్న పంకజ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

Advertisement

TSRTC: హైదరాబాద్‌లో కొత్తగా 22 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి, ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో కొత్తగా 22 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు.

Geethanjali Suicide Case: ఏపీని కుదిపేస్తున్న గీతాంజలి ఆత్మహత్య కేసు, అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు, నా భార్య మృతికి ట్రోలింగే కారణమన్న ఆమె భర్త

Hazarath Reddy

తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ఆమె వివాదాస్పద సూసైడ్ కథనాలు (Geethanjali Suicide Case) ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ (trolled in Social Media) వల్లే తన భార్య సూసైడ్‌ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్నారు..

Andhra Pradesh Elections 2024: బీజేపీ రాకతో తగ్గిన జనసేన సీట్లు, మూడు పార్టీల మధ్య పూర్తి అయిన సీట్ల పంపకాలు, పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..

Hazarath Reddy

వచ్చే ఏపీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ ఎక్కు­వ స్థానాలు కోరడంతో ఆ పార్టీకి సీట్ల సర్దుబాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన సీట్లను తగ్గించారు. .

Kodikatti Sreenu: జై భీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను.. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి

Rudra

కోడికత్తి కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన శ్రీను జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు.

Advertisement
Advertisement